01-05-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు, ఇక్కడ హద్దుకు సంబంధించిన విషయమేమీ లేదు, మీరు చాలా ఉల్లాసముతో తండ్రిని స్మృతి చేసినట్లయితే పాత ప్రపంచాన్ని మర్చిపోతారు’’

ప్రశ్న:-
ఏ ఒక్క విషయాన్ని మీరు పదే-పదే మీలో మీరు చింతన చేస్తూ పక్కా చేసుకోవాలి?

జవాబు:-
నేను ఆత్మను, నేను పరమాత్మ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాను. ఆత్మలు పిల్లలు, పరమాత్మ తండ్రి. ఇప్పుడు పిల్లలు మరియు తండ్రి యొక్క మేళా జరుగుతుంది. ఈ విషయాన్ని పదే-పదే చింతన చేస్తూ పక్కా చేసుకోండి. ఎంతగా ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారో, అంతగా దేహాభిమానము తొలగిపోతుంది.

పాట:-
ఎవరైతే ప్రియమైనవారితో ఉంటారో...

ఓంశాంతి
పిల్లలకు తెలుసు, మేము బాబాతోపాటు కూర్చుని ఉన్నాము - వీరు అందరికన్నా గొప్ప బాబా, వీరు అందరికీ తండ్రి. బాబా వచ్చి ఉన్నారు. తండ్రి నుండి ఏం లభిస్తుంది అన్న ప్రశ్నయే తలెత్తదు. తండ్రి నుండి వారసత్వమే లభిస్తుంది. వీరు అందరి యొక్క అనంతమైన తండ్రి, వీరి నుండి అనంతమైన సుఖము, అనంతమైన ఆస్తి లభిస్తుంది. అది హద్దులోని ఆస్తి. కొందరి వద్ద 1000, కొందరి వద్ద 5000 ఉండవచ్చు. కొందరి వద్ద 10-20-50 కోట్లు, వంద కోట్లు ఉండవచ్చు. ఇప్పుడు వారందరూ లౌకిక తండ్రులు మరియు హద్దులోని పిల్లలు. మేము అనంతమైన తండ్రి వద్దకు అనంతమైన ఆస్తిని తీసుకునేందుకు వచ్చాము అని ఇక్కడ పిల్లలైన మీరు భావిస్తారు. మనసులో ఆశ అయితే ఉంటుంది కదా. స్కూల్లో తప్ప ఇతర సత్సంగాలు మొదలైనవాటిలో ఏ ఆశ ఉండదు. శాంతి లభించాలి అని అంటారు, కానీ అదైతే లభించదు. ఇక్కడ పిల్లలైన మీరు ఈ విధంగా భావిస్తారు - మేము విశ్వపు కొత్త ప్రపంచానికి యజమానులుగా అయ్యేందుకు వచ్చాము. లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాము. పిల్లలు ఎంతగా వృద్ధి చెందుతూ ఉంటారు! వారంటారు - బాబా, మేమైతే విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు వచ్చాము అని, ఇందులో హద్దుకు సంబంధించిన విషయమేమీ లేదు. బాబా, మీ నుండి మేము అనంతమైన స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము. కల్ప-కల్పము మనము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము, మళ్ళీ మాయా పిల్లి లాగేసుకుంటుంది, అందుకే దీనిని గెలుపు-ఓటముల ఆట అని అంటారు. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు కూడా నంబరువారుగా అర్థం చేసుకుంటారు, వీరేమి సాధు-సన్యాసి కాదు. మీరు ఏ విధమైన వస్త్రాలను ధరించారో, వీరు కూడా అటువంటివే ధరించారు. వీరైతే బాబా కదా. కొందరు - ఎవరి వద్దకు వెళ్తున్నారు అని అడుగుతారు. మీరేమో - మేము బాప్ దాదా వద్దకు వెళ్తున్నాము అని చెప్తారు. ఇదైతే ఒక పరివారము. ఎందుకు వెళ్తారు, ఏం తీసుకునేందుకు వెళ్తారు? ఈ విషయాలను ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. మేము బాప్ దాదా వద్దకు వెళ్తాము, వారసత్వము వారి నుండి లభిస్తుంది అని ఎవరూ చెప్పలేరు. తాతగారి ఆస్తికి అందరూ హక్కుదారులే. శివబాబాకు అవినాశీ పిల్లలుగా (ఆత్మలుగా) ఉండనే ఉన్నారు, మళ్ళీ ప్రజాపిత బ్రహ్మాకు చెందినవారిగా అవ్వడంతో వారికి మనుమలు-మనుమరాళ్ళుగా అవుతారు. ఇప్పుడు మీకు తెలుసు - మనము ఆత్మలము. ఇది చాలా పక్కాగా అభ్యాసము చేయాలి. ఆత్మలైన మనము పరమాత్మ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. ఆత్మలమైన మనము తండ్రిని వచ్చి కలుసుకున్నాము. ఇంతకుముందు శరీర భానం ఉండేది. ఫలానా-ఫలానా పేరు కలవారే ఆస్తిని తీసుకుంటారు. ఇప్పుడు ఆత్మలు, పరమాత్మ నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. ఆత్మలు పిల్లలు, పరమాత్మ తండ్రి. పిల్లలు మరియు తండ్రి యొక్క మేళా చాలా కాలము తర్వాత జరుగుతుంది. ఇది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. భక్తి మార్గములో అనేక కృత్రిమమైన మేళాలు జరుగుతూ ఉంటాయి. ఇది అన్నింటికన్నా అద్భుతమైన మేళా. ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలంగా వేరుగా ఉన్నారు... ఎవరు? ఆత్మలైన మీరే. ఆత్మలమైన మనము మన స్వీట్ సైలెన్స్ హోమ్ లో నివసించేవారము అనేది కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ అలసిపోయారు. అందుకే సన్యాసులు, గురువులు మొదలైనవారి వద్దకు వెళ్ళి శాంతి కావాలని కోరుకుంటారు. వారు ఇళ్ళు-వాకిళ్ళు వదిలేసి అడవులలోకి వెళ్తారు, వారి నుండి శాంతి లభిస్తుందని భావిస్తారు. కానీ అలా కాదు. ఇప్పుడైతే అందరూ నగరాల్లోకి వచ్చేసారు. అడవులలో గుహలు ఖాళీగా ఉన్నాయి. గురువులై కూర్చున్నారు. లేదంటే వారు నివృత్తి మార్గపు జ్ఞానాన్ని ఇచ్చి పవిత్రతను నేర్పించాలి. ఈ రోజుల్లో చూడండి, వారు వివాహాలు చేయిస్తూ ఉంటారు.

పిల్లలైన మీరు మీ యోగబలముతో మీ కర్మేంద్రియాలను వశం చేసుకుంటారు. కర్మేంద్రియాలు యోగబలముతో శీతలమవుతాయి. కర్మేంద్రియాలలో చంచలత్వము ఉంటుంది కదా. ఇప్పుడు కర్మేంద్రియాలపై విజయం పొందాలి, వాటిలో చంచలత్వము ఏమీ ఉండకూడదు. యోగబలం లేకుండా కర్మేంద్రియాలు వశమవ్వడము అసంభవము. తండ్రి అంటారు - కర్మేంద్రియాల చంచలత్వం యోగబలముతోనే తెగిపోతుంది. యోగబలానికి శక్తి అయితే ఉంది కదా. ఇందులో చాలా శ్రమ అనిపిస్తుంది. మున్ముందు కర్మేంద్రియాల యొక్క చంచలత్వము ఉండదు. సత్యయుగంలో ఎటువంటి అశుద్ధమైన వ్యాధులు ఉండవు. ఇక్కడ మీరు కర్మేంద్రియాలను వశం చేసుకుని వెళ్తారు కావున ఎటువంటి అశుద్ధమైన విషయాలు అక్కడ ఉండవు. దాని పేరే స్వర్గము. ఇది మర్చిపోయిన కారణంగా లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. ఇప్పటికీ కూడా మందిరాలను నిర్మిస్తూ ఉంటారు. ఒకవేళ లక్షల సంవత్సరాలు అయినట్లయితే ఇక ఆ విషయమే గుర్తుండదు. ఈ మందిరాలు మొదలైనవి ఎందుకు నిర్మిస్తారు? అక్కడ కర్మేంద్రియాలు శీతలముగా ఉంటాయి. ఎటువంటి చంచలత్వమూ ఉండదు. శివబాబాకైతే కర్మేంద్రియాలు లేవు. ఇకపోతే ఆత్మలో మొత్తం జ్ఞానమంతా ఉంది కదా. వారే శాంతిసాగరుడు, సుఖసాగరుడు. వారు - కర్మేంద్రియాలు వశమవ్వవు అని అంటారు. తండ్రి అంటారు - యోగబలముతో మీరు కర్మేంద్రియాలను వశం చేసుకోండి. తండ్రి స్మృతిలో ఉండండి. ఎటువంటి నియమవిరుద్ధమైన కర్మలను కర్మేంద్రియాలతో చేయకూడదు. ఇటువంటి లవ్లీ (ప్రియమైన) తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ ప్రేమలో అశ్రువులు రావాలి. ఆత్మ పరమాత్మలో లీనమవ్వదు. తండ్రి ఒక్కసారి మాత్రమే కలుస్తారు, వారు శరీరాన్ని అప్పుగా తీసుకుంటారు, కావున ఇటువంటి తండ్రితో ఎంత ప్రేమగా నడుచుకోవాలి. బాబాకు సంతోషం కలిగింది కదా. ఓహో! బాబా విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు, ఇక ఈ ధన-సంపదలను ఏమి చేసుకోవాలి, అన్నింటినీ వదిలేయాలి. వెర్రివాని వలె అయిపోయారు. వీరికి ఉన్నట్టుండి ఏం జరిగింది అని అందరూ వారిని అనడం మొదలుపెట్టారు. వ్యాపారము మొదలైనవన్నీ విడిచిపెట్టి వచ్చేసారు. సంతోషపు పాదరసం ఎక్కింది. సాక్షాత్కారాలు జరగడం మొదలయ్యాయి. రాజ్యము లభించనున్నది, కానీ అది ఎలా లభిస్తుంది? ఏం జరుగుతుంది? ఇవేమీ తెలియదు. లభించనున్నది అని మాత్రమే తెలుసు, ఈ సంతోషములో అంతా వదిలేశారు. తర్వాత నెమ్మది-నెమ్మదిగా జ్ఞానము లభిస్తూ ఉంది. పిల్లలైన మీరు ఇక్కడికి స్కూల్లోకి వచ్చారు, లక్ష్యము-ఉద్దేశ్యమైతే ఉంది కదా. ఇది రాజయోగము. అనంతమైన తండ్రి నుండి రాజ్యాన్ని తీసుకునేందుకు వచ్చారు. పిల్లలకు తెలుసు - మేము వారి నుండి చదువుకుంటాము. బాబా, మీరు వచ్చి మా దుఃఖాన్ని హరించండి సుఖాన్ని ఇవ్వండి అని వారినే స్మృతి చేసేవారము. మాకు శ్రీకృష్ణుడి వంటి కొడుకు లభించాలి అని కుమార్తెలు అంటారు. అరే, వారైతే వైకుంఠంలో లభిస్తారు కదా. కృష్ణుడు వైకుంఠవాసి, వారిని మీరు ఊయలలో ఊపుతారు, అటువంటి కొడుకు వైకుంఠంలోనే లభిస్తారు కదా. ఇప్పుడు మీరు వైకుంఠము యొక్క రాజ్యాధికారాన్ని తీసుకునేందుకు వచ్చారు. అక్కడ తప్పకుండా యువరాజులు-యువరాణులే లభిస్తారు. పవిత్రమైన పిల్లలు లభించాలి అన్న ఆశ కూడా పూర్తవుతుంది. ఆ మాటకొస్తే యువరాజులు-యువరాణులు ఇక్కడ కూడా ఎంతోమంది ఉన్నారు, కానీ వారు నరకవాసులుగా ఉన్నారు. మీరు స్వర్గవాసులుగా ఉన్నవారిని కోరుకుంటారు. చదువైతే చాలా సహజము. తండ్రి అంటారు - మీరు ఎంతో భక్తి చేశారు, ఎదురుదెబ్బలు తిన్నారు. మీరు ఎంతటి సంతోషముతో తీర్థ యాత్రలు మొదలైనవాటికి వెళ్తారు. అమర్ నాథ్ వద్దకు వెళ్తారు, శంకరుడు పార్వతికి అమరకథను వినిపించారని భావిస్తారు. అమరనాథుని సత్యమైన కథను మీరు ఇప్పుడు వింటారు. దీనిని తండ్రి కూర్చొని మీకు వినిపిస్తారు. మీరు తండ్రి వద్దకు వచ్చారు. మీకు తెలుసు - వీరు భాగ్యశాలి రథము, వీరు దీనిని అప్పుగా తీసుకున్నారు. మేము శివబాబా వద్దకు వెళ్తాము, వారి శ్రీమతం పైనే నడుస్తాము. ఏదైనా అడగాలంటే బాబాను అడుగవచ్చు. బాబా, మేము మాట్లాడలేము అని అంటారు. మరి దీని కోసం మీరు పురుషార్థము చేయండి, ఇందులో బాబా ఏం చేయగలరు.

తండ్రి, పిల్లలైన మీకు శ్రేష్ఠంగా అయ్యేందుకు సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు - ఒకటేమో కర్మేంద్రియాలను వశం చేసుకోండి, మరొకటి దైవీ గుణాలను ధారణ చేయండి. ఎవరైనా కోపం మొదలైనవి చేస్తే వినకండి. ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయండి. ఏ చెడు విషయాలైతే మంచిగా అనిపించవో, వాటిని విననే వినకండి. చూడండి, పతి క్రోధం చేస్తారు, కొడతారు, అప్పుడేమి చెయ్యాలి? ఎప్పుడెప్పుడు పతి కోపం చేస్తున్నట్లు అనిపిస్తుందో, అప్పుడు వారిపై పుష్పాలను కురిపించండి. నవ్వుతూ ఉండండి. యుక్తులైతే ఎన్నో ఉన్నాయి. కామేషు, క్రోధేషు ఉంటారు కదా. అబలలు పిలుస్తారు. ఒక్కరే ద్రౌపది కాదు, అందరూ ద్రౌపదులే. వివస్త్రంగా అవ్వడం నుండి రక్షించేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. తండ్రి అంటారు - ఈ మృత్యులోకములో ఇది మీ అంతిమ జన్మ. నేను పిల్లలైన మిమ్మల్ని శాంతిధామానికి తీసుకువెళ్ళేందుకు వచ్చాను. అక్కడికి పతిత ఆత్మలు వెళ్ళలేరు, అందుకే నేను వచ్చి అందరినీ పావనముగా తయారుచేస్తాను. ఎవరికి ఏ పాత్ర లభించిందో, అది పూర్తి చేసుకుని ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి. మొత్తం వృక్షము యొక్క రహస్యము బుద్ధిలో ఉంది. ఇకపోతే వృక్షము యొక్క ఆకులను ఎవరైనా లెక్కపెట్టగలరా. కావున తండ్రి కూడా ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తారు - బీజము మరియు వృక్షము. ఇకపోతే మనుష్యులైతే ఎంతోమంది ఉన్నారు. ఒక్కొక్కరి లోపల ఏముందో కూర్చుని ఏమైనా తెలుసుకుంటారా. భగవంతుడు అంతర్యామి, వారికి ప్రతి ఒక్కరి మనసులో ఉన్న విషయము గురించి తెలుసు అని మనుష్యులు భావిస్తారు. ఇదంతా అంధవిశ్వాసము.

మమ్మల్ని పతితుల నుండి పావనులుగా చేయడానికి రండి, రాజయోగాన్ని నేర్పించండి అని మీరు నన్ను పిలుస్తారని తండ్రి అంటారు. ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు. తండ్రి ఈ మతాన్ని ఇస్తారు కదా. తండ్రి యొక్క శ్రీమతము మరియు గతి అన్నింటికన్నా అతీతమైనది. మతము అనగా సలహా, దీని ద్వారా మన సద్గతి జరుగుతుంది. ఆ ఒక్క తండ్రియే మనకు సద్గతిని ఇచ్చేవారు, ఇంకెవ్వరూ ఇవ్వరు. వారిని ఈ సమయములోనే పిలుస్తారు. సత్యయుగములోనైతే పిలవరు. సర్వుల సద్గతిదాత ఒక్క రాముడు అని ఇప్పుడే అంటారు. మాలను తిప్పుతున్నప్పుడు అలా తిప్పుతూ-తిప్పుతూ ఎప్పుడైతే పుష్పము వస్తుందో, దానిని రామా అని అంటూ కళ్ళకు అద్దుకుంటారు. ఒక్క పుష్పాన్నే జపించాలి. మిగిలినదంతా వారి యొక్క పవిత్రమైన రచన. మాల గురించి మీరు మంచి రీతిలో తెలుసుకున్నారు. ఎవరైతే తండ్రితో పాటు సేవ చేస్తారో, వారిదే ఈ మాల. శివబాబాను రచయిత అని అనరు. రచయిత అని అన్నట్లయితే, వారు ఎప్పుడు రచించారు అన్న ప్రశ్న తలెత్తుతుంది. ప్రజాపిత బ్రహ్మా ఇప్పుడు సంగమములోనే బ్రాహ్మణులను రచిస్తారు కదా. శివబాబా రచన అయితే అనాది అయినది. కేవలం పతితుల నుండి పావనులుగా తయారుచేసేందుకే తండ్రి వస్తారు. ఇప్పుడు ఇది పాత సృష్టి. కొత్త సృష్టిలో దేవతలు ఉంటారు. ఇప్పుడు శూద్రులను దేవతలుగా ఎవరు తయారుచేస్తారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఆ విధంగా తయారవుతున్నారు. బాబా మనల్ని శూద్రులు నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారుచేస్తారని మీకు తెలుసు. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా అయ్యారు. మనుష్య సృష్టిని రచించేవారు బ్రహ్మా, వారు మనుష్య సృష్టి యొక్క హెడ్ (ముఖ్యమైనవారు). ఇకపోతే ఆత్మలకు అవినాశీ తండ్రి అయితే శివుడే. ఈ కొత్త విషయాలన్నింటినీ మీరు వింటారు. వివేకవంతులు ఎవరైతే ఉంటారో, వారు మంచి రీతిలో ధారణ చేస్తారు. మెల్ల-మెల్లగా మీరు కూడా వృద్ధి చెందుతారు. మనము వాస్తవానికి దేవతలుగా ఉండేవారము, మళ్ళీ 84 జన్మలు ఎలా తీసుకున్నాము అన్నది ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతిలోకి వచ్చింది. అన్ని రహస్యాలు మీకు తెలుసు. ఎక్కువ విషయాలలోకి వెళ్ళవలసిన అవసరము లేదు.

తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రి చెప్తున్న ముఖ్యమైన విషయము ఏమిటంటే - ఒకటేమో నన్ను స్మృతి చేయండి, ఇంకొకటి పవిత్రముగా అవ్వండి. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి మరియు తమ సమానముగా తయారుచేయండి. ఇది ఎంత సహజము. కానీ స్మృతి నిలవడము లేదు. జ్ఞానమైతే చాలా సహజము. ఇప్పుడు పాత ప్రపంచము అంతమవ్వనున్నది. తర్వాత సత్యయుగములో కొత్త ప్రపంచములో దేవీ-దేవతలు రాజ్యము చేస్తారు. ఈ ప్రపంచములో అతి పురాతనమైనవి ఈ దేవతల చిత్రాలు మరియు వారి మహళ్ళు మొదలైనవి ఉన్నాయి. మీరంటారు - అతి పురాతనమైన విశ్వ మహారాజులు-మహారాణులుగా మేమే ఉండేవారము. శరీరాలైతే సమాప్తమైపోతాయి. చిత్రాలను తయారుచేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ విషయాలు ఎవరికైనా తెలుసా - ఈ లక్ష్మీ-నారాయణులు ఎవరైతే రాజ్యము చేసేవారో వారు ఎక్కడికి వెళ్ళారు? రాజ్యము ఎలా తీసుకున్నారు? బిర్లా ఇన్ని మందిరాలను నిర్మిస్తారు, కానీ వాటి కోసము ఏమి తెలియదు. ధనము లభిస్తూ ఉంటుంది మరియు నిర్మిస్తూ ఉంటారు. ఇది దేవతల కృప అని భావిస్తారు. ఒక్క శివుని పూజయే అవ్యభిచారి భక్తి. జ్ఞానాన్ని ఇచ్చేవారు జ్ఞానసాగరుడు ఒక్కరే, మిగిలినదంతా భక్తి మార్గము. జ్ఞానము ద్వారా అర్ధకల్పము సద్గతి లభిస్తుంది, ఆ తర్వాత భక్తి యొక్క అవసరముండదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము. ఇప్పుడు భక్తి పట్ల, పాత ప్రపంచము పట్ల వైరాగ్యం ఉంది. పాతది ఇప్పుడు అంతమవ్వనున్నది, దీని పట్ల ఆసక్తిని ఎందుకు పెట్టుకోవాలి. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, మనము ఇంటికి వెళ్తాము. ఆ సంతోషము ఉంటుంది. చాలా మంది ఏమని భావిస్తారంటే - మోక్షము పొందడము మంచిది, మళ్ళీ ఇక్కడికి తిరిగి రాము. ఆత్మ నీటి బుడగ వంటిది, అది సాగరములో కలిసిపోతుంది. ఇవన్నీ ప్రగల్భాలు. పాత్రధారి తప్పకుండా పాత్రను అభినయిస్తారు. ఇంట్లో కూర్చునేవారు పాత్రధారులు కాదు. మోక్షము లభించదు. ఈ డ్రామా అనాదిగా తయారైనది. ఇక్కడ మీకు ఎంత జ్ఞానము లభిస్తుంది. మనుష్యుల బుద్ధిలోనైతే ఏమీ లేదు. తండ్రి నుండి జ్ఞానము తీసుకోవడము, వారసత్వాన్ని పొందడమే మీ పాత్ర. మీరు డ్రామాలో బంధించబడి ఉన్నారు. పురుషార్థము తప్పకుండా చేస్తారు. అలాగని డ్రామాలో ఉంటే లభిస్తుందని కాదు. అలాగైతే కూర్చునే ఉండండి. కానీ కర్మలు చేయకుండా ఎవరూ ఉండలేరు. కర్మ సన్యాసము జరగనే జరగదు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. యోగబలము యొక్క శక్తితో తమ కర్మేంద్రియాలను శీతలముగా తయారుచేసుకోవాలి. మీ వశములో ఉంచుకోవాలి. చెడు విషయాలను వినకూడదు, వినిపించకూడదు. ఏ విషయాలైతే మంచిగా అనిపించవో, వాటిని ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేయాలి.

2. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి, పవిత్రముగా అయి తమ సమానంగా తయారుచేసే సేవను చేయాలి.

వరదానము:-
మురళీ నాదము (వాయిద్యము) ద్వారా మాయను సరెండర్ చేసే మురళీధర్ భవ

మురళీలైతే ఎన్నో విన్నారు, ఇప్పుడు ఎటువంటి మురళీధరులుగా అవ్వండి అంటే మాయ మురళీ ముందు సరెండర్ (బలిహారము) అయిపోవాలి. మురళి రహస్యమనే నాదాన్ని ఒకవేళ ఎల్లప్పుడూ మ్రోగిస్తూ ఉన్నట్లయితే మాయ సదాకాలము కొరకు సరెండర్ అయిపోతుంది. మాయ యొక్క ముఖ్య స్వరూపము కారణము రూపములో వస్తుంది. మురళి ద్వారా కారణానికి నివారణ లభించినట్లయితే మాయ సదాకాలము కొరకు సమాప్తమైపోతుంది. కారణము సమాప్తమైతే మాయ సమాప్తమైనట్లే.

స్లోగన్:-
అనుభవీ స్వరూపులుగా అయినట్లయితే ముఖముపై భాగ్యము యొక్క మెరుపు కనిపిస్తుంది.

అవ్యక్త సూచనలు - ‘‘ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి’’

సంగమయుగ బ్రాహ్మణ జీవితపు విశేషత పవిత్రత, ప్రవృత్తిలో ఉంటూ అపవిత్రత నుండి నివృత్తులుగా ఉండటము, స్వప్నమాత్రముగా కూడా అపవిత్రతతో కూడిన సంకల్పాల నుండి ముక్తులుగా ఉండటము - ఇదే విశ్వానికి ఛాలెంజ్ చేసే సాధనము, ఇదే బ్రాహ్మణులైన మీ యొక్క ఆత్మిక రాయల్టీ మరియు పర్సనాలిటీ.