01-10-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ప్రతి రోజూ రాత్రి మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి, డైరీ పెట్టుకున్నట్లయితే ఎక్కడా నష్టము కలుగకూడదు అన్న భయము ఉంటుంది’’

ప్రశ్న:-
కల్పక్రితపు భాగ్యశాలి పిల్లలకు తండ్రి యొక్క ఏ విషయము వెంటనే టచ్ అవుతుంది?

జవాబు:-
బాబా ప్రతిరోజు పిల్లలకు స్మృతి కోసం ఏ యుక్తులనైతే తెలియజేస్తారో, అవి భాగ్యశాలి పిల్లలకే టచ్ అవుతూ ఉంటాయి. వారు వాటిని వెంటనే అమలులోకి తీసుకొస్తారు. బాబా అంటారు - పిల్లలూ, కొంత సమయము తోటలోకి వెళ్ళి ఏకాంతములో కూర్చోండి. బాబాతో మధురాతి-మధురమైన మాటలు మాట్లాడండి, మీ చార్టు పెట్టుకోండి, అప్పుడు ఉన్నతి జరుగుతూ ఉంటుంది.

ఓంశాంతి
మిలిటరీ వారిని మొట్టమొదట - అటెన్షన్ ప్లీజ్ అని సావధానపరచడం జరుగుతుంది. తండ్రి కూడా పిల్లలను అడుగుతున్నారు - స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకుని తండ్రిని స్మృతి చేస్తూ ఉంటున్నారా? ఈ జ్ఞానాన్ని తండ్రి ఈ సమయములోనే ఇవ్వగలరని పిల్లలకు అర్థం చేయించారు. తండ్రియే చదివిస్తున్నారు. భగవానువాచ కదా - భగవంతుడు ఎవరు అన్నది ముఖ్యమైన విషయము. ఎవరు చదివిస్తున్నారు? ఈ విషయాన్ని మొదట అర్థం చేసుకుని, నిశ్చయము చేసుకోవలసి ఉంటుంది. ఆపై, అతీంద్రియ సుఖములో కూడా ఉండాలి. మనకు అనంతమైన తండ్రి లభించారని ఆత్మకు ఎంతో సంతోషము ఉండాలి. తండ్రి వారసత్వాన్ని ఇచ్చేందుకని ఒక్కసారి మాత్రమే వచ్చి కలుస్తారు. ఏ వారసత్వము? 5 వేల సంవత్సరాల క్రితము వలె విశ్వ రాజ్యాధికారపు వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి వచ్చి ఉన్నారు అనైతే పక్కా నిశ్చయముంది. వారు మళ్ళీ సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, నేర్పించవలసి ఉంటుంది. పిల్లలకు ఏమీ నేర్పించడం జరగదు. దానంతటదే నోటి నుండి అమ్మ-నాన్న అని వస్తుంది, ఎందుకంటే ఆ పదాలనైతే వింటారు కదా. వీరు ఆత్మిక తండ్రి. ఆత్మకు ఆంతరికమైన గుప్త నషా ఉంటుంది. ఆత్మయే చదువుకోవాలి. పరమపిత పరమాత్మ అయితే ఎలాగూ నాలెడ్జ్ ఫుల్ గానే ఉంటారు. వారేమీ చదువుకోలేదు. వారిలో నాలెడ్జ్ ఉండనే ఉంది, ఏ నాలెడ్జ్ ఉంది? ఇది కూడా మీ ఆత్మ అర్థం చేసుకుంటుంది. బాబాలో మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉంది. ఒక్క ధర్మ స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనము ఎలా జరుగుతుంది, ఇదంతా వారికి తెలుసు - అందుకే వారిని అన్నీ తెలిసినవారు అని అంటారు. అన్నీ తెలిసినవారు అంటే అర్థమేమిటి? ఇది ఎవ్వరికీ ఏ మాత్రము తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి ఏమని అర్థం చేయించారంటే - మనుష్యులై ఉండి ఒకవేళ రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల వ్యవధి, పునరావృతమవ్వడము గురించి తెలియకపోతే ఏమనాలి... అని ఈ స్లోగన్ కూడా తప్పకుండా వేయించండి, పునరావృతము అనే ఈ పదము కూడా చాలా అవసరము. కరెక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది కదా. గీతా భగవానుడు ఎవరు... ఈ చిత్రము చాలా ఫస్ట్ క్లాస్ అయినది. మొత్తం ప్రపంచములో ఇదే అన్నింటికన్నా నంబర్ వన్ తప్పు. పరమపిత పరమాత్మను తెలుసుకోని కారణముగా అందరూ భగవంతుడి రూపాలే అని అనేస్తారు. ఎలాగైతే చిన్న పిల్లలను, నీవు ఎవరి బిడ్డవు అని అడిగితే, ఫలానావారి బిడ్డను అని చెప్తారు. మరి ఫలానావారు ఎవరి బిడ్డ అని అడిగితే ఫలానావారికి బిడ్డ అని చెప్తారు. ఇంకా అడిగితే, వారు నా బిడ్డే అని అనేస్తారు. అలాగే ఇక్కడ కూడా భగవంతుని గురించి తెలియని కారణముగా నేనే భగవంతుడిని అని అనేస్తారు. ఎంతో పూజ కూడా చేస్తారు కానీ అర్థం చేసుకోరు. బ్రహ్మా యొక్క రాత్రి అని అంటున్నారంటే తప్పకుండా అది బ్రాహ్మణ-బ్రాహ్మణీల యొక్క రాత్రి కూడా అవుతుంది. ఇవన్నీ ధారణ చేయవలసిన విషయాలు. ఎవరైతే యోగములో ఉంటారో, వారికే ఈ ధారణ జరుగుతుంది. స్మృతినే బలము అని అంటారు. జ్ఞానము అనేది సంపాదనకు ఆధారము. స్మృతి ద్వారా శక్తి లభిస్తుంది, దానితో వికర్మలు వినాశనమవుతాయి. మీరు బుద్ధియోగాన్ని తండ్రితో జోడించాలి. ఈ జ్ఞానాన్ని తండ్రి ఇప్పుడు మాత్రమే ఇస్తారు, ఇక మళ్ళీ ఎప్పుడూ లభించదు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మిగిలినవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలు, కర్మ-కాండల క్రియలు. వాటిని జ్ఞానము అనరు. ఆధ్యాత్మిక జ్ఞానము ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది మరియు వారు అది బ్రాహ్మణులకు మాత్రమే ఇస్తారు. ఇంకెవరి వద్ద ఆధ్యాత్మిక జ్ఞానము ఉండదు. ప్రపంచములో ఎన్ని ధర్మాలు, మఠాలు, సాంప్రదాయాలు ఉన్నాయి, ఎన్ని అభిప్రాయాలు ఉన్నాయి. పిల్లలకు అర్థం చేయించడానికి ఎంత శ్రమ కలుగుతుంది. ఎన్ని తుఫానులు వస్తాయి. నా నావను తీరానికి చేర్చండి - అని పాడుతారు కూడా. అందరి నావలు అయితే తీరానికి చేరుకోలేవు. కొన్ని మునిగిపోతాయి కూడా, కొన్ని నిలిచి ఉంటాయి. చాలా వాటి గురించి 2-3 సంవత్సరాలు వరకు కూడా తెలియదు. కొన్ని అయితే ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. కొన్ని అక్కడే నిలబడిపోతాయి. ఇందులో చాలా శ్రమ ఉంది. ఆర్టిఫీషియల్ యోగాలు కూడా ఎన్ని వెలువడ్డాయి. ఎన్ని యోగ ఆశ్రమాలు ఉన్నాయి. ఆత్మిక యోగ ఆశ్రమము ఏదీ ఉండదు. తండ్రే వచ్చి ఆత్మలకు ఆత్మిక యోగాన్ని నేర్పిస్తారు. బాబా చెప్తున్నారు, ఇది చాలా సహజ యోగము. దీనంతటి సహజమైనది ఇంకేదీ లేదు. ఆత్మయే శరీరములోకి వచ్చి పాత్రను అభినయిస్తుంది. ఎక్కువలో ఎక్కువ 84 జన్మలుంటాయి, మిగిలినవారికి తగ్గిపోతూ ఉంటాయి. ఈ విషయాలు కూడా పిల్లలైన మీలో కొందరి బుద్ధిలోనే ఉన్నాయి. బుద్ధిలో చాలా కష్టము మీద ధారణ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వండి అన్నది తండ్రి అర్థం చేయించే మొదటి విషయము. తండ్రి పరిచయాన్ని ఎలా ఇవ్వాలి, దీని కోసం యుక్తులు రచించబడతాయి. నిశ్చయము ఏర్పడినప్పుడు తండ్రి సత్యమైనవారు అని అర్థం చేసుకుంటారు. తండ్రి తప్పకుండా సత్యమైన విషయాలనే చెప్తూ ఉండవచ్చు. వీటిలో సంశయము రానివ్వకూడదు. స్మృతిలోనే శ్రమ ఉంది, ఇందులో మాయ అపోజిషన్ చేస్తుంది. పదే-పదే స్మృతిని మరపింపజేస్తుంది, అందుకే బాబా అంటారు - చార్టు వ్రాయండి. అప్పుడు ఎవరు ఎంత స్మృతి చేస్తున్నారు అన్నది బాబా కూడా చూస్తారు. పావు వంతు మంది కూడా చార్టు పెట్టరు. కొంతమంది - మేమైతే రోజంతా స్మృతిలోనే ఉంటామని అంటారు. బాబా అంటారు, అది చాలా కష్టము. బంధనాలలో ఉంటూ దెబ్బలు తినేవారు రాత్రింబవళ్ళు పూర్తిగా స్మృతిలో ఉంటూ ఉండవచ్చు, శివబాబా, మేము ఈ సంబంధీకుల నుండి ఎప్పుడు విడుదలవుతాము, బాబా, మేము ఈ బంధనము నుండి ఎలా విడుదలవ్వాలి అని ఆత్మ పిలుస్తుంది. ఒకవేళ ఎవరైనా బాగా స్మృతిలో ఉంటే బాబాకు చార్టు పంపించాలి. రోజూ రాత్రివేళ మీ లెక్కాపత్రము చూసుకోండి, డైరీ పెట్టుకోండి అని డైరెక్షన్లు లభిస్తాయి. డైరీ పెట్టినట్లయితే, మాకు నష్టము కలుగకూడదు అన్న భయము ఉంటుంది. బాబా చూస్తే ఏమంటారు - ఇంత అతి ప్రియమైన తండ్రిని ఇంత సమయమే స్మృతి చేస్తున్నారా! లౌకిక తండ్రిని, పత్నిని మీరు తలచుకుంటారు, నన్ను ఇంత కొంచెము కూడా స్మృతి చెయ్యరా. చార్టు వ్రాస్తే మీకే సిగ్గుగా అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో నేను పదవిని పొందలేను అని అనిపిస్తుంది, అందుకే బాబా చార్టు పట్ల అటెన్షన్ ఇప్పిస్తున్నారు. తండ్రిని మరియు 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయాలి, అప్పుడు చక్రవర్తీ రాజులుగా అవుతారు. తమ సమానముగా తయారుచేసినప్పుడే ప్రజలపై రాజ్యము చేస్తారు. ఇది నరుని నుండి నారాయణునిగా తయారయ్యే రాజయోగము. ఇదే లక్ష్యము-ఉద్దేశ్యము. ఆత్మను చూడడం జరగదు, అర్థం చేసుకోవడం జరుగుతుంది. వీరిలో ఆత్మ ఉంది అని ఇది కూడా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఈ లక్ష్మీ-నారాయణులది తప్పకుండా రాజధాని ఉంటుంది. వీరు అందరికన్నా ఎక్కువ శ్రమ చేశారు, అందుకే స్కాలర్షిప్ పొందారు. తప్పకుండా వీరికి అనేకమంది ప్రజలుంటారు. వీరు ఉన్నతోన్నతమైన పదవిని పొందారు, తప్పకుండా ఎంతో యోగము చేసారు, అందుకే పాస్ విత్ ఆనర్ గా అయ్యారు. మాకు యోగము ఎందుకు కుదరడం లేదు, దీనికి కూడా కారణము తెలుసుకోవాలి. వ్యాపారాలు మొదలైన జంజాటాలలోకి బుద్ధి చాలా వెళ్ళిపోతూ ఉంటుంది. వాటి నుండి సమయము తీసి ఇటు వైపు ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. కొంచెము సమయము తీసి తోటలో ఏకాంతములో కూర్చోవాలి. స్త్రీలు అయితే వెళ్ళలేరు. వారైతే ఇంటిని సంభాళించాలి. పురుషులకు ఇది సహజము. కల్పక్రితపు భాగ్యశాలులు ఎవరైతే ఉంటారో, వారికే ఇది టచ్ అవుతుంది. చదువైతే చాలా మంచిది. ఇకపోతే ప్రతి ఒక్కరి బుద్ధి ఎవరిది వారిదే. ఎలాగైనా సరే తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. తండ్రి డైరెక్షన్లు అన్నీ ఇస్తారు. చేయవలసిందైతే పిల్లలే. బాబా జనరల్ గా డైరెక్షన్లు ఇస్తారు. ఒక్కొక్కరు పర్సనల్ గా వచ్చి అడిగినా కూడా వారికి సలహా ఇవ్వగలరు. తీర్థయాత్రలలో పెద్ద-పెద్ద పర్వతాలపైకి వెళ్ళినప్పుడు పండాలు సావధానపరుస్తూ ఉంటారు. చాలా కష్టముగా వెళ్తారు. పిల్లలైన మీకైతే తండ్రి చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తున్నారు. తండ్రిని స్మృతి చేయాలి. శరీర భానాన్ని సమాప్తము చేయాలి. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళిపోతారు. ఆత్మ వంటి వేగవంతమైన రాకెట్ ఇంకేదీ ఉండదు. వారు చంద్రుడు మొదలైనవాటి పైకి వెళ్ళేందుకు ఎంత టైమ్ వేస్ట్ చేస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఈ సైన్స్ యొక్క నైపుణ్యము కూడా వినాశనములో సహాయము చేస్తుంది. అది సైన్స్, మీది సైలెన్స్. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యడము - ఇది డెడ్ సైలెన్స్. ఆత్మనైన నేను శరీరము నుండి వేరుగా ఉన్నాను. ఈ శరీరము పాత చెప్పు. సర్పము, తాబేలు వంటి ఉదాహరణలు కూడా మీ కోసమే, మీరే పురుగుల వంటి మనుష్యులను భూ-భూ చేసి మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. విషయ సాగరము నుండి క్షీర సాగరములోకి తీసుకువెళ్ళడం మీ పని. సన్యాసులు ఈ యజ్ఞ-తపాదులు మొదలైనవేవీ చేయనవసరం లేదు. భక్తి మరియు జ్ఞానము గృహస్థుల కోసమే ఉన్నాయి. సన్యాసులైతే సత్యయుగములోకి వచ్చేదే లేదు. ఈ విషయాలు వారికేమి తెలుసు. ఈ నివృత్తి మార్గము వారిది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారో - వారే డ్రామానుసారముగా వస్తూ ఉంటారు. ఇందులో కూడా నంబరువారుగా వెలువడుతూ ఉంటారు. మాయ చాలా శక్తివంతమైనది. కళ్ళు చాలా అశుద్ధముగా ఉన్నాయి. జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించడముతో కళ్ళు పవిత్రముగా అవుతాయి, ఇక అర్ధకల్పము మళ్ళీ ఎప్పుడూ అశుద్ధముగా అవ్వవు. ఇవి చాలా మోసగిస్తాయి. మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా కర్మేంద్రియాలు శీతలమవుతాయి. ఇక మళ్ళీ 21 జన్మలు కర్మేంద్రియాలు చంచలత్వములోకి రావు. అక్కడ కర్మేంద్రియాలలో చంచలత్వము ఉండదు. కర్మేంద్రియాలన్నీ శాంతిగా, సతోగుణీగా ఉంటాయి. దేహాభిమానము తర్వాతనే అసురత్వమంతా వస్తుంది. తండ్రి మిమ్మల్ని దేహీ-అభిమానులుగా తయారుచేస్తున్నారు. అర్ధకల్పము కోసం మీకు వారసత్వము లభిస్తుంది. ఎవరెంత శ్రమ చేస్తారో, అంతటి ఉన్నత పదవిని పొందుతారు. దేహీ-అభిమానులుగా అయ్యే కృషి చెయ్యాలి, అప్పుడిక కర్మేంద్రియాలు మోసము చెయ్యవు. చివరి వరకు యుద్ధము నడుస్తూనే ఉంటుంది. కర్మాతీత అవస్థకు చేరుకున్నప్పుడు ఆ యుద్ధము కూడా మొదలవుతుంది. రోజురోజుకూ శబ్దము వెలువడుతూ ఉంటుంది, మృత్యువుకు భయపడతారు.

తండ్రి చెప్తున్నారు, ఈ జ్ఞానము అందరి కోసముంది. కేవలం తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఆత్మలమైన మనమంతా పరస్పరము సోదరులము. అందరూ ఒక్క తండ్రిని స్మృతి చేస్తారు. గాడ్ ఫాదర్ అని అంటారు. ప్రకృతిని నమ్మేవారు కొందరుంటారు. కానీ గాడ్ అయితే ఉన్నారు కదా. ముక్తి-జీవన్ముక్తుల కొరకు వారిని స్మృతి చేస్తారు. మోక్షము అయితే ఉండదు. ప్రపంచ చరిత్ర-భౌగోళికము రిపీట్ అవ్వాలి. సత్యయుగము ఉన్నప్పుడు ఒక్క భారత్ యే ఉండేదని బుద్ధి కూడా చెప్తుంది. మనుష్యులకైతే ఏమీ తెలియదు. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది కదా. లక్షల సంవత్సరాల విషయమైతే ఉండదు. లక్షల సంవత్సరాలు ఉండి ఉండుంటే జనాభా సంఖ్య ఎంతగా పెరిగిపోయి ఉండేది. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు కలియుగము పూర్తయ్యి సత్యయుగ స్థాపన జరుగుతోంది. వారు కలియుగము ఇంకా బాల్యములోనే ఉందని, ఇన్ని వేల సంవత్సరాల ఆయుష్షు ఉందని భావిస్తారు. ఈ కల్పము ఉన్నదే 5 వేల సంవత్సరాలు అని పిల్లలైన మీకు తెలుసు. భారత్ లోనే ఈ స్థాపన జరుగుతోంది. భారత్ యే ఇప్పుడు స్వర్గముగా అవుతోంది. ఇప్పుడు మనము శ్రీమతముపై ఈ రాజ్య స్థాపన చేస్తున్నాము. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. మొట్టమొదట అసలు ఈ మాటే చెప్పండి. ఎంతవరకైతే తండ్రి పట్ల నిశ్చయము ఏర్పడదో అంతవరకు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇంకా ఏదైనా విషయానికి సమాధానము లభించకపోతే - వీరికి అసలేమీ తెలియదు కానీ భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారని చెప్తున్నారు అని అనుకుంటారు, అందుకే మొట్టమొదట ఈ ఒక్క విషయాన్నే పట్టుకోండి. తప్పకుండా ఆత్మలందరి తండ్రి ఒక్కరే మరియు వారే రచయిత అని మొదట తండ్రి పట్ల నిశ్చయము ఏర్పరచాలి. వారు తప్పకుండా సంగమయుగములోనే వస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను ప్రతి యుగములోనూ రాను, కల్పము యొక్క సంగమయుగములోనే వస్తాను. నేను ఉన్నదే కొత్త సృష్టి రచయితను. కావున మధ్యలో ఎలా వస్తాను. నేను పాత యుగానికి మరియు కొత్త యుగానికి మధ్యలోనే వస్తాను. దీనిని పురుషోత్తమ సంగమయుగమని అంటారు. మీరు పురుషోత్తములుగా కూడా ఇక్కడే అవుతారు. లక్ష్మీ-నారాయణులు అందరికన్నా పురుషోత్తములు. లక్ష్యము-ఉద్దేశ్యము ఎంత సహజమైనది. ఈ స్థాపన జరుగుతోందని అందరికీ చెప్పండి. పురుషోత్తమ అనే పదాన్ని తప్పకుండా వ్రాయండి అని బాబా చెప్పారు ఎందుకంటే ఇక్కడ మీరు కనిష్టుల నుండి పురుషోత్తములుగా అవుతారు. ఇటువంటి ముఖ్యమైన విషయాలను మర్చిపోకూడదు. మరియు ఆ కాలము యొక్క తారీఖులు కూడా తప్పకుండా వ్రాయాలి. అక్కడ మీ రాజ్యము మొదటి నుండే ప్రారంభమవుతుంది, ఇతరులెవ్వరి రాజ్యము మొదటి నుండి ఉండదు. అక్కడ ధర్మస్థాపకులు వచ్చినప్పుడు వారి వెనుక వారి ధర్మము వృద్ధి చెందుతుంది. కోట్ల సంఖ్యలో తయారైనప్పుడు వారి రాజ్యము స్థాపనవుతుంది. మీకైతే సత్యయుగము మొదటి నుండే రాజ్యము ఉంటుంది. సత్యయుగములో ఇంతటి రాజ్యము ఎక్కడి నుండి వచ్చింది అనేది ఎవరి బుద్ధిలోకి రాదు. కలియుగాంతములో ఇన్ని లెక్కలేనన్ని ధర్మాలు ఉన్నాయి, మరి సత్యయుగములో ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఎలా ఏర్పడింది? ఎన్ని వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉన్నాయి. భారత్ ఎలా ఉండేదంటే, దానిని ప్యారడైజ్ అనేవారు. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయము. లక్షల సంవత్సరాల లెక్క ఎక్కడి నుండి వచ్చింది. మనుష్యులు ఎంతగా తికమకలో ఉన్నారు. ఇప్పుడు వారికి ఎవరు అర్థం చేయించాలి. మేము ఆసురీ రాజ్యములో ఉన్నామని వారు అర్థం చేసుకోరు. వీరికి (దేవతలకు) సర్వగుణ సంపన్నులు... అని మహిమ ఉంది, వీరిలో పంచ వికారాలు లేవు ఎందుకంటే దేహీ-అభిమానులుగా ఉన్నారు, అందుకే ముఖ్యమైన విషయము స్మృతి అని తండ్రి చెప్తున్నారు. 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ మీరు పతితముగా అయ్యారు, ఇప్పుడు మళ్ళీ పవిత్రముగా అవ్వాలి. ఇది డ్రామా చక్రము. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ధారణ చేసి మోసము చేసే మీ కళ్ళను పవిత్రముగా తయారుచేసుకోవాలి. స్మృతి ద్వారానే కర్మేంద్రియాలు శీతలముగా, సతోగుణీగా అవుతాయి, అందుకే ఇదే కృషి చేయాలి.

2. వ్యాపారము మొదలైనవాటి నుండి సమయము తీసి ఏకాంతములోకి వెళ్ళి స్మృతిలో కూర్చోవాలి. మాకు యోగము ఎందుకు కుదరడం లేదు అని కారణము చూసుకోవాలి. మీ చార్టును తప్పకుండా పెట్టాలి.

వరదానము:-
సహనశక్తి ద్వారా అవినాశీ మరియు మధురమైన ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సర్వులకు స్నేహీ భవ

సహనము చేయడము అంటే మరణించడము కాదు, వాస్తవానికి అందరి హృదయాలలో స్నేహముతో జీవించడము. ఎటువంటి విరోధులైనా, రావణుడి కన్నా శక్తివంతముగా ఉన్నా, ఒక్కసారి కాదు పది సార్లు సహనము చేయవలసి వచ్చినా కానీ సహనశక్తి యొక్క ఫలము అవినాశీగా మరియు మధురముగా ఉంటుంది. నేను ఇంత సహనము చేసాను కావున వారు కూడా ఎంతోకొంత చేయాలి కదా అని కేవలం ఈ భావనను పెట్టుకోకండి. అల్పకాలికమైన ఫలము యొక్క భావనను పెట్టుకోకండి. దయా భావాన్ని ఉంచండి - ఇదే సేవా భావము. సేవా భావము కలవారు సర్వుల బలహీనతలను ఇముడ్చుకుంటారు. వాటిని ఎదిరించరు.

స్లోగన్:-
ఏదైతే గతించిపోయిందో దానిని మర్చిపోండి, గతించిన విషయాల నుండి శిక్షణ తీసుకుని భవిష్యత్తు కోసము సదా అప్రమత్తముగా ఉండండి.

అవ్యక్త సూచనలు - స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి

బాప్ దాదాకు ఎలాగైతే దయ కలుగుతుందో, అలా పిల్లలైన మీరు కూడా మాస్టర్ దయార్ద్ర హృదయులుగా అయి తమ మనసా వృత్తి ద్వారా, వాయుమండలము ద్వారా ఆత్మలకు తండ్రి ద్వారా లభించిన శక్తులను ఇవ్వండి. కొద్ది సమయములోనే మొత్తము విశ్వము యొక్క సేవను సంపన్నము చెయ్యాలి, తత్వాల సహితముగా అందరినీ పావనంగా చెయ్యాలి కావున మనసు ద్వారా తీవ్రవేగముతో సేవ చెయ్యండి, యోగ శక్తులను ప్రయోగించండి.