ఓంశాంతి
ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, బ్రాహ్మణులమైన మనమే ఆత్మిక తండ్రిని
గుర్తిస్తామని మీకు తెలుసు. ఆత్మిక తండ్రి, ఎవరినైతే గాడ్ ఫాదర్ లేక పరమపిత పరమాత్మ
అని అంటున్నారో, వారి గురించి ప్రపంచములోని మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు.
ఎప్పుడైతే ఆ ఆత్మిక తండ్రి వస్తారో, అప్పుడే ఆత్మిక పిల్లలకు పరిచయాన్ని ఇస్తారు. ఈ
జ్ఞానము సృష్టి ఆదిలోనూ ఉండదు, సృష్టి అంతిమములోనూ ఉండదు. ఇప్పుడు మీకు జ్ఞానము
లభించింది, ఇది సృష్టి అంతిమము మరియు ఆది యొక్క సంగమయుగము. ఈ సంగమయుగము గురించి కూడా
తెలియకపోతే ఇక తండ్రిని ఎలా తెలుసుకోగలరు. ఓ పతిత-పావనా రండి, మీరు వచ్చి పావనముగా
చేయండి అని అంటారు కానీ పతిత-పావనుడు ఎవరు మరియు వారెప్పుడు వస్తారు అనేది తెలియదు.
తండ్రి అంటారు - నేను ఎవరినో, ఎలా ఉన్నానో, నా గురించి ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడైతే
నేను వచ్చి పరిచయాన్ని ఇస్తానో, అప్పుడే నన్ను తెలుసుకుంటారు. నేను నా పరిచయాన్ని
మరియు సృష్టి ఆదిమధ్యాంతాల పరిచయాన్ని సంగమయుగములో ఒక్కసారి మాత్రమే వచ్చి ఇస్తాను.
కల్పము తర్వాత మళ్ళీ వస్తాను. మీకు ఏదైతే అర్థం చేయిస్తున్నానో అది మళ్ళీ
కనుమరుగైపోతుంది. సత్యయుగము నుండి మొదలుకొని కలియుగాంతము వరకు మనుష్యమాత్రులెవ్వరికీ
పరమపిత పరమాత్మనైన నా గురించి తెలియదు. అలాగే బ్రహ్మా-విష్ణు-శంకరులను గురించి కూడా
తెలియదు. నన్ను మనుష్యులే పిలుస్తారు, బ్రహ్మా-విష్ణు-శంకరులు పిలవరు. మనుష్యులు
దుఃఖితులైనప్పుడు పిలుస్తారు. సూక్ష్మవతనపు విషయమే లేదు. ఆత్మిక తండ్రి వచ్చి తమ
ఆత్మిక పిల్లలకు అనగా ఆత్మలకు కూర్చుని అర్థం చేయిస్తారు. అచ్ఛా, ఆత్మిక తండ్రి
పేరేమిటి? బాబా అని ఎవరినైతే అంటారో, వారికి తప్పకుండా ఏదో ఒక పేరుండాలి కదా.
తప్పకుండా శివ అనే ఒక్క పేరునే ఉపయోగిస్తారు. ఇది ప్రసిద్ధి చెందిన పేరు కానీ
మనుష్యులు అనేక పేర్లను పెట్టేసారు. భక్తి మార్గములో తమ బుద్ధితో ఈ లింగ రూపాన్ని
తయారుచేసారు. అయినా శివ అన్న పేరే ఉంటుంది. తండ్రి అంటారు - నేను ఒక్కసారే వస్తాను,
వచ్చి ముక్తి-జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇస్తాను. మనుష్యులు ముక్తిధామము,
నిర్వాణధామము అన్న పేర్లను ఉపయోగిస్తారు కానీ వాటి గురించి ఏమీ తెలియదు. తండ్రి
గురించి తెలియదు, అలాగే దేవతల గురించి తెలియదు. తండ్రి భారత్ లోకి వచ్చి రాజధానిని
ఏ విధముగా స్థాపన చేస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు. పరమపిత పరమాత్మ ఏ విధముగా వచ్చి
ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు అని శాస్త్రాలలో కూడా ఇటువంటి
విషయాలేవీ లేవు. సత్యయుగములో దేవతలకు జ్ఞానము ఉండేదని, అది మాయమైపోయిందని కాదు. అలా
కాదు. ఒకవేళ దేవతలలో కూడా ఈ జ్ఞానము ఉన్నట్లయితే, అది కొనసాగుతూ వచ్చేది. ఇస్లాములు,
బౌద్ధులు మొదలైనవారెవరైతే ఉన్నారో వారి జ్ఞానము కొనసాగుతూ వస్తుంది. ఈ జ్ఞానము
కనుమరుగైపోతుందని అందరికీ తెలుసు. నేను ఎప్పుడైతే వస్తానో, అప్పుడు ఏ ఆత్మలైతే
పతితముగా అయి రాజ్యాన్ని పోగొట్టుకుని కూర్చున్నారో, వారిని మళ్ళీ పావనముగా
తయారుచేస్తాను. భారత్ లో రాజ్యముండేది, దానినెలా పోగొట్టుకున్నారు, ఇది కూడా
ఎవ్వరికీ తెలియదు. అందుకే తండ్రి అంటారు, పిల్లల బుద్ధి ఎంత తుచ్ఛబుద్ధిగా
అయిపోయింది. నేను పిల్లలకు ఈ జ్ఞానాన్ని ఇచ్చి ప్రారబ్ధాన్ని ఇస్తాను, మళ్ళీ అందరూ
మర్చిపోతారు. తండ్రి ఏ విధముగా వచ్చారు, ఏ విధముగా పిల్లలకు శిక్షణను ఇచ్చారు
అనేదంతా మర్చిపోతారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. పిల్లలకు విచార సాగర మంథనము
చేసేందుకు విశాలమైన బుద్ధి కావాలి.
తండ్రి అంటారు, ఈ శాస్త్రాలు మొదలైనవేవైతే మీరు చదువుతూ వచ్చారో, వీటిని సత్య,
త్రేతాయుగాలలో చదివేవారు కాదు. అక్కడ అవి లేనే లేవు. మీరు ఈ జ్ఞానాన్ని మర్చిపోతారు,
మరి గీత మొదలైన శాస్త్రాలు ఎక్కడ నుండి వచ్చాయి? ఎవరైతే గీతను విని ఈ పదవిని పొందారో,
వారికే తెలియకపోతే ఇక ఇతరులు ఎలా తెలుసుకోగలరు. తాము మనుష్యుల నుండి దేవతలుగా ఎలా
అయ్యారు అనేది దేవతలు కూడా తెలుసుకోలేరు. ఆ పురుషార్థము యొక్క పాత్రయే
సమాప్తమైపోయింది. మీ ప్రారబ్ధము ప్రారంభమయ్యింది. అక్కడ ఈ జ్ఞానము ఎలా ఉండగలదు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు, కల్పక్రితము వలె ఈ జ్ఞానము మీకు మళ్ళీ లభిస్తుంది.
మీకు రాజయోగాన్ని నేర్పించి ప్రారబ్ధాన్ని ఇవ్వడము జరుగుతుంది. ఇక తర్వాత అక్కడ
దుర్గతి ఉండదు, కావున జ్ఞానము యొక్క విషయము కూడా తలెత్తదు. జ్ఞానము ఉన్నదే సద్గతి
పొందేందుకు. దానిని ఇచ్చేవారు ఒక్క తండ్రియే. సద్గతి మరియు దుర్గతి అనే పదాలు ఇక్కడ
నుండే వెలువడుతాయి. సద్గతిని భారతవాసులే పొందుతారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ స్వర్గాన్ని
రచించారని భావిస్తారు. ఎప్పుడు రచించారు? ఇది ఏ మాత్రము తెలియదు. శాస్త్రాలలో లక్షల
సంవత్సరాలని వ్రాసేసారు. తండ్రి అంటారు - పిల్లలూ, మీకు మళ్ళీ జ్ఞానాన్ని ఇస్తాను,
తర్వాత ఈ జ్ఞానము సమాప్తమైపోతుంది, అప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. అర్ధకల్పము
జ్ఞానము, అర్ధకల్పము భక్తి. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. సత్యయుగానికి లక్షల
సంవత్సరాల ఆయువును చూపించారు. ఇక వారికి ఎలా తెలుస్తుంది. 5 వేల సంవత్సరాల నాటి
విషయాన్ని కూడా మర్చిపోయారు, ఇక లక్షల సంవత్సరాల విషయాన్ని ఎలా తెలుసుకోగలరు. ఏమీ
అర్థం చేసుకోరు. తండ్రి ఎంత సహజముగా అర్థం చేయిస్తారు. కల్పము ఆయుష్షు 5 వేల
సంవత్సరాలు. యుగాలే 4 ఉంటాయి. నాలుగింటికీ సమానముగా 1250 సంవత్సరాల కాలము ఉంటుంది.
ఇది బ్రాహ్మణుల చిన్నని యుగము. ఆ 4 యుగాల కంటే ఇది చాలా చిన్ననిది. తండ్రి
కొత్త-కొత్త పాయింట్లను రకరకాల పద్ధతులతో, సహజమైన రీతిలో పిల్లలకు అర్థం చేయిస్తూ
ఉంటారు. ధారణను మీరు చేయాలి. కృషిని మీరు చేయాలి. డ్రామానుసారముగా ఏదైతే అర్థం
చేయిస్తూ వచ్చానో, ఆ పాత్ర కొనసాగుతూ వస్తుంది. ఏదైతే తెలియజేసేది ఉందో, అదే ఈ రోజు
తెలియజేస్తున్నాను. ఇమర్జ్ అవుతూ ఉంటుంది. మీరు వింటూ ఉంటారు. మీరే ధారణ చేయాలి
మరియు చేయించాలి. నేనైతే ధారణ చేయవలసిన అవసరము లేదు. మీకు వినిపిస్తాను, ధారణ
చేయిస్తాను. నా ఆత్మలో పతితులను పావనముగా తయారుచేసే పాత్ర ఉంది. కల్పక్రితము ఏదైతే
అర్థం చేయించానో, అదే వెలువడుతూ ఉంటుంది. నేను ఏమి వినిపిస్తాను అనేది నాకు ముందు
నుండే తెలియదు. ఇతని ఆత్మ విచార సాగర మంథనము చేస్తుంది. ఇతను విచార సాగర మంథనము చేసి
వినిపిస్తున్నారా లేక బాబా వినిపిస్తున్నారా - ఇవి చాలా లోతైన విషయాలు, ఇందులో చాలా
మంచి వివేకము కావాలి. ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో, వారికే విచార సాగర మంథనము
నడుస్తూ ఉంటుంది.
వాస్తవానికి కన్యలు బంధనముక్తులుగా ఉంటారు. వారు ఈ ఆత్మిక చదువులో నిమగ్నమైపోవాలి,
వారికి ఎటువంటి బంధనము లేదు. కుమారీలు దీనిని బాగా తీసుకోవచ్చు, వారికి ఉన్న పనే
చదువుకోవడము మరియు చదివించడము. వారు సంపాదించాల్సిన అవసరము లేదు. కుమారీ ఒకవేళ ఈ
జ్ఞానాన్ని మంచి రీతిలో అర్థం చేసుకున్నట్లయితే, అది అన్నిటికంటే మంచిది. తెలివైన
కుమారీ అయితే ఇక ఈ ఆత్మిక సంపాదనలో నిమగ్నమైపోతారు. కొంతమంది కుమారీలు అభిరుచితో
లౌకిక చదువును చదువుకుంటూ ఉంటారు. దాని వలన లాభమేమీ ఉండదు, మీరు ఈ ఆత్మిక చదువును
చదువుకుని సేవలో నిమగ్నమవ్వండని వారికి అర్థం చేయించడము జరుగుతుంది. ఆ చదువు అయితే
దేనికీ ఉపయోగపడదు. దానిని చదువుకుని గృహస్థ వ్యవహారములోకి వెళ్ళిపోతారు.
గృహస్థములోని మాతలుగా అయిపోతారు. కన్యలైతే ఈ జ్ఞానములో నిమగ్నమైపోవాలి. అడుగడుగునా
శ్రీమతముపై నడుస్తూ ధారణలో నిమగ్నమైపోవాలి. మమ్మా ప్రారంభములో వచ్చారు మరియు ఈ
చదువులో నిమగ్నమైపోయారు, ఎంతమంది కుమారీలు మాయమైపోయారు. కుమారీలకు మంచి అవకాశముంది.
శ్రీమతముపై నడిచినట్లయితే చాలా ఫస్ట్ క్లాస్ గా అవుతారు. ఇది శ్రీమతమా లేక బ్రహ్మా
మతమా - ఇందులోనే తికమకపడిపోతారు. అయినా ఇది బాబా రథము కదా. వీరి ద్వారా ఏదైనా
పొరపాటు జరిగినా, మీరు శ్రీమతముపై నడుస్తూ ఉన్నట్లయితే దానిని వారంతట వారే సరి
చేస్తారు. శ్రీమతము లభించడము కూడా వీరి ద్వారానే లభిస్తుంది. శ్రీమతము లభిస్తుందని
మీరు సదా భావించాలి, ఇక తర్వాత ఏం జరిగినా వారు స్వయము బాధ్యులు. బాబా అంటారు - వీరి
ద్వారా ఏమైనా జరిగినా, నేను బాధ్యుడను. డ్రామాలో ఈ రహస్యము నిశ్చితమై ఉంది. వీరిని
కూడా బాగు చేయగలరు. అయినా వీరు తండ్రి కదా. బాప్ దాదా ఇరువురూ కలిసే ఉన్నారు కావున
శివబాబా చెప్తున్నారా లేక బ్రహ్మా చెప్తున్నారా అన్నది తెలియదు అని తికమకపడుతూ
ఉంటారు. శివబాబాయే మతమును ఇస్తున్నారని ఒకవేళ భావించినట్లయితే ఇక ఎప్పుడూ కదలరు.
శివబాబా ఏదైతే అర్థం చేయిస్తారో, అది రైటే. మీరంటారు - బాబా, మీరే మాకు తండ్రి,
టీచర్, గురువు. మరి శ్రీమతముపై నడవాలి కదా. వారు ఏం చెప్తే దానిపై నడుచుకోండి.
ఎల్లప్పుడూ శివబాబాయే చెప్తున్నారని భావించండి - వారు కళ్యాణకారి, వీరి బాధ్యత కూడా
వారిపై ఉంది. వారి రథము కదా. ఇది బ్రహ్మా సలహానా లేక శివబాబాదా అన్నది తెలియదు, అని
ఎందుకు తికమకపడతారు. శివబాబాయే అర్థం చేయిస్తున్నారని మీరెందుకు అర్థం చేసుకోరు.
శ్రీమతము ఏం చెప్తే, అది చేస్తూ ఉండండి. ఇతరుల మతములోకి అసలు మీరెందుకు వస్తారు.
శ్రీమతముపై నడిచినట్లయితే ఎప్పుడూ కునికిపాట్లు రావు. కానీ నడవలేకపోతారు,
తికమకపడతారు. బాబా అంటారు, మీరు శ్రీమతముపై నిశ్చయము పెట్టుకున్నట్లయితే నేను
బాధ్యుడిని. మీరు నిశ్చయమే పెట్టుకోకపోతే ఇక నేను కూడా బాధ్యుడిని కాను. శ్రీమతముపై
నడవాల్సిందేనని ఎల్లప్పుడూ భావించండి. వారు ఏమి చెప్తే అది, వారు ప్రేమ చేసినా లేక
కొట్టినా... అని ఇది వారి కోసమున్న గాయనమే. ఇందులో కాలితో తన్నడము మొదలైన విషయమేమీ
లేదు. కానీ ఎవరికైనా నిశ్చయము కూర్చోవడమే చాలా కష్టము. నిశ్చయము పూర్తిగా
కూర్చున్నట్లయితే కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. కానీ ఆ అవస్థ రావడానికి కూడా సమయము
కావాలి. అది అంతిమములో జరుగుతుంది, ఇందులో నిశ్చయము చాలా స్థిరముగా ఉండాలి. శివబాబా
ద్వారానైతే ఎప్పుడూ ఎటువంటి పొరపాటు జరగదు, వీరి ద్వారా జరగవచ్చు. వీరిరువురూ కలిసే
ఉన్నారు. కానీ - శివబాబా అర్థం చేయిస్తున్నారు, దానిపై మనము నడవాల్సి ఉంటుందని మీరు
నిశ్చయము కూడా పెట్టుకోవాలి. బాబా శ్రీమతమని భావిస్తూ నడుచుకుంటూ ఉండండి, అప్పుడు
తప్పు కూడా ఒప్పు అయిపోతుంది. అక్కడక్కడా అపార్థాలు కూడా జరుగుతాయి. శివబాబా మరియు
బ్రహ్మాబాబా మురళీని కూడా చాలా మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. బాబా చెప్పారా లేక
వీరు చెప్పారా. బ్రహ్మా అసలు మాట్లాడరని కూడా కాదు. కానీ బాబా అర్థం చేయించారు -
అచ్ఛా, ఈ బ్రహ్మాకు ఏమీ తెలియదు, అంతా శివబాబాయే వినిపిస్తారు అని భావించండి పోని.
శివబాబా రథానికి స్నానము చేయిస్తాను, శివబాబా భండారా యొక్క సేవ చేస్తాను - ఇది
గుర్తున్నా కూడా చాలా మంచిది. శివబాబా స్మృతిలో ఉంటూ ఏమి చేసినా చాలామంది కంటే
చురుకుగా ముందుకు వెళ్ళగలరు. ముఖ్యమైన విషయము శివబాబాను స్మృతి చేయడమే. భగవంతుడు
మరియు వారు ఇచ్చే రాజ్యాధికార వారసత్వము. మిగిలినదంతా విస్తారము.
తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో, దానిపై అటెన్షన్ పెట్టాలి. తండ్రియే పతిత-పావనుడు,
జ్ఞానసాగరుడు కదా. వారే వచ్చి పతిత శూద్రులను బ్రాహ్మణులుగా తయారుచేస్తారు.
బ్రాహ్మణులనే పావనముగా తయారుచేస్తారు, శూద్రులను పావనముగా చేయరు, ఈ విషయాలన్నీ
భాగవతము మొదలైనవాటిలో లేవు. కొన్ని-కొన్ని విషయాలు ఉన్నాయి. రాధా-కృష్ణులే
లక్ష్మీ-నారాయణులని కూడా మనుష్యులకు తెలియదు. తికమకపడతారు. దేవతలు ఉన్నదే
సూర్యవంశీయులు, చంద్రవంశీయులు. లక్ష్మీ-నారాయణుల రాజ్యము, సీతా-రాముల రాజ్యము. బాబా
అంటారు - భారతవాసీ మధురమైన పిల్లలూ, స్మృతి చేయండి. లక్షల సంవత్సరాల విషయమైతే కాదు.
ఇది నిన్నటి విషయమే. మీకు రాజ్యాన్ని ఇచ్చాను. లెక్కలేనంత ధనమును, సంపదను ఇచ్చాను.
తండ్రి మిమ్మల్ని మొత్తం విశ్వానికి యజమానులుగా చేసారు, ఇంకే ఖండాలు ఉండేవి కావు,
మరి తర్వాత మీకు ఏమయ్యింది! విద్వాంసులు, ఆచార్యులు, పండితులు, ఎవ్వరికీ ఈ విషయాలు
తెలియవు. తండ్రియే అంటారు - అరే భారతవాసులు, మీకు రాజ్య భాగ్యాన్ని ఇచ్చాను కదా.
మీకు ఇంత ధనాన్ని ఇచ్చాను, మీరు మళ్ళీ ఎక్కడ పోగొట్టుకున్నారని శివబాబా అంటున్నారని
మీరు కూడా చెప్తారు. తండ్రి వారసత్వము ఎంత గొప్పది. తండ్రియే అడుగుతారు కదా లేక
తండ్రి వెళ్ళిపోతే మిత్ర-సంబంధీకులు అడుగుతారు - తండ్రి నీకు ఇంత ధనాన్ని ఇచ్చారు,
అదంతా ఎక్కడ పోగొట్టుకున్నావు అని! వీరైతే అనంతమైన తండ్రి. తండ్రి గవ్వ నుండి వజ్రము
వలె తయారుచేసారు. ఇంతటి రాజ్యాన్ని ఇచ్చారు, మరి ఆ ధనము ఏమైపోయింది అని అడిగితే మీరు
ఏం జవాబు ఇస్తారు. ఇది ఎవ్వరికీ అర్థం కాదు. ఇంతటి నిరుపేదగా ఎలా అయిపోయారని తండ్రి
సరిగ్గానే అడుగుతున్నారని మీరు భావిస్తారు. మొదట అన్నీ సతోప్రధానముగా ఉండేవి,
తర్వాత కళలు తగ్గుతూ వచ్చాయి, ఇక అన్నీ తగ్గిపోతూ వచ్చాయి. సత్యయుగములోనైతే
సతోప్రధానముగా ఉండేవారు, లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. రాధా-కృష్ణుల కన్నా
లక్ష్మీ-నారాయణుల పేరు ఎక్కువగా ఉంటుంది. వారి గురించి ఎటువంటి నింద వ్రాయలేదు,
మిగిలినవారందరి గురించి నిందలు వ్రాసారు. లక్ష్మీ-నారాయణుల రాజ్యములో అసురులు
మొదలైనవారెవ్వరి గురించి చెప్పరు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. బాబా జ్ఞాన ధనముతో
జోలెను నింపుతున్నారు. తండ్రి అంటారు - పిల్లలూ, ఈ మాయతో అప్రమత్తముగా ఉండండి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.