ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. చూడండి, అందరూ తిలకాన్ని
ఇక్కడ (భృకుటిలో) దిద్దుకుంటారు. ఈ స్థానము, ఒకటేమో - ఇది ఆత్మ యొక్క నివాస స్థానము,
మరొకటి రాజ్య తిలకాన్ని కూడా ఇక్కడే దిద్దుతారు. ఇది ఆత్మకు గుర్తుగా ఉండనే ఉంది.
ఇప్పుడు ఆత్మకు తండ్రి యొక్క స్వర్గ వారసత్వము కావాలి. విశ్వపు రాజ్య తిలకము కావాలి.
సూర్యవంశీ-చంద్రవంశీ మహారాజులు-మహారాణులుగా అయ్యేందుకు చదువుకుంటారు. ఈ చదువును
చదువుకోవడము అనగా మీ కొరకు మీరు రాజ్య తిలకాన్ని ఇచ్చుకోవడము. మీరు ఇక్కడికి
వచ్చిందే చదువుకోవడానికి. ఆత్మ ఏదైతే ఇక్కడ నివసిస్తుందో, ఆ ఆత్మ అంటుంది - బాబా,
మేము మీ నుండి విశ్వము యొక్క స్వరాజ్యాన్ని తప్పకుండా పొందుతాము. ప్రతి ఒక్కరూ తమ
కొరకు తాము పురుషార్థము చేయాలి. పిల్లలు అంటారు - బాబా, మేము ఇటువంటి సుపుత్రులుగా
అయి చూపిస్తాము. మేము ఎలా నడుచుకుంటున్నాము అని మీరు మా నడవడికను చూస్తూ ఉండండి.
మనము స్వయానికి రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు యోగ్యులుగా అయ్యామా లేదా అని మీరు
కూడా తెలుసుకోగలరు. పిల్లలైన మీరు తండ్రికి సుపుత్రులుగా అయి చూపించాలి. బాబా, మేము
మీ పేరును తప్పకుండా ప్రసిద్ధి చేస్తాము. మేము మీకు సహాయకులుగా అనగా స్వయానికి
సహాయకులుగా అయి భారత్ పై మా రాజ్యము చేస్తాము. భారతవాసులు అంటారు కదా - ఇది మా
రాజ్యము అని. కానీ, ఇప్పుడు విషయ వైతరిణీ నదిలో పడి ఉన్నారని పాపము వారికి తెలియదు.
ఆత్మలమైన మన రాజ్యమైతే లేదు. ఇప్పుడు ఆత్మ తలక్రిందులుగా వేలాడుతూ ఉంది. తినడానికి
కూడా లభించడం లేదు. ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందో, అప్పుడు బాబా అంటారు
- ఇప్పుడైతే నా పిల్లలకు తినడానికి కూడా లభించడము లేదు, ఇప్పుడు నేను వెళ్ళి వీరికి
రాజయోగాన్ని నేర్పిస్తాను. కావున తండ్రి రాజయోగాన్ని నేర్పించడానికి వస్తారు.
పిల్లలు అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. వారు కొత్త ప్రపంచాన్ని రచించేవారు.
తండ్రి పతిత-పావనుడు కూడా, జ్ఞానసాగరుడు కూడా. ఈ విషయాలు మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి
బుద్ధిలోనూ లేవు. తప్పకుండా మన బాబా జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు అని కేవలం పిల్లలైన
మీకు మాత్రమే తెలుసు. ఈ మహిమను పక్కాగా గుర్తుంచుకోండి, మర్చిపోకండి. ఇది తండ్రి
మహిమ కదా. ఆ తండ్రి పునర్జన్మ రహితుడు. కృష్ణుడి మహిమ పూర్తిగా వేరు. ప్రైమ్
మినిస్టర్ (ప్రధాన మంత్రి), ప్రెసిడెంట్ (రాష్ట్రపతి) యొక్క మహిమ అయితే వేర్వేరుగా
ఉంటాయి కదా. తండ్రి అంటారు - నాకు కూడా ఈ డ్రామాలో ఉన్నతోన్నతమైన పాత్ర లభించి ఉంది.
డ్రామాలోని పాత్రధారులకు - ఇది అనంతమైన డ్రామా అని, దీని ఆయుష్షు ఎంత అని తెలియాలి
కదా. ఒకవేళ తెలియకపోతే వారిని వివేకహీనులు అని అంటారు. కానీ ఈ విషయాలను ఎవరూ అర్థం
చేసుకోరు. ఎలా ఉన్న మనుష్యులు ఎలా అయిపోతారు అన్న వ్యత్యాసాన్ని తండ్రి వచ్చి
తెలియజేస్తారు. 84 జన్మలు ఎలా తీసుకుంటారు అనేది మనుష్యులకు పూర్తిగా తెలియదు,
ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరు. భారత్ ఎంత ఉన్నతముగా ఉండేది, చిత్రాలు ఉన్నాయి కదా.
సోమనాథుని మందిరము నుండి ఎంత ధనాన్ని దోచుకొని వెళ్ళారు. ఎంత ధనము ఉండేది. ఇప్పుడు
పిల్లలైన మీరు ఇక్కడికి అనంతమైన తండ్రిని కలుసుకునేందుకు వచ్చారు. బాబా నుండి రాజ్య
తిలకాన్ని శ్రీమతముపై తీసుకునేందుకు వచ్చామని పిల్లలకు తెలుసు. తండ్రి అంటారు -
పవిత్రముగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది. జన్మ-జన్మాంతరాలు విషయ వైతరిణీ నదిలో మునకలు
వేస్తూ అలసిపోలేదా! మేము పాపులము, నిర్గుణులమైన మాలో ఏ గుణాలు లేవు అని అంటారు కూడా,
అంటే తప్పకుండా ఒకప్పుడు గుణాలు ఉండేవి, అవి ఇప్పుడు లేవు.
ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు - మనము విశ్వానికి యజమానులుగా, సర్వగుణ
సంపన్నులుగా ఉండేవారము. ఇప్పుడు ఏ గుణాలూ లేవు. ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తారు.
పిల్లల యొక్క రచయిత తండ్రియే. కావున తండ్రికే పిల్లలందరిపై దయ కలుగుతుంది. తండ్రి
అంటారు - నాకు కూడా డ్రామాలో ఈ పాత్ర ఉంది. ఎంత తమోప్రధానముగా అయిపోయారు. అసత్యత,
పాపాలు, గొడవలు ఏమేమి జరుగుతూ ఉన్నాయి. మేము ఒకానొక సమయములో విశ్వానికి యజమానులుగా,
డబుల్ కిరీటధారులుగా ఉండేవారమని భారతవాసులైన పిల్లలందరూ మర్చిపోయారు. తండ్రి వారికి
స్మృతిని ఇప్పిస్తున్నారు - మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు, మళ్ళీ మీరు 84
జన్మలు తీసుకుంటూ వచ్చారు. మీరు మీ 84 జన్మలను మర్చిపోయారు. ఇది విచిత్రము, 84
జన్మలకు బదులుగా 84 లక్షల జన్మలు అని వ్రాసేసారు మళ్ళీ కల్పము యొక్క ఆయుష్షు కూడా
లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. ఘోర అంధకారములో ఉన్నారు కదా. ఇది ఎంత అసత్యము.
భారత్ యే సత్యఖండముగా ఉండేది, భారత్ యే అసత్యఖండముగా ఉంది. అసత్యఖండాన్ని ఎవరు
తయారుచేశారు, సత్యఖండాన్ని ఎవరు తయారుచేశారు అన్నది ఎవరికీ తెలియదు. రావణుడి గురించి
అసలేమీ తెలియదు. భక్తులు రావణుడిని కాలుస్తారు. ఎవరైనా ధార్మిక మనస్తత్వం కల వ్యక్తి
ఉంటే, మనుష్యులు ఏమేమి చేస్తారు అని మీరు వారికి చెప్పండి. సత్యయుగము దేనినైతే
స్వర్గము, ప్యారడైజ్ అని అంటారో, అక్కడికి అసురుడైన రావణుడు ఎక్కడి నుండి వచ్చాడు.
నరకానికి చెందిన మనుష్యులు అక్కడ ఎలా ఉండగలరు. ఇది తప్పకుండా పొరపాటేనని అప్పుడు
అర్థం చేసుకుంటారు. మీరు రామరాజ్యము యొక్క చిత్రముపై అర్థం చేయించవచ్చు, ఇందులో
రావణుడు ఎక్కడి నుండి వచ్చాడు? మీరు అర్థం చేయిస్తారు కూడా, అయినా కానీ అర్థం
చేసుకోరు. అలా అర్థం చేసుకునేవారు ఎవరో అరుదుగా వెలువడుతారు. మీరు ఎంత కొద్దిమంది
ఉన్నారు, అది కూడా ఇంకా మున్ముందు ఎంతమంది నిలుస్తారు అనేది చూడాలి.
బాబా అర్థం చేయించారు - ఆత్మ యొక్క చిన్న గుర్తును కూడా ఇక్కడే భృకుటిలో
చూపిస్తారు. పెద్ద గుర్తు రాజ్య తిలకము. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. స్వయానికి
పెద్ద తిలకాన్ని ఎలా దిద్దుకోవాలి, మీరు స్వరాజ్యాన్ని ఎలా పొందగలరు అన్న మార్గాన్ని
తెలియజేస్తారు. దానికి రాజయోగము అన్న పేరును పెట్టారు. రాజయోగాన్ని నేర్పించేవారు
తండ్రి. శ్రీకృష్ణుడు తండ్రి అవ్వగలరా. వారైతే బాలుడు, రాధతో స్వయంవరము జరిగిన
తర్వాత వారికి ఒక కొడుకు ఉంటారు. ఇకపోతే శ్రీకృష్ణుడికి ఇంతమంది రాణులు మొదలైనవారిని
చూపించారు, ఇది అసత్యము కదా. కానీ ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది, ఇటువంటి
విషయాలను మళ్ళీ కూడా వింటారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది - ఆత్మలమైన మనము
పాత్రను అభినయించడానికి ఏ విధంగా పై నుండి వస్తాము. ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి
తీసుకుంటాము. ఇది చాలా సహజము కదా. కొడుకు జన్మిస్తాడు, ఇలా మాట్లాడు అని అతనికి
నేర్పిస్తారు. అలా నేర్పించడముతో నేర్చుకుంటాడు. మీకు బాబా ఏం నేర్పిస్తారు? కేవలం
తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని అంటారు. నీవే తల్లివి-తండ్రివి...
అని మీరు పాడుతారు కూడా. ఇలా ఆత్మ పాడుతుంది కదా, తప్పకుండా అపారమైన సుఖపు ఖజానాలు
లభిస్తాయి. శివబాబా మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడికి మీరు
శివబాబా వద్దకు వచ్చారు. భగీరథుడు అనగా మానవ రథము కదా. వీరిలో పరమపిత పరమాత్మ
విరాజమానమవుతారు, కానీ రథము పేరేమిటి? ఇప్పుడు మీకు తెలుసు, వారి పేరు బ్రహ్మా
ఎందుకంటే బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు కదా. మొదట, పిలక అయిన బ్రాహ్మణులు
ఉంటారు, ఆ తర్వాత దేవతలు ఉంటారు. మొదటైతే బ్రాహ్మణులు కావాలి అందుకే విరాట రూపాన్ని
కూడా చూపించారు. బ్రాహ్మణులైన మీరే మళ్ళీ దేవతలుగా అవుతారు. తండ్రి చాలా మంచి రీతిలో
అర్థం చేయిస్తారు, అయినా కానీ మర్చిపోతారు. తండ్రి అంటారు - పిల్లలూ సదా
గుర్తుంచుకోండి, మనము స్త్రీ-పురుషులము కాదు, మనము ఆత్మలము, మనము పెద్ద బాబా (శివబాబా)
నుండి చిన్న బాబా (బ్రహ్మా) ద్వారా వారసత్వాన్ని తీసుకుంటున్నాము, అప్పుడు రావణత్వపు
స్మృతి విస్మృతి అవుతుంది. ఇది పవిత్రముగా ఉండేందుకు చాలా మంచి యుక్తి. బాబా వద్దకు
చాలా మంది యుగల్స్ (దంపతులు) వస్తారు, ఇరువురూ బాబా అనే అంటారు. మేము ఒక్క తండ్రికి
పిల్లలము అన్నది స్మృతిలోకి వచ్చినప్పుడు రావణత్వపు స్మృతి విస్మృతి అవ్వాలి, ఇందులో
శ్రమించాల్సి వస్తుంది. శ్రమ లేకుండా ఏదీ జరగదు. మేము బాబాకు చెందినవారిగా అయ్యాము,
వారినే స్మృతి చేస్తాము. తండ్రి కూడా అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు
వినాశనమవుతాయి. 84 జన్మల కథ కూడా చాలా సహజమైనది. ఇకపోతే తండ్రిని స్మృతి చేయడములోనే
శ్రమ ఉంది. తండ్రి అంటారు - పురుషార్థము చేసి తక్కువలో తక్కువ 8 గంటలైనా స్మృతి
చేయండి. ఒక ఘడియ, అర ఘడియ... స్మృతి చేయండి. క్లాసులోకి వచ్చినప్పుడు, తండ్రి మాకు
చదివిస్తున్నారు అన్నది స్మృతిలోకి వస్తుంది. ఇప్పుడు మీరు తండ్రి సమ్ముఖంలో ఉన్నారు
కదా. తండ్రి, పిల్లలూ-పిల్లలూ అంటూ అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు వింటారు. తండ్రి
అంటారు - చెడు వినకండి... ఇది కూడా ఇప్పటి విషయమే.
ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - మనము జ్ఞానసాగరుడైన తండ్రి సమ్ముఖంలోకి వచ్చాము.
జ్ఞానసాగరుడైన తండ్రి మీకు మొత్తం సృష్టి యొక్క జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఇక
ఎవరైనా తీసుకుంటారా, తీసుకోరా అనేది వారిపై ఆధారపడి ఉంటుంది. తండ్రి వచ్చి ఇప్పుడు
మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. మనము ఇప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటాము. ఆ తర్వాత
శాస్త్రాలు మొదలైన భక్తికి సంబంధించిన అంశాలేవీ ఉండవు. భక్తి మార్గములో జ్ఞానము
అంశమాత్రము కూడా ఉండదు, జ్ఞాన మార్గములో మళ్ళీ భక్తి అంశమాత్రము కూడా ఉండదు.
జ్ఞానసాగరుడు వచ్చినప్పుడే జ్ఞానాన్ని వినిపిస్తారు. వారి జ్ఞానము ఉన్నదే సద్గతి
కొరకు. సద్గతిదాత ఒక్కరే, వారినే భగవంతుడు అని అంటారు. అందరూ ఆ ఒక్క పతిత-పావనుడినే
పిలుస్తున్నప్పుడు వేరొకరు ఎలా ఉండగలరు. ఇప్పుడు తండ్రి ద్వారా పిల్లలైన మీరు
సత్యమైన విషయాలను వింటున్నారు. తండ్రి వినిపించారు - పిల్లలూ, నేను మిమ్మల్ని ఎంతటి
షావుకారులుగా తయారుచేసి వెళ్ళాను. ఇది 5000 సంవత్సరాల నాటి విషయము. మీరు డబుల్
కిరీటధారులుగా ఉండేవారు, పవిత్రతా కిరీటము కూడా ఉండేది మళ్ళీ ఎప్పుడైతే రావణ రాజ్యము
వస్తుందో, అప్పుడు మీరు పూజారులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి చదివించడానికి వచ్చారు
కావున వారి శ్రీమతంపై నడవాలి, ఇతరులకు కూడా అర్థం చేయించాలి. తండ్రి అంటారు - నేను
ఈ శరీరాన్ని అప్పుగా తీసుకోవాల్సి ఉంటుంది. మహిమ అంతా ఆ ఒక్కరిదే, నేనైతే వారి
రథాన్ని. నేను ఎద్దును కాదు. బలిహారమంతా మీదే, బాబా మీకు వినిపిస్తారు, నేను మధ్యలో
వింటాను. నా ఒక్కరికే ఎలా వినిపిస్తారు. మీకు వినిపిస్తారు, అప్పుడు నేను కూడా
వింటాను. వీరు కూడా పురుషార్థీ విద్యార్థియే. మీరు కూడా విద్యార్థులే. వీరు కూడా
చదువుకుంటారు. తండ్రి స్మృతిలో ఉంటారు. ఎంతటి సంతోషములో ఉంటారు. నేను ఈ విధంగా
అవ్వనున్నాను అని లక్ష్మీ-నారాయణులను చూసి సంతోషమనిపిస్తుంది. మీరు ఇక్కడకు వచ్చిందే
స్వర్గపు యువరాజులు-యువరాణులుగా అయ్యేందుకు. ఇది రాజయోగము కదా. లక్ష్యము-ఉద్దేశ్యము
కూడా ఉంది. చదివించేవారు కూడా కూర్చుని ఉన్నారు, మరి అంతటి సంతోషము ఎందుకు కలగడం
లేదు. లోలోపల చాలా సంతోషముండాలి. బాబా నుండి మనము కల్ప-కల్పము వారసత్వము తీసుకుంటాము.
ఇక్కడికి జ్ఞానసాగరుని వద్దకు వస్తాము, నీటికి సంబంధించిన విషయమేమీ లేదు. ఇదైతే
తండ్రి సమ్ముఖంగా అర్థం చేయిస్తున్నారు. మీరు కూడా వీరిలా (దేవతలుగా) అయ్యేందుకు
చదువుకుంటున్నారు. ఇప్పుడు మనము మన ఇంటికి వెళుతున్నామని పిల్లలకు ఎంతో సంతోషము
ఉండాలి. ఇప్పుడు ఎవరు ఎంత చదువుకుంటే అంత ఉన్నత పదవిని పొందుతారు. ప్రతి ఒక్కరూ
తమ-తమ పురుషార్థము చేయాలి. నిరుత్సాహపడకండి. ఇది చాలా పెద్ద లాటరీ. అర్థం
చేసుకున్నప్పటికీ కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా వెళ్ళిపోయి చదువును వదిలేస్తారు.
మాయ ఎంత శక్తివంతమైనది. అచ్ఛా.
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.