ఓంశాంతి
బాబా, మేము మీ రుద్రమాలలో తప్పకుండా కూర్చబడతాము అని పిల్లలు పాట అర్థాన్ని విన్నారు.
ఈ పాటలైతే భక్తి మార్గములో తయారయ్యాయి. ప్రపంచములో ఏయే సామాగ్రి అయితే ఉందో,
జప-తపాదులు, పూజ, పఠనము, ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి. భక్తి రావణ రాజ్యము,
జ్ఞానము రామ రాజ్యము. జ్ఞానాన్ని నాలెడ్జ్ అని అంటారు, ఇది చదువు. భక్తిని చదువు అని
అనరు. భక్తిలో, మేము ఎలా తయారవుతాము అంటూ లక్ష్యము ఏమీ లేదు, భక్తి చదువు కాదు.
రాజయోగాన్ని నేర్చుకోవడము అనేది ఒక చదువు. చదువు అనేది ఒక చోట స్కూలులో చదువుకోవడం
జరుగుతుంది. భక్తిలోనైతే ప్రతి ముంగిట ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. చదువు అంటే చదువే.
చదువును పూర్తిగా చదువుకోవాలి. మేము విద్యార్థులము అని పిల్లలకు తెలుసు. తమను తాము
విద్యార్థులుగా భావించనివారు చాలామంది ఉన్నారు, ఎందుకంటే వారు అసలేమీ చదవరు. వారు
తండ్రిని తండ్రిగానూ భావించరు, అలాగే శివబాబాను సద్గతిదాతగా కూడా భావించరు. బుద్ధిలో
ఏమీ కూర్చొని వారు కూడా కొందరు ఉన్నారు, మరి రాజధాని స్థాపన అవుతోంది కదా. ఇందులో
అన్నిరకాల వారూ ఉంటారు. తండ్రి పతితులను పావనముగా తయారుచేసేందుకే వచ్చారు. తండ్రిని
- ఓ పతిత పావనా, రండి అనే పిలుస్తారు. ఇప్పుడు ఇక తండ్రి అంటున్నారు - పావనముగా
అవ్వండి, తండ్రిని స్మృతి చేయండి. ప్రతి ఒక్కరికీ తండ్రి సందేశాన్ని అందించాలి. ఈ
సమయములో భారత్ యే వేశ్యాలయముగా ఉంది. ఇదివరకు భారత్ యే శివాలయముగా ఉండేది. ఇప్పుడు
రెండు కిరీటాలు లేవు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితము నుండి పావనముగా
అయిపోతారు అని పతిత-పావనుడైన తండ్రి తెలియజేస్తున్నారు అన్న విషయము ఇప్పుడు
పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. స్మృతిలోనే శ్రమించవలసి ఉంటుంది. స్మృతి ఉండేవారు
చాలా కొద్దిమందే ఉన్నారు. భక్త మాల కూడా కొద్దిమందిదే కదా. ధన్నా అనే భక్తుడు,
నారదుడు, మీరా... మొదలైన భక్తుల పేర్లు ఉన్నాయి. అలాగే ఇక్కడికి కూడా అందరూ వచ్చి
చదువుకోరు. కల్పపూర్వము ఎవరైతే చదువుకున్నారో వారే వస్తారు. బాబా, కల్పపూర్వము కూడా
చదువుకునేందుకు మరియు స్మృతియాత్రను నేర్చుకునేందుకు మేము మిమ్మల్ని కలుసుకున్నాము
అని అంటారు కూడా. ఇప్పుడు తండ్రి పిల్లలైన మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకే వచ్చారు. మీ
ఆత్మ పతితముగా ఉంది, అందుకే మీరు వచ్చి పావనముగా తయారుచేయండి అని పిలుస్తారు అని
తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు - నన్ను స్మృతి చేయండి,
పవిత్రముగా అవ్వండి. తండ్రి చదివిస్తారు, ఆ తర్వాత తనతో పాటు తీసుకువెళ్తారు కూడా.
పిల్లలకు లోలోపల ఎంతో సంతోషము ఉండాలి. తండ్రి చదివిస్తున్నారు, కృష్ణుడిని తండ్రి
అని అనరు. కృష్ణుడిని పతిత-పావనా అని అనరు. తండ్రీ అని ఎవరినంటారు మరియు వారు
జ్ఞానాన్ని ఎలా ఇస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు. ఇది మీకు మాత్రమే తెలుసు. తండ్రి
తన పరిచయాన్ని పిల్లలకు మాత్రమే ఇస్తారు. కొత్త-కొత్తవారిని ఎవరినీ తండ్రి కలవరు.
తండ్రి అంటారు, కొడుకు తండ్రిని ప్రత్యక్షము చేస్తాడు. పిల్లలే తండ్రిని ప్రత్యక్షము
చేస్తారు. తండ్రి ఎవరినీ కలిసేది, మాట్లాడేది లేదు. ఇంతవరకు బాబా కొత్త-కొత్తవారిని
కలిసేవారు, అది డ్రామాలో ఉంది, ఎంతోమంది వచ్చేవారు. మిలిట్రీవారి కోసం కూడా బాబా
అర్థం చేయించారు, వారి ఉద్ధరణ చేయాలి, వారు కూడా తమ కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందే
కదా, లేదంటే శత్రువులు దాడి చేస్తారు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. ఎవరైతే యుద్ధ
మైదానములో శరీరాన్ని వదులుతారో వారు స్వర్గాములోకి వెళ్తారు అని పాటలో ఉంది, కానీ
అలా వెళ్ళలేరు. స్వర్గ స్థాపన చేసేవారు ఎప్పుడైతే వస్తారో, అప్పుడే స్వర్గములోకి
వెళ్తారు. స్వర్గము అంటే ఏమిటి అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు
పంచ వికారాల రూపీ రావణుడితో యుద్ధము చేస్తారు. తండ్రి అశరీరి భవ అని అంటారు.
స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకుని నన్ను స్మృతి చేయండి. ఇంకెవ్వరూ ఇలా అనలేరు.
సర్వశక్తివంతుడు అని ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ అనలేరు. బ్రహ్మా, విష్ణు,
శంకరులను శ్రీ అని అనలేరు. ఆల్మైటీ (సర్వశక్తివంతుడు) ఒక్క తండ్రి మాత్రమే. వరల్డ్
ఆల్మైటీ అథారిటీ, జ్ఞానసాగరుడు అని ఒక్క తండ్రినే అంటారు. ఈ సాధు-సన్యాసులు
మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, వారు శాస్త్రాల అథారిటీ. వారిని భక్తి అథారిటీ అని కూడా
అనలేరు. వారు శాస్త్రాల అథారిటీ. వారి ఆధారమంతా శాస్త్రాలపై ఉంది. భక్తి ఫలాన్ని
భగవంతుడు ఇస్తారు అని భావిస్తారు. భక్తి ఎప్పుడు ప్రారంభమైంది, అది ఎప్పుడు
పూర్తవ్వనున్నది అనేది తెలియదు. భక్తితో భగవంతుడు రాజీ అవుతారు అని భక్తులు
భావిస్తారు. భగవంతుడిని కలుసుకోవాలి అనే కోరిక ఉంటుంది, కానీ వారు ఎవరి భక్తితో రాజీ
అవుతారు? తప్పకుండా వారిని భక్తి చేసినప్పుడే రాజీ అవుతారు కదా. మీరు శంకరుడిని
భక్తి చేస్తే తండ్రి ఎలా రాజీ అవుతారు. హనుమంతుడి భక్తి చేస్తే తండ్రి రాజీ అవుతారా?
వారి సాక్షాత్కారము జరుగుతుందే కానీ దాని వల్ల ఏమీ లభించదు. తండ్రి అంటారు, నేను
సాక్షాత్కారము చేయిస్తాను కానీ వారు వచ్చి నన్ను కలుసుకుంటారు అని కాదు. మీరు
మాత్రమే నన్ను కలుసుకుంటారు. భక్తులు భగవంతుడిని కలుసుకునేందుకు భక్తి చేస్తారు.
భగవంతుడు ఏ రూపములో వచ్చి కలుసుకుంటారో తెలియదు అని అంటారు, అందుకే దానిని
అంధవిశ్వాసము అని అంటారు. ఇప్పుడు మీరు తండ్రిని కలుసుకున్నారు. ఆ నిరాకారుడైన
తండ్రి ఎప్పుడైతే శరీరాన్ని ధారణ చేస్తారో, అప్పుడే - నేను మీ తండ్రిని అని వారి
పరిచయాన్ని ఇస్తారు. 5000 సంవత్సరాల క్రితం కూడా మీకు రాజ్య భాగ్యాన్ని ఇచ్చారు, ఆ
తర్వాత మీరు 84 జన్మలు తీసుకోవలసి వస్తుంది. ఈ సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది.
ద్వాపరము తర్వాతనే ఇతర ధర్మాలు వస్తాయి, ప్రతి ఒక్కరూ వచ్చి తమ-తమ ధర్మాన్ని స్థాపన
చేస్తారు. ఇందులో గొప్ప విషయమేమీ లేదు. వాస్తవానికి ఎవ్వరి గొప్పతనమూ లేదు. బ్రహ్మా
యొక్క గొప్పతనము కూడా ఈ తండ్రి వచ్చి ప్రవేశించినప్పుడే ఉంటుంది. లేదంటే ఇతను
వ్యాపారము చేసుకుంటూ ఉండేవారు. నాలోకి భగవంతుడు వస్తారు అని ఇతనికి కూడా ఇంతకుముందు
తెలియదు. నేను ఇతనిలోకి ఎలా ప్రవేశించాను? అన్నది తండ్రి ప్రవేశించి అర్థం చేయించారు.
వారికి ఏ విధంగా చూపించారంటే - నాదంతా నీదే, నీదంతా నాదే చూడు. నీవు నీ తనువు,
మనస్సు, ధనము ద్వారా నాకు సహాయకునిగా అయితే దానికి ప్రతిఫలముగా నీకు ఇది లభిస్తుంది.
తండ్రి అంటారు, ఎవరికైతే అతని జన్మల గురించి తెలియదో, నేను అతని సాధారణ తనువులోకి
ప్రవేశిస్తాను. కానీ నేను ఎప్పుడు వస్తాను, ఎలా వస్తాను, ఇది ఎవ్వరికీ తెలియదు.
సాధారణ తనువులోకి తండ్రి వచ్చారని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇతని ద్వారా మనకు
జ్ఞానాన్ని మరియు యోగాన్ని నేర్పిస్తున్నారు. జ్ఞానమైతే చాలా సహజమైనది. నరక ద్వారము
మూసుకుని స్వర్గ ద్వారము ఎలా తెరచుకుంటుంది, ఇది కూడా మీకు తెలుసు. ద్వాపరములో రావణ
రాజ్యము ప్రారంభమవుతుంది అనగా నరక ద్వారము తెరుచుకుంటుంది. కొత్త ప్రపంచము మరియు
పాత ప్రపంచము సగం-సగం ఉంటాయి. ఇప్పుడు తండ్రి అంటారు, నేను పిల్లలైన మీకు పతితము
నుండి పావనముగా అయ్యే యుక్తిని తెలియజేస్తాను. తండ్రిని స్మృతి చేసినట్లయితే
జన్మ-జన్మాంతరాల పాపాలు నాశనమవుతాయి. ఈ జన్మలో చేసిన పాపాలను కూడా తండ్రికి
తెలియజేయాలి. ఏమేమి పాపాలు చేసారు, ఏమేమి దాన-పుణ్యాలు చేసారు అనేది గుర్తు అయితే
ఉంటుంది కదా. ఇతనికి ఇతని బాల్యము గురించి తెలుసు కదా. శ్రీకృష్ణునికే
నల్లనివారు-తెల్లనివారు, శ్యామ-సుందరుడు అన్న పేరు ఉంది. దాని అర్థము ఎప్పుడూ ఎవరి
బుద్ధిలోకీ రాదు. శ్యామ-సుందరుడు అన్న పేరు ఉండడం వల్ల చిత్రములో అతడిని నల్లగా
చూపించారు. రఘునాథుని మందిరములో చూసినట్లయితే అక్కడ కూడా నల్లగా చూపించారు.
హనుమంతుని మందిరములో చూసినట్లయితే అక్కడ కూడా అందరినీ నల్లగా చూపిస్తారు. ఈ ప్రపంచమే
పతిత ప్రపంచము. మేము నల్లగా ఉన్నవారి నుండి సుందరముగా తయారవ్వాలి అని ఇప్పుడు
పిల్లలైన మీకు చింత ఉంది. దాని కొరకు మీరు తండ్రి స్మృతిలో ఉంటారు. తండ్రి అంటారు,
ఇది అంతిమ జన్మ, నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మమవుతాయు. తండ్రి
తీసుకువెళ్ళేందుకు వచ్చారని తెలుసు. కావున తప్పకుండా శరీరాలు ఇక్కడే వదిలివేస్తారు.
శరీరము సైతముగా అయితే తీసుకువెళ్ళరు కదా. పతిత ఆత్మలు కూడా వెళ్ళలేవు. తప్పకుండా
తండ్రి పావనముగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే
వికర్మలు వినాశనమవుతాయి అని అంటారు. భక్తి మార్గములో అంధవిశ్వాసము ఉంటుంది. శివకాశీ
అని అంటారు, మళ్ళీ శివుడు గంగను తీసుకువచ్చారని, భగీరథుడి ద్వారా గంగ వెలువడిందని
కూడా అంటారు. అసలు తల నుండి నీరు ఎలా వెలువడుతుంది. అతని జటాజూటముల నుండి గంగ
వెలువడేందుకు భగీరథుడు ఏమైనా పర్వతముపై కూర్చొన్నాడా! నీరు ఏదైతే కురుస్తుందో,
దానిని మేఘాలు సముద్రము నుండి తీసుకుంటాయి, అలా మొత్తము ప్రపంచములోకి నీరు వెళ్తుంది.
నదులైతే అన్నివైపులా ఉన్నాయి. పర్వతాలపై మంచు ఏర్పడుతుంది, ఆ నీరు కూడా వస్తూ
ఉంటుంది. పర్వతాలలోని గుహలలో ఏదైతే నీరు ఉంటుందో, అది తర్వాత బావులలోకి వస్తూ
ఉంటుంది. అది కూడా వర్షము ఆధారముగానే వస్తుంది. వర్షాలు పడకపోతే బావులు కూడా
ఎండిపోతాయి.
బాబా, మమ్మల్ని పావనముగా తయారుచేసి స్వర్గములోకి తీసుకువెళ్ళండి అని అంటారు కూడా.
స్వర్గములోకి, కృష్ణపురిలోకి వెళ్ళాలనే అందరికీ ఆశ ఉంది. విష్ణుపురి గురించి
ఎవ్వరికీ తెలియదు. ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు అని శ్రీకృష్ణుని భక్తులు అంటూ
ఉంటారు. అరే, పరమాత్మ సర్వవ్యాపి అయితే మరి ఎక్కడ చూసినా పరమాత్మే పరమాత్మ అని
ఎందుకు అనరు. పరమాత్ముని భక్తులు ఏమంటూ ఉంటారంటే - ఇవన్నీ అతని రూపాలే, అతడే ఈ
లీలనంతా చేస్తున్నాడు, లీలను చేసేందుకే భగవంతుడు రూపాన్ని ధరించాడు కావున తప్పకుండా
అతను తన లీలను చేస్తాడు కదా! పరమాత్ముని ప్రపంచాన్ని స్వర్గములో చూడండి, అక్కడ
అశుద్ధమైనదేదీ ఉండదు. ఇక్కడైతే అశుద్ధతే అశుద్ధత కానీ ఇక్కడ పరమాత్మ సర్వవ్యాపి అని
అంటూ ఉంటారు. పరమాత్మయే సుఖాన్ని ఇస్తారు. బిడ్డ జన్మిస్తే సుఖము కలుగుతుంది,
మరణిస్తే దుఃఖము కలుగుతుంది. అరే, భగవంతుడు నీకు ఒక వస్తువును ఇచ్చి మళ్ళీ తిరిగి
తీసుకుంటే, అందులో మీకు ఏడ్వవలసిన అవసరమేముంది! సత్యయుగములో ఏడవడము మొదలైనవాటికి
సంబంధించిన దుఃఖము ఉండదు. మోహాన్ని జయించిన రాజు ఉదాహరణను చూపించారు, ఇవన్నీ
అసత్యమైన ఉదాహరణలు. వాటిలో సారమేమీ లేదు. సత్యయుగములో ఋషులు, మునులు ఉండరు. అలాగే,
ఇక్కడ కూడా అలాంటి విషయాలేమీ ఉండవు. అటువంటి మోహాన్ని జయించిన రాజులుగా ఎవ్వరూ ఉండరు.
భగవానువాచ - యాదవులు, కౌరవులు, పాండవులు ఏమి చేసి వెళ్ళారు? మీకు తండ్రితో యోగము
ఉంది. తండ్రి అంటారు, నేను పిల్లలైన మీ ద్వారా భారత్ ను స్వర్గముగా తయారుచేస్తాను.
ఇప్పుడు ఎవరైతే పవిత్రముగా అవుతారో వారు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు.
ఎవరు కలిసినా వారికి చెప్పండి - భగవంతుడు చెప్తున్నారు, ననొక్కరినే స్మృతి చేయండి,
నాతో ప్రీతిని జోడించండి, ఇంకెవ్వరినీ స్మృతి చేయకండి. ఇది అవ్యభిచారి స్మృతి.
ఇక్కడేమీ నీరు మొదలైనవాటితో అభిషేకము చేయవలసిన అవసరము లేదు. భక్తి మార్గములో ఈ
పనులన్నీ చేసుకుంటూ స్మృతి చేసేవారు కదా. గురువులు కూడా - నన్ను స్మృతి చేయండి, మీ
పతిని స్మృతి చేయకండి అని అంటారు. పిల్లలైన మీకు ఎన్ని విషయాలను అర్థం చేయిస్తారు.
ముఖ్యమైన విషయము - నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి అంటున్నారని అందరికీ
సందేశాన్ని ఇవ్వండి. బాబా అంటేనే భగవంతుడు. భగవంతుడైతే నిరాకారుడు. శ్రీకృష్ణుడిని
అందరూ భగవంతుడు అని అనరు. శ్రీకృష్ణుడు ఒక చిన్న పిల్లవాడు. శివబాబా ఇతనిలోకి
రాకపోతే మీరు ఉండేవారా? శివబాబా ఇతని ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకున్నారు, తనవారిగా
చేసుకున్నారు. ఇతను తల్లి కూడా, తండ్రి కూడా. తల్లి అయితే సాకారములో కావాలి కదా.
అతను మీకు తండ్రి. ఇటువంటి విషయాలను బాగా ధారణ చేయండి.
పిల్లలైన మీరు ఎప్పుడూ ఏ విషయములోనూ తికమక పడకూడదు. చదువును ఎప్పుడూ వదలకండి.
కొంతమంది పిల్లలు సంగత్యదోషములోకి వచ్చి, అలిగి, విడిగా తమ పాఠశాలను తెరుస్తారు.
ఒకవేళ పరస్పరము దెబ్బలాడుకుని వెళ్ళి తమ పాఠశాలను తెరిస్తే అది మూర్ఖత్వము, అసలు
అలుగుతున్నారంటేనే పాఠశాలను తెరిచేందుకు అర్హులే కారు. మీ ఆ దేహాభిమానము అసలు నడవనే
నడవదు, ఎందుకంటే బుద్ధిలో శత్రుత్వము ఉన్న కారణముగా అదే గుర్తుకొస్తూ ఉంటుంది, ఇక
ఎవరికీ ఏమీ అర్థం చేయించలేరు. ఎవరికైతే జ్ఞానము ఇస్తారో వారు ముందుకు వెళ్ళిపోతారు,
కానీ స్వయం కింద పడిపోతారు, ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. నా కన్నా ఫలానావారి అవస్థ
బాగుంది అని స్వయం కూడా అర్థం చేసుకుంటారు. చదువుకునేవారు రాజులుగా అవుతారు మరియు
చదివించేవారు దాస-దాసీలుగా అవుతారు, ఇటువంటివారు కూడా ఇక్కడ ఉన్నారు. పురుషార్థము
చేసి తండ్రి కంఠహారముగా తయారవ్వాలి. బాబా, నేను జీవిస్తూనే మీ వారిగా అయ్యాను.
తండ్రి స్మృతి ద్వారానే నావ తీరాన్ని చేరుతుంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.