ఓంశాంతి
పిల్లలు పాటలోని రెండు లైన్లు విన్నారు. ఇది ప్రతిజ్ఞకు సంబంధించిన పాట. ఎవరికైనా
నిశ్చితార్థము జరిగినప్పుడు, స్త్రీ-పురుషులు ఒకరినొకరు ఎప్పుడూ విడిచిపెట్టమని
ప్రతిజ్ఞ చేస్తారు. కొంతమందికి ఒకరితో ఒకరికి పడకపోతే విడిచిపెట్టేస్తారు కూడా.
ఇక్కడ పిల్లలైన మీరు ఎవరితో ప్రతిజ్ఞ చేస్తారు? ఈశ్వరునితో. వారితోనే పిల్లలైన మీకు
లేక ప్రేయసులైన మీకు నిశ్చితార్థము జరిగింది, కానీ ఈ విధముగా విశ్వానికి యజమానులుగా
తయారుచేసేవారిని కూడా విడిచిపెట్టేస్తారు. ఇక్కడ పిల్లలైన మీరు కూర్చున్నారు,
ఇప్పుడు అనంతమైన బాప్ దాదా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. ఇక్కడ మీకు ఏ అవస్థ అయితే
ఉంటుందో, అది అక్కడ సెంటర్ లో ఉన్నప్పుడు ఉండదు. ఇక్కడ బాప్ దాదా వచ్చి ఉన్నారని
మీరు భావిస్తారు. అక్కడ సెంటర్ లో ఉన్నప్పుడు బాబా వినిపించిన మురళీ వచ్చిందని
భావిస్తారు. ఇక్కడికి మరియు అక్కడికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అనంతమైన
తండ్రి సమ్ముఖములో మీరు కూర్చొన్నారు. అక్కడైతే సమ్ముఖముగా ఉండరు. సమ్ముఖముగా వెళ్ళి
మురళీ వినాలని కోరుకుంటారు. బాబా వచ్చి ఉన్నారని ఇక్కడ పిల్లల బుద్ధిలోకి వచ్చింది.
ఇతర సత్సంగాలలో, ఫలానా స్వామీజీ వస్తారని భావిస్తారు కదా. కానీ ఈ ఆలోచన కూడా అందరికీ
ఏకరసముగా ఉండదు. చాలామంది బుద్ధియోగమైతే వేరే వైపులకు భ్రమిస్తూ ఉంటుంది. కొంతమందికి
పతి గుర్తుకువస్తారు, కొంతమందికి సంబంధీకులు గుర్తుకువస్తారు. ఆ ఒక్క గురువుపై కూడా
బుద్ధియోగము నిలవదు. స్వామీజీ స్మృతిలో కూర్చుని ఉండేవారు ఎవరో అరుదుగా ఉంటారు.
ఇక్కడ కూడా అలాగే. అందరూ శివబాబా స్మృతిలో ఉంటారని కూడా కాదు. బుద్ధి ఎక్కడెక్కడికో
పరిగెడుతూ ఉంటుంది, మిత్ర-సంబంధీకులు మొదలైనవారు గుర్తుకువస్తూ ఉంటారు. మొత్తం
సమయమంతా ఒక్క శివబాబా స్మృతిలోనే ఉంటే ఇక అది అహో సౌభాగ్యము. కానీ స్థిరమైన స్మృతిలో
ఎవరో అరుదుగా ఉంటారు. ఇక్కడ తండ్రి సమ్ముఖములో ఉన్నట్లయితే చాలా సంతోషముండాలి.
అతీంద్రియ సుఖము గురించి గోపీ వల్లభుని గోప-గోపికలను అడగండి, ఇది ఇక్కడి గాయనమే.
ఇక్కడ మీరు తండ్రి స్మృతిలో కూర్చున్నారు. ఇప్పుడు మనము ఈశ్వరుని ఒడిలో ఉన్నామని,
తర్వాత దైవీ ఒడిలో ఉంటామని మీకు తెలుసు. ఈ చిత్రములో ఈ కరెక్షన్ చేయాలి, ఇది
వ్రాయాలి అని కొంతమంది బుద్ధిలో సేవ యొక్క ఆలోచనలు కూడా నడుస్తూ ఉంటాయి. కానీ మంచి
పిల్లలెవరైతే ఉంటారో వారు - ఇప్పుడైతే తండ్రి నుండి వినాలని భావిస్తారు, ఇంకే
సంకల్పాలను రానివ్వరు. తండ్రి జ్ఞాన రత్నాలతో జోలిని నింపడానికి వచ్చారు కనుక
తండ్రితోనే బుద్ధియోగాన్ని జోడించాలి. నంబరువారుగా ధారణ చేసేవారైతే తప్పకుండా ఉంటారు.
కొంతమంది మంచి రీతిలో విని ధారణ చేస్తారు, కొంతమంది తక్కువగా ధారణ చేస్తారు.
బుద్ధియోగము వేరే వైపులకు పరిగెడుతూ ఉంటే ధారణ జరగదు, కచ్చాగానే (అపరిపక్వముగానే)
ఉండిపోతారు. 1-2 సార్లు మురళీ విన్నా కూడా ధారణ జరగకపోతే, ఇక ఆ అలవాటు పక్కా అయిపోతూ
ఉంటుంది. ఇక తర్వాత ఎంతగా వింటూ ఉన్నా సరే, వారికి ధారణ జరగదు, వారు ఎవ్వరికీ
వినిపించలేకపోతారు. ఎవరికైతే ధారణ జరుగుతుందో, వారికి సేవ పట్ల అభిరుచి ఉంటుంది.
అటువంటివారు ఉత్సాహముతో ఉప్పొంగుతూ ఉంటారు. మేము వెళ్ళి జ్ఞాన ధనాన్ని దానము చేయాలని
అనుకుంటారు ఎందుకంటే ఈ ధనము ఒక్క తండ్రి వద్ద తప్ప ఇంకెవ్వరి వద్ద లేదు. అందరికీ ఒకే
విధముగా ధారణ జరగదని, అందరూ ఒకే విధముగా ఉన్నత పదవిని పొందలేరని కూడా తండ్రికి
తెలుసు, అందుకే బుద్ధి వేరే వైపులకు భ్రమిస్తూ ఉంటుంది. అటువంటివారి భవిష్య భాగ్యము
అంత ఉన్నతముగా తయారవ్వదు. కొంతమంది స్థూల సేవలో తమ ఎముక-ఎముకను ఇస్తారు. అందరినీ
సంతుష్టపరుస్తారు. భోజనము తయారుచేస్తూ, తినిపిస్తూ ఉంటారు, ఇది కూడా ఒక సబ్జెక్టు
కదా. ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో, వారు నోటితో జ్ఞానాన్ని వినిపించకుండా
ఉండలేరు. అప్పుడు బాబా చూస్తారు కూడా - వీరికి దేహాభిమానమైతే లేదు కదా, పెద్దవారి
పట్ల గౌరవాన్ని ఉంచుతున్నారా లేదా అని. పెద్ద మహారథుల పట్ల గౌరవము ఉంచవలసి ఉంటుంది.
అయితే కొంతమంది చిన్నవారు కూడా తెలివైనవారిగా అయిపోతారు, అప్పుడు పెద్దవారు కూడా
చిన్నవారికి గౌరవాన్ని ఇవ్వవలసి ఉండవచ్చు, ఎందుకంటే ఆ చిన్నవారి బుద్ధి గ్యాలప్
చేస్తుంది (వేగముగా ముందుకు వెళ్తుంది). సేవ పట్ల ఉన్న అభిరుచిని చూసి, వీరు మంచి
సేవ చేస్తారని తండ్రి అయితే సంతోషిస్తారు కదా. రోజంతా ప్రదర్శనీలలో అర్థం చేయించే
అభ్యాసము చేయాలి. ప్రజలైతే ఎంతోమంది తయారవుతారు కదా, ఇంకే ఉపాయము లేదు.
సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, రాజులు, రాణులు, ప్రజలు అందరూ ఇక్కడే తయారవుతారు.
ఎంత సేవ చేయాలి. ఇప్పుడు మనము బ్రాహ్మణులుగా అయ్యామనైతే పిల్లల బుద్ధిలో ఉంది.
ఇంటిలో గృహస్థములో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ, ఎవరి అవస్థ వారిది ఉంటుంది కదా.
అలాగని ఇళ్ళు-వాకిళ్ళనైతే వదిలిపెట్టకూడదు. తండ్రి అంటారు, ఇంటిలో ఉండండి కానీ
బుద్ధిలో ఈ నిశ్చయము ఉంచుకోవాలి - పాత ప్రపంచము సమాప్తమయ్యే ఉంది అని. మనకు ఇప్పుడు
తండ్రితోనే పని ఉంది. కల్పక్రితము ఎవరైతే జ్ఞానాన్ని తీసుకున్నారో, వారే
తీసుకుంటారని కూడా మీకు తెలుసు. క్షణము తర్వాత క్షణము యథావిధిగా రిపీట్ అవుతోంది.
ఆత్మలో జ్ఞానముంటుంది కదా. తండ్రి వద్ద కూడా జ్ఞానముంటుంది. పిల్లలైన మీరు కూడా
తండ్రి వలె తయారవ్వాలి. పాయింట్లను ధారణ చేయాలి. అన్ని పాయింట్లూ ఒకే సమయములో అర్థం
చేయించడము జరగదు. వినాశనము కూడా ఎదురుగా ఉంది. ఇది ఇంతకుముందు జరిగిన అదే వినాశనము.
సత్య, త్రేతాయుగాలలోనైతే ఎటువంటి యుద్ధము జరగదు. చాలా ధర్మాలు ఏర్పడిన తర్వాత,
సైన్యాలు మొదలైనవి ఏర్పడినప్పుడు యుద్ధాలు ప్రారంభమవుతాయి. మొట్టమొదట ఆత్మలు
సతోప్రధాన స్థితిలో దిగుతాయి, ఆ తర్వాత సతో, రజో, తమో స్థితులలోకి వస్తాయి. రాజధాని
ఏ విధముగా స్థాపనవుతోంది అనేదంతా కూడా బుద్ధిలో ఉంచుకోవాలి. ఇక్కడ కూర్చుని
ఉన్నప్పుడు, శివబాబా వచ్చి మాకు ఖజానాలను ఇస్తున్నారని బుద్ధిలో ఉంచుకోవాలి, వాటిని
బుద్ధిలో ధారణ చేయాలి. మంచి-మంచి పిల్లలు నోట్స్ వ్రాస్తారు, వ్రాయడము మంచిదే,
అప్పుడు బుద్ధిలోకి టాపిక్స్ వస్తాయి. ఈ రోజు ఫలానా టాపిక్ పై అర్థం చేయించాలని
భావిస్తారు. తండ్రి అంటారు, నేను మీకు ఎంత ఖజానాను ఇచ్చాను. సత్య, త్రేతాయుగాలలో మీ
వద్ద అపారమైన ధనముండేది, ఆ తర్వాత వామ మార్గములోకి వెళ్ళడముతో ఆ ధనము తగ్గిపోతూ
వచ్చింది. సంతోషము కూడా తగ్గిపోతూ వచ్చింది. ఏదో ఒక వికర్మ జరగడము మొదలవుతుంది.
కిందికి దిగుతూ-దిగుతూ కళలు తగ్గిపోతూ ఉంటాయి. సతోప్రధాన, సతో, రజో, తమో స్థితులు
ఉంటాయి. సతో నుండి రజోలోకి వస్తారు, అప్పుడు ఒక్కసారిగా వచ్చేస్తారని కాదు,
మెల్లమెల్లగా దిగుతారు. తమోప్రధానములో కూడా మెల్లమెల్లగా మెట్లు దిగుతూ వస్తారు,
కళలు తగ్గుతూ ఉంటాయి, రోజురోజుకు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు జంప్ చేయాలి. తమోప్రధానము
నుండి సతోప్రధానముగా అవ్వాలి. దీని కోసం సమయము కూడా కావాలి. ఎక్కితే వైకుంఠ రసాన్ని
చవి చూస్తారు... అని అంటూ ఉంటారు. కామము యొక్క చెంపదెబ్బ తగలడముతో పూర్తిగా
చూర్ణమైపోతారు, ఎముక-ఎముక విరిగిపోతుంది. కొంతమంది మనుష్యులు స్వయాన్ని జీవహత్య
చేసుకుంటారు, అది ఆత్మహత్య కాదు, దానిని జీవహత్య అని అంటారు. ఇక్కడైతే తండ్రి నుండి
వారసత్వాన్ని పొందాలి, తండ్రిని స్మృతి చేయాలి, ఎందుకంటే తండ్రి నుండి రాజ్యాధికారము
లభిస్తుంది. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి - నేను తండ్రిని స్మృతి చేసి భవిష్యత్తు
కోసం ఎంత సంపాదన చేసుకున్నాను? ఎంతగా అంధులకు చేతికర్రగా అయ్యాను? ఈ పాత ప్రపంచము
మారుతోంది అని ఇంటి-ఇంటికీ సందేశాన్ని ఇవ్వాలి. తండ్రి కొత్త ప్రపంచము కోసం
రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మెట్ల చిత్రములో అంతా చూపించారు. ఈ చిత్రాలు
తయారుచేయడములో కృషి చేయవలసి ఉంటుంది. ఎవరైనా సరే సహజముగా అర్థం చేసుకునే విధముగా ఈ
చిత్రాలను తయారుచేయాలని, రోజంతా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ప్రపంచములోని వారంతా అయితే
ఇక్కడకు రారు. దేవీ-దేవతా ధర్మమువారే వస్తారు. మీ సేవ అయితే ఎంతగానో జరగనున్నది. మన
ఈ క్లాస్ ఎప్పటివరకు నడుస్తోంది అనేది మీకు తెలుసు. వారైతే కల్పము యొక్క ఆయుష్షు
లక్షల సంవత్సరాలని భావిస్తారు. అందుకే శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తూ ఉంటారు.
అంతిమము వచ్చినప్పుడు సర్వుల సద్గతిదాత వస్తారని, మా శిష్యులు ఎవరైతే ఉన్నారో వారి
గతి ఏర్పడుతుందని, ఆ తర్వాత మేము కూడా వెళ్ళి జ్యోతిలో కలిసిపోతామని వారు భావిస్తారు.
కానీ అలా జరగదు. మనము అమరుడైన తండ్రి ద్వారా సత్యాతి-సత్యమైన అమరకథను వింటున్నామని
మీకు ఇప్పుడు తెలుసు. కావున అమరుడైన తండ్రి ఏదైతే చెప్తారో, దానిని అంగీకరించాలి
కూడా, వారు కేవలం - నన్ను స్మృతి చేయండి, పవిత్రముగా అవ్వండి అని చెప్తున్నారు.
లేకపోతే శిక్షలు కూడా చాలా అనుభవించవలసి ఉంటుంది, పదవి కూడా తక్కువది లభిస్తుంది.
సేవలో కృషి చేయాలి. దధీచి ఋషి ఉదాహరణ ఉంది కదా. వారు ఎముకలను కూడా సేవలో పెట్టారు.
తమ శరీరము పట్ల కూడా ధ్యాస పెట్టకుండా రోజంతా సేవలో ఉండడము, దీనినే సేవలో ఎముకలను
ఇవ్వడమని అంటారు. ఒకటి, ఎముకలతో చేసే దైహిక సేవ, రెండవది, ఎముకలతో చేసే ఆత్మిక సేవ.
ఆత్మిక సేవ చేసేవారు ఆత్మిక జ్ఞానాన్నే వినిపిస్తూ ఉంటారు. ధనాన్ని దానము చేస్తూ
సంతోషములో నాట్యము చేస్తూ ఉంటారు. ప్రపంచములో మనుష్యులేదైతే సేవ చేస్తూ ఉంటారో,
అదంతా దైహిక సేవ. వారు శాస్త్రాలను వినిపిస్తారు, అది ఆత్మిక సేవ కాదు. ఆత్మిక
సేవనైతే కేవలం తండ్రి మాత్రమే వచ్చి నేర్పిస్తారు. స్పిరిచ్యుల్ తండ్రియే వచ్చి
స్పిరిచ్యుల్ పిల్లలను (ఆత్మలను) చదివిస్తారు.
పిల్లలైన మీరు ఇప్పుడు సత్యయుగీ కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు
చేసుకుంటున్నారు. అక్కడ మీ ద్వారా ఎటువంటి వికర్మలు జరగవు. అది ఉన్నదే రామ రాజ్యము.
అక్కడ ఉండేది కొద్దిమంది మాత్రమే. ఇప్పుడైతే రావణ రాజ్యములో అందరూ దుఃఖితులుగా
ఉన్నారు కదా. ఈ జ్ఞానమంతా కూడా మీ బుద్ధిలో నంబరువారు పురుషార్థానుసారముగా ఉంది. ఈ
మెట్ల చిత్రములోనే జ్ఞానమంతా వచ్చేస్తుంది. తండ్రి అంటారు, ఈ అంతిమ జన్మ పవిత్రముగా
అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. మీరు ఏ విధముగా అర్థం
చేయించాలంటే, దానితో మనుష్యులకు - మేము సతోప్రధానము నుండి తమోప్రధానముగా అయ్యాము,
స్మృతియాత్రతోనే మళ్ళీ సతోప్రధానముగా అవుతాము అని తెలియాలి. ఇది చూసినప్పుడు - ఈ
జ్ఞానము ఇంకెవ్వరి వద్దా లేదని అర్థమవుతుంది. ఈ మెట్ల చిత్రములో ఇతర ధర్మాల సమాచారము
ఎక్కడ ఉందని అంటారు. ఆ విషయాలు ఈ సృష్టి చక్రము చిత్రములో వ్రాయబడి ఉన్నాయి. ఇతర
ధర్మాలవారు కొత్త ప్రపంచములోకైతే రారు, వారికి శాంతి లభిస్తుంది. భారతవాసులే
స్వర్గములో ఉండేవారు కదా. తండ్రి కూడా భారత్ లోకే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు,
అందుకే భారత్ యొక్క ప్రాచీన యోగాన్ని అందరూ కోరుకుంటారు. తప్పకుండా కొత్త ప్రపంచములో
కేవలం భారత్ యే ఉండేదని ఈ చిత్రాల ద్వారా వారు స్వయం కూడా అర్థం చేసుకుంటారు. తమ
ధర్మము గురించి కూడా అర్థం చేసుకుంటారు. ధర్మ స్థాపన చేయడానికి క్రైస్ట్ వచ్చారు
కానీ ఈ సమయములో వారు కూడా తమోప్రధానముగా ఉన్నారు. రచయిత మరియు రచన యొక్క ఈ జ్ఞానము
ఎంత గొప్పది.
మీరు ఈ విధముగా చెప్పవచ్చు - మాకు ఎవరి ధనము అవసరము లేదు, ధనాన్ని మేమేమి
చేసుకుంటాము, మీరు కూడా వినండి, ఇతరులకు కూడా వినిపించండి, ఈ చిత్రాలు మొదలైనవి
ముద్రించండి. ఈ చిత్రాలను ఉపయోగించుకోవాలి. ఈ జ్ఞానము వినిపించేందుకు హాల్
కట్టించండి, ఇకపోతే మేము ధనము తీసుకుని ఏమి చేస్తాము, మీ ఇంటి కళ్యాణమే జరుగుతుంది,
మీరు కేవలం ఏర్పాట్లు చేయండి. రచయిత మరియు రచనల జ్ఞానము చాలా బాగుందని చాలామంది
వచ్చి చెప్తారు. ఇదంతా మనుష్యులే అర్థం చేసుకోవాలి. విదేశీయులు ఈ జ్ఞానాన్ని విని
చాలా ఇష్టపడతారు, చాలా సంతోషిస్తారు. మేము కూడా తండ్రితో యోగాన్ని జోడించినట్లయితే
వికర్మలు వినాశనమవుతాయని భావిస్తారు. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఈ
జ్ఞానాన్ని అయితే భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరని అర్థం చేసుకుంటారు. ఖుదా
స్వర్గాన్ని స్థాపన చేసారని అంటారు కానీ వారు ఎలా వస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు.
మీ మాటలు విని సంతోషిస్తారు, ఆ తర్వాత పురుషార్థము చేసి యోగము నేర్చుకుంటారు,
తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యేందుకు పురుషార్థము చేస్తారు. సేవ కోసమైతే
ఎంతగానో ఆలోచించాలి. భారత్ లో నైపుణ్యాన్ని చూపిస్తే బాబా విదేశాలకు కూడా పంపిస్తారు.
ఈ సంస్థ విదేశాలకు కూడా వెళ్తుంది. ఇప్పుడింకా సమయముంది కదా. కొత్త ప్రపంచము
తయారయ్యేందుకు సమయమేమీ పట్టదు. ఎక్కడైనా భూకంపాలు మొదలైనవి జరిగితే, 2-3 సంవత్సరాలలో
పూర్తిగా కొత్త ఇళ్ళు మొదలైనవి నిర్మిస్తారు. పనివారు చాలా మంది ఉండి, మొత్తం
సామానంతా సిద్ధముగా ఉన్నట్లయితే, ఇక తయారవ్వడానికి సమయమేమీ పట్టదు. విదేశాలలో ఇళ్ళు
ఎలా తయారవుతాయి - మినిట్ మోటర్ (నిమిషములో తయారవుతాయి). మరి స్వర్గములో ఇంకెంత
త్వరగా తయారవుతూ ఉండవచ్చు. అక్కడ బంగారము, వెండి మొదలైనవి మీకు చాలా లభిస్తాయి, మీరు
గనుల నుండి బంగారము, వెండి, వజ్రాలు తీసుకుని వస్తారు. అన్ని నైపుణ్యాలను
నేర్చుకుంటున్నారు. ఇక్కడ సైన్స్ వారి గర్వము ఎంతగా ఉంది. ఈ సైన్స్ మళ్ళీ అక్కడ
ఉపయోగపడుతుంది. ఇక్కడ నేర్చుకున్నవారు మళ్ళీ తర్వాత జన్మను అక్కడ తీసుకుని దీనిని
ఉపయోగిస్తారు. ఆ సమయములోనైతే మొత్తము ప్రపంచమంతా కొత్తగా అవుతూ ఉంటుంది, రావణ
రాజ్యము సమాప్తమైపోతుంది, పంచ తత్వాలు కూడా నియమానుసారముగా మన సేవలో ఉంటాయి.
స్వర్గము తయారవుతుంది. అక్కడ ఎటువంటి ఉపద్రవాలు జరగవు, రావణ రాజ్యమే ఉండదు, అందరూ
సతోప్రధానముగా ఉంటారు.
అన్నింటికంటే మంచి విషయమేమిటంటే - పిల్లలైన మీకు తండ్రి పట్ల చాలా ప్రేమ ఉండాలి.
తండ్రి ఖజానాను ఇస్తారు, దానిని ధారణ చేసి ఇతరులకు దానమివ్వాలి. ఎంతగా దానమిస్తారో,
అంతగా జమ అవుతూ ఉంటుంది. సేవే చేయకపోతే ధారణ ఎలా జరుగుతుంది? సేవలో బుద్ధిని
ఉపయోగించాలి. సేవ అయితే చాలా ఎక్కువ చేయడానికి అవకాశముంది. రోజురోజుకు ఉన్నతిని
పొందాలి. స్వయము యొక్క ఉన్నతిని కూడా చేసుకోవాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.