09-05-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీకు నషా ఉండాలి, ఏ శివుడినైతే అందరూ పూజిస్తారో, వారు ఇప్పుడు మనకు తండ్రిగా అయ్యారు, మనము వారి సమ్ముఖములో కూర్చున్నాము’’

ప్రశ్న:-
మనుష్యులు భగవంతుడిని క్షమాపణ ఎందుకు కోరుకుంటారు? వారికి క్షమాపణ లభిస్తుందా?

జవాబు:-
మేము ఏవైతే పాప కర్మలు చేసామో వాటికి శిక్ష భగవంతుడు ధర్మరాజు ద్వారా ఇప్పిస్తారు అని మనుష్యులు భావిస్తారు, అందుకే క్షమాపణ కోరుకుంటారు. కానీ వారు తమ కర్మలకు శిక్షలను కర్మభోగము రూపములో అనుభవించవలసే ఉంటుంది, భగవంతుడు వారికి మందు ఏమీ ఇవ్వరు. గర్భజైలులో కూడా శిక్షలను అనుభవించాలి, మీరు ఇవి-ఇవి చేసారు, ఈశ్వరీయ డైరెక్షన్లపై నడుచుకోలేదు, అందుకే ఈ శిక్ష లభిస్తుంది అని సాక్షాత్కారమవుతుంది.

పాట:-
నీవు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నావు...

ఓంశాంతి
ఈ విధంగా ఎవరు అన్నారు? ఆత్మిక తండ్రి అన్నారు. వారు ఉన్నతోన్నతమైనవారు. మనుష్యులందరికన్నా, ఆత్మలందరికన్నా కూడా వారు ఉన్నతమైనవారు. అందరిలోనూ ఆత్మయే ఉంది కదా. శరీరము అనేది పాత్రను అభినయించడానికి లభించింది. సన్యాసులు మొదలైనవారి శరీరాలకు కూడా ఎంత గౌరవము ఉంటుంది అనేది ఇప్పుడు మీరు చూస్తుంటారు. తమ గురువులకు మొదలైనవారికి ఎంత మహిమను చేస్తారు. ఈ అనంతమైన తండ్రి అయితే గుప్తమైనవారు. శివబాబా ఉన్నతోన్నతమైనవారని, వారికన్నా ఉన్నతమైనవారు ఎవ్వరూ లేరని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. ధర్మరాజు కూడా వారితోపాటు ఉన్నారు, ఎందుకంటే భక్తి మార్గములో - ఓ భగవంతుడా, క్షమించండి అని క్షమాపణ కోరుకుంటారు. ఇప్పుడు భగవంతుడు ఏమి చేస్తారు! ఇక్కడ గవర్నమెంట్ అయితే జైలులో వేస్తుంది. ఆ ధర్మరాజు గర్భజైలులో దండన విధిస్తాడు. చేసినదానికి ప్రతిఫలాన్ని అనుభవించవలసే ఉంటుంది, దానిని కర్మభోగము అని అంటారు. కర్మభోగాన్ని ఎవరు అనుభవిస్తారు, ఏమి జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఓ ప్రభూ, క్షమించండి, దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని అంటారు. ఇప్పుడు భగవంతుడు ఏమైనా మందు ఇస్తారా ఏమిటి? వారేమీ చేయలేరు. మరి అటువంటప్పడు భగవంతుడిని ఎందుకు అడుగుతారు? ఎందుకంటే భగవంతుడితోపాటు ధర్మరాజు కూడా ఉన్నారు. చెడు కర్మలు చేయడం వలన తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది. గర్భజైలులో శిక్షలు కూడా లభిస్తాయి. అన్ని సాక్షాత్కారాలు జరుగుతాయి. సాక్షాత్కారాలు జరగకుండా శిక్షలు లభించవు. గర్భజైలులోనైతే మందులు మొదలైనవేవీ లేవు. అక్కడ శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఎప్పుడైతే దుఃఖితులుగా అవుతారో అప్పుడు - భగవంతుడా, ఈ జైలు నుండి విడిపించండి అని అంటారు.

ఇప్పుడు పిల్లలైన మీరు ఎవరి ఎదురుగా కూర్చున్నారు? ఉన్నతోన్నతుడైన తండ్రి ఎదురుగా, కానీ వారు గుప్తమైనవారు. మిగిలినవారందరి విషయములోనైతే శరీరాలు కనిపిస్తాయి, ఇక్కడ శివబాబాకైతే తమ కాళ్ళు-చేతులు మొదలైనవేవీ లేవు. పుష్పాలు మొదలైనవాటిని కూడా ఎవరు తీసుకుంటారు? ఒకవేళ కావాలనుకుంటే, ఇతని చేతుల ద్వారానే తీసుకోవలసి ఉంటుంది. కానీ వారు ఎవరి నుండీ తీసుకోరు. ఏ విధంగా ఆ శంకరాచార్యుడు - నన్ను ఎవరూ ముట్టుకోకూడదు అని అంటారో, అలాగే తండ్రి అంటారు - నేను పతితులది ఏదైనా కూడా ఎలా తీసుకుంటాను. నాకు పుష్పాలు మొదలైనవాటి అవసరము లేదు. భక్తి మార్గములో సోమనాథ్ మొదలైనవారి మందిరాలు నిర్మిస్తారు, పుష్పాలు అర్పిస్తారు. కానీ నాకైతే శరీరము లేదు. ఆత్మను ఎవరైనా ఎలా ముట్టుకోగలరు! నేను పతితుల నుండి పుష్పాలను ఎలా తీసుకోగలను అని అంటారు! ఎవరూ ముట్టుకోను కూడా ముట్టుకోలేరు. పతితులను ముట్టుకోనివ్వద్దు కూడా. ఈ రోజు ‘బాబా’ అని అంటారు, రేపు మళ్ళీ వెళ్ళి నరకవాసులుగా అవుతారు. ఇటువంటి వారినైతే చూడను కూడా చూడకూడదు. తండ్రి అంటారు - నేనైతే ఉన్నతోన్నతమైనవాడిని. ఈ సన్యాసులు మొదలైనవారందరినీ కూడా డ్రామానుసారముగా ఉద్ధరించాలి. నా గురించి ఎవరికీ తెలియనే తెలియదు. శివుని పూజను చేస్తారు కానీ - వారు గీతా భగవానుడని మరియు ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారని వారికి తెలియదు. గీతలో శ్రీకృష్ణుడి పేరును వేసేసారు. శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని ఇచ్చారంటే, మరి శివుడు ఏమి చేస్తూ ఉండవచ్చు! అందుకే మనుష్యులు అనుకుంటారు, వారు అసలు రానే రారు అని. అరే, పతిత-పావనుడు అని శ్రీకృష్ణుడిని అనరు. పతిత-పావనుడు అని నన్ను అంటారు కదా. మీలో కూడా ఇంతటి గౌరవాన్ని ఉంచగలిగేవారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వీరు ఉండడము కూడా ఎంత సాధారణముగా ఉంటారు, నేను ఈ సాధువులు మొదలైనవారందరికీ కూడా తండ్రిని అని అర్థం చేయిస్తారు కూడా. శంకరాచార్యులు మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, ఆ ఆత్మలందరికీ నేను తండ్రిని. శారీరాలకు తండ్రి ఎవరైతే ఉన్నారో వారు ఎలాగూ ఉన్నారు, నేను ఆత్మలందరికీ తండ్రిని. నన్ను అందరూ పూజిస్తారు. ఇప్పుడు వారు ఇక్కడ సమ్ముఖములో కూర్చున్నారు. కానీ మేము ఎవరి ఎదురుగా కూర్చున్నాము అనేది అందరూ అర్థం చేసుకోరు.

ఆత్మలు జన్మజన్మాంతరాలుగా దేహాభిమానానికి అలవాటు పడిపోయి ఉన్నారు, అందుకే తండ్రిని స్మృతి చేయలేకపోతున్నారు. దేహాన్నే చూస్తూ ఉంటారు. దేహీ-అభిమానులుగా ఉన్నట్లయితే ఆ తండ్రిని స్మృతి చేయగలుగుతారు మరియు ఆ తండ్రి ఇచ్చే శ్రీమతముపై నడవగలుగుతారు. తండ్రి అంటారు, నన్ను తెలుసుకునేందుకు అందరూ పురుషార్థులే. అంతిమములో పూర్తిగా దేహీ-అభిమానులుగా అయ్యేవారే పాస్ అవుతారు. మిగిలినవారందరిలో కొద్ది-కొద్దిగా దేహాభిమానము ఉంటుంది. తండ్రి అయితే గుప్తముగా ఉన్నారు. వారికి ఏమీ ఇవ్వలేము. కుమార్తెలు శివుని మందిరములోకి కూడా వెళ్ళి అర్థం చేయించవచ్చు. కుమారీలే శివబాబా పరిచయాన్ని ఇచ్చారు. వాస్తవానికి కుమారులు, కుమారీలు ఇరువురూ ఉన్నారు. కుమారులు కూడా పరిచయాన్ని ఇచ్చి ఉంటారు. విశేషముగా మాతలను పైకి లేపుతారు, ఎందుకంటే వారు పురుషులకన్నా ఎక్కువ సేవ చేశారు. పిల్లలకు సేవ పట్ల అభిరుచి ఉండాలి. ఉదాహరణకు ఆ చదువు పట్ల కూడా అభిరుచి ఉంటుంది కదా. అది దైహికమైనది, ఇది ఆత్మికమైనది. ఆ దైహిక చదువును చదువుతారు, డ్రిల్ మొదలైనవి నేర్చుకుంటారు, కానీ వాటి ద్వారా ఏమీ లభించదు. ఒకవేళ ఇప్పుడు ఎవరికైనా పిల్లలు జన్మిస్తే, ఎంతో ఘనంగా వారి నామకరణము మొదలైనవి జరుపుతారు, కానీ వారు ఏమి పొందుతారు! ఏదైనా పొందేందుకు అంత సమయము కూడా లేదు. ఇక్కడి నుండి కూడా వెళ్ళి జన్మ తీసుకుంటారు, కానీ వారు కూడా ఏమీ అర్థం చేసుకోరు. ఇక్కడి నుండి ఎవరైనా వెళ్ళి ఉంటే, వారు ఏదైతే నేర్చుకుని వెళ్ళారో, దాని అనుసారముగా బాల్యములోనే శివబాబాను స్మృతి చేస్తూ ఉంటారు. ఇది మంత్రము కదా. చిన్న పిల్లలకు నేర్పిస్తారు, కానీ వారు బిందువు మొదలైన విషయాలనైతే అర్థం చేసుకోరు. కేవలం శివబాబా, శివబాబా అని అంటూ ఉంటారు. శివబాబాను స్మృతి చేసినట్లయితే స్వర్గ వారసత్వాన్ని పొందుతారు - ఇలా వారికి అర్థం చేయించినట్లయితే వారు కూడా స్వర్గములోకి వచ్చేస్తారు. కానీ ఉన్నత పదవిని పొందలేకపోతారు. ఇలా ఎంతోమంది పిల్లలు వస్తూ ఉంటారు, శివబాబా, శివబాబా అని అంటూ ఉంటారు. ఆ తర్వాత అంతిమ స్మృతిని బట్టి మరుసటి జన్మ లభిస్తుంది. ఇక్కడ రాజధాని స్థాపన అవుతోంది. ఇప్పుడు మనుష్యులు శివుని పూజను చేస్తూ ఉంటారు, కానీ వారి గురించి ఏమీ తెలియదు. చిన్న పిల్లలు శివ శివ అని అన్నట్లుగా అంటూ ఉంటారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఇక్కడ కూడా పూజ చేస్తారు కానీ పరిచయము ఏ మాత్రమూ లేదు. కావున వారికి చెప్పాలి - మీరు ఎవరినైతే పూజిస్తున్నారో వారే జ్ఞానసాగరుడు, గీతా భగవానుడు. వారు మనల్ని చదివిస్తున్నారు. శివబాబా మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని అనగలిగేవారు ఈ ప్రపంచములో ఎవ్వరూ లేరు. ఇది కేవలం మీకు మాత్రమే తెలుసు, కానీ అది కూడా మర్చిపోతూ ఉంటారు. భగవానువాచ - నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. భగవానువాచ - కామము మహాశత్రువు, దానిపై విజయము పొందాలి అని ఎవరు అన్నారు. పాత ప్రపంచాన్ని సన్యసించండి. వారు శంకరాచార్యుడు, వీరు శివాచార్యుడు. వీరు మనకు నేర్పిస్తున్నారు. శ్రీకృష్ణాచార్యా అని అనలేము. అతను ఒక చిన్న బాలుడు మాత్రమే. సత్యయుగములో జ్ఞానము యొక్క అవసరము ఉండదు.

ఎక్కడెక్కడైతే శివుని మందిరాలు ఉన్నాయో, అక్కడ పిల్లలైన మీరు చాలా మంచి సేవ చేయవచ్చు. శివుని మందిరాలకు వెళ్ళండి, అక్కడికి మాతలు వెళ్తే మంచిది, కన్యలు వెళ్తే ఇంకా మంచిది. ఇప్పుడైతే మనము బాబా నుండి రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలి. తండ్రి మనల్ని చదివిస్తున్నారు, ఆ తర్వాత మనము మహారాజులుగా, మహారాణులుగా అవుతాము. ఉన్నతోన్నతమైనవారు తండ్రియే. ఇటువంటి శిక్షణను మనుష్యమాత్రులెవ్వరూ ఇవ్వలేరు. ఇది కలియుగము. సత్యయుగములో వీరి రాజ్యము ఉండేది. వీరు రాజు, రాణులుగా ఎలా తయారయ్యారు? వీరు సత్యయుగానికి యజమానులుగా అయ్యేందుకు వీరికి రాజయోగాన్ని ఎవరు నేర్పించారు? మీరు ఎవరినైతే పూజిస్తున్నారో వారు మనల్ని చదివించి సత్యయుగానికి యజమానులుగా తయారుచేస్తారు. బ్రహ్మా ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన... పతిత ప్రవృత్తి మార్గము వారే పావన ప్రవృత్తి మార్గములోకి వెళ్తారు. బాబా, పతితులైన మమ్మల్ని పావనముగా తయారుచేయండి, పావనముగా తయారుచేసి ఈ దేవతల వలె తయారుచేయండి అని అంటారు కూడా. అది ప్రవృత్తి మార్గము. నివృత్తి మార్గమువారికి గురువుగా అయ్యేదే లేదు. ఎవరైతే పవిత్రముగా అవుతారో, వారికి గురువుగా అవ్వవచ్చు. ఈ విధముగా చాలా మంది కంపానియన్లుగా కూడా ఉంటారు, వారు వికారాల కొరకు వివాహము చేసుకోరు. పిల్లలైన మీరు ఈ-ఈ విధముగా సేవ చేయవచ్చు. మేము బాబాకు సుపుత్రులైన పిల్లలుగా అయి ఎందుకు వెళ్ళి సేవ చేయకూడదు అని లోలోపల అభిరుచి ఉండాలి. పాత ప్రపంచపు వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. ఇప్పుడు శివబాబా చెప్తున్నారు, శ్రీకృష్ణుడైతే ఇక్కడ ఉండరు. అతను ఒకే ఒకసారి సత్యయుగములో ఉంటారు. మరుసటి జన్మలో అవే ముఖకవళికలు మరియు అదే పేరు ఉండదు కదా. 84 జన్మలలో 84 ముఖకవళికలు. శ్రీకృష్ణుడు ఈ జ్ఞానాన్ని ఎవ్వరికీ నేర్పించలేరు. ఆ శ్రీకృష్ణుడు ఇక్కడికి ఎలా వస్తారు. ఇప్పుడు మీరు ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. అర్ధకల్పము మంచి జన్మలు ఉంటాయి, ఆ తర్వాత రావణ రాజ్యము మొదలవుతుంది. మనుష్యులు పూర్తిగా జంతువుల వలె తయారైపోతారు. ఒకరితో ఒకరు గొడవపడుతూ, కొట్లాడుకుంటూ ఉంటారు. కావున రావణుడి జన్మ జరిగినట్లు కదా. కానీ 84 లక్షల జన్మలైతే లేవు. 84 లక్షల వెరైటీలు ఉన్నాయి. ఎవరూ ఇన్ని జన్మలు తీసుకోరు. ఇప్పుడు ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వారు ఉన్నతోన్నతమైన భగవంతుడు. వారు చదివిస్తున్నారు, వారి తర్వాత ఇతను కూడా ఉన్నారు కదా. ఇక్కడ చదువుకోకపోతే ఎవరి వద్దకైనా వెళ్ళి దాస-దాసీలుగా అవుతారు. శివబాబా వద్ద దాస-దాసీలుగా అవుతారా? తండ్రి అయితే అర్థం చేయిస్తున్నారు - చదువుకోకపోతే వెళ్ళి సత్యయుగములో దాస-దాసీలుగా అవుతారు. ఎవరైతే ఏ సేవా చేయరో, కేవలం తింటూ, తాగుతూ, పడుకుంటూ ఉంటారో, వారు ఎలా తయారవుతారు! ఎలా తయారవుతారు అనేది బుద్ధిలోకైతే వస్తుంది కదా! నేనైతే మహారాజుగా అవుతాను. అటువంటివారు నా ఎదురుగా కూడా రాలేరు. మేము ఈ విధముగా తయారవుతాము అని స్వయం కూడా అర్థం చేసుకుంటారు. అయినా కానీ సిగ్గు పడడం లేదే. మేము మా ఉన్నతి చేసుకుని ఎంతోకొంత పొందాలి అని అనుకోనే అనుకోరు. అందుకే బాబా అంటారు - ఈ బ్రహ్మా చెప్తున్నారు అని ఎప్పుడూ భావించకండి, ఎల్లప్పుడూ శివబాబాయే చెప్తున్నారని భావించండి. శివబాబా పట్ల అయితే గౌరవము ఉంచాలి కదా. వారితోపాటు ధర్మరాజు కూడా ఉన్నారు. లేదంటే ధర్మరాజు ద్వారా శిక్షలు కూడా ఎన్నో అనుభవించవలసి వస్తుంది. కుమారీలైతే చాలా చురుకుగా ఉండాలి. ఇక్కడ విని, బయటికి వెళ్ళగానే సమాప్తమైపోవడం కాదు. భక్తి మార్గము యొక్క సామాగ్రి ఎంతగా ఉంది. ఇప్పుడు తండ్రి అంటారు - విషాన్ని వదలండి, స్వర్గవాసులుగా కండి. ఈ-ఈ విధమైన స్లోగన్లు తయారుచేయండి. సాహసవంతులైన సింహాల వలె అవ్వండి. అనంతమైన తండ్రి లభించారు, ఇక ఇంకేమి కావాలి. ప్రభుత్వము ధర్మాన్నే అంగీకరించకపోతే ఇక వారు మనుష్యుల నుండి దేవతలుగా తయారవ్వడానికి ఎలా వస్తారు. వారు - మేము ఏ ధర్మాన్ని నమ్మము అని అంటారు. మేము అందరూ ఒక్కటే అని భావిస్తామని చెప్తారు, మరి వారు పరస్పరము ఎందుకు గొడవపడుతూ, కొట్లాడుకుంటూ ఉంటారు. అంతా అబద్దమే, ఇసుమంత కూడా సత్యము లేదు. మొట్టమొదట ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనడముతోనే అసత్యము ప్రారంభమవుతుంది. హిందూ ధర్మమంటూ ఏదీ లేదు. క్రిస్టియన్ల ధర్మము అలా కొనసాగుతూ వస్తుంది. వారు ధర్మము మార్చుకోరు. తమ ధర్మాన్ని మార్చుకుని హిందువులుగా పిలుచుకునే ధర్మము ఇదొక్కటే. అంతేకాక ఎలాంటి, ఎలాంటి పేర్లు పెట్టుకుంటారో చూడండి... శ్రీ శ్రీ ఫలానా అని అంటారు... వాస్తవానికి ఇప్పుడు శ్రీ అనగా శ్రేష్ఠమైనవారు ఎక్కడ ఉన్నారు. అలాగే ఎవ్వరి మతమూ శ్రీమతము కాదు. వారందరి మతములు ఇనుపయుగపు మతములు. వారి మతమును శ్రీమతము అని ఎలా అనగలము. ఇప్పుడు కుమారీలైన మీరు లేచి నిలబడినట్లయితే మీరు ఎవరికైనా అర్థం చేయించగలుగుతారు. కానీ యోగయుక్తమైన, తెలివైన మంచి కుమార్తెలు కావాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తమ ఉన్నతి చేసుకునేందుకు తండ్రి సేవలో తత్పరులై ఉండాలి. కేవలము తినడము, తాగడము, పడుకోవడము అంటే అది పదవిని పోగొట్టుకోవడము.

2. తండ్రి మరియు చదువు పట్ల గౌరవము ఉంచాలి. దేహీ-అభిమానులుగా అయ్యేందుకు పూర్తి-పూర్తి పురుషార్థము చేయాలి. తండ్రి శిక్షణలను ధారణ చేసి సుపుత్రులైన పిల్లలుగా అవ్వాలి.

వరదానము:-
సేవ చేస్తూ ఉపరామ స్థితిలో ఉండే యోగయుక్త, యుక్తియుక్త సేవాధారీ భవ

ఎవరైతే యోగయుక్త, యుక్తియుక్తమైన సేవాధారులు ఉంటారో, వారు సేవ చేస్తూ కూడా సదా ఉపరామముగా ఉంటారు. సేవ ఎక్కువగా ఉంది, అందుకే అశరీరిగా అవ్వలేము అని కాదు. ఇది నా సేవ కాదు, తండ్రి ఇచ్చారు అన్నది గుర్తుండాలి, అప్పుడు నిర్బంధనులుగా ఉంటారు. నేను ట్రస్టీని, బంధనముక్తుడను, ఇటువంటి అభ్యాసము చెయ్యండి. అతి సమయములో అంతిమము యొక్క స్థితిని, కర్మాతీత అవస్థను అభ్యాసము చెయ్యండి. ఏ విధంగా మధ్యమధ్యలో సంకల్పాల ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తారో, అదే విధంగా అతి సమయములో అంతిమము యొక్క స్థితిని అనుభవము చెయ్యండి, అప్పుడు అంతిమ సమయములో పాస్ విత్ ఆనర్ గా అవ్వగలరు.

స్లోగన్:-
శుభ భావన కారణాన్ని నివారణలోకి పరివర్తన చేస్తుంది.

అవ్యక్త సూచనలు - ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి

పవిత్రత విశేష జన్మ అయిన బ్రాహ్మణ జీవితములోని విశేషత. పవిత్ర సంకల్పాలు బ్రాహ్మణుల బుద్ధికి భోజనము వంటివి. పవిత్ర దృష్టి బ్రాహ్మణుల కంటి వెలుగు, పవిత్ర కర్మలు బ్రాహ్మణ జీవితము యొక్క విశేషమైన వ్యాపారము. పవిత్ర సంబంధ-సంపర్కాలు బ్రాహ్మణ జీవితపు మర్యాద. ఇటువంటి ఉన్నతమైన పవిత్రతను అలవరచుకునేందుకు శ్రమించకండి, హఠంతో అలవరచుకోకండి. ఈ పవిత్రత అనేది మీ జీవితము యొక్క వరదానము.