09-10-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యారు, మీరు అందరికీ సదా సుఖాన్ని ఇవ్వాలి, మీరు ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు’’

ప్రశ్న:-
మంచి ఫస్ట్ క్లాస్ పురుషార్థీ పిల్లలు ఏ మాటలను హృదయపూర్వకముగా చెప్తారు?

జవాబు:-
బాబా, మేమైతే పాస్ విత్ ఆనర్ గా అయి చూపిస్తాము, మీరు నిశ్చింతగా ఉండండి. వారి రిజిస్టరు కూడా బాగుంటుంది. వారి నోటి నుండి ఎప్పుడూ కూడా - ఇప్పుడింకా మేము పురుషార్థులము అన్న మాటలు రావు. పురుషార్థము చేసి ఎటువంటి మహావీరులుగా అవ్వాలంటే, మాయ కొద్దిగా కూడా కదిలించలేకపోవాలి.

ఓంశాంతి
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి ద్వారా చదువుకుంటున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. నిరాకార తండ్రి యొక్క నిరాకారీ పిల్లలమైన ఆత్మలమైన మనము చదువుకుంటున్నాము. ప్రపంచములో సాకారీ టీచర్లే చదివిస్తారు. ఇక్కడ నిరాకార తండ్రి, నిరాకార టీచరు ఉన్నారు, ఇకపోతే ఇతనికి ఇంతకుముందు విలువేమీ లేదు. అనంతమైన తండ్రి అయిన శివబాబా వచ్చి వీరికి విలువనిస్తారు. అత్యంత విలువైనవారు శివబాబా, వారు స్వర్గ స్థాపన చేస్తారు. వారు ఎంత ఉన్నతమైన కార్యాన్ని చేస్తారు. తండ్రి ఎంత ఉన్నతోన్నతమైనవారిగా గాయనము చేయబడుతున్నారో, పిల్లలు కూడా అంతగానే ఉన్నతముగా తయారవ్వాలి. అందరికన్నా ఉన్నతమైనవారు తండ్రి అని మీకు తెలుసు. తప్పకుండా ఇప్పుడు స్వర్గ రాజ్యము స్థాపనవుతుందని, ఇది సంగమయుగమని మీ బుద్ధిలో ఉంది. సత్యయుగానికి మరియు కలియుగానికి మధ్యలో, ఇది పురుషోత్తములుగా తయారయ్యే సంగమయుగము. పురుషోత్తమ అనే పదము యొక్క అర్థము కూడా మనుష్యులకు తెలియదు. ఉన్నతోన్నతముగా, మళ్ళీ నీచాతి నీచముగా అయ్యారు. పతితులకు మరియు పావనులకు మధ్యన ఎంత వ్యత్యాసము ఉంది. దేవతల పూజారులు ఎవరైతే ఉంటారో, వారు స్వయంగా ఈ విధముగా వర్ణిస్తారు - మీరు సర్వగుణ సంపన్నులు, విశ్వానికి యజమానులు, మేము విషయ వైతరణి నదిలో మునకలు వేసేవారము అని. ఇలా కేవలం నామమాత్రముగా అంటారు, అంతేకానీ అర్థం చేసుకోరు. డ్రామా విచిత్రమైనది, అద్భుతమైనది. ఇలాంటి విషయాలను మీరు కల్ప-కల్పము వింటారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఎవరికైతే తండ్రిపై పూర్తి ప్రేమ ఉంటుందో, వారికి చాలా ఆకర్షణ కలుగుతుంది. ఇప్పుడు ఆత్మ తండ్రిని ఎలా కలుసుకోవాలి? సాకారములో కలుసుకోవడం జరుగుతుంది, నిరాకారీ ప్రపంచములోనైతే ఆకర్షణ అనే మాటే ఉండదు. అక్కడైతే అందరూ పవిత్రముగానే ఉంటారు, తుప్పు తొలగించబడి ఉంటుంది, ఆకర్షణ అనే మాట ఉండదు. ప్రేమ అనే మాట ఇక్కడే ఉంటుంది. ఇటువంటి తండ్రిని పూర్తిగా పట్టుకోండి. బాబా, మీరైతే అద్భుతము చేస్తారు, మీరు మా జీవితాన్ని ఇలా తయారుచేస్తారు. చాలా ప్రేమ ఉండాలి. ప్రేమ ఎందుకు లేదు, ఎందుకంటే తుప్పు పట్టి ఉంది. స్మృతియాత్రతో తప్ప తుప్పు తొలగదు, అంత ప్రియముగా కారు. పుష్పాలైన మీరైతే ఇక్కడే వికసించాలి, పుష్పాలుగా అవ్వాలి, అప్పుడు అక్కడ జన్మ-జన్మాంతరాల కొరకు పుష్పాలుగా అవుతారు. మేము ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాము అని ఎంత సంతోషము ఉండాలి. పుష్పాలు సదా అందరికీ సుఖాన్ని ఇస్తాయి. పుష్పాలను అందరూ తమ కళ్ళకద్దుకుంటారు, వాటి ద్వారా సుగంధాన్ని తీసుకుంటారు. పుష్పాలతో సెంటును తయారుచేస్తారు, గులాబి జలాన్ని తయారుచేస్తారు. తండ్రి మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేస్తారు, మరి పిల్లలైన మీకు సంతోషము ఎందుకు ఉండదు! బాబాకైతే ఆశ్చర్యమనిపిస్తుంది. శివబాబా మనల్ని స్వర్గములో పుష్పాలుగా తయారుచేస్తారు! పుష్పాలు కూడా పాతవిగా అయిపోయినప్పుడు పూర్తిగా వాడిపోతాయి. ఇప్పుడు మనము మనుష్యుల నుండి దేవతలు అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది. తమోప్రధాన మనుష్యులకు మరియు సతోప్రధాన దేవతలకు ఎంత వ్యత్యాసము ఉంది. ఇది కూడా తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు.

మనము దేవతలుగా అయ్యేందుకు చదువుకుంటున్నామని మీకు తెలుసు. చదువులో నషా ఉంటుంది కదా. మనము బాబా ద్వారా చదువుకుని విశ్వానికి యజమానులుగా అవుతామని మీరు కూడా భావిస్తారు. మీ చదువు భవిష్యత్తు కోసముంది. భవిష్యత్తు కోసం చదువు అని ఎప్పుడైనా విన్నారా? మేము కొత్త ప్రపంచము కోసం, కొత్త జన్మ కోసం చదువుకుంటున్నామని మీరే అంటారు. కర్మ-అకర్మ-వికర్మల గతిని కూడా తండ్రి అర్థం చేయిస్తారు. ఇది గీతలో కూడా ఉంది కానీ దాని అర్థము గీతను చదివేవారికి తెలియదు. సత్యయుగములో కర్మ, అకర్మగా అవుతుందని, ఆ తర్వాత రావణ రాజ్యములో కర్మ, వికర్మగా అవ్వడం మొదలవుతుందని ఇప్పుడు తండ్రి ద్వారా మీరు తెలుసుకున్నారు. 63 జన్మలుగా మీరు ఇలాంటి కర్మలు చేస్తూ వచ్చారు. వికర్మల భారము తలపై చాలా ఉంది. అందరూ పాపాత్ములుగా అయిపోయారు. ఇప్పుడు ఆ గతం యొక్క వికర్మలు ఎలా కట్ అవుతాయి. మొదట సతోప్రధానముగా ఉండేవారమని, ఆ తర్వాత 84 జన్మలు తీసుకున్నామని మీకు తెలుసు. తండ్రి డ్రామా యొక్క పరిచయాన్ని ఇచ్చారు. ఎవరైతే మొట్టమొదట వస్తారో, ఎవరి రాజ్యమైతే మొట్టమొదట ఉంటుందో, వారే 84 జన్మలు తీసుకుంటారు. ఆ తర్వాత తండ్రి వచ్చి రాజ్య భాగ్యాన్ని ఇస్తారు. ఇప్పుడు మీరు రాజ్యాన్ని తీసుకుంటున్నారు. మనం 84 జన్మల చక్రములో ఎలా తిరిగాము అనేది మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ పవిత్రముగా అవ్వాలి. బాబాను స్మృతి చేస్తూ-చేస్తూ ఆత్మ పవిత్రముగా అయిపోతుంది, అప్పుడిక ఈ పాత శరీరము సమాప్తమైపోతుంది. పిల్లలకు అపారమైన సంతోషము ఉండాలి. తండ్రి, తండ్రి కూడా, టీచర్ కూడా, గురువు కూడా అన్న మహిమను ఎప్పుడూ ఎక్కడా వినలేదు. ముగ్గురూ ఉన్నతోన్నతమైనవారే. సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సద్గురువు, ముగ్గురూ ఒక్కరే. ఇప్పుడు మీకు అనుభూతి కలుగుతుంది. జ్ఞానసాగరుడైన బాబా ఆత్మలందరికీ తండ్రి, వారు మనల్ని చదివిస్తున్నారు. యుక్తులను రచిస్తున్నారు. మ్యాగజైన్ లో కూడా మంచి-మంచి పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. రంగుల చిత్రాలతో కూడా మ్యాగజైన్ తయారుచేసే అవకాశముంది. కేవలం పదాలు చిన్నవైపోతాయి. చిత్రాలైతే తయారై ఉన్నాయి. ఎక్కడైనా ఎవరైనా తయారుచేయవచ్చు. పై నుండి మొదలుకొని ప్రతి చిత్రము యొక్క చరిత్ర మీకు తెలుసు. శివబాబా కర్తవ్యము కూడా మీకు తెలుసు. పిల్లలు తండ్రి కర్తవ్యాన్ని తప్పకుండా తండ్రి ద్వారానే తెలుసుకుంటారు కదా. ఇంతకుముందు మీకు కూడా ఏమీ తెలియదు. చిన్న బిడ్డకు చదువు గురించి ఏం అర్థమవుతుంది. 5 సంవత్సరాల తర్వాత చదవడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత చదువుకుంటూ-చదువుకుంటూ పెద్ద పరీక్షను పాస్ అయ్యేందుకు చాలా సంవత్సరాలు పడుతుంది. మీరు ఉండడం ఎంత సాధారణముగా ఉన్నారు కానీ తయారవ్వడం ఎలా తయారవుతారు! విశ్వానికి యజమానులుగా తయారవుతారు. మీకు ఎంత అలంకరణ జరుగుతుంది. గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ (నోటిలో బంగారు చెంచా) ఉంటుంది. ఆ ప్రపంచానికి సంబంధించి ఈ గాయనము ఎలాగూ ఉంది, కానీ ఇప్పుడు కూడా మంచి పిల్లలెవరైనా శరీరాన్ని విడిచిపెడితే, వారు చాలా మంచి ఇంటిలో జన్మ తీసుకుంటారు. అప్పుడు నోటిలో బంగారు చెంచా లభిస్తుంది. కొంతమంది ముందుగానే ఎవరి వద్దకైనా వెళ్తారు కదా. నిర్వికారుల వద్దనైతే మొట్టమొదట శ్రీకృష్ణుడే జన్మ తీసుకోవాలి. మిగిలినవారు ఎవరు వెళ్ళినా వారు వికారుల వద్దనే జన్మ తీసుకుంటారు కానీ గర్భములో ఇన్ని శిక్షలను అనుభవించరు. చాలా మంచి ఇళ్ళల్లో జన్మ తీసుకుంటారు. శిక్షలైతే తొలగిపోతాయి, మహా అయితే కొద్దిగా మిగిలి ఉంటాయి. ఇంత దుఃఖముండదు. మున్ముందు మీ వద్దకు చాలా పెద్ద-పెద్ద ఇంటి పిల్లలైన రాకుమారులు, రాకుమారీలు ఎలా వస్తారో చూడండి. తండ్రి ఎంతగా మీ మహిమను చేస్తారు. ఎలాగైతే లౌకిక తండ్రి పిల్లలను సుఖవంతులుగా చేస్తారో, అలా నేను మిమ్మల్ని నా కన్నా ఉన్నతముగా తయారుచేస్తాను. 60 సంవత్సరాల తర్వాత ఇక స్వయం వానప్రస్థములోకి వెళ్ళిపోతారు, భక్తిలో నిమగ్నమైపోతారు. జ్ఞానాన్ని అయితే ఎవ్వరూ ఇవ్వలేరు. జ్ఞానము ద్వారా సర్వుల సద్గతిని నేను చేస్తాను. మీ పేరు మీద అందరి కళ్యాణము జరుగుతుంది ఎందుకంటే మీ కొరకు తప్పకుండా కొత్త ప్రపంచము కావాలి. మీరు ఎంత సంతోషిస్తారు. ఇప్పుడు వెజిటేరియన్ కాన్ఫరెన్స్ లో కూడా పిల్లలైన మీకు ఆహ్వానము లభించింది. ధైర్యము వహించండి అని బాబా అయితే చెప్తూ ఉంటారు. ఢిల్లీ వంటి నగరాలలోనైతే పూర్తిగా శబ్దము వ్యాపించాలి. ప్రపంచములో అంధవిశ్వాసముతో కూడిన భక్తి చాలా ఉంది. సత్య, త్రేతాయుగాలలో భక్తి యొక్క విషయమేదీ ఉండదు. ఆ డిపార్టుమెంట్ వేరు. అర్ధకల్పము జ్ఞానము యొక్క ప్రారబ్ధముంటుంది. మీకు అనంతమైన తండ్రి ద్వారా 21 జన్మల వారసత్వము లభిస్తుంది. ఇక 21 తరాలు మీరు సుఖవంతులుగా ఉంటారు. వృద్ధాప్యము వరకు కూడా దుఃఖము అన్న పేరే ఉండదు. పూర్తి ఆయువు సుఖముగా ఉంటారు. వారసత్వాన్ని పొందే పురుషార్థాన్ని ఎంతగా చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. కనుక పురుషార్థము పూర్తిగా చేయాలి. మాల నంబరువారుగా ఎలా తయారవుతుందో మీరు చూస్తారు. పురుషార్థానుసారముగానే తయారవుతుంది. మీరు అద్భుతమైన విద్యార్థులు. స్కూలులో కూడా పిల్లలను గమ్యము వరకు పరిగెత్తిస్తారు కదా. మీరు కూడా గమ్యము వరకు పరుగెత్తి మళ్ళీ ఇక్కడికే రావాలి అని బాబా కూడా చెప్తారు. స్మృతియాత్ర ద్వారా మీరు పరుగెత్తుకుని వెళ్ళండి, మళ్ళీ మీరు నంబరువన్ లోకి వస్తారు. ముఖ్యమైనది స్మృతియాత్ర. బాబా, మేము మర్చిపోతున్నామని అంటారు. అరే, తండ్రి ఇంతగా మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తున్నారు, వారిని మీరు మర్చిపోతున్నారా. తుఫానులైతే వస్తాయి. తండ్రి ధైర్యాన్ని ఇప్పిస్తారు కదా. ఇంకా, ఇది యుద్ధ స్థలమని కూడా చెప్తారు. వాస్తవానికి యుద్ధము నేర్పించే తండ్రినే యుధిష్టరుడు అని కూడా అనాలి. మాయతో మీరు యుద్ధము ఎలా చేయవచ్చు అనేది యుధిష్టరుడైన తండ్రి మీకు నేర్పిస్తారు. ఈ సమయములో ఇది యుద్ధ మైదానము కదా. తండ్రి అంటారు, కామము మహాశత్రువు, దీనిని జయిస్తే మీరు జగత్ జీతులుగా అవుతారు. మీరు నోటితో ఏమీ జపించవలసిన అవసరము లేదు, మౌనముగా ఉండాలి. భక్తి మార్గములో ఎంతగా శ్రమిస్తారు. లోపల రామ-రామ అని జపిస్తూ ఉంటారు, దానినే నవవిధ భక్తి అని అంటారు. బాబా మనల్ని తన మాలలోని వారిగా తయారుచేస్తున్నారని మీకు తెలుసు. మీరు రుద్రమాలలోని మణులుగా అయ్యేటటువంటివారు, దానినే తర్వాత పూజిస్తారు. రుద్రమాల మరియు రుండమాల తయారవుతూ ఉంది. విష్ణుమాలను రుండమాల అని అంటారు. మీరు విష్ణు మెడలోని హారముగా అవుతారు. ఎలా అవుతారు? పరుగు పందెములో గెలిచినప్పుడు అవుతారు. తండ్రిని స్మృతి చేయాలి మరియు 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. మీరు ఎటువంటి లైట్ హౌస్ లు. ఒక కంటిలో ముక్తిధామము, మరొక కంటిలో జీవన్ముక్తిధామము. ఈ చక్రాన్ని తెలుసుకోవడముతో మీరు చక్రవర్తి రాజులుగా, సుఖధామానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు ఆత్మలైన మేము మా ఇంటికి వెళ్తాము అని మీ ఆత్మ అంటుంది. ఇంటిని స్మృతి చేస్తూ, చేస్తూ వెళ్ళిపోతారు. ఇది స్మృతియాత్ర. మీ యాత్ర ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉందో చూడండి. మేము కూర్చుని-కూర్చుని క్షీరసాగరములోకి వెళ్ళిపోతామని బాబాకు తెలుసు. విష్ణువును క్షీరసాగరములో చూపిస్తారు కదా. తండ్రిని స్మృతి చేస్తూ, చేస్తూ క్షీరసాగరములోకి వెళ్ళిపోతారు. ఇప్పుడైతే క్షీరసాగరము లేదు. ఎవరైతే కొలనును తయారుచేసారో, వారు తప్పకుండా అందులో పాలు పోసి ఉంటారు. పూర్వము పాలు చాలా చవకగా ఉండేవి. ఒక్క పైసాకు లోటా నిండుగా లభించేవి. మరి కొలను ఎందుకు నిండదు. ఇప్పుడు పాలు ఎక్కడ ఉన్నాయి. అంతా నీరే నీరులా అయిపోయింది. బాబా నేపాల్ లో చూసారు - చాలా పెద్ద విష్ణువు చిత్రము ఉంది. వారిని నల్లగానే తయారుచేసారు. ఇప్పుడు మీరు స్మృతియాత్ర ద్వారా మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పడం ద్వారా విష్ణుపురికి యజమానులుగా అవుతున్నారు. దైవీ గుణాలను కూడా ఇక్కడే ధారణ చేయాలి. ఇది పురుషోత్తమ సంగమయుగము. చదువుకుంటూ, చదువుకుంటూ మీరు పురుషోత్తములుగా అయిపోతారు. ఆత్మ యొక్క కనిష్టత తొలగిపోతుంది. బాబా ప్రతిరోజూ అర్థం చేయిస్తుంటారు - నషా ఎక్కాలి. బాబా, పురుషార్థము చేస్తున్నామని అంటారు. అరే, బాబా, మేమైతే పాస్ విత్ ఆనర్ గా అయ్యి చూపిస్తాము, మీరు చింతించకండి అని హృదయపూర్వకముగా చెప్పండి కదా. ఫస్ట్ క్లాస్ పిల్లలు ఎవరైతే బాగా చదువుకుంటారో, వారి రిజిస్టరు కూడా బాగుంటుంది. బాబా, మీరు నిశ్చింతగా ఉండండి, మేము ఇలా తయారై చూపిస్తాము అని బాబాకు చెప్పాలి. బాబాకు కూడా తెలుసు కదా, చాలామంది టీచర్లు చాలా ఫస్ట్ క్లాసుగా ఉన్నారు. అందరూ అయితే ఫస్ట్ క్లాసుగా అవ్వలేరు. మంచి-మంచి టీచర్లు ఒకరికొకరు తెలుసు. అందరినీ మహారథుల లైనులోకి తీసుకురాలేము. మంచి-మంచి పెద్ద-పెద్ద సెంటర్లను తెరిచినట్లయితే పెద్ద-పెద్ద వ్యక్తులు వస్తారు. కల్పక్రితము కూడా హుండీ నిండింది. సావల్ షాహ్ బాబా (సర్వులు మనోకామనలను తీర్చే బాబా) హుండీని తప్పకుండా నింపుతారు. ఇద్దరు తండ్రులు పిల్లలు కలవారు. ప్రజాపిత బ్రహ్మాకు ఎంతమంది పిల్లలున్నారు. కొందరు పేదవారు, కొందరు సాధారణమైనవారు, కొందరు షావుకార్లు ఉన్నారు, కల్పక్రితము కూడా వీరి ద్వారా రాజ్యము స్థాపనయ్యింది, దానిని దైవీ రాజస్థాన్ అని అంటారు. ఇప్పుడిది ఆసురీ రాజస్థాన్. విశ్వమంతా దైవీ రాజస్థాన్ గా ఉండేది, ఇన్ని ఖండాలుండేవి కావు. ఇదే ఢిల్లీ యమునా నదీ తీరములో ఉండేది, దానిని పరిస్తాన్ అని అంటారు. అక్కడి నదులు మొదలైనవి పొంగవు. ఇప్పుడైతే ఎంతగా పొంగుతూ ఉంటాయి, ఆనకట్టలు తెగిపోతుంటాయి. ప్రకృతికి మనము దాసుల వలె అయిపోయాము. మళ్ళీ మీరు యజమానులుగా అవుతారు. అక్కడ మీ పరువు తీసేందుకు మాయకు శక్తి ఉండదు. భూమికి కంపించేందుకు శక్తి ఉండదు. మీరు కూడా మహావీరులుగా అవ్వాలి. హనుమంతుడిని మహావీర్ అని అంటారు కదా. తండ్రి అంటారు, మీరందరూ మహావీరులు. మహావీర పిల్లలు ఎప్పుడూ చలించరు. మహావీర, మహావీరనీల మందిరాలు నిర్మించబడి ఉన్నాయి. అందరి చిత్రాలు పెట్టలేము కదా. మోడల్ రూపములో తయారుచేసారు. ఇప్పుడు మీరు భారత్ ను స్వర్గముగా తయారుచేస్తున్నారు కావున ఎంత సంతోషముండాలి. ఎన్ని మంచి గుణాలు ఉండాలి. అవగుణాలను తొలగించుకుంటూ వెళ్ళండి. సదా హర్షితముగా ఉండాలి. తుఫానులైతే వస్తాయి. తుఫానులు వస్తేనే మహావీరనీ యొక్క శక్తి కనిపిస్తుంది. మీరు ఎంతగా దృఢముగా అవుతారో, అంతగా తుఫానులు వస్తాయి. ఇప్పుడు మీరు పురుషార్థము చేసి నంబరువారు పురుషార్థానుసారముగా మహావీరులుగా అవుతున్నారు. జ్ఞానసాగరుడు తండ్రి మాత్రమే. మిగిలిన శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గము యొక్క సామాగ్రి. మీ కొరకు - ఇది పురుషోత్తమ సంగమయుగము. కృష్ణుని ఆత్మ ఇక్కడే కూర్చుని ఉంది. వీరు భగీరథుడు. అలాగే మీరందరూ భగీరథులు, భాగ్యశాలులు కదా. భక్తి మార్గములో తండ్రి ఎవరికైనా సాక్షాత్కారము చేయించగలరు. ఈ కారణము చేత మనుష్యులు సర్వవ్యాపి అనేసారు, ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. పిల్లలైన మీరు చాలా ఉన్నతమైన చదువు చదువుతున్నారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆత్మపై ఏదైతే తుప్పు ఏర్పడిందో, దానిని స్మృతియాత్రతో తొలగించి చాలా-చాలా ప్రియముగా అవ్వాలి. ప్రేమ ఎలా ఉండాలంటే తండ్రి పట్ల సదా ఆకర్షణ ఉండాలి.

2. మాయా తుఫానులకు భయపడకూడదు, మహావీరులుగా అవ్వాలి. తమ అవగుణాలను తొలగించుకుంటూ వెళ్ళాలి, సదా హర్షితముగా ఉండాలి. ఎప్పుడూ చలించకూడదు.

వరదానము:-
శుద్ధ సంకల్పాల శక్తి యొక్క స్టాక్ ద్వారా మనసా సేవ యొక్క సహజ అనుభవీ భవ

అంతర్ముఖులుగా అయి శుద్ధ సంకల్పాల శక్తి యొక్క స్టాక్ ను జమ చేసుకోండి. ఈ శుద్ధ సంకల్పాల శక్తి సహజముగానే మీ వ్యర్థ సంకల్పాలను సమాప్తము చేస్తుంది మరియు ఇతరులను కూడా శుభ భావన, శుభ కామన స్వరూపము ద్వారా పరివర్తన చేయగలుగుతారు. శుద్ధ సంకల్పాల స్టాక్ ను జమ చేసుకోవడానికి మురళి యొక్క ప్రతి పాయింటును వినడముతో పాటుగా శక్తి రూపములో దానిని ప్రతి సమయము కార్యములో వినియోగించండి. ఎంతగా శుద్ధ సంకల్పాల శక్తి యొక్క స్టాక్ జమ అవుతుందో, అంతగా మనసా సేవ యొక్క సహజ అనుభవీలుగా అవుతూ ఉంటారు.

స్లోగన్:-
మనసు ద్వారా సదా కొరకు ఈర్ష్యా, ద్వేషాలకు వీడ్కోలు ఇవ్వండి, అప్పుడు విజయము ప్రాప్తిస్తుంది.

అవ్యక్త సూచనలు - స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగము చెయ్యండి

ఎంతగా ఇప్పుడు తనువు, మనసు, ధనము మరియు సమయాన్ని పెడతారో, అంతకన్నా కూడా మనసా శక్తుల ద్వారా సేవ చెయ్యటం వలన చాలా కొద్ది సమయములోనే సఫలత ఎక్కువగా లభిస్తుంది. ఇప్పుడు ఏదైతే మీ విషయములో అప్పుడప్పుడు శ్రమించాల్సి వస్తుందో - మీ స్వభావాన్ని పరివర్తన చేసుకోవడానికి లేక సంగఠనలో ఉండటానికి లేదా సేవలో అప్పుడప్పుడు సఫలత తక్కువగా లభించటము చూసి నిరాశకు లోనవ్వటము, ఇవన్నీ సమాప్తమైపోతాయి.