12-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీకు డ్రామా ఆట గురించి తెలుసు, అందుకే కృతజ్ఞతలను తెలపవలసిన విషయము కూడా లేదు’’

ప్రశ్న:-
సర్వీసబుల్ పిల్లల్లో ఏ అలవాటు అసలు ఉండకూడదు?

జవాబు:-
యాచించే (అడిగే) అలవాటు. మీరు తండ్రిని ఆశీర్వాదాలు లేక కృప మొదలైనవి అడగవలసిన అవసరం లేదు. మీరు ఎవ్వరినీ ధనము కూడా అడగకూడదు. అడగడం కన్నా మరణించడం మేలు. మీకు తెలుసు, డ్రామా అనుసారముగా కల్పక్రితము ఎవరైతే బీజాన్ని నాటి ఉంటారో వారే నాటుతారు, ఎవరికైతే తమ భవిష్య పదవిని ఉన్నతముగా తయారుచేసుకునేది ఉంటుందో, వారు తప్పకుండా సహయోగిగా అవుతారు. మీ పని సేవ చేయడము. మీరు ఎవ్వరినీ ఏమీ అడగకూడదు. భక్తిలో అడగడం జరుగుతుంది, జ్ఞానములో కాదు.

పాట:-
నాకు ఆధారాన్ని ఇచ్చేవారు... (ముజ్ కో సహారా దేనేవాలే...)

ఓంశాంతి
తండ్రి-టీచరు-గురువు పట్ల పిల్లలకు లోపల నుండి కృతజ్ఞత అనే మాట వెలువడకూడదు ఎందుకంటే ఈ ఆట తయారై ఉందని పిల్లలకు తెలుసు. కృతజ్ఞతలు తెలపడం మొదలైనవాటి విషయమేమీ లేదు. ఇది కూడా పిల్లలకు డ్రామానుసారముగా తెలుసు. డ్రామా అనే పదము కూడా పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది. ఆట అనే పదము పలకగానే మొత్తం ఆట అంతా మీ బుద్ధిలోకి వచ్చేస్తుంది అనగా మీకు మీరే స్వదర్శన చక్రధారులుగా అయిపోతారు. మూడు లోకాలు కూడా మీ బుద్ధిలోకి వచ్చేస్తాయి. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము. ఇప్పుడు ఆట పూర్తవుతుందని కూడా మీకు తెలుసు. తండ్రి వచ్చి మిమ్మల్ని త్రికాలదర్శులుగా తయారుచేస్తారు. మూడు కాలాలు, మూడు లోకాలు, ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. కాలము అని సమయాన్ని అంటారు. ఈ విషయాలన్నీ నోట్ చేసుకోకుండా గుర్తుండవు. పిల్లలైన మీరైతే చాలా పాయింట్లు మర్చిపోతారు. డ్రామా యొక్క వ్యవధి కూడా మీకు తెలుసు. మీరు త్రినేత్రులుగా, త్రికాలదర్శులుగా అవుతారు, జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభిస్తుంది. అన్నిటికన్నా గొప్ప విషయము ఏమిటంటే మీరు ఆస్తికులుగా అవుతారు, లేదంటే ఇంతవరకు అనాథలుగా ఉన్నారు. ఈ జ్ఞానము పిల్లలైన మీకు లభిస్తుంది. విద్యార్థి బుద్ధిలో సదా జ్ఞాన మంథనము జరుగుతుంది. ఇది కూడా జ్ఞానము కదా. ఉన్నతోన్నతమైన తండ్రియే డ్రామానుసారముగా జ్ఞానాన్ని ఇస్తారు. డ్రామా అనే పదము కూడా మీ నోటి నుండే వెలువడగలదు. అది కూడా ఏ పిల్లలైతే సేవలో తత్పరులై ఉంటారో, వారి నోటి నుండే వెలువడుతుంది. మనము అనాథలుగా ఉండేవారమని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు అనంతమైన తండ్రి అయిన ఆ నాథుడు లభించారు కావున ఆ నాథుడికి చెందినవారిగా అయ్యాము. ఇదివరకు మీరు అనంతమైన అనాథలుగా ఉండేవారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు, ఇటువంటి సుఖాన్ని ఇచ్చే తండ్రి ఇంకెవ్వరూ ఉండరు. కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము, ఇవన్నీ పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి. కానీ ఇతరులకు కూడా యథార్థ రీతిలో అర్థం చేయించి, ఈ ఈశ్వరీయ వ్యాపారములో నిమగ్నమవ్వాలి. ప్రతి ఒక్కరి పరిస్థితులు ఎవరివి వారివే ఉంటాయి. అర్థం చేయించడం కూడా ఎవరైతే స్మృతియాత్రలో ఉంటారో వారే అర్థం చేయించగలరు. స్మృతి ద్వారా బలము లభిస్తుంది కదా. తండ్రి పదును గల ఖడ్గము వంటివారు. పిల్లలైన మీరు పదును నింపుకోవాలి. మీరు యోగబలము ద్వారా విశ్వ రాజ్యాధికారాన్ని పొందుతారు. యోగము ద్వారా బలము లభిస్తుంది, జ్ఞానము ద్వారా కాదు. జ్ఞానము సంపాదనకు ఆధారము అని పిల్లలకు అర్థం చేయించారు. యోగాన్ని బలము అని అంటారు. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు యోగము మంచిదా లేక జ్ఞానము మంచిదా? యోగమే ప్రసిద్ధమైనది. యోగము అనగా తండ్రి స్మృతి. తండ్రి అంటారు, ఈ స్మృతి ద్వారానే మీ పాపాలు కట్ అవుతాయి. దీనికే తండ్రి ప్రాధాన్యతను ఇస్తారు. జ్ఞానము అయితే సహజము. భగవానువాచ - నేను మీకు సహజ జ్ఞానాన్ని వినిపిస్తాను. 84 జన్మల చక్రము యొక్క జ్ఞానాన్ని వినిపిస్తాను. అందులో అన్నీ వచ్చేస్తాయి. చరిత్ర-భౌగోళికాలు ఉన్నాయి కదా. జ్ఞానము మరియు యోగము, రెండూ క్షణము యొక్క విషయాలు. నేను ఆత్మను, నేను తండ్రిని స్మృతి చేయాలి, అంతే. ఇందులో శ్రమ ఉంది. స్మృతియాత్రలో ఉండడం ద్వారా శరీరము యొక్క విస్మృతి జరుగుతూ ఉంటుంది. ఒక గంట అయినా ఇలా పూర్తిగా అశరీరిగా అయి కూర్చుంటే ఎంత పావనముగా అయిపోతారు. మనుష్యులు రాత్రివేళలో కొందరు 6 గంటలు, కొందరు 8 గంటలు నిద్రించినప్పుడు అశరీరిగా అయిపోతారు కదా. ఆ సమయములో ఏ వికర్మలు జరగవు. ఆత్మ అలసిపోయి నిద్రపోతుంది. అలాగని పాపాలేవి వినాశనమవుతాయని కాదు. అది నిద్ర. వికర్మలేవీ జరగవు. నిద్రపోకపోతే పాపాలే చేస్తూ ఉంటారు. కావున నిద్ర కూడా ఒక రక్షణ. ఆత్మ రోజంతా సేవ చేసి ఇలా అంటుంది - నేనిప్పుడు నిద్రపోతాను, అశరీరిగా అయిపోతాను అని. మీరు శరీరములో ఉంటూ అశరీరిగా అవ్వాలి. ఆత్మనైన నేను ఈ శరీరము నుండి అతీతమైన శాంతి స్వరూపాన్ని. ఆత్మ మహిమను ఎప్పుడూ విని ఉండరు. ఆత్మ సత్ చిత్ ఆనంద స్వరూపము. పరమాత్ముని మహిమలో - వారు సత్యము, చైతన్యము, సుఖ-శాంతుల సాగరుడు అని పాడుతారు. ఇప్పుడు మిమ్మల్ని మాస్టర్ అని అంటారు, పిల్లలను మాస్టర్ అని కూడా అంటారు. తండ్రి యుక్తులు కూడా తెలియజేస్తూ ఉంటారు. అలాగని రోజంతా నిద్రించమని కూడా కాదు. అలా కాదు. మీరు స్మృతిలో ఉంటూ పాపాలను వినాశనము చేసుకోవాలి. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయాలి. అలాగని తండ్రి మన పట్ల దయ లేక కృప చూపిస్తారని కూడా కాదు. అలా కాదు. దయార్ద్ర హృదయుడైన చక్రవర్తి అన్నది వారి మహిమ. తమోప్రధానము నుండి సతోప్రధానముగా చేయడము - ఇది కూడా వారి పాత్ర. భక్తులు మహిమను పాడుతారు, మీరు కేవలం మహిమను పాడకూడదు. ఈ పాటలు మొదలైనవి కూడా ఇక రోజురోజుకు నిలిపివేయబడుతూ ఉంటాయి. స్కూల్ లో ఎప్పుడైనా పాటలు ఉంటాయా ఏమిటి? పిల్లలు శాంతిగా కూర్చొని ఉంటారు. టీచర్ వచ్చినప్పుడు లేచి నిలబడతారు, తర్వాత కూర్చుంటారు. ఈ తండ్రి అంటారు - నాకైతే చదివించే పాత్ర లభించింది కావున చదివించాల్సిందే. పిల్లలైన మీరు లేచి నిలబడవలసిన అవసరము లేదు. ఆత్మ కూర్చొని వినాలి. మీ విషయము ప్రపంచానికి అతీతమైనది. మీరు లేచి నిలబడండి అని పిల్లలని అంటారా ఏమిటి. అనరు. అది భక్తి మార్గములో చేస్తారు, ఇక్కడ కాదు. తండ్రి అయితే స్వయంగా లేచి నమస్తే చెప్తారు. స్కూల్ కు ఒకవేళ పిల్లలు ఆలస్యముగా వస్తే, టీచర్, అయితే రూల్ పెడతారు లేక బయట నిలబెడతారు, అందుకే సమయానికి చేరుకోవాలనే భయముంటుంది. ఇక్కడైతే భయపడే విషయమేమీ లేదు. తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు - మురళీలు లభిస్తూ ఉంటాయి, వాటిని రెగ్యులర్ గా చదువుకోవాలి. మురళీని చదువుకున్నట్లయితే మీకు ప్రెజెంట్ మార్క్ (హాజరు) పడుతుంది లేకపోతే ఆబ్సెంట్ పడుతుంది ఎందుకంటే తండ్రి అంటారు - నేను మీకు గుహ్యాతి-గుహ్యమైన విషయాలను వినిపిస్తాను, మీరు ఒకవేళ మురళీని మిస్ చేస్తే ఆ పాయింట్లు మిస్ అయిపోతాయి. ఇవి కొత్త విషయాలు, వీటి గురించి ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. మీ చిత్రాలను చూస్తూనే ఆశ్చర్యపోతారు. ఇవి ఏ శాస్త్రాలలో కూడా లేవు. భగవంతుడు ఈ చిత్రాలను తయారుచేశారు. మీ ఈ చిత్రశాల కొత్తది. బ్రాహ్మణ కులానికి చెందినవారు, ఎవరైతే దేవతలుగా అవ్వబోతున్నారో, వారి బుద్ధిలోనే కూర్చుంటుంది. వారే అంటారు - ఇది రైట్, కల్పక్రితము కూడా మేము చదువుకున్నాము, తప్పకుండా భగవంతుడు చదివిస్తారు.

భక్తి మార్గములోని శాస్త్రాలలో మొదటి నంబరులో గీతయే ఉంది, ఎందుకంటే మొదటి ధర్మము ఇదే. మళ్ళీ అర్ధకల్పము తర్వాత, అది కూడా చాలా కాలము తర్వాత, ఇతర శాస్త్రాలు తయారవుతాయి. మొదట ఇబ్రహీమ్ వచ్చారు, అప్పుడు వారు ఒక్కరే ఉన్నారు, ఆ తర్వాత ఒకరి నుండి ఇద్దరు, ఇద్దరి నుండి నలుగురు అయ్యారు. ధర్మము వృద్ధి చెందుతూ-చెందుతూ లక్ష-లక్షన్నర మంది అయినప్పుడు శాస్త్రాలు మొదలైనవి తయారవుతాయి. వారివి కూడా సగం సమయము తర్వాతనే తయారవుతూ ఉండవచ్చు, లెక్క తీయడం జరుగుతుంది కదా. తండ్రి నుండి మనకు వారసత్వము లభిస్తుందని పిల్లలకైతే చాలా సంతోషము ఉండాలి. తండ్రి మనకు సృష్టి చక్రము యొక్క జ్ఞానమంతటినీ అర్థం చేయిస్తారని మీకు తెలుసు. ఇది అనంతమైన చరిత్ర-భౌగోళికము. ఇక్కడ ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు అర్థం చేయించడం జరుగుతుందని అందరికీ చెప్పండి, ఇది ఇతరులెవ్వరూ నేర్పించలేరు. ప్రపంచ చిత్ర పటాన్ని (మ్యాప్ ను) తయారుచేస్తారు. కానీ అందులో ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఎప్పుడు ఉండేది, ఎంత సమయము నడిచింది అనేది ఎక్కడ చూపించారు. ప్రపంచమైతే ఒక్కటే. వారు భారత్ లోనే రాజ్యము చేసి వెళ్ళారు, ఇప్పుడు వారు లేరు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. వారైతే కల్పము ఆయుష్షును లక్షల సంవత్సరాలని ఎక్కువ చేసి చెప్తారు. మధురాతి-మధురమైన పిల్లలైన మీకు ఎక్కువ కష్టమేమీ ఇవ్వను. తండ్రి అంటారు, పావనముగా అవ్వాలి. పావనముగా అయ్యేందుకు మీరు భక్తి మార్గములో ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు. ఎదురుదెబ్బలు తింటూ-తింటూ 2500 సంవత్సరాలు గడిచిపోయాయని ఇప్పుడు అర్థం చేసుకుంటారు. రాజ్య భాగ్యాన్ని మళ్ళీ ఇవ్వడానికి ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చారు. మీకు ఇదే గుర్తుంది. ప్రపంచము పాతది నుండి కొత్తదిగా మరియు కొత్తది నుండి పాతదిగా తప్పకుండా అవుతుంది. ఇప్పుడు మీరు పాత భారత్ కు యజమానులు కదా. మళ్ళీ కొత్తదానికి యజమానులుగా అవుతారు. ఒకవైపు భారత్ యొక్క మహిమను చాలా పాడుతూ ఉంటారు, మరోవైపు మళ్ళీ చాలా నింద చేస్తూ ఉంటారు. ఆ పాటలు కూడా మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏమేమి జరుగుతుంది అనేది మీరు అర్థం చేయిస్తారు. ఈ రెండు పాటలు కూడా వినిపించాలి. రామ రాజ్యము ఎక్కడ, ఇది ఎక్కడ... అనేది మీరు తెలియజేయవచ్చు.

తండ్రి పేదల పెన్నిధి. పేదవారి కుమార్తెలే బాబా దగ్గరకు వస్తారు. షావుకారులకైతే తమ నషా ఉంటుంది. కల్పక్రితము ఎవరైతే వచ్చి ఉంటారో, వారే వస్తారు. చింతించవలసిన విషయమేమీ లేదు. శివబాబాకు ఎప్పుడూ ఎటువంటి చింత ఉండదు, దాదాకు ఉంటుంది. నేను నంబరువన్ పావనముగా అవ్వాలని, వీరికి స్వయం యొక్క చింత కూడా ఉంది. ఇందులో గుప్త పురుషార్థము ఉంది. చార్ట్ పెట్టడం ద్వారా వీరి పురుషార్థము ఎక్కువగా ఉందని అర్థమవుతుంది. డైరీ వ్రాయమని తండ్రి ఎప్పుడూ అర్థం చేయిస్తూ ఉంటారు. చార్ట్ వ్రాయడం ద్వారా చాలా బాగుపడ్డాము అని చాలామంది పిల్లలు వ్రాస్తారు కూడా. ఈ యుక్తి చాలా బాగుంది కావున అందరూ చేయాలి. డైరీ పెట్టడం ద్వారా మీకు చాలా లాభము ఉంటుంది. డైరీ పెట్టడం అనగా తండ్రిని స్మృతి చేయడము. అందులో తండ్రి స్మృతి గురించి వ్రాయాలి. డైరీ కూడా సహాయము చేస్తుంది, పురుషార్థము జరుగుతుంది. మీరు నోట్ చేసుకోవడం కోసమని ఎన్ని లక్షల, కోట్ల డైరీలు తయారవుతాయి. నోట్ చేసుకోవడమే అన్నిటికన్నా ముఖ్యమైన విషయము. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. అప్పటికప్పుడే డైరీలో వ్రాసుకోవాలి. రాత్రికి పూర్తి లెక్కాపత్రము వ్రాయాలి. అప్పుడు నాకు నష్టము కలుగుతుందే అని తెలుస్తుంది, ఎందుకంటే జన్మ-జన్మాంతరాల వికర్మలను భస్మము చేసుకోవాలి.

తమపై తాము దయ లేక కృప చూపించుకోవాలి అని తండ్రి మార్గము తెలియజేస్తారు. టీచర్ అయితే చదివిస్తారు, కానీ ఆశీర్వదించరు. ఆశీర్వాదాలు, కృప, దయ మొదలైనవి అడగడం కన్నా మరణించడం మేలు. ఎవ్వరినీ ధనము కూడా అడగకూడదు. పిల్లలకు ఇది పూర్తిగా నిషేధించబడింది. తండ్రి అంటారు, డ్రామానుసారముగా ఎవరైతే కల్పక్రితము బీజాన్ని నాటారో, వారసత్వాన్ని పొందారో, వారు తమంతట తామే చేసుకుంటారు. మీరు ఏ పని కోసమూ అడగకండి. చేయకపోతే వారే పొందరు. మనుష్యులు దాన-పుణ్యాలు చేస్తారు కావున రిటర్న్ లో లభిస్తుంది కదా. రాజుల ఇళ్ళల్లో లేక షావుకారుల వద్ద జన్మ జరుగుతుంది. ఎవరైతే చేసేది ఉంటుందో, వారు తమంతట తామే చేస్తారు, మీరు అడగకూడదు. కల్పక్రితము ఎవరు ఎంత చేసారో, డ్రామా వారి ద్వారా అలా చేయిస్తుంది. అడగవలసిన అవసరమేముంది. బాబా అయితే చెప్తూ ఉంటారు, సేవ కోసం హుండీ నిండుతూనే ఉంటుంది. ధనము ఇవ్వమని నేను పిల్లలకు చెప్పను. భక్తి మార్గములోని విషయాలు జ్ఞాన మార్గములో ఉండవు. ఎవరైతే కల్పక్రితము సహాయము చేసారో, వారు చేస్తూనే ఉంటారు, మీ అంతట మీరు ఎప్పుడూ అడగకూడదు. బాబా అంటారు, పిల్లలూ - మీరు చందాలు వసూలు చేయకూడదు, అది సన్యాసులు చేస్తారు. భక్తి మార్గములో కొద్దిగా ఇచ్చినా కూడా దానికి రిటర్న్ లో ఒక జన్మ కొరకు లభిస్తుంది. ఇది జన్మ-జన్మాంతరాల కోసం ఉంటుంది. జన్మ-జన్మాంతరాల కోసమైతే అంతా ఇచ్చేయడం మంచిదే కదా. వీరి పేరు అయితే భోళా భండారి. మీరు పురుషార్థము చేసినట్లయితే విజయమాలలో కూర్చబడతారు. ఎవరి భండారా నుండి తింటున్నామో ఆ భాండాగారము ఎప్పుడూ నిండుగా ఉంటుంది, కష్టాలు, దుఃఖాలు దూరముగా ఉంటాయి. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువు జరగదు. ఇక్కడ మనుష్యులు మృత్యువు గురించి ఎంతగా భయపడతారు. కొద్దిగా ఏదైనా జరిగినా, మృత్యువే గుర్తుకొస్తుంది. అక్కడ ఈ ఆలోచనే ఉండదు, మీరు అమరపురిలోకి వెళ్తారు. ఇది ఛీ-ఛీ మృత్యులోకము. భారత్ యే అమరలోకముగా ఉండేది, ఇప్పుడు మృత్యులోకముగా ఉంది.

మీ అర్ధకల్పము చాలా ఛీ-ఛీగా గడిచింది. కిందకు పడిపోతూనే వచ్చారు. జగన్నాథపురిలో చాలా అశుద్ధమైన చిత్రాలు ఉన్నాయి. బాబా అయితే అనుభవజ్ఞులు కదా, నలువైపులా తిరిగి వచ్చినవారు. వీరు తెల్లగా ఉన్నవారి నుండి నల్లగా అయ్యారు. పల్లెలో ఉండేవారు. వాస్తవానికి ఈ భారత్ అంతా ఒక పల్లె వంటిది. మీరు పల్లెటూరి పిల్లలు. మేము విశ్వానికి యజమానులుగా అవుతామని ఇప్పుడు మీరు భావిస్తారు. మేమైతే బొంబాయిలో నివసించేవారము అని భావించకండి. బొంబాయి కూడా స్వర్గము ముందు ఏ పాటిది! అసలు ఏమీ కాదు. ఒక రాయి అంత కూడా కాదు. పల్లెటూరి పిల్లలైన మనము అనాథలుగా అయిపోయాము, ఇప్పుడు మళ్ళీ మనము స్వర్గానికి యజమానులుగా అవుతున్నాము కావున సంతోషముండాలి. దాని పేరే స్వర్గము. మహళ్ళలో ఎన్ని వజ్ర-వైఢూర్యాలు పొదగబడి ఉంటాయి. సోమనాథ మందిరమే ఎన్ని వజ్ర-వైఢూర్యాలతో నిండి ఉండేది. మొట్టమొదట శివుని మందిరాన్నే తయారుచేస్తారు. మీరు ఎంత షావుకారులుగా ఉండేవారు. ఇప్పుడైతే భారత్ పల్లెలా ఉంది. సత్యయుగములో చాలా సంపన్నముగా ఉండేది. ఈ విషయాలు ప్రపంచములో మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియవు. మీరు అంటారు - నిన్న మేము చక్రవర్తులుగా ఉండేవారము, నేడు ఫకీరులుగా ఉన్నాము, మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతాము. పిల్లలైన మీరు మీ భాగ్యానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మనము పదమాపదమ భాగ్యశాలులము. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. వికర్మల నుండి రక్షించుకునేందుకు ఈ శరీరములో ఉంటూ అశరీరిగా అయ్యే పురుషార్థము చేయాలి. స్మృతియాత్ర ఏ విధముగా ఉండాలంటే, శరీర విస్మృతి జరగాలి.

2. జ్ఞాన మంథనము చేసి ఆస్తికులుగా అవ్వాలి. మురళీని ఎప్పుడూ మిస్ చేయకూడదు. మీ ఉన్నతి కోసము డైరీలో స్మృతి చార్ట్ ను నోట్ చేయాలి.

వరదానము:-
ఆత్మిక శక్తిని ప్రతి కర్మలోనూ ఉపయోగించే యుక్తియుక్త, జీవన్ముక్త భవ

ఈ బ్రాహ్మణ జీవితము యొక్క విశేషతయే ఆత్మికత. ఆత్మికత యొక్క శక్తితోనే స్వయాన్ని లేక సర్వులను పరివర్తన చేయగలరు. ఈ శక్తితో అనేక రకాల దైహిక బంధనాల నుండి విముక్తి లభిస్తుంది. కానీ యుక్తియుక్తులుగా అయి, ప్రతి కర్మలోనూ లూజ్ అయ్యేందుకు బదులుగా ఆత్మిక శక్తిని ఉపయోగించండి. మనసా, వాచా మరియు కర్మణా, మూడింటిలోనూ ఒకేసారి ఆత్మికతా శక్తిని అనుభవం చేయండి. ఎవరైతే మూడింటిలోనూ యుక్తియుక్తులో, వారే జీవన్ముక్తులు.

స్లోగన్:-
సత్యత యొక్క విశేషత ద్వారా సంతోషాన్ని మరియు శక్తిని అనుభూతి చేస్తూ వెళ్ళండి.

అవ్యక్త సూచనలు - అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి

ఏయే పరిస్థితులైతే వస్తున్నాయో మరియు రాబోతున్నాయో, వాటి కోసం విదేహీ స్థితి యొక్క అభ్యాసము చాలా అవసరము, అందుకే మిగిలిన విషయాలన్నింటినీ పక్కన పెట్టి - ఇదైతే అవ్వదు, అదైతే అవ్వదు, ఏమవుతుందో... ఈ ప్రశ్నలను వదిలేయండి, ఇప్పుడు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. విదేహీ పిల్లలపై ఎటువంటి పరిస్థితి గాని లేక ఎటువంటి అలజడి గాని ప్రభావాన్ని చూపలేదు.