14-05-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు, మీరు
పాత ప్రపంచము నుండి సంబంధాన్ని తెంచివేయాలి, ఎందుకంటే ఈ పాత ప్రపంచము ఇప్పుడు
అంతమవ్వనున్నది’’
ప్రశ్న:-
సంగమము
యొక్క ఏ విశేషత మొత్తము కల్పమంతటిలో అతీతమైనది?
జవాబు:-
చదువుకునేది
ఇక్కడ, ప్రారబ్ధాన్ని పొందేది భవిష్యత్తులో - ఇది సంగమములోని విశేషత మాత్రమే. మరుసటి
జన్మలో ప్రారబ్ధము లభించేటువంటి చదువు మొత్తము కల్పమంతటిలోనూ చదివించడము జరగదు.
ఇప్పుడు పిల్లలైన మీరు అమరలోకము కోసం మృత్యులోకములో చదువుకుంటున్నారు. ఇంకెవ్వరూ
మరుసటి జన్మ కోసమని చదవరు.
పాట:-
దూరదేశములో
నివసించేవారు...
ఓంశాంతి
దూరదేశములో నివసించేవారు ఎవరు? ఇది ఎవ్వరికీ తెలియదు. వారు పరాయి దేశములోకి
వచ్చారంటే వారికి తన దేశమంటూ ఏది లేదా ఏమిటి? వారు వారి దేశములోకి రారు. ఈ రావణ
రాజ్యము వారికి పరాయి దేశము కదా. శివబాబా తన దేశములోకి రారా ఏమిటి? అచ్ఛా, రావణుడికి
పరాయి దేశము ఏది మరియు స్వదేశము ఏది? శివబాబాకు తన దేశము ఏది, పరాయి దేశము ఏది? బాబా
పరాయి దేశములోకి వస్తారంటే, మరి వారి స్వదేశము ఏది? బాబా తన దేశాన్ని స్థాపన
చేయడానికి వస్తారు, కానీ వారు తాను స్థాపించిన దేశములోకి స్వయం వస్తారా? (ఒకరిద్దరు
తమ అభిప్రాయాలు వినిపించారు) అచ్ఛా! ఈ విషయముపై అందరూ విచార సాగర మంథనము చేయండి. ఇది
బాగా అర్థం చేసుకోవలసిన విషయము. రావణుడి యొక్క పరాయి దేశము ఏది అనేది చెప్పడం చాలా
సహజము. రామ రాజ్యములోకి రావణుడు ఎప్పుడూ రాడు. బాబాకు రావణుడి దేశములోకి రావలసి
వస్తుంది, ఎందుకంటే రావణ రాజ్యాన్ని పరివర్తన చేయవలసి ఉంటుంది. ఇది సంగమయుగము. బాబా
సత్యయుగములోకి కూడా రారు, కలియుగములోకి కూడా రారు. సంగమయుగములో వస్తారు. ఇది రాముడి
దేశము కూడా, రావణుడి దేశము కూడా. ఇటు తీరము రాముడిది, అటు తీరము రావణుడిది. ఇది
సంగమము కదా. ఇప్పుడు పిల్లలైన మీరు సంగమములో ఉన్నారు. ఇటువైపు లేరు, అటువైపు లేరు.
స్వయాన్ని సంగమములో ఉన్నట్లుగా భావించాలి. మనకు అటువైపుతో సంబంధము లేదు. బుద్ధితో
పాత ప్రపంచము నుండి సంబంధాన్ని తెంచవలసి ఉంటుంది. మీరు ఉండేది అయితే ఇక్కడే. కానీ ఈ
పాత ప్రపంచము అంతమవ్వనున్నదని బుద్ధి ద్వారా తెలుసుకున్నారు. ఇప్పుడు నేను సంగమములో
ఉన్నాను అని ఆత్మ అంటుంది. తండ్రి వచ్చి ఉన్నారు, వారిని నావికుడు అని కూడా అంటారు.
ఇప్పుడు మనము వెళ్తున్నాము. ఎలా? యోగము ద్వారా. యోగము కోసం కూడా జ్ఞానము ఉంది. అలాగే
జ్ఞానము కోసం కూడా జ్ఞానము ఉంది. యోగము కోసం ఏమని అర్థం చేయించడం జరుగుతుందంటే -
స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. ఇది కూడా జ్ఞానమే కదా.
జ్ఞానము అనగా వివరణ. తండ్రి డైరెక్షన్లు ఇవ్వడానికి వచ్చారు. స్వయాన్ని ఆత్మగా
భావించండి అని చెప్తున్నారు. ఆత్మయే 84 జన్మలు తీసుకుంటుంది. తండ్రి కూర్చుని
పిల్లలకే విస్తారముగా అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ రావణ రాజ్యము అంతమవ్వనున్నది.
ఇక్కడ కర్మ బంధనాలు ఉన్నాయి, అక్కడ కర్మ సంబంధాలు ఉంటాయి. బంధనము అనగా దుఃఖానికి
పేరు. సంబంధము అనగా సుఖానికి పేరు. ఇప్పుడు కర్మ బంధనాలను తెంచివేయాలి. మనము ఈ
సమయములో బ్రాహ్మణ సంబంధములో ఉన్నామని, తర్వాత దైవీ సంబంధములోకి వెళ్తామని బుద్ధిలో
ఉంది. బ్రాహ్మణ సంబంధము ఈ ఒక్క జన్మలోనే ఉంటుంది. ఆ తర్వాత 8 మరియు 12 జన్మలు దైవీ
సంబంధములో ఉంటాయి. ఈ జ్ఞానము బుద్ధిలో ఉంది, అందుకే కలియుగీ ఛీ-ఛీ కర్మ బంధనాల పట్ల
అయిష్టం కలుగుతుంది. ఈ ప్రపంచము యొక్క కర్మ బంధనాలలో ఇప్పుడు ఇక ఉండకూడదు
అనిపిస్తుంది. ఇవన్నీ ఆసురీ కర్మ బంధనాలు అని తెలియపరిచే బుద్ధి లభిస్తుంది. మనము
కూడా గుప్తముగా ఒక యాత్రలో ఉన్నాము. ఈ తండ్రి యాత్రను నేర్పించారు, ఇక తర్వాత ఈ
కర్మ బంధనాల నుండి అతీతమై మనము కర్మాతీతులుగా అయిపోతాము. ఈ కర్మ బంధనాలు ఇప్పుడు
తెగిపోవాల్సిందే. పవిత్రముగా అయి, చక్రాన్ని అర్థం చేసుకుని, చక్రవర్తీ రాజుగా
అయ్యేందుకు మనము తండ్రిని స్మృతి చేస్తాము. మనము చదువుకుంటున్నాము, మరి దానికి
లక్ష్యము-ఉద్దేశ్యము, ప్రారబ్ధము కూడా కావాలి కదా. మనల్ని చదివించేవారు అనంతమైన
తండ్రి అని మీకు తెలుసు. అనంతమైన తండ్రి మనల్ని 5000 సంవత్సరాల క్రితం చదివించారు.
ఇది ఒక డ్రామా కదా. ఎవరినైతే కల్పపూర్వము చదివించారో వారినే చదివిస్తారు. వస్తూ
ఉంటారు, వృద్ధి చెందుతూ ఉంటారు. అందరూ సత్యయుగములోకి రారు. మిగిలినవారంతా తిరిగి
ఇంటికి వెళ్ళిపోతారు. ఇవతలివైపు నరకము ఉంది, అవతలివైపు స్వర్గము ఉంది. ఆ చదువులోనైతే
- మేము ఇక్కడ చదువుకుంటాము, తిరిగి ప్రారబ్ధాన్ని కూడా ఇక్కడే పొందుతామని భావిస్తారు.
ఇక్కడ మనము చదువుకునేది సంగమయుగములో, దీని ప్రారబ్ధము మనకు కొత్త ప్రపంచములో
లభిస్తుంది. ఇది కొత్త విషయము. మీకు దీనికి ప్రారబ్ధము వచ్చే జన్మలో లభిస్తుంది అని
ప్రపంచములో ఈ విధంగా ఎవ్వరూ అనరు. ఈ జన్మలో చేసిన పురుషార్థానికి వచ్చే జన్మలో
ప్రారబ్ధాన్ని పొందడం - ఇలా కేవలం ఈ సంగమయుగములోనే జరుగుతుంది. తండ్రి కూడా వచ్చేది
సంగమయుగములోనే. మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు చదువుకుంటారు. జ్ఞానసాగరుడైన
భగవంతుడు ఒకే ఒక్కసారి వచ్చి కొత్త ప్రపంచమైన అమరపురి కోసం చదివిస్తారు. ఇప్పుడు ఇది
కలియుగము, మృత్యులోకము. మనము సత్యయుగము కోసం చదువుకుంటాము, నరకవాసుల నుండి
స్వర్గవాసులుగా అయ్యేందుకు చదువుకుంటాము. ఇది పరాయి దేశము, అది మన దేశము. ఆ మన
దేశములోకి బాబా రావాల్సిన అవసరము లేదు. ఆ దేశము పిల్లల కోసమే ఉంది. ఆ సత్యయుగములోకి
రావణుడు రాడు, రావణుడు మాయమైపోతాడు. మళ్ళీ ద్వాపరములో వస్తాడు. కావున తండ్రి కూడా
మాయమైపోతారు. సత్యయుగములో ఎవరికీ బాబా గురించి తెలియదు. కావున వారిని అక్కడ స్మృతి
ఎందుకు చేస్తారు. సుఖ ప్రారబ్ధము పూర్తయితే మళ్ళీ రావణ రాజ్యము ప్రారంభమవుతుంది,
దానిని పరాయి దేశము అని అంటారు.
మనము సంగమయుగములో ఉన్నామని, మనకు దారిని చూపించే తండ్రి లభించారని ఇప్పుడు మీరు
అర్థం చేసుకున్నారు. మిగిలినవారంతా ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. ఎవరైతే బాగా అలసిపోయి
ఉంటారో, ఎవరైతే కల్పపూర్వము ఈ దారిలో నడిచారో, వారు ఇక్కడికి వస్తూ ఉంటారు. పండాలైన
మీరు అందరికీ దారిని తెలియజేస్తూ ఉంటారు. ఇది ఆత్మిక యాత్రకు సంబంధించిన దారి. ఈ
దారిలో మీరు నేరుగా సుఖధామానికి వెళ్ళిపోతారు. పండాలైన మీరు పాండవ సాంప్రదాయానికి
చెందినవారు. పాండవ రాజ్యము అని అనరు. రాజ్యము పాండవులకూ లేదు, కౌరవులకూ లేదు.
ఇరువురికీ కిరీటము లేదు. భక్తి మార్గములో ఇరువురికీ కిరీటాన్ని చూపించారు. ఒకవేళ
కిరీటము చూపించినా కౌరవులకు ప్రకాశ కిరీటాన్ని చూపించరు. పాండవులకు కూడా ప్రకాశ
కిరీటాన్ని చూపించడానికి వీల్లేదు, ఎందుకంటే వారు పురుషార్థీలు. నడుస్తూ, నడుస్తూ
పడిపోతూ ఉంటారు కదా, ఇక ఎవరికి ఇవ్వాలి, అందుకే ఈ గుర్తులన్నీ విష్ణువుకు చూపించారు
ఎందుకంటే వారు పవిత్రమైనవారు. సత్యయుగములో అందరూ పవిత్రముగా, సంపూర్ణ నిర్వికారిగా
ఉంటారు. పవిత్రతకు గుర్తు అయిన ప్రకాశ కిరీటము ఉంటుంది. ఈ సమయములో ఎవరూ పవిత్రముగా
లేరు. సన్యాసులు - మేము పవిత్రులము అని చెప్పుకుంటారు, కానీ ప్రపంచమైతే పవిత్రముగా
లేదు కదా. కనుక జన్మనైతే వికారీ ప్రపంచములోనే తీసుకుంటారు. ఇది రావణుడి పతితపురి.
పావన రాజ్యము అని సత్యయుగీ కొత్త ప్రపంచాన్ని అంటారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని
తోట యజమాని అయిన తండ్రి ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేస్తారు. వారు పతిత-పావనుడు
కూడా, నావికుడు కూడా, తోట యజమాని కూడా. తోట యజమాని ముళ్ళ ప్రపంచములోకి వచ్చారు. మీ
అందరి కమాండర్ ఒక్కరే. యాదవుల కమాండర్ ఇన్ చీఫ్ అని శంకరుడిని అనవచ్చా? వాస్తవానికి
అతనేమీ వినాశనము చేయించరు. సమయము వచ్చినప్పుడు యుద్ధము ప్రారంభమవుతుంది. శంకరుని
ప్రేరణ ద్వారా మిసైల్స్ మొదలైనవి తయారవుతాయని అంటారు. ఇలాంటి కథలన్నింటినీ వారు
కూర్చుని తయారుచేసారు. పాత ప్రపంచము తప్పకుండా అంతమవ్వాల్సిందే. ఇల్లు పాతబడితే
కూలిపోతుంది, మనుష్యులు చనిపోతారు. అలాగే ఈ పాత ప్రపంచము కూడా అంతమవ్వనున్నది.
వీరంతా భూమిలో కూరుకుపోయి చనిపోతారు, కొందరు నీటిలో మునిగి చనిపోతారు, కొందరు షాక్
తో చనిపోతారు. బాంబులు మొదలైనవాటి విష వాయువులు కూడా హతమారుస్తాయి. ఇప్పుడు ఇక
వినాశనము జరగవలసిందే అని పిల్లల బుద్ధిలో ఉంది. మనము అటువైపుకు వెళ్తున్నాము.
కలియుగము పూర్తయి సత్యయుగ స్థాపన తప్పకుండా జరగనున్నది. ఇక ఆ తర్వాత అర్ధకల్పము
యుద్ధము జరగనే జరగదు.
ఇప్పుడు తండ్రి పురుషార్థము చేయించడానికి వచ్చారు. ఇది చివరి అవకాశము. ఆలస్యము
చేస్తే ఇక అకస్మాత్తుగా చనిపోతారు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. మనుష్యులు
కూర్చుని, కూర్చుని ఉండగా అకస్మాత్తుగా చనిపోతారు. కనీసము చనిపోయే ముందు
స్మృతియాత్రను చేయండి. ఇప్పుడు పిల్లలైన మీరు ఇంటికి వెళ్ళాలి, అందుకే తండ్రి అంటారు
- పిల్లలూ, ఇంటిని స్మృతి చేయండి, దీని ద్వారా అంతమతి సో గతి జరుగుతుంది, ఇక ఇంటికి
వెళ్ళిపోతారు. కానీ కేవలం ఇంటిని మాత్రమే స్మృతి చేస్తే పాపాలు వినాశనమవ్వవు,
తండ్రిని స్మృతి చేస్తే పాపాలు వినాశనమవుతాయి మరియు మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు,
అందుకే తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. మీ చార్టు పెట్టుకున్నట్లయితే, మొత్తం
రోజంతటిలో నేను ఏం చేసాను అనేది తెలుస్తుంది. 5-6 సంవత్సరాల వయసు నుండి మొదలుకుని
మీ జీవితములో ఏమేమి చేసారో... అది కూడా గుర్తుంటుంది. అయితే, అలా అదే పనిగా ఎంత
సమయము స్మృతి చేసాను అనేది వ్రాస్తూ ఉండాలి అని కాదు. అది ధ్యానములో ఉంటుంది కదా -
తోటలో కూర్చుని బాబాను స్మృతి చేసాను, దుకాణములో కస్టమర్లు ఎవరూ లేనప్పుడు నేను
స్మృతిలో కూర్చొన్నాను... అని లోలోపల నోట్ అయి ఉంటుంది. ఒకవేళ వ్రాసుకోవాలనుకుంటే
డైరీ పెట్టుకోవలసి ఉంటుంది. ముఖ్యమైన విషయము ఇదే. మనము తమోప్రధానము నుండి
సతోప్రధానముగా ఎలా అవ్వాలి, పవిత్ర ప్రపంచానికి యజమానులుగా ఎలా అవ్వాలి, పతితము
నుండి పావనముగా ఎలా అవ్వాలి - అన్న ఈ జ్ఞానాన్ని తండ్రి వచ్చి ఇస్తారు. జ్ఞానసాగరుడు
తండ్రే. మీరు ఇప్పుడు అంటారు - బాబా, మేము మీ వారము, మేము సదా మీ వారమే, కానీ కేవలం
మర్చిపోయి దేహాభిమానులుగా అయిపోయాము, ఇప్పుడు మీరు తెలియజేసారు కావున మేము మళ్ళీ
దేహీ-అభిమానులుగా అవుతాము. సత్యయుగములో మనము దేహీ-అభిమానులుగా ఉండేవారము. సంతోషముగా
ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకునేవారము. పిల్లలైన మీరు ఈ విషయాలన్నింటినీ ధారణ
చేసి ఇతరులకు అర్థం చేయించేందుకు యోగ్యులుగా అవ్వాలి, తద్వారా అనేకుల కళ్యాణము
జరుగుతుంది. డ్రామానుసారముగా, నంబరువారు పురుషార్థానుసారముగా సర్వీసబుల్ గా
అవుతున్నారని బాబాకు తెలుసు. అచ్ఛా, ఒకవేళ కల్పవృక్షము మొదలైనవాటి గురించి అర్థం
చేయించలేకపోతే, మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అన్న
విషయమైతే సహజమే కదా, ఇది మీరు ఎవరికైనా చెప్పవచ్చు. ఇది చాలా సహజము. నన్ను స్మృతి
చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అని ఈ తండ్రే తెలియజేస్తారు, బ్రాహ్మణులైన మీరు
తప్ప ఇతర మనుష్యమాత్రులెవ్వరూ ఇది తెలియజేయలేరు. ఇతరులెవ్వరికీ ఆత్మను గురించి గాని,
తండ్రియైన పరమాత్మను గురించి గాని తెలియదు. ఊరికే అలా చెప్తే ఎవరికీ బాణము తగలదు.
భగవంతుని రూపాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. వీరంతా నాటకములోని పాత్రధారులు. ప్రతి
ఆత్మ తన శరీరముతో పాత్రను అభినయిస్తుంది. ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుని
పాత్రను అభినయిస్తుంది. ఆ పాత్రధారులు వస్త్రాలను మారుస్తూ భిన్న-భిన్న పాత్రలను
అభినయిస్తారు. మీరేమో శరీరాలను మారుస్తారు. వారు స్త్రీ లేక పురుషుల దుస్తులను
అల్పకాలికముగా ధరిస్తారు. ఇక్కడ పురుష శరీరాన్ని తీసుకుంటే ఆ జన్మ అంతా పురుషునిగానే
ఉంటారు. అది హద్దులోని డ్రామా, ఇది అనంతమైనది. మొట్టమొదటి ముఖ్యమైన విషయము ఏమిటంటే
- నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. యోగము అన్న పదాన్ని కూడా
ఉపయోగించకండి, ఎందుకంటే యోగాలు అనేక రకాలవి నేర్చుకుంటారు. అవన్నీ భక్తి మార్గానికి
చెందినవి. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి మరియు ఇంటిని స్మృతి చేయండి,
తద్వారా మీరు ఇంటికి వెళ్ళిపోతారు. శివబాబా వీరిలోకి వచ్చి శిక్షణను ఇస్తున్నారు.
తండ్రిని స్మృతి చేస్తూ, చేస్తూ మీరు పావనముగా అయిపోతారు, అప్పుడు ఇక పవిత్ర ఆత్మ
ఎగిరిపోతుంది. ఎంతెంతగా స్మృతి చేసి ఉంటారో, సేవ చేసి ఉంటారో, అంతగా వారు ఉన్నత
పదవిని పొందుతారు. స్మృతిలోనే ఎన్నో విఘ్నాలు కలుగుతాయి. పావనముగా అవ్వకపోతే
ధర్మరాజపురిలో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది, పరువు కూడా పోతుంది, పదవి కూడా
భ్రష్టమవుతుంది. అంతిమములో అన్నీ సాక్షాత్కారమవుతాయి. కానీ అప్పుడు ఏమీ చేయలేరు.
నీకు ఇంత అర్థం చేయించాను, అయినా నీవు స్మృతి చేయలేదు, పాపాలు ఉండిపోయాయి, ఇక శిక్ష
అనుభవించు అని సాక్షాత్కారము చేయిస్తారు. ఆ సమయము చదువుకునే వీలుండే సమయము కాదు.
అయ్యో, నేను ఎందుకు ఇలా చేసాను, అనవసరముగా సమయాన్ని వృధా చేసాను అని బాధపడతారు,
పశ్చాత్తాపపడతారు, కానీ శిక్షలైతే అనుభవించవలసే ఉంటుంది. అప్పుడిక ఏమీ చేయలేరు.
ఫెయిల్ అయితే ఇక ఫెయిల్ అయినట్టే. మళ్ళీ చదవడానికి అవకాశము ఉండదు. ఆ చదువులోనైతే
ఫెయిల్ అయితే మళ్ళీ చదువుతారు, కానీ ఇక్కడ చదువే పూర్తయిపోతుంది. అంతిమ సమయములో
పశ్చాత్తాపపడకుండా ఉండేందుకు తండ్రి సలహా ఇస్తున్నారు - పిల్లలూ, ఇప్పుడే బాగా
చదివేసుకోండి. పరచింతన విషయాలను మాట్లాడటములో మీ సమయాన్ని వృధా చేసుకోకండి, లేదంటే
చాలా పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. మాయ చాలా తప్పుడు పనులు చేయిస్తుంది. ఎప్పుడూ
దొంగతనము చేయకపోయినా, ఆ పని చేయించేస్తుంది. మాయ నన్ను మోసం చేసేసింది అన్నది
తర్వాత గుర్తుకు వస్తుంది. ఫలానా వస్తువును దొంగిలించాలి అని ముందు మనసులో ఆలోచన
వస్తుంది, కానీ అది రైటా, రాంగా అన్నది తెలుసుకునేందుకు బుద్ధి అయితే లభించింది. ఈ
వస్తువు దొంగిలిస్తే రాంగ్ అవుతుంది, దొంగిలించకపోతే రైట్ అవుతుంది. మరి ఇప్పుడు ఏం
చేయాలి? పవిత్రముగా ఉండడం మంచిదే కదా. సాంగత్యములోకి వచ్చి లూజ్ అవ్వకూడదు. మనము
సోదరీ-సోదరులము, మరి నామ-రూపాలలో ఎందుకు చిక్కుకోవాలి. దేహాభిమానములోకి రాకూడదు.
కానీ మాయ చాలా శక్తివంతమైనది. మాయ రాంగ్ పనులు చేయాలి అనే సంకల్పాలను తీసుకువస్తుంది.
తండ్రి అంటారు, మీరు రాంగ్ పనులు చేయకూడదు. లోపల యుద్ధము నడుస్తుంది, అప్పుడు
పడిపోతారు, ఇక రైట్ బుద్ధి మళ్ళీ రానే రాదు. మనము రైట్ పనులు చేయాలి. అంధులకు
చేతికర్రగా అవ్వాలి. ఇదే అన్నింటికన్నా మంచి పని. శరీర నిర్వహణ కోసం సమయమైతే ఉంది.
రాత్రివేళ నిదురించాలి కూడా. ఆత్మ అలసిపోతే ఇక నిద్రపోతుంది, శరీరము కూడా
నిద్రపోతుంది. కావున శరీర నిర్వహణ కోసము, విశ్రాంతి కోసము సమయమైతే ఉంది. మిగిలిన
సమయము నా సేవలో నిమగ్నమవ్వండి. స్మృతి చార్టు పెట్టండి. వ్రాస్తారు కూడా, మళ్ళీ
నడుస్తూ, నడుస్తూ ఫెయిల్ అయిపోతారు. తండ్రిని స్మృతి చేయకపోతే, సేవ చేయకపోతే రాంగ్
పనులు జరుగుతూ ఉంటాయి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పరచింతన విషయాలను మాట్లాడటములో సమయాన్ని వృధా చేసుకోకూడదు. మాయ ఎటువంటి
తప్పుడు పనులూ చేయించకూడదు అన్న విషయములో అటెన్షన్ పెట్టాలి. సాంగత్యదోషములోకి వచ్చి
ఎప్పుడూ లూజ్ అవ్వకూడదు. దేహాభిమానములోకి వచ్చి ఎవరి నామ-రూపాలలోనూ చిక్కుకోకూడదు.
2. ఇంటిని స్మృతి చేయడంతో పాటుగా తండ్రిని కూడా స్మృతి చేయాలి. స్మృతి చార్టు
యొక్క డైరీని వ్రాయాలి. నేను రోజంతటిలో ఏమేమి చేసాను, ఎంత సమయము తండ్రి స్మృతిలో
ఉన్నాను అన్నది నోట్ చేసుకోవాలి.
వరదానము:-
నమ్రత రూపీ కవచము ద్వారా వ్యర్థమనే రావణుడిని కాల్చే సత్యమైన
స్నేహీ, సహయోగీ భవ
మీ సంగఠనలో లోపాన్ని వెతికేందుకు ఎవరు ఎంతగా ప్రయత్నించినా
కానీ, కొద్దిగా కూడా స్వభావ సంస్కారాల ఘర్షణ కనిపించకూడదు. ఒకవేళ ఎవరైనా నిందించినా,
అవమానపరచినా కూడా, మీరు సెయింట్ గా (సాధువుగా) అయిపోండి. ఒకవేళ ఎవరైనా రాంగ్ చేసినా
కూడా మీరు రైట్ గా ఉండండి. ఒకవేళ ఎవరైనా మీతో ఘర్షణ పడినా కూడా, మీరు వారికి స్నేహము
రూపీ నీరును ఇవ్వండి. ఇది ఎందుకు, ఇలా ఎందుకు - ఈ సంకల్పాలను చేసి అగ్నిలో ఆజ్యము
పోయకండి. నమ్రత రూపీ కవచము ధరించి ఉండండి. ఎక్కడైతే నమ్రత ఉంటుందో, అక్కడ స్నేహము
మరియు సహయోగము కూడా తప్పకుండా ఉంటాయి.
స్లోగన్:-
‘నాది’
అనే అనేక హద్దులోని భావనలను ఒక్క ‘నా బాబా’ లో ఇమిడిపోయేలా చేయండి.
అవ్యక్త సూచనలు -
ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి
ఆత్మిక రాయల్టీ యొక్క
పునాది సంపూర్ణ పవిత్రత. కనుక స్వయాన్ని ప్రశ్నించుకోండి - ఆత్మిక రాయల్టీ యొక్క
మెరుపు మరియు నషా మీ రూపము మరియు చరిత్ర ద్వారా ప్రతి ఒక్కరికీ అనుభవమవుతుందా?
జ్ఞానమనే దర్పణములో స్వయాన్ని చూసుకోండి - నా ముఖములో, నడవడికలో ఆ ఆత్మిక రాయల్టీ
కనిపిస్తుందా లేక సాధారణ నడవడిక మరియు ముఖము కనిపిస్తున్నాయా?
| | |