17-06-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తమ కళ్యాణము చేసుకోవాలంటే అన్ని రకాల పథ్యమును పాటించండి, పుష్పాలుగా తయారయ్యేందుకు పవిత్రమైనవారి చేతితో తయారుచేసిన శుద్ధమైన భోజనాన్నే తినండి’’

ప్రశ్న:-
21 జన్మలు వరకు నిలిచి ఉండే ఏ అభ్యాసమును పిల్లలైన మీరు ఇప్పుడు ఇక్కడే చేస్తారు?

జవాబు:-
సదా తనువు-మనస్సు ద్వారా ఆరోగ్యముగా ఉండే అభ్యాసమును మీరు ఇక్కడి నుండే చేస్తారు. మీరు దధీచి ఋషి వలె యజ్ఞ సేవలో ఎముకలను కూడా ఇవ్వాలి కానీ ఇక్కడ హఠయోగము యొక్క విషయము లేదు. మీ శరీరాన్ని బలహీనము చేసుకోకూడదు. మీరు యోగము ద్వారా 21 జన్మల కొరకు ఆరోగ్యవంతులుగా అవుతారు, దాని అభ్యాసమును ఇక్కడి నుండే చేస్తారు.

ఓంశాంతి
కాలేజీ లేక యూనివర్సిటీలో టీచరు విద్యార్థుల వైపు చూస్తారు. గులాబీ పుష్పాలు ఎక్కడ ఉన్నారు, ముందు వరసలో ఎవరు కూర్చుని ఉన్నారు? ఇది కూడా పుష్పాల తోటనే కానీ నంబరువారుగా అయితే ఉన్నారు. ఇక్కడే గులాబీ పుష్పాన్ని చూస్తాను, మళ్ళీ పక్కన రత్న జ్యోతి పుష్పాన్ని చూస్తాను. ఒకచోట జిల్లేడు పుష్పాన్ని కూడా చూస్తాను. తోట యజమానికైతే చూడవలసి ఉంటుంది కదా. మీరు వచ్చి ఈ ముళ్ళ అడవిని సమాప్తము చేసి పుష్పాల తోటకు అంటు కట్టండి అని ఆ తోట యజమానినే పిలుస్తారు. ముళ్ళ నుండి పుష్పాల అంటు ఏ విధముగా కట్టబడుతోంది అనేది పిల్లలైన మీకు ప్రాక్టికల్ గా తెలుసు. ఈ విషయాల గురించి చింతన చేసేవారు మీలో కూడా చాలా కొద్దిమందే ఉన్నారు. ఈ విషయం కూడా పిల్లలైన మీకు తెలుసు - వారు తోట యజమాని కూడా, నావికుడు కూడా, వారు అందరినీ తీసుకువెళ్తారు. పుష్పాలను చూసి తండ్రి కూడా సంతోషిస్తారు. మేము ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నామని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఈ జ్ఞానము చూడండి, ఇది ఎంత ఉన్నతమైనది. దీనిని అర్థం చేసుకోవడానికి కూడా చాలా విశాల బుద్ధి కావాలి. ఇక్కడ ఉన్నది కలియుగీ నరకవాసులే. మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు. సన్యాసులైతే ఇళ్ళు-వాకిళ్ళను వదిలి పారిపోతారు. మీరు అలా పారిపోకూడదు. కొందరి ఇళ్ళల్లో ఒకరు ముల్లు అయితే ఒకరు పుష్పము వంటివారు. బాబా, కొడుకుకు వివాహము చేయాలా? అని బాబాను కొందరు అడుగుతారు. బాబా అంటారు, చేస్తే చేయండి. అతడిని ఇంట్లో పెట్టుకోండి, సంభాళించండి. అడుగుతున్నారు అంటేనే ధైర్యము లేదని దీనితో అర్థమైపోతుంది. కావున బాబా కూడా - చేస్తే చేయండి అని అంటారు. ఏమంటారంటే - నేనైతే అనారోగ్యముగా ఉంటాను, మరి కోడలు వచ్చినప్పుడు ఆమె చేతి వంటను తినవలసి వస్తుంది. బాబా అంటారు, తింటే తినండి. వద్దు అని అంటారా ఏమిటి! పరిస్థితులు అలా ఉంటే తినవలసే ఉంటుంది, ఎందుకంటే మోహము కూడా ఉంది కదా. ఇంటికి కోడలు వస్తే ఇక అడగకండి, ఒక దేవి వచ్చినట్లుగా భావిస్తారు. అంతగా సంతోషపడిపోతారు. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవలసిన విషయము. మనం పుష్పాలుగా అవ్వాలంటే పవిత్రమైనవారి చేతి వంటను తినాలి. దాని కోసం ఎవరి ఏర్పాట్లు వారు చేసుకోవాలి, ఇందులో అడగవలసింది ఏమైనా ఉందా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు దేవతలుగా అవుతారు, దాని కోసం ఈ పథ్యము కావాలి. ఎంత ఎక్కువగా పథ్యము పెట్టుకుంటారో, అంతగా మీ కళ్యాణము జరుగుతుంది. ఎక్కువగా పథ్యము పెట్టుకోవాలంటే, అందులో కొంత శ్రమ కూడా ఉంటుంది. మార్గమధ్యములో ఆకలి వేయవచ్చు అనిపిస్తే, భోజనాన్ని మీతోపాటు తీసుకువెళ్ళండి. ఏదైనా కష్టం అనిపిస్తే, తప్పనిసరి పరిస్థితి అయితే, స్టేషన్ వారి నుండి బ్రెడ్ తీసుకుని తినండి. కేవలం తండ్రిని స్మృతి చేయండి. దీనినే యోగబలము అని అంటారు. ఇందులో హఠయోగము యొక్క విషయమేమీ లేదు, శరీరాన్ని బలహీనము చేసుకోకూడదు. దధీచి ఋషి వలె ఎముక-ఎముకను ఇవ్వాలి, ఇందులో హఠయోగము యొక్క విషయమేమీ లేదు. ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు. శరీరాన్ని అయితే పూర్తిగా ఆరోగ్యముగా ఉంచుకోవాలి. యోగము ద్వారా 21 జన్మల కొరకు ఆరోగ్యముగా అవ్వాలి. ఈ అభ్యాసాన్ని ఇక్కడే చేయాలి. బాబా అర్థం చేయిస్తున్నారు, ఇందులో అడగవలసిన అవసరమేమీ ఉండదు. అయితే, ఏదైనా పెద్ద విషయముందంటే, అందులో తికమకపడుతుంటే అడగవచ్చు. చిన్న-చిన్న విషయాలను బాబాను అడగడంలో ఎంత సమయం పోతుంది. గొప్ప వ్యక్తులు చాలా తక్కువగా మాట్లాడుతారు. శివబాబా సద్గతిదాత అని అంటారు. రావణుడిని సద్గతిదాత అని అనరు. ఒకవేళ అతను సద్గతిదాత అయితే అతడిని ఎందుకు కాలుస్తారు? రావణుడు ప్రసిద్ధమైనవాడు అని పిల్లలు భావిస్తారు. రావణుడిలో ఎంతో శక్తి ఉంది, కానీ అతను శత్రువు కదా. అర్ధకల్పము రావణ రాజ్యము నడుస్తుంది. కానీ ఎప్పుడైనా అతని మహిమను విన్నారా? ఏమీ లేదు. రావణుడు అని 5 వికారాలను అంటారని మీకు తెలుసు. సాధు-సన్యాసులు పవిత్రముగా అవుతారు కావున వారిని మహిమ చేస్తారు కదా. ఈ సమయములోని మనుష్యులైతే అందరూ పతితముగా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా వస్తే, ఎవరైనా పెద్ద వ్యక్తి వచ్చారనుకోండి, వారు బాబాను కలవాలి అని అంటారు, అప్పుడు బాబా వారిని ఏమడుగుతారు? బాబా వారిని ఏమి అడుగుతారంటే - రామ రాజ్యము మరియు రావణ రాజ్యము గురించి ఎప్పుడైనా విన్నారా? మనుష్యులు మరియు దేవతలను గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ సమయములో మనుష్యుల రాజ్యము ఉందా లేక దేవతల రాజ్యము ఉందా? మనుష్యులు ఎవరు, దేవతలు ఎవరు? దేవతలు ఏ రాజ్యములో ఉండేవారు? దేవతలైతే సత్యయుగములో ఉంటారు. యథా రాజా రాణి తథా ప్రజా... మీరు ఇలా అడగవచ్చు - ఇది కొత్త సృష్టియా లేక పాతదా? సత్యయుగములో ఎవరి రాజ్యము ఉండేది? ఇప్పుడు ఎవరి రాజ్యము ఉంది? చిత్రాలైతే ఎదురుగా ఉన్నాయి. భక్తి అంటే ఏమిటి, జ్ఞానము అంటే ఏమిటి? ఇది తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు.

బాబా, ధారణ జరగడం లేదు అని ఏ పిల్లలైతే అంటారో, వారితో బాబా అంటారు - అరే, అల్ఫ్ మరియు బే (భగవంతుడు మరియు వారసత్వము), ఇవి అయితే సహజమే కదా. అల్ఫ్ అయిన తండ్రే అంటున్నారు, తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే వారసత్వము లభిస్తుంది. భారత్ లో శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు భారత్ లోకి ఎప్పుడు వచ్చి స్వర్గాన్ని తయారుచేసారు? భారత్ స్వర్గముగా ఉండేది అన్న విషయము తెలియదు, మర్చిపోయారు. మీరంటారు, మేము స్వర్గాధిపతులుగా ఉండేవారమని మాకు కూడా ఇంతకుముందు ఏమీ తెలియదు. ఇప్పుడు తండ్రి ద్వారా మేము మళ్ళీ దేవతలుగా అవుతున్నాము. అర్థం చేయించేవాడిని నేనే. క్షణములో జీవన్ముక్తి అని అంటూ ఉంటారు. కానీ దీని అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. క్షణములో మీరు స్వర్గము యొక్క దేవ కన్యలుగా అవుతారు కదా! దీనిని ఇంద్ర సభ అని కూడా అంటారు, కానీ వారు వర్షము కురిపించేవారిని ఇంద్రునిగా భావిస్తారు. వాస్తవానికి వర్షము కురిపించేవారి సభ ఏమైనా జరుగుతుందా? ఇంద్రుని వజ్రాయుధమని, ఇంద్ర సభ అని ఏమేమో వినిపిస్తుంటారు.

ఈ రోజు మళ్ళీ ఈ పురుషార్థము చేస్తున్నారు, ఇది చదువు కదా. బ్యారిస్టరీ చదివేటప్పుడు - రేపు మేము బ్యారిస్టరుగా అవుతాము అని భావిస్తారు. మీరు ఈ రోజు చదువుతున్నారు, రేపు శరీరము విడిచిపెట్టి రాజ్యములోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు. మీరు భవిష్యత్తు కొరకు ప్రారబ్ధాన్ని పొందుతారు. ఇక్కడి నుండి చదువుకుని వెళ్తాము, తర్వాత మన జన్మ సత్యయుగములో జరుగుతుంది. రాకుమారులుగా, రాకుమారీలుగా అవ్వడమే లక్ష్యము-ఉద్దేశ్యము. ఇది రాజయోగము కదా. ఒకవేళ ఎవరైనా - బాబా, మా బుద్ధి తెరుచుకోవడం లేదు అని అంటే, బాబా అంటారు, నీ భాగ్యము ఆ విధంగా ఉంది, డ్రామాలో పాత్ర అలా ఉంది, దానిని బాబా ఎలా మార్చగలరు. స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు అయితే అందరూ హక్కుదారులే. కానీ నంబరువారుగా అయితే ఉంటారు కదా. అందరూ చక్రవర్తులుగా అయితే అవ్వరు కదా. కొందరు అంటారు, ఈశ్వరీయ శక్తి ఉన్నట్లయితే మరి అందరినీ చక్రవర్తులుగా చేసేయాలి. అప్పుడు ప్రజలు ఎక్కడి నుండి వస్తారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము కదా. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది. ఇప్పుడు కేవలం నామ మాత్రముగా మహారాజులు, మహారాణులు ఉన్నారు. టైటిల్స్ కూడా ఇచ్చేస్తారు. లక్ష, రెండు లక్షలు ఇస్తే రాజా-రాణి అనే టైటిల్ లభించేస్తుంది. కానీ నడవడికను కూడా ఆ విధంగా ఉంచుకోవాలి కదా.

మనం శ్రీమతమనుసారముగా మన రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అక్కడైతే అందరూ సుందరముగా, తెల్లగా ఉంటారు. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది కదా. శాస్త్రాలలో కల్పము ఆయువును ఎక్కువగా రాయడం వలన మనుష్యులు మర్చిపోయారు. ఇప్పుడు మీరు శ్యామము నుండి సుందరముగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. నిజానికి దేవతలు నల్లగా ఉంటారా ఏమిటి? శ్రీకృష్ణుని నీలముగా, రాధేను తెల్లగా చూపిస్తారు. ఇప్పుడు సుందరముగా ఉంటే, ఇద్దరూ సుందరముగానే ఉంటారు కదా, తర్వాత కామ చితి పైకి ఎక్కి ఇద్దరూ నల్లగా అయిపోతారు. అక్కడ ఉన్నది స్వర్ణిమ ప్రపంచము యొక్క అధిపతులు, ఇది నల్లని ప్రపంచము. పిల్లలైన మీకు ఒకటేమో లోలోపల సంతోషము ఉండాలి మరియు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. కొందరు అంటారు - బాబా, బీడీని వదల లేకపోతున్నాము. బాబా అంటారు, మంచిది, బాగా కాల్చండి. మరి ఇలా అడిగితే ఏమంటారు! పథ్యము పాటించకపోతే పడిపోతావు. ఇది మీ అంతట మీరు అర్థం చేసుకోవాలి కదా. మనం దేవతలుగా అవుతున్నామంటే, మరి మన నడత-నడవడిక, ఆహార-పానీయాలు ఎలా ఉండాలి. మేము లక్ష్మిని, నారాయణుడిని వరిస్తాము అని అందరూ అంటారు. అచ్ఛా, మరి స్వయాన్ని చూసుకోండి, అటువంటి గుణాలు ఉన్నాయా? మేము బీడీ కాల్చుతున్నాము కదా, మరి నారాయణునిగా అవ్వగలమా? నారదుని కథ కూడా ఉంది కదా. నారదుడు అంటే ఎవరో ఒక్కరని కాదు కదా. మనుష్యులందరూ భక్తులే (నారదులే).

తండ్రి అంటారు, దేవతలుగా అయ్యే పిల్లలు అంతర్ముఖులుగా అయి మీతో మీరు మాట్లాడుకోండి - మేము దేవతలుగా అవుతాము అన్నప్పుడు మరి మా నడవడిక ఎలా ఉండాలి? మనం దేవతలుగా అవుతాము కావున మనం మద్యము తాగకూడదు, బీడీ కాల్చకూడదు, వికారాలలోకి వెళ్ళకూడదు, పతితుల చేతి వంటను తినకూడదు. లేదంటే అవస్థపై ప్రభావము పడుతుంది. ఈ విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. డ్రామా రహస్యము కూడా ఎవ్వరికీ తెలియదు. ఇది నాటకము, అందరూ పాత్రధారులు. ఆత్మలమైన మనం పై నుండి వస్తాము, పాత్రనైతే మొత్తం ప్రపంచములోని పాత్రధారులందరూ అభినయించాలి. అందరికీ తమ-తమ పాత్ర ఉంది. ఎంతమంది పాత్రధారులు ఉన్నారు, ఏ విధంగా పాత్రను అభినయిస్తారు. ఇది వెరైటీ ధర్మాల వృక్షము. ఒక్క మామిడి వృక్షమే ఉంటే దానిని వెరైటీ వృక్షము అని అనరు, ఎందుకంటే దానిలో మామిడి పళ్ళు మాత్రమే ఉంటాయి. అలాగే ఇది మనుష్య సృష్టి యొక్క వృక్షమే కానీ దీని పేరు - వెరైటీ ధర్మాల వృక్షము. బీజము ఒక్కరే, కానీ మనుష్యులలో వెరైటీ చూడండి, ఎంత ఉంది. ఒకరు ఒకలా ఉంటే మరొకరు మరోలా ఉంటారు. ఈ విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, మనుష్యులకైతే ఏమీ తెలియదు. మనుష్యులను తండ్రియే పారసబుద్ధి కలవారిగా తయారుచేస్తారు. ఈ పాత ప్రపంచములో ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉన్నాయని పిల్లలైన మీకు తెలుసు. కల్పక్రితము వలె అంటు కట్టబడుతూ ఉంటుంది. మంచి ప్రజలు, సాధారణ ప్రజల యొక్క అంటు కూడా కట్టబడుతుంది. ఇక్కడే రాజధాని స్థాపన అవుతోంది. పిల్లలు ప్రతి విషయములోనూ బుద్ధిని నడిపించాల్సి ఉంటుంది. మురళి విన్నా వినకపోయినా పర్వాలేదు అని కాదు. ఇక్కడ కూర్చుని ఉన్నా కూడా బుద్ధి బయట పరిగెడుతూ ఉంటుంది. కొందరైతే సమ్ముఖముగా మురళీ వింటూ ఎంతగానో పులకరించిపోతూ ఉంటారు, ఇటువంటివారు కూడా ఉన్నారు. వారు మురళి కోసం పరుగుపరుగున వస్తారు. భగవంతుడు చదివిస్తున్నారంటే, మరి ఇటువంటి చదువును వదిలేయవచ్చా. టేప్ లో ఏక్యురేట్ గా రికార్డ్ అవుతుంది, దానిని వినాలి. షావుకార్లు కొన్నారంటే పేదవారు వింటారు. ఎంతమంది కళ్యాణము జరుగుతుంది. పేద పిల్లలు కూడా తమ భాగ్యాన్ని చాలా ఉన్నతముగా చేసుకోవచ్చు. బాబా పిల్లల కోసం ఇళ్ళు కట్టిస్తారు, పేదవారు రెండు రూపాయలు కూడా మనీ ఆర్డర్ పంపిస్తారు, బాబా, దీనిలో నుండి ఒక ఇటుకను ఇంటి కోసం వినియోగించండి, ఒక రూపాయిని యజ్ఞములో వేయండి అని అంటారు. అలాగే హుండీని నింపేవారు కూడా ఎవరో ఒకరు ఉంటారు కదా. మనుష్యులు హాస్పిటళ్ళు మొదలైనవి తయారుచేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది. షావుకార్లు ప్రభుత్వానికి ఎంతో సహాయము చేస్తారు, వారికి ఏమి లభిస్తుంది! అల్పకాలికమైన సుఖము. ఇక్కడ మీరు ఏదైతే చేస్తారో, అది 21 జన్మల కోసము. మీరు చూస్తున్నారు కదా, ఈ బాబా అంతా ఇచ్చేసారు, విశ్వానికి యజమానిగా, ఫస్ట్ నంబరువారుగా అయ్యారు. 21 జన్మల కోసం ఇటువంటి వ్యాపారాన్ని చేయనివారు ఎవరుంటారు. అందుకే కదా భోళానాథుడు అని అంటారు. ఇది ఇప్పటి విషయమే. వారు ఎంత భోళా అయినవారు, ఏది చెయ్యాలనుకుంటున్నారో అది చేసేయండి అని అంటారు. పేద కుమార్తెలు ఎంతమంది ఉన్నారు, బట్టలు కుట్టుకుంటూ కడుపు నింపుకుంటారు. అటువంటివారు చాలా ఉన్నత పదవిని పొందబోతున్నారు అని బాబాకు తెలుసు. సుదాముని ఉదాహరణ కూడా ఉంది కదా. పిడికెడు బియ్యానికి బదులుగా 21 జన్మల కొరకు మహళ్ళు లభించాయి. ఈ విషయాలు మీకు నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. తండ్రి అంటారు, నేను భోళానాథుడిని కూడా కదా. ఈ దాదా అయితే భోళానాథుడు కారు. భోళానాథుడు శివబాబాయే అని వీరు కూడా అంటారు, అందుకే వారిని వ్యాపారస్థుడు, రత్నాకరుడు, ఇంద్రజాలికుడు అని అంటారు. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇక్కడ భారత్ నిరుపేదగా ఉంది. ప్రజలు షావుకార్లుగా ఉన్నారు, ప్రభుత్వము నిరుపేదగా ఉంది. భారత్ ఎంత ఉన్నతముగా ఉండేది అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, స్వర్గముగా ఉండేది. వాటి గుర్తులు కూడా ఉన్నాయి. సోమనాథ మందిరము ఎంతగా వజ్ర-వైఢూర్యాలతో అలంకరించబడి ఉండేది. వజ్ర-వైఢూర్యాలను ఒంటెలపై నింపుకుని తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఈ ప్రపంచము తప్పకుండా మారనున్నదని పిల్లలైన మీకు తెలుసు. దీని కోసం మీరు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరు చేస్తారో వారు పొందుతారు. మాయ అపోజిషన్ (విరోధము) ఎంతగానో జరుగుతుంది. మీరు ఈశ్వరునికి ఫాలోవర్స్. మిగిలిన వారంతా రావణుడికి బానిసలు. మీరు శివబాబాకు ఫాలోవర్స్. శివబాబా మీకు వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి గురించి తప్ప ఇంకే విషయము బుద్ధిలోకి రాకూడదు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అంతర్ముఖులుగా అయి మీతో మీరు మాట్లాడుకోవాలి - నేను దేవతగా అవుతాను అన్నప్పుడు మరి నా నడవడిక ఎలా ఉంది! ఎటువంటి అశుద్ధమైన ఆహార-పానీయాలు అయితే లేవు కదా!

2. మీ భవిష్యత్తును 21 జన్మల కొరకు ఉన్నతముగా తయారుచేసుకోవాలి కావున ఏదైతే ఉందో దానిని సుదాముని వలె భోళానాథుడైన తండ్రికి అర్పించండి. చదువు విషయములో ఎటువంటి సాకులు చెప్పకండి.

వరదానము:-
ఆది మరియు అనాది స్వరూపపు స్మృతి ద్వారా తమ నిజ స్వధర్మమును అలవరచుకునే పవిత్ర మరియు యోగీ భవ

బ్రాహ్మణుల నిజమైన స్వధర్మము పవిత్రత, అపవిత్రత పరధర్మము. ఏ పవిత్రతను అలవరచుకోవడాన్ని అయితే మనుష్యులు కష్టముగా భావిస్తారో, అది పిల్లలైన మీకు అతి సహజము ఎందుకంటే మన ఆత్మ యొక్క వాస్తవిక స్వరూపము సదా పవిత్రత అన్న స్మృతి కలిగింది. అనాది స్వరూపము పవిత్ర ఆత్మ మరియు ఆది స్వరూపము పవిత్ర దేవత. ఇప్పటి అంతిమ జన్మ కూడా పవిత్ర బ్రాహ్మణ జీవితమే కావున పవిత్రతయే బ్రాహ్మణ జీవితపు పర్సనాలిటీ (వ్యక్తిత్వము). ఎవరైతే పవిత్రముగా ఉంటారో వారే యోగీలు.

స్లోగన్:-
సహజ యోగీలము అని అంటూ నిర్లక్ష్యమును తీసుకురాకండి, శక్తి రూపులుగా అవ్వండి.

అవ్యక్త ప్రేరణలు - ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి

‘‘అంతర్ముఖీ సదా సుఖీ’’ అని అంటారు. వారిని బాహ్య ఆకర్షణ ఏదీ ఆకర్షితము చెయ్యలేదు. మన్మతము గాని, పరమతము గాని ఎప్పుడూ ఆకర్షితము చెయ్యలేవు. అంతర్ముఖీ సదా సుఖీగా ఉండేవారు సుఖదాత పిల్లలైన మాస్టర్ సుఖదాతలుగా ఉంటారు, బాహ్యముఖత నుండి ముక్తులుగా ఉంటారు.