ఓంశాంతి
మీరు ఎక్కడ కూర్చున్నారు? దీనిని స్కూల్ లేక యూనివర్శిటీ అని కూడా అనవచ్చు. ఇది
విశ్వవిద్యాలయము, దీనికి ఈశ్వరీయ బ్రాంచులు ఉన్నాయి. తండ్రి అత్యంత పెద్ద
విశ్వవిద్యాలయాన్ని తెరిచారు. శాస్త్రాల్లో రుద్రయజ్ఞము అన్న పేరును వ్రాసారు.
శివబాబా ఈ పాఠశాలను లేక యూనివర్శిటీని తెరిచారని ఈ సమయములో పిల్లలైన మీకు తెలుసు.
ఉన్నతోన్నతుడైన తండ్రి చదివిస్తారు. భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు అని పిల్లల
బుద్ధిలో గుర్తుండాలి. వారి ద్వారా రచించబడిన యజ్ఞమిది, దీని పేరు కూడా
ప్రసిద్ధమైనది. ఇది రాజశ్వ అశ్వమేధ రుద్ర జ్ఞాన యజ్ఞము. రాజశ్వ అనగా స్వరాజ్యాన్ని
పొందేందుకు అని. అశ్వమేధము అనగా ఈ కనులతో ఏదైతే కనిపిస్తోందో, దానినంతటినీ స్వాహా
చేస్తున్నారు, శరీరము కూడా స్వాహా అయిపోతుంది. ఆత్మ అయితే స్వాహా అవ్వలేదు. అన్ని
శరీరాలూ స్వాహా అయిపోతాయి. ఇకపోతే ఆత్మలు తిరిగి పరుగుతీస్తాయి. ఇది సంగమయుగము. చాలా
ఆత్మలు తిరిగి పరుగుతీస్తాయి, ఇకపోతే శరీరాలు అంతమైపోతాయి. ఇదంతా డ్రామా, మీరు
డ్రామాకు వశమై నడుచుకుంటున్నారు. తండ్రి అంటారు, నేను రాజశ్వ యజ్ఞాన్ని రచించాను.
ఇది కూడా డ్రామా ప్లాన్ అనుసారముగానే రచింపబడింది. నేను యజ్ఞాన్ని రచించాను అని అనను.
డ్రామా ప్లాన్ అనుసారముగా పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు కల్పపూర్వము వలె జ్ఞాన
యజ్ఞము రచింపబడింది. నేను రచించాను అని అనడంలో కూడా అర్థం లేదు. డ్రామా ప్లాన్
అనుసారముగా రచింపబడింది, కల్ప-కల్పమూ రచింపబడుతుంది. ఈ డ్రామా తయారుచేయబడి ఉంది కదా.
డ్రామా ప్లాన్ అనుసారముగా ఒకేసారి యజ్ఞము రచింపబడుతుంది, ఇది కొత్త విషయమేమీ కాదు.
తప్పకుండా 5000 సంవత్సరాల క్రితం కూడా సత్యయుగము ఉండేదని, ఇప్పుడు చక్రము మళ్ళీ
రిపీట్ అవుతోందని ఇప్పుడు బుద్ధిలో కూర్చుంది. మళ్ళీ కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది.
మీరు కొత్త ప్రపంచములో స్వరాజ్యాన్ని పొందేందుకు చదువుకుంటున్నారు. పవిత్రముగా కూడా
తప్పకుండా అవ్వాలి. ఎవరైతే డ్రామానుసారముగా కల్పపూర్వము తయారయ్యారో వారే మళ్ళీ
తయారవుతారు, వారు ఇప్పుడు కూడా తయారవుతారు. సాక్షీగా అయి డ్రామాను చూడవలసి ఉంటుంది,
అలాగే మళ్ళీ పురుషార్థము కూడా చేయవలసి ఉంటుంది. పిల్లలు మార్గాన్ని కూడా తెలియజేయాలి.
ముఖ్యమైన విషయము పవిత్రతకు సంబంధించినది. మీరు రండి, వచ్చి మమ్మల్ని పవిత్రముగా
తయారుచేసి ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి తీసుకువెళ్ళండి అనే తండ్రిని పిలుస్తారు. తండ్రి
ఇంటికి తీసుకువెళ్ళేందుకే వచ్చారు. పిల్లలకు పాయింట్లు అయితే ఎన్నో అందించడం
జరుగుతుంది. అయినా, ముఖ్యమైన విషయము తండ్రి చెప్తున్నారు - మన్మనాభవ. పావనముగా
అయ్యేందుకు తండ్రిని స్మృతి చేస్తారు, ఇది మర్చిపోకూడదు. ఎంత స్మృతి చేస్తే, అంత
లాభము ఉంటుంది, చార్టు పెట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ చివరిలో ఫెయిల్ అయిపోతారు. మనమే
సతోప్రధానముగా ఉండేవారము అని పిల్లలు అర్థం చేసుకున్నారు, నంబరువారు పురుషార్థం
అనుసారముగా ఎవరైతే ఉన్నతముగా అవుతారో, వారు శ్రమ కూడా ఎక్కువగా చేయవలసి ఉంటుంది.
స్మృతిలో ఉండవలసి ఉంటుంది. ఇంకా కొద్ది సమయమే ఉంది, మళ్ళీ సుఖమయమైన రోజులు
రానున్నాయి అన్నదైతే అర్థం చేసుకున్నారు. తప్పకుండా మన అపారమైన సుఖమయమైన రోజులు
రానున్నాయి. తండ్రి ఒకేసారి వస్తారు, దుఃఖధామాన్ని అంతము చేసి తమ సుఖధామానికి
తీసుకువెళ్తారు. ఇప్పుడు మనం ఈశ్వరీయ పరివారములో ఉన్నామని, తర్వాత దైవీ పరివారములోకి
వెళ్తామని పిల్లలైన మీకు తెలుసు. ఈ సమయానికే గాయనం ఉంది - ఈ సంగమమే పురుషోత్తములుగా,
ఉన్నతముగా అయ్యే యుగము. మనల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీకు
తెలుసు. ఇక మున్ముందు సన్యాసులు కూడా అంగీకరిస్తారు. ఆ సమయము కూడా వస్తుంది కదా.
ఇప్పుడు మీ ప్రభావము అంతగా వెలువడదు. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతోంది, ఇంకా సమయము
మిగిలి ఉంది. చివరిలో ఈ సన్యాసులు మొదలైనవారు కూడా వచ్చి అర్థం చేసుకుంటారు. సృష్టి
చక్రము ఎలా తిరుగుతుంది అన్న ఈ జ్ఞానము ఎవరిలోనూ లేదు. పిల్లలకు ఈ విషయము కూడా
తెలుసు, పవిత్రత విషయములో ఎన్ని విఘ్నాలు కలుగుతాయి. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి.
ద్రౌపది పిలిచారు కదా. వాస్తవానికి మీరందరూ ద్రౌపదులు, సీతలు, పార్వతులు. స్మృతిలో
ఉండడం ద్వారా అబలలు, నడుం వంగిపోయిన వృద్ధులు కూడా తండ్రి నుండి వారసత్వాన్ని
పొందుతారు. వారు స్మృతిలోనైతే ఉండగలరు కదా. భగవంతుడు వచ్చి యజ్ఞాన్ని రచించారు,
ఇందులో ఎన్ని విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఇప్పటికీ విఘ్నాలు కలుగుతూ ఉంటాయి, కన్యలకు
బలవంతంగా వివాహాలు చేయిస్తారు, లేకపోతే కొట్టి-కొట్టి బయటకు తరిమేస్తారు, అందుకే -
ఓ పతిత-పావనా రండి అని వారిని పిలుస్తారు, మరి వారు వచ్చి పావనముగా తయారుచేయడానికి
వారికి తప్పకుండా రథము కావాలి. గంగ యొక్క నీటితో పావనముగా అవ్వరు. తండ్రియే వచ్చి
పావనముగా తయారుచేసి పావన ప్రపంచానికి యజమానులుగా తయారుచేస్తారు.
ఈ పతిత ప్రపంచము యొక్క వినాశనము ఎదురుగా నిలబడి ఉందని మీరు చూస్తారు. మరి ఎందుకు
బాబాకు చెందినవారిగా అవ్వకూడదు, స్వాహా అవ్వకూడదు. స్వాహా ఎలా అవ్వాలి, ట్రాన్స్ఫర్
(పరివర్తన) ఎలా చేసుకోవాలి అని అడుగుతారు. బాబా అంటారు - పిల్లలూ, మీరు ఈ సాకార
బాబాను చూస్తారు కదా. వీరు స్వయంగా చేసి నేర్పిస్తున్నారు. మనము ఎటువంటి కర్మలను
చేస్తామో, మనల్ని చూసి ఇతరులు చేస్తారు. తండ్రి వీరి ద్వారా కర్మలు చేయించారు కదా.
మొత్తము యజ్ఞములో స్వాహా చేయించారు. స్వాహా అవ్వడములో కష్టమేమైనా ఉందా. వీరు చాలా
షావుకారూ కాదు, చాలా పేదవారూ కాదు, సాధారణమైనవారు. యజ్ఞాన్ని రచించినప్పుడు అందులో
ఆహార-పానీయాల సామాగ్రి అంతా కావాలి కదా. ఇది ఈశ్వరీయ యజ్ఞము. ఈశ్వరుడు వచ్చి ఈ
జ్ఞాన యజ్ఞాన్ని స్థాపన చేసారు. మిమ్మల్ని చదివిస్తారు, ఈ యజ్ఞము యొక్క మహిమ చాలా
గొప్పది. ఈశ్వరీయ యజ్ఞము ద్వారానే మీ శరీర నిర్వహణ జరుగుతుంది. ఎవరైతే స్వయాన్ని
అర్పణమయ్యాము అని భావిస్తారో, వారు - మేము ట్రస్టీలము, ఇదంతా ఈశ్వరునిది, మేము
శివబాబా యజ్ఞము నుండి భోజనము చేస్తున్నాము అని భావిస్తారు, ఇది అర్థం చేసుకోవలసిన
విషయము కదా. ఇక్కడైతే అందరూ వచ్చి కూర్చోలేరు. వీరు ఏ విధంగా సర్వస్వాన్ని స్వాహా
చేసారో, వీరి ఉదాహరణను చూసారు. బాబా అంటారు - ఎటువంటి కర్మలు వీరు చేస్తారో, వీరిని
చూసి ఇతరులకు కూడా అటువంటి కర్మలు చేయడము వచ్చింది. ఎంతోమంది స్వాహా అయ్యారు.
ఎవరెవరైతే స్వాహా అయ్యారో వారు తమ వారసత్వాన్ని తీసుకుంటారు. ఆత్మ అయితే
వెళ్ళిపోతుంది, ఇక మిగిలిన శరీరాలన్నీ సమాప్తమైపోతాయి అని బుద్ధి ద్వారా కూడా అర్థం
చేసుకోవడం జరుగుతుంది. ఇది అనంతమైన యజ్ఞము, ఇందులో అందరూ స్వాహా అవుతారు. బుద్ధి
ద్వారా స్వాహా అయి నష్టామోహులుగా ఎలా అవ్వాలి అనేది పిల్లలైన మీకు అర్థం చేయించడం
జరుగుతుంది. ఈ సామాగ్రి అంతా బూడిద అవ్వనున్నదని కూడా తెలుసు. ఇది ఎంత పెద్ద యజ్ఞము,
అక్కడ మళ్ళీ ఎటువంటి యజ్ఞము రచించడం జరగదు. అలాగే ఎటువంటి ఉపద్రవాలు ఉండవు. ఈ భక్తి
మార్గానికి సంబంధించిన అనేక యజ్ఞాలేవైతే ఉన్నాయో, అవన్నీ సమాప్తమైపోతాయి.
జ్ఞానసాగరుడు ఒక్క భగవంతుడే. వారే మనుష్య సృష్టికి బీజరూపుడు, సత్యము, చైతన్యము.
శరీరము జడమైనది, ఆత్మయే చైతన్యమైనది. వారు జ్ఞానసాగరుడు, పిల్లలైన మిమ్మల్ని
జ్ఞానసాగరుడు కూర్చుని చదివిస్తారు. వారు కేవలం గానం చేస్తూ ఉంటారు మరియు మీకు
తండ్రి పూర్తి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. జ్ఞానమేమి ఎక్కువగా లేదు. ప్రపంచము
యొక్క చక్రము ఎలా తిరుగుతుందో, ఇది కేవలం అర్థం చేయించవలసి ఉంటుంది.
ఇక్కడ తండ్రి స్వయంగా మిమ్మల్ని చదివిస్తున్నారు. నేను సాధారణమైన తనువులోకి
ప్రవేశిస్తాను అని కూడా అంటారు. భగీరథుడు కూడా ప్రసిద్ధమైనవారు, తండ్రి రావడము కూడా
తప్పకుండా మానవునిలోకే వస్తారు. వారికి శివ అన్న ఒక్క పేరే కొనసాగుతూ వస్తుంది,
మిగిలిన వారందరి పేర్లు మారుతాయి, వీరి పేరు మారదు. ఇకపోతే భక్తిలో అనేక పేర్లు
పెట్టేసారు. ఇక్కడైతే ఉన్నదే శివబాబా. శివుడు కళ్యాణకారి అని అంటారు. భగవంతుడే వచ్చి
కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన చేస్తారు. వారు కళ్యాణకారి కదా. మీకు తెలుసు -
భారత్ లో స్వర్గము ఉండేది. ఇప్పుడిది నరకము మళ్ళీ స్వర్గము తప్పకుండా ఉంటుంది.
దీనిని పురుషోత్తమ సంగమయుగము అని అంటారు, తండ్రి నావికుడిగా అయి మిమ్మల్ని ఈ తీరము
నుండి ఆవలి తీరానికి తీసుకువెళ్తారు. ఇది పాత దుఃఖమయమైన ప్రపంచము, మళ్ళీ తప్పకుండా
డ్రామానుసారముగా కొత్త ప్రపంచము ఉంటుంది, దాని కొరకే మీరిప్పుడు పురుషార్థము
చేస్తున్నారు. తండ్రి స్మృతినే ఘడియ-ఘడియ మర్చిపోతున్నారు, ఇందులో శ్రమ ఉంది, ఇకపోతే
మీ ద్వారా ఏ వికర్మలైతే జరిగాయో, వాటి శిక్షలను కర్మభోగము రూపములో అనుభవించవలసి
ఉంటుంది, కర్మ భోగాన్ని అంతిమము వరకు అనుభవించాల్సిందే, అందులో క్షమాపణ లభించదు.
బాబా, క్షమించండి అని అనడానికి లేదు. అటువంటిదేమీ ఉండదు. డ్రామానుసారముగా అంతా
జరుగుతుంది. క్షమాపణ మొదలైనవేవీ ఉండవు. లెక్కాచారాలను సమాప్తము చేసుకోవలసిందే.
తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి, దాని కొరకు శ్రీమతము కూడా లభిస్తుంది,
శ్రీ శ్రీ శివబాబా శ్రీమతము ద్వారా మీరు శ్రేష్ఠముగా తయారవుతారు. ఉన్నతోన్నతమైన
తండ్రి మిమ్మల్ని ఉన్నతముగా తయారుచేస్తారు. మీరిప్పుడు ఆ విధంగా తయారవుతున్నారు,
బాబా కల్ప-కల్పమూ వచ్చి మమ్మల్ని చదివిస్తారు అన్నది ఇప్పుడు మీకు స్మృతిలోకి
వచ్చింది. అర్ధకల్పము దాని ప్రారబ్ధము లభిస్తుంది. సృష్టిచక్రము ఎలా తిరుగుతుంది
అన్న జ్ఞానము అవసరం ఉండదు. ఈ సృష్టిచక్రము ఎలా తిరుగుతుంది అనేది కల్ప-కల్పమూ
ఒక్కసారే వచ్చి తెలియజేస్తారు.
మీ పని చదువుకోవడము మరియు పవిత్రముగా అవ్వడము. యోగములో ఉండాలి. తండ్రికి
చెందినవారిగా అయి పవిత్రముగా అవ్వకపోతే 100 రెట్ల శిక్ష పడుతుంది. పేరు కూడా
అప్రతిష్టపాలవుతుంది. సద్గురువుకు నింద తీసుకొచ్చినవారు ఉన్నతమైన పదవిని పొందలేరు
అని అంటూ ఉంటారు. వీరు ఎవరు అన్నది మనుష్యులకు తెలియదు. సత్యమైన తండ్రియే సద్గురువు,
సత్యమైన శిక్షకుడు అవుతారు కదా. మిమ్మల్ని చదివించేది వారే, వారు సత్యమైన సద్గురువు
కూడా. ఏ విధంగా తండ్రి జ్ఞానసాగరుడో, అలాగే మీరు కూడా జ్ఞానసాగరులు కదా. తండ్రి
అయితే పూర్తి జ్ఞానాన్ని ఇచ్చేసారు, ఎవరు ఎంతగా కల్పపూర్వము ధారణ చేసారో, అంతే
చేస్తారు. పురుషార్థము చేయాలి, కర్మ లేకుండానైతే ఎవరూ ఉండలేరు. ఎన్ని హఠయోగాలు
మొదలైనవి చేసినా, అవి కూడా కర్మలే కదా. ఇది కూడా జీవనోపాధి కొరకు చేసే ఒక వ్యాపారము.
పేరు వస్తుంది, ఎంతో ధనము లభిస్తుంది, నీటిపైన, మంటల పైన నడుచుకుని వెళ్తారు. కేవలం
ఎగరలేరు అంతే. దాని కొరకైతే పెట్రోల్ మొదలైనవి కావాలి కదా. కానీ వీటి వలన లాభమైతే
ఏమీ ఉండదు. పావనముగానైతే అవ్వరు. సైన్స్ వారికి కూడా రేస్ ఉంటుంది. వారిది సైన్స్
యొక్క రేస్ మరియు మీది సైలెన్స్ యొక్క రేస్. అందరూ శాంతినే కోరుకుంటారు. తండ్రి
అంటారు, శాంతి మీ స్వధర్మము, స్వయాన్ని ఆత్మగా భావించండి, తమ ఇల్లు అయిన
శాంతిధామానికి వెళ్ళాలి. ఇది దుఃఖధామము. మనము శాంతిధామము నుండి మళ్ళీ సుఖధామములోకి
వస్తాము. ఈ దుఃఖధామము అంతమవ్వనున్నది. ఈ విషయాన్ని మంచి రీతిలో ధారణ చేసి మళ్ళీ
ఇతరుల చేత ధారణ చేయించాలి. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి, ఆ చదువును చదువుకొని
మళ్ళీ శరీర నిర్వహణార్థం కష్టపడవలసి ఉంటుంది. అదృష్టవంతులైన పిల్లలు మేము ఏ చదువును
చదువుకోవాలి అని వెంటనే నిర్ణయం తీసుకుంటారు. ఆ చదువు ద్వారా ఏమి లభిస్తుంది మరియు
ఈ చదువు ద్వారా ఏమి లభిస్తుంది. ఈ చదువు ద్వారానైతే 21 జన్మల కొరకు ప్రారబ్ధము
తయారవుతుంది, కావున - మేము ఏ చదువును చదువుకోవాలి అని ఆలోచించాలి. ఎవరైతే అనంతమైన
తండ్రి నుండి వారసత్వాన్ని పొందవలసి ఉంటుందో, వారు అనంతమైన చదువులో నిమగ్నమవుతారు.
కానీ డ్రామా ప్లాన్ అనుసారముగా ఎవరి అదృష్టములోనైనా లేకపోతే, మళ్ళీ ఆ చదువుకి
అతుక్కుపోతారు. ఈ చదువును చదవుకోరు. తీరిక లభించడము లేదు అని అంటారు. తండ్రి
అడుగుతారు, ఏ జ్ఞానము మంచిది? దాని ద్వారా ఏమి లభిస్తుంది మరియు దీని ద్వారా ఏమి
లభిస్తుంది? బాబా, దైహికమైన చదువు ద్వారా ఏమి లభిస్తుంది, ఏదో కొద్దిగా సంపాదిస్తాము
అని అంటారు. ఇక్కడైతే భగవంతుడు చదివిస్తారు. మనమైతే చదువుకుని రాజ్య పదవిని పొందాలి
మరి అటువంటప్పుడు ఏ విషయము పట్ల ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలి. కొందరైతే - బాబా, ఆ
కోర్సును పూర్తి చేసి మళ్ళీ వస్తాము అని అంటారు. వీరి అదృష్టములో లేదు అని బాబా
భావిస్తారు. ఏమి జరుగనున్నదో మున్ముందు వెళ్ళి చూడాలి. శరీరముపై ఎటువంటి నమ్మకము
లేదని అర్థం చేసుకుంటారు, మరి సత్యమైన సంపాదనలో నిమగ్నమవ్వాలి. ఎవరి భాగ్యములో
ఉంటుందో, వారే తమ భాగ్యాన్ని మేల్కొపుకుంటారు. పూర్తిగా కృషి చేయాలి, మేమైతే తండ్రి
నుండి వారసత్వాన్ని తీసుకునే తీరుతాము. అనంతమైన తండ్రి మనకు రాజ్యాన్ని
ఇస్తున్నప్పుడు మరి ఎందుకు ఈ ఒక్క అంతిమ జన్మ మనము పవిత్రముగా అవ్వము. ఇంతమంది
పిల్లలు పవిత్రముగా ఉంటారు. అబద్ధము చెప్పరు. అందరూ పురుషార్థము చేస్తున్నారు.
చదువుకుంటున్నారు, అయినా కూడా నమ్మరు. ఎప్పుడైతే పాత ప్రపంచాన్ని కొత్తదిగా
తయారుచేయవలసి ఉంటుందో, అప్పుడే అనంతమైన తండ్రి వస్తారు. పాత ప్రపంచము యొక్క
వినాశనమైతే ఎదురుగా నిలబడి ఉంది. ఇది చాలా స్పష్టముగా ఉంది. సమయం కూడా అదే, అనేక
ధర్మాలు కూడా ఉన్నాయి, సత్యయుగములో ఒకే ధర్మము ఉంటుంది. ఇది కూడా మీ బుద్ధిలో ఉంది.
మీలో కూడా నిశ్చయం ఉన్నవారు కొందరే ఉన్నారు. అరే, నిశ్చయము ఏర్పరచుకోవడములో సమయము
పడుతుందా ఏమిటి. శరీరముపై కూడా నమ్మకము లేదు, కొద్దిగా కూడా అవకాశాన్ని వదలుకోకూడదు.
ఎవరి అదృష్టములోనైనా లేకపోతే, బుద్ధిలోకి కొద్దిగా కూడా రాదు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.