19-06-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానముగా అయ్యారు, మీలో ఎటువంటి ఆసురీ గుణాలు ఉండకూడదు, మీ ఉన్నతిని చేసుకోవాలి, నిర్లక్ష్యము చేయకూడదు’’

ప్రశ్న:-
సంగమయుగీ బ్రాహ్మణ పిల్లలైన మీకు ఏ నిశ్చయము మరియు నషా ఉంటుంది?

జవాబు:-
పిల్లలైన మనకు ఉన్న నిశ్చయము మరియు నషా ఏమిటంటే - ఇప్పుడు మనము ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారము, మనము స్వర్గవాసులుగా, విశ్వాధిపతులుగా అవుతున్నాము, సంగమయుగములో మనము ట్రాన్స్ఫర్ అవుతున్నాము, ఆసురీ సంతానము నుండి ఈశ్వరీయ సంతానముగా అయి 21 జన్మల కొరకు స్వర్గవాసులుగా అవుతాము, ఇంతకన్నా గొప్ప విషయము ఇంకేదీ ఉండదు.

ఓంశాంతి
తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, చాలా వరకు మనుష్యులు శాంతిని ఇష్టపడతారు. ఇంట్లో ఒకవేళ పిల్లల గొడవ ఉంటే అశాంతి ఉంటుంది. అశాంతి ద్వారా దుఃఖము అనుభవమవుతుంది. శాంతి ద్వారా సుఖము అనుభవమవుతుంది. ఇక్కడ పిల్లలైన మీరు కూర్చున్నారు, మీకు సత్యమైన శాంతి ఉంది. తండ్రిని స్మృతి చేయండి, స్వయాన్ని ఆత్మగా భావించండి అని మీకు చెప్పడం జరిగింది. ఆత్మలో అర్ధకల్పము నుండి ఏదైతే అశాంతి ఉందో, అది శాంతిసాగరుడైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా తొలగనున్నది. మీకు శాంతి వారసత్వము లభిస్తోంది. శాంతి ప్రపంచము మరియు అశాంతి ప్రపంచము పూర్తిగా వేరని కూడా మీకే తెలుసు. ఆసురీ ప్రపంచము, ఈశ్వరీయ ప్రపంచము, సత్యయుగము, కలియుగము అని వేటిని అంటారు అనేది మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. మీరు అంటారు - ఇంతకుముందు మాకు కూడా తెలియదు. ఎంత పొజిషన్ లో ఉన్నవారికైనా సరే ఇంతకుముందు తెలియదు. ధనము ఉన్నవారిని పొజిషన్ కలవారు అని అంటారు. పేదవారు మరియు షావుకార్లు అన్నది అర్థమైతే చేసుకోగలరు కదా. అలాగే తప్పకుండా ఈశ్వరీయ సంతానము మరియు ఆసురీ సంతానము ఉన్నారని మీరు కూడా అర్థం చేసుకోగలరు. మనం ఈశ్వరీయ సంతానము అని ఇప్పుడు మధురమైన పిల్లలైన మీరు అర్థం చేసుకోగలరు. ఈ పక్కా నిశ్చయము ఉంది కదా. ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందిన మనం స్వర్గవాసీ విశ్వాధిపతులుగా అవుతున్నాము అని బ్రాహ్మణులైన మీరు అర్థం చేసుకున్నారు. ప్రతి క్షణమూ ఆ సంతోషము ఉండాలి. యథార్థ రీతిగా అర్థం చేసుకునేవారు చాలా కొద్దిమందే ఉన్నారు. సత్యయుగములో ఈశ్వరీయ సాంప్రదాయము వారు ఉంటారు. కలియుగములో ఆసురీ సాంప్రదాయము వారు ఉంటారు. పురుషోత్తమ సంగమయుగములో ఆసురీ సాంప్రదాయము బదిలీ అవుతుంది. ఇప్పుడు మనం శివబాబా సంతానముగా అయ్యాము. ఈ విషయాన్ని మధ్యలో మర్చిపోయాము. మనం శివబాబా సంతానమని ఇప్పుడు మళ్ళీ ఈ సమయములో తెలుసుకున్నాము. అక్కడ సత్యయుగములో ఎవ్వరూ తమను తాము ఈశ్వరీయ సంతానముగా చెప్పుకోరు. అక్కడ ఉన్నవారు దైవీ సంతానము. దీనికి ముందు మనం ఆసురీ సంతానముగా ఉండేవారము. ఇప్పుడు ఈశ్వరీయ సంతానముగా అయ్యాము. బ్రాహ్మణులమైన మనం బి.కే.లము. రచన అంతా ఒక్క తండ్రిదే. మీరందరూ సోదరీ-సోదరులు మరియు ఈశ్వరీయ సంతానము. బాబా నుండి రాజ్యము లభిస్తోందని మీకు తెలుసు. మనం వెళ్ళి భవిష్యత్తులో దైవీ స్వరాజ్యాన్ని పొందుతాము, సుఖీగా ఉంటాము. తప్పకుండా సత్యయుగము సుఖధామము, కలియుగము దుఃఖధామము. ఇది కేవలం సంగమయుగీ బ్రాహ్మణులైన మీకే తెలుసు. ఆత్మయే ఈశ్వరీయ సంతానము. బాబా స్వర్గ స్థాపనను చేస్తున్నారని కూడా మీకు తెలుసు. వారు రచయిత కదా. వారేమీ నరకానికి రచయిత కాదు. వారిని ఎవరు స్మృతి చేస్తారు. తండ్రి స్వర్గ స్థాపనను చేస్తున్నారని మధురాతి మధురమైన పిల్లలైన మీకు తెలుసు. వారు మనకు ఎంతో మధురమైన తండ్రి. మనల్ని 21 జన్మల కొరకు స్వర్గవాసులుగా తయారుచేస్తారు. ఇంతకన్నా గొప్ప విషయము ఇంకేదీ ఉండదు. ఇది అర్థం చేసుకోవాలి. మనం ఈశ్వరీయ సంతానము, కావున మనలో ఎటువంటి ఆసురీ అవగుణాలు ఉండకూడదు. మీ ఉన్నతిని చేసుకోవాలి. సమయము చాలా కొద్దిగానే ఉంది. ఇందులో నిర్లక్ష్యము చేయకూడదు. మర్చిపోకండి. తండ్రి సమ్ముఖముగా కూర్చున్నారు అన్నది మీరు చూస్తున్నారు, వారికి మనం సంతానము. మనం దైవీ సంతానముగా అయ్యేందుకు ఈశ్వరుడైన తండ్రి ద్వారా చదువుకుంటున్నాము, కావున ఎంతటి సంతోషము ఉండాలి. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి అని తండ్రి కేవలం ఇదే చెప్తున్నారు. అందరినీ తీసుకువెళ్ళేందుకే తండ్రి వచ్చారు. ఎంతెంతగా స్మృతి చేస్తారో, అంతంతగా వికర్మలు వినాశనమవుతాయి. అజ్ఞానకాలములో కన్యకు నిశ్చితార్థము జరిగినప్పుడు వరుడి స్మృతి తనలో ముద్రించుకుపోతుంది. అలాగే కొడుకు పుట్టిన తర్వాత ఆ స్మృతి ముద్రించుకుపోతుంది. ఆ స్మృతి స్వర్గములో కూడా ముద్రించుకుపోతుంది, అలాగే నరకములో కూడా ముద్రించుకుపోతుంది. వీరు నా తండ్రి అని కొడుకు అంటాడు. ఇప్పుడు వీరు అనంతమైన తండ్రి, వీరి నుండి స్వర్గ వారసత్వము లభిస్తుంది అన్నప్పుడు మరి వీరి స్మృతి ముద్రించుకుపోవాలి. తండ్రి ద్వారా మనం భవిష్య 21 జన్మల కొరకు మళ్ళీ వారసత్వాన్ని పొందుతున్నాము. బుద్ధిలో వారసత్వమే గుర్తుంది.

అందరూ మరణించవలసిందేనని కూడా మీకు తెలుసు. ఎంతో ప్రియాతి ప్రియమైన వారెవరైతే ఉన్నారో, వారిలో ఒక్కరు కూడా మిగిలేది లేదు, అందరూ వెళ్ళిపోతారు. ఈ పాత ప్రపంచము ఇప్పుడు ఇక అంతమైపోనున్నది అని కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. అక్కడికి వెళ్ళే ముందే పూర్తి పురుషార్థము చేయాలి. మీరు ఈశ్వరీయ సంతానము కావున మీకు అపారమైన సంతోషము ఉండాలి. తండ్రి అంటూ ఉంటారు - పిల్లలూ, మీ జీవితాన్ని వజ్రతుల్యముగా తయారుచేసుకోండి. అది దైవీ ప్రపంచము, ఇది ఆసురీ ప్రపంచము. సత్యయుగములో ఎంత అపారమైన సుఖము ఉంటుంది. దానిని తండ్రియే ఇస్తారు. ఇక్కడ మీరు తండ్రి వద్దకు వచ్చారు. ఇక్కడే కూర్చుని ఉండిపోరు కదా. అందరూ కలిసి ఇక్కడే ఉండిపోయేది కూడా లేదు, ఎందుకంటే పిల్లలు అనంతముగా ఉన్నారు. ఇక్కడకు మీరు ఎంతో ఉల్లాసముతో వస్తారు. మేము అనంతమైన తండ్రి వద్దకు వెళ్తున్నాము, మేము ఈశ్వరీయ సంతానము, మేము గాడ్ ఫాదర్ పిల్లలము, మరి మేము స్వర్గములో ఎందుకు ఉండము? గాడ్ ఫాదర్ అయితే స్వర్గాన్నే రచిస్తారు కదా. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు ఉన్నాయి. హెవెన్లీ గాడ్ ఫాదర్ మనల్ని స్వర్గానికి యోగ్యులుగా తయారుచేస్తున్నారని మీకు తెలుసు. ప్రతి కల్పం తర్వాత తయారుచేస్తారు. తాను పాత్రధారి అని తెలిసిన మనుష్యులు ఒక్కరు కూడా లేరు. మనం భగవంతుడైన తండ్రికి పిల్లలము అన్నప్పుడు మరి మనం దుఃఖితులుగా ఎందుకు ఉన్నాము! పరస్పరం ఎందుకు కొట్లాడుకుంటాము! ఆత్మలమైన మనమందరమూ సోదరులమే కదా. సోదరులు పరస్పరం ఎలా కొట్లాడుకుంటూ ఉంటారో చూడండి. కొట్లాడుకుని అంతమైపోతారు. ఇక్కడ మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. సోదరులు ఎప్పుడూ పరస్పరం ఉప్పు నీరులా అవ్వకూడదు. ఇక్కడైతే తండ్రితో కూడా ఉప్పు నీరులా అయిపోతారు. మంచి-మంచి పిల్లలు ఉప్పు నీరులా అయిపోతారు. మాయ ఎంత శక్తివంతమైనది. మంచి-మంచి పిల్లలెవరైతే ఉంటారో, వారు తండ్రికి తప్పకుండా గుర్తుకువస్తారు. తండ్రికి పిల్లలపై ఎంత ప్రేమ ఉంది. తండ్రికి తన పిల్లలు తప్ప గుర్తు చేసుకునేందుకు ఇంకెవ్వరూ లేరు. మీకైతే ఎంతోమంది ఉన్నారు. మీ బుద్ధి ఇటూ, అటూ వెళ్తుంటుంది. వ్యాపార, వ్యవహారాలు మొదలైనవాటి వైపుకు కూడా బుద్ధి వెళ్తుంది. నాకైతే వ్యాపారము మొదలైనవి కూడా ఏవీ లేవు. అనేకమంది పిల్లలైన మీకు అనేక వ్యాపారాలు ఉన్నాయి. నాకైతే ఒకటే వ్యాపారము. నేను పిల్లలను స్వర్గానికి వారసులుగా తయారుచేసేందుకే వచ్చాను. అనంతమైన తండ్రికి ఆస్తి కేవలం పిల్లలైన మీరే. వారు గాడ్ ఫాదర్ కదా. ఆత్మలందరూ వారికి ఆస్తి. మాయ ఛీ-ఛీగా చేసేసింది. ఇప్పుడు పుష్పాల్లా తండ్రి తయారుచేస్తారు. తండ్రి అంటారు, నాకైతే కేవలం మీరే ఉన్నారు. మీపై నాకు మోహం కూడా ఉంది. మీరు ఉత్తరం వ్రాయకపోతే చింత కలుగుతుంది. మంచి-మంచి పిల్లల నుండి కూడా ఉత్తరం రాదు. మంచి-మంచి పిల్లలను మాయ పూర్తిగా అంతం చేసేస్తుంది. తప్పకుండా దేహాభిమానము ఉంది. మీ క్షేమ సమాచారాలు వ్రాస్తూ ఉండండి అని తండ్రి చెప్తూ ఉంటారు. బాబా పిల్లలను అడుగుతుంటారు - పిల్లలూ, మాయ మిమ్మల్ని హైరానా పరచడం లేదు కదా? సాహసవంతులుగా అయి మాయపై విజయాన్ని పొందుతున్నారు కదా! మీరు యుద్ధ మైదానములో ఉన్నారు కదా. కర్మేంద్రియాలను ఎలా వశం చేసుకోవాలంటే, కొద్దిగా కూడా అందులో చంచలత్వము ఉండకూడదు. సత్యయుగములో కర్మేంద్రియాలన్నీ వశములో ఉంటాయి. కర్మేంద్రియాల చంచలత్వము ఏ మాత్రమూ ఉండదు. నోటి యొక్క, చేతుల యొక్క, చెవుల యొక్క... అసలు చంచలత్వము యొక్క విషయమేదీ ఉండదు. అక్కడ ఎటువంటి అశుద్ధమైన వస్తువు ఉండదు. ఇక్కడ యోగబలం ద్వారా కర్మేంద్రియాలపై విజయము పొందుతారు. తండ్రి అంటారు, ఎటువంటి అశుద్ధమైన విషయమూ ఉండదు. కర్మేంద్రియాలను వశం చేసుకోవాలి. బాగా పురుషార్థము చేయాలి. సమయము చాలా తక్కువగా ఉంది. ఎంతో పోయింది, కొద్దిగా మాత్రమే ఉంది అన్న గాయనము కూడా ఉంది. ఇప్పుడు ఇక కొద్దిగా మాత్రమే మిగులుతూ ఉంటుంది. కొత్త ఇల్లు తయారవుతూ ఉంటే బుద్ధిలో ఉంటుంది కదా - ఇంకా కొద్ది సమయమే ఉంది, ఇప్పుడు ఇక ఇది తయారైపోతుంది, ఇంకా ఈ కొద్ది పనే మిగిలి ఉంది అని అనుకుంటారు. అది హద్దులోని విషయము, ఇది అనంతమైన విషయము. వారిది సైన్స్ బలమైతే మీది సైలెన్స్ బలము అని ఇది కూడా పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. వారిది కూడా బుద్ధిబలమే, మీది కూడా బుద్ధిబలమే. సైన్స్ ఇన్వెన్షన్లు ఎన్ని వెలువడుతూ ఉంటాయి. ఇప్పుడైతే ఎటువంటి బాంబులను తయారుచేస్తూ ఉంటారంటే, వాటిని అక్కడ కూర్చుని వదిలితే మొత్తం నగరమంతా అంతమైపోతుంది అని అంటారు. ఇక అప్పుడు ఈ సైన్యాలూ, విమానాలూ మొదలైనవి కూడా ఉపయోగపడవు. అది సైన్స్ బుద్ధి. మీది సైలెన్స్ బుద్ధి. వారు వినాశనం కోసం నిమిత్తము అయ్యారు. మీరు అవినాశీ పదవిని పొందేందుకు నిమిత్తము అయ్యారు. ఇది అర్థం చేసుకునే బుద్ధి కూడా కావాలి కదా.

తండ్రి ఎంతటి సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు అనేది పిల్లలైన మీరు అర్థం చేసుకోగలరు. ఎంతమంది అహల్యలు, నడుము ఒంగిపోయిన వృద్ధ మాతలు ఉన్నా కూడా, కేవలం రెండు మాటలు స్మృతి చేయాలి - తండ్రి మరియు వారసత్వము. ఆపై ఎవరు ఎంత స్మృతి చేస్తే అంత. ఇతర సాంగత్యాలను వదిలి ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి అంటారు, నేను మన ఇల్లు అయిన పరంధామములో ఉన్నప్పుడు, భక్తి మార్గములో మీరు పిలిచేవారు - బాబా, మీరు వచ్చినట్లయితే మేము సర్వస్వమూ బలిహారం చేస్తాము. వారు కాటికాపరి వంటివారు. కాటికాపరికి పాత సామానులు ఇవ్వడం జరుగుతుంది. మీరు తండ్రికి ఏమిస్తారు? వీరికి (బ్రహ్మాకు) అయితే ఇవ్వరు కదా. ఇతను కూడా తన సర్వస్వాన్నీ ఇచ్చేసారు. ఇతనేమీ ఇక్కడ కూర్చుని మహళ్ళను తయారుచేసుకోరు కదా. ఇవన్నీ శివబాబా కొరకే ఉన్నాయి. వారి డైరెక్షన్లతోనే చేస్తున్నారు. వారు చేసేవారు, చేయించేవారు. డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు. పిల్లలు అంటారు - బాబా, మాకు మీరొక్కరే, మీకైతే ఎంతోమంది పిల్లలు ఉన్నారు. అప్పుడు బాబా అంటారు - నాకైతే కేవలం పిల్లలైన మీరే ఉన్నారు, కానీ మీకైతే ఎంతోమంది ఉన్నారు. దైహిక సంబంధీకుల స్మృతి ఎంతగా ఉంటుంది. మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి చెప్తున్నారు - ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయండి మరియు అందరినీ మర్చిపోతూ ఉండండి. స్వర్గ రాజ్యపు వెన్న మీకు లభిస్తుంది. ఈ ఆట రచన ఎలా ఉందో కొంచెం ఆలోచించండి. మీరు కేవలం తండ్రిని స్మృతి చేస్తారు మరియు స్వదర్శన చక్రధారులుగా అవ్వడం ద్వారా చక్రవర్తీ రాజులుగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు ప్రాక్టికల్ గా అనుభవజ్ఞులుగా ఉన్నారు. భక్తి పరంపరగా కొనసాగుతూ వస్తోంది అని మనుష్యులు భావిస్తారు. అలాగే వికారాలు కూడా పరంపరగా కొనసాగుతూ వచ్చాయి. ఈ లక్ష్మీ-నారాయణులకు, రాధే-కృష్ణులకు కూడా పిల్లలు ఉండేవారు కదా అని అంటారు. అరే, అవును, పిల్లలు లేరని కాదు, కానీ వారిని సంపూర్ణ నిర్వికారులు అని అనడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నది సంపూర్ణ వికారులుగా. ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు శ్రీ శ్రీ అయిన తండ్రి శ్రీమతము లభిస్తుంది. మిమ్మల్ని శ్రేష్ఠముగా తయారుచేస్తారు. ఒకవేళ తండ్రి చెప్పింది పాటించకపోతే మరి అలా అవ్వరు. ఇక పాటిస్తారా, పాటించరా, మీ ఇష్టం. సుపుత్రులైన పిల్లలు అయితే వెంటనే పాటిస్తారు. పూర్తిగా సహాయము చేయకపోతే మిమ్మల్ని మీరే నష్టపరచుకుంటారు. తండ్రి అంటారు, నేను కల్ప-కల్పమూ వస్తాను. ఎంత పురుషార్థము చేయిస్తాను. ఎంత సంతోషములోకి తీసుకువెళ్తారు. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవడములోనే మాయ నిర్లక్ష్యము చేయిస్తుంది. కానీ మీరు ఆ వలలో చిక్కుకోకూడదు. మాయతోనే యుద్ధము జరుగుతుంది. చాలా పెద్ద-పెద్ద తుఫానులు వస్తాయి. అందులోనూ వారసులపైనే మాయ ఎక్కువగా యుద్ధము చేస్తుంది. రుస్తుమ్ తో రుస్తుమ్ గా అయి కొట్లాడుతుంది. ఏ విధంగా వైద్యుడు మందు ఇచ్చినప్పుడు రోగమంతా బయటికి వస్తుందో, అలాగే ఇక్కడ కూడా నావారిగా అయినప్పుడు అందరి స్మృతి రావడం మొదలవుతుంది. తుఫానులు వస్తాయి. ఇందులో లైన్ క్లియర్ గా ఉండాలి. మనం మొదట పవిత్రముగా ఉండేవారము, తర్వాత అర్ధకల్పము అపవిత్రముగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే ఈ యోగాగ్ని ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి. ఎంతగా స్మృతి చేస్తారో, అంతటి ఉన్నత పదవిని పొందుతారు. స్మృతి చేస్తూ-చేస్తూ మీరు ఇంటికి వెళ్ళిపోతారు, ఇందులో పూర్తిగా అంతర్ముఖత కావాలి. జ్ఞానము కూడా ఆత్మలోనే ధారణ అవుతుంది కదా. ఆత్మయే చదువుకుంటుంది. ఆత్మ జ్ఞానాన్ని కూడా పరమాత్మ అయిన తండ్రియే వచ్చి ఇస్తారు. విశ్వాధిపతులుగా అయ్యేందుకు మీరు ఇంత గొప్ప జ్ఞానాన్ని తీసుకుంటారు. మీరు నన్ను పతిత-పావనా, జ్ఞానసాగరా, శాంతిసాగరా అని పిలుస్తారు. నా వద్ద ఏదైతే ఉందో అదంతా మీకు ఇస్తాను. కేవలం దివ్యదృష్టి తాళంచెవిని మాత్రం ఇవ్వను. దానికి బదులుగా మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారుచేస్తాను. సాక్షాత్కారాలలో ఏమీ లేదు. ముఖ్యమైనది చదువు. చదువు ద్వారా మీకు 21 జన్మల సుఖము లభిస్తుంది. మీరాకు లభించిన సుఖముతో మీరు మీ సుఖాన్ని పోల్చి చూసుకోండి. ఆమె అయితే కలియుగములో ఉన్నారు, సాక్షాత్కారాలు పొందారు, ఆ తర్వాత ఏమిటి? భక్తి మాలయే వేరు. జ్ఞానమార్గపు మాల వేరు. రావణుడి రాజ్యము వేరు, మీ రాజ్యము వేరు. దానిని పగలు అని, దీనిని రాత్రి అని అంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్మృతి బలము ద్వారా ఎటువంటి చంచలత్వమూ ఉండని విధంగా మీ కర్మేంద్రియాలను వశం చేసుకోవాలి. సమయము చాలా తక్కువగా ఉంది, అందుకే బాగా పురుషార్థము చేసి మాయాజీతులుగా అవ్వాలి.

2. తండ్రి ఏ జ్ఞానమునైతే ఇస్తారో, దానిని అంతర్ముఖులుగా అయి ధారణ చేయాలి. ఎప్పుడూ పరస్పరం ఉప్పు నీరులా అవ్వకూడదు. తండ్రికి మీ క్షేమ సమాచారాలను తప్పకుండా అందించాలి.

వరదానము:-
కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేసే సర్వ ఆత్మల ఆశీర్వాదాలకు అధికారీ భవ

కళ్యాణకారీ వృతి ద్వారా సేవ చెయ్యటము - ఇదే సర్వ ఆత్మల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునేందుకు సాధనము. మేము విశ్వ కళ్యాణకారులము అన్న లక్ష్యము ఉన్నట్లయితే అకళ్యాణపు కర్తవ్యము జరగజాలదు. ఎటువంటి కార్యము ఉంటుందో, మీ ధారణలు ఆ విధంగా ఉంటాయి, ఒకవేళ కార్యము గుర్తు ఉన్నట్లయితే సదా దయాహృదయులుగా, సదా మహాదానులుగా ఉంటారు. ప్రతి అడుగులో కళ్యాణకారీ వృత్తితో నడుస్తారు, నేను అన్న భావము రాదు, నిమిత్త భావము గుర్తు ఉంటుంది. ఇటువంటి సేవాధారులకు సేవకు రిటర్నులో సర్వ ఆత్మల ఆశీర్వాదాల అధికారము ప్రాప్తిస్తుంది.

స్లోగన్:-
సాధనాల ఆకర్షణ సాధనను ఖండితము చేసేస్తుంది.

అవ్యక్త ప్రేరణలు - ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి

అంతర్ముఖీ ఆత్మలు మూడు రకాల భాషల యొక్క అనుభవజ్ఞులుగా ఉంటారు - 1. నయనాల భాష 2. భావన యొక్క భాష 3. సంకల్పాల భాష. ఈ మూడు రకాల భాషలు ఆత్మిక యోగీ జీవితము యొక్క భాషలు, ఎంతెంతగా మీరు అంతర్ముఖీ స్వీట్ సైలెన్స్ స్వరూపములో స్థితులవుతూ ఉంటారో, అంతగానే ఈ మూడు భాషల ద్వారా సర్వాత్మలకు అనుభవము చేయించగలరు. ఇప్పుడు ఈ ఆత్మిక భాష యొక్క అభ్యాసీలుగా అవ్వండి.