20-06-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తండ్రి ప్రేమను పొందాలంటే
ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి, తండ్రి నుండి మేము స్వర్గ వారసత్వాన్ని
తీసుకుంటున్నాము అన్న సంతోషములో ఉండండి’’
ప్రశ్న:-
సంగమయుగములో మీరు బ్రాహ్మణుల నుండి ఫరిశ్తాలుగా అయ్యేందుకు ఏ గుప్తమైన శ్రమను
చేస్తారు?
జవాబు:-
బ్రాహ్మణులైన
మీరు పవిత్రముగా అయ్యే గుప్తమైన శ్రమనే చేయవలసి ఉంటుంది. బ్రహ్మా పిల్లలైన మీరు
సంగమములో సోదరీ-సోదరులు, సోదరీ-సోదరులకు అశుద్ధమైన దృష్టి ఉండజాలదు. స్త్రీ-పురుషులు
ఇరువురూ కలిసి ఉంటూ స్వయాన్ని బి.కే.లుగా భావిస్తారు. ఈ స్మృతి ద్వారా ఎప్పుడైతే
పూర్తిగా పవిత్రముగా అవుతారో అప్పుడు ఫరిశ్తాలుగా అవ్వగలరు.
ఓంశాంతి
మధురాతి మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇక్కడ కూర్చోవాలి. ఈ రహస్యాన్ని
పిల్లలైన మీరు కూడా అర్థం చేయించాలి. ఆత్మాభిమానులుగా అయి కూర్చున్నట్లయితే తండ్రి
పట్ల ప్రేమ ఉంటుంది. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. బాబా నుండి మనం స్వర్గ
వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఈ స్మృతి రోజంతా బుద్ధిలో ఉండాలి - ఇందులోనే శ్రమ
ఉంది. ఇది ఘడియ-ఘడియ మర్చిపోయినట్లయితే సంతోషపు పాదరసము దిగిపోతుంది. పిల్లలూ,
దేహీ-అభిమానులుగా అయి కూర్చోండి, స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అప్రమత్తం
చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళా కదా. మేళా జరిగింది,
ఎప్పుడు జరిగింది? తప్పకుండా కలియుగ అంతము మరియు సత్యయుగ ఆది యొక్క సంగమములోనే జరిగి
ఉంటుంది కదా. ఈ రోజు పిల్లలకు టాపిక్ పై అర్థం చేయిస్తాము. మీరు ఇలా టాపిక్ లను
తప్పకుండా తీసుకోవాలి. ఉన్నతోన్నతుడు భగవంతుడు, ఆ తర్వాత కిందకు వస్తే
బ్రహ్మా-విష్ణు-శంకరులు. తండ్రి మరియు దేవతలు. శివునికి మరియు బ్రహ్మా, విష్ణు,
శంకరులకు సంబంధమేమిటి అనేది మనుష్యులకు తెలియదు. ఎవ్వరికీ వీరి జీవితగాథను గురించి
తెలియదు. త్రిమూర్తి చిత్రము ప్రసిద్ధమైనది. ఈ ముగ్గురూ దేవతలు. కేవలం ముగ్గురితోనే
ధర్మము ఉండదు కదా. ధర్మమనేది పెద్దగా ఉంటుంది, అది దేవతా ధర్మము. వారు సూక్ష్మ
వతనవాసులు, పైన శివబాబా ఉన్నారు. ముఖ్యమైనవారు బ్రహ్మా మరియు విష్ణువు. బ్రహ్మా
నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మాగా ఎలా అవుతారు అని మీరు టాపిక్ ను ఇవ్వాలి
అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. మేము శూద్రుల నుండి బ్రాహ్మణులుగా,
బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము అని మీరు ఎలా అయితే అంటారో అలాగే వీరి విషయములో
కూడా జరుగుతుంది. మొట్టమొదట బ్రహ్మా నుండి విష్ణువుగా, ఆ తర్వాత విష్ణువు నుండి
బ్రహ్మాగా అవుతారు. వారైతే ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అనేస్తారు. అది
పొరపాటు. అసలు అలా జరగదు కూడా. కావున ఈ టాపిక్ పై బాగా అర్థం చేయించాలి. పరమాత్మ
శ్రీకృష్ణుని తనువులోకి వచ్చారు అని కొందరు అంటారు. ఒకవేళ శ్రీకృష్ణునిలోకి
వచ్చినట్లయితే ఇక బ్రహ్మా పాత్ర సమాప్తమైపోతుంది కదా! శ్రీకృష్ణుడు సత్యయుగపు మొదటి
యువరాజు. అక్కడికి వారు వచ్చి పావనముగా చేయడానికి అసలు అక్కడ పతితులు ఎలా ఉండగలరు.
అది పూర్తిగా తప్పు. ఈ విషయాలు కూడా మహారథులైన సర్వీసబుల్ పిల్లలే అర్థం చేసుకుంటారు.
ఇంకెవ్వరి బుద్ధిలోనూ కూర్చోనే కూర్చోవు. ఈ టాపిక్ అయితే చాలా ఫస్ట్ క్లాస్ అయినది.
బ్రహ్మా నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మాగా ఎలా అవుతారు? వారి జీవితగాథను
గురించి తెలియజేస్తారు ఎందుకంటే వీరిరువురుకీ సంబంధముంది. అసలు మొదలుపెట్టడమే ఇలా
మొదలుపెట్టాలి. బ్రహ్మా నుండి విష్ణువుగా ఒక్క క్షణములో అవుతారు. విష్ణువు నుండి
బ్రహ్మాగా అయ్యేందుకు 84 జన్మలు పడుతుంది. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు.
ఇప్పుడు మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు. ప్రజాపిత బ్రహ్మా యొక్క బ్రాహ్మణ కులము
ఏమయ్యింది? ప్రజాపిత బ్రహ్మాకైతే కొత్త ప్రపంచము కావాలి కదా. కొత్త ప్రపంచము
సత్యయుగము. అక్కడైతే ప్రజాపిత లేరు. కలియుగములో కూడా ప్రజాపిత ఉండజాలరు. వారు
సంగమయుగములో ఉన్నారు. మీరు ఇప్పుడు సంగమయుగములో ఉన్నారు. మీరు శూద్రుల నుండి
బ్రాహ్మణులుగా అయ్యారు. తండ్రి బ్రహ్మాను దత్తత తీసుకున్నారు. శివబాబా వీరిని ఎలా
రచించారు అన్నది ఎవ్వరికీ తెలియదు. త్రిమూర్తి చిత్రములో రచయిత అయిన శివుని చిత్రమే
లేదు, కావున వారికి ఉన్నతోన్నతమైనవారు భగవంతుడని, మిగిలినవారంతా వారి రచనయే అని ఎలా
తెలుస్తుంది. ఇది బ్రాహ్మణ సాంప్రదాయము, కావున తప్పకుండా ప్రజాపిత కావాలి.
కలియుగములో అయితే ఉండరు. అలాగే సత్యయుగములో కూడా ఉండరు. బ్రాహ్మణ దేవీ-దేవతాయ నమః
అని అంటూ ఉంటారు. మరి బ్రాహ్మణులు ఎక్కడివారు? ప్రజాపిత బ్రహ్మా ఎక్కడివారు?
తప్పకుండా సంగమయుగములోనివారు అనే అంటారు. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఈ సంగమయుగము
గురించి ఏ శాస్త్రాలలోనూ వర్ణన లేదు. మహాభారత యుద్ధము కూడా సంగమములో జరిగింది,
అంతేకానీ సత్యయుగములో లేక కలియుగములో కాదు. పాండవులు మరియు కౌరవులు, వీరు
సంగమయుగములో ఉన్నారు. పాండవులైన మీరు సంగమయుగవాసులు, కౌరవులు కలియుగవాసులు. గీతలో
కూడా భగవానువాచ ఉంది కదా. మీరు పాండవులు, దైవీ సాంప్రదాయులు. మీరు ఆత్మిక పండాలుగా
అవుతారు. మీది ఆత్మిక యాత్ర, దీనిని మీరు బుద్ధి ద్వారా చేస్తారు.
తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, స్మృతి యాత్రలో ఉండండి. దైహికమైన
యాత్రలలో తీర్థయాత్రలకు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు. అది అర్ధకల్పము కొనసాగుతుంది.
ఈ సంగమయుగ యాత్ర ఒకేసారి జరుగుతుంది. మీరు వెళ్ళి మృత్యులోకములోకి తిరిగి రారు. మీరు
పవిత్రముగా అయి మళ్ళీ పవిత్ర ప్రపంచములోకి రావాలి, అందుకే మీరు ఇప్పుడు పవిత్రముగా
అవుతున్నారు. ఇప్పుడు మనం బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందినవారమని మీకు తెలుసు. ఆ
తర్వాత దైవీ సాంప్రదాయులుగా, విష్ణు సాంప్రదాయులుగా అవుతాము. సత్యయుగములో
దేవీ-దేవతలు విష్ణు సాంప్రదాయులు. అక్కడ చతుర్భుజుని ప్రతిమ ఉంటుంది, తద్వారా వారు
విష్ణు సాంప్రదాయానికి చెందినవారని తెలుస్తుంది. ఇక్కడ రావణుని ప్రతిమ ఉంది, కావున
వీరు రావణ సాంప్రదాయులు. ఈ టాపిక్ పెట్టినట్లయితే మనుష్యులు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు
మీరు దేవతలుగా అయ్యేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. బ్రహ్మా ముఖవంశావళీ
బ్రాహ్మణులైన మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. దత్తత తీసుకోబడ్డారు.
బ్రాహ్మణులు కూడా ఇక్కడే ఉన్నారు, ఆ తర్వాత దేవతలుగా కూడా ఇక్కడే అవుతారు. వంశావళి
ఇక్కడే ఉంటుంది. వంశావళి అని రాజ్యమునే అంటారు. విష్ణు వంశావళి ఉంటుంది. దానిని
బ్రాహ్మణుల వంశావళి అని అనరు. ఆ రాజ్యవంశావళిలో రాజ్యము కొనసాగుతుంది. ఒకరి తర్వాత
రెండవవారు, ఆ తర్వాత మూడవవారు కొనసాగుతారు. మనం బ్రాహ్మణ కులభూషణులమని ఇప్పుడు మీకు
తెలుసు. ఆ తర్వాత మనం దేవతలుగా అవుతాము. బ్రాహ్మణుల నుండి విష్ణుకులములోకి,
విష్ణుకులము నుండి క్షత్రియ చంద్రవంశీ కులములోకి, ఆ తర్వాత వైశ్యకులములోకి, ఆ
తర్వాత శూద్రకులములోకి వస్తాము, మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. అర్థము
ఎంత స్పష్టముగా ఉంది. చిత్రాలలో ఏమేమి చూపిస్తారో చూడండి. బ్రాహ్మణులమైన మనం
విష్ణుపురికి అధిపతులుగా అవుతాము. ఇందులో తికమకపడకూడదు. బాబా వ్యాసములా వ్రాయమని
ఏవైతే టాపిక్ లు ఇస్తారో, వాటిపై ఎవరికి ఎలా అర్థం చేయించాలి అంటూ విచార సాగర మంథనము
చేయాలి, తద్వారా మనుష్యులు వీరి వివరణ చాలా బాగుంది అని ఆశ్చర్యపోవాలి. జ్ఞానసాగరుడు
తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. విచార సాగర మంథనము చేసి కూర్చుని వ్రాయాలి, ఆ
తర్వాత వాటిని చదివితే ఈ-ఈ పదాలను కలపాలి అన్న ఆలోచన కలుగుతుంది. బాబా కూడా
మొట్టమొదట మురళిని వ్రాసి మీ చేతికి ఇచ్చేవారు, ఆ తర్వాత మీరు వినిపించేవారు.
ఇక్కడైతే మీరు ఇంట్లో తండ్రితోపాటు ఉంటారు. ఇప్పుడైతే మీరు ఇక బయటకు వెళ్ళి
వినిపించవలసి ఉంటుంది. ఈ టాపిక్ లు చాలా అద్భుతమైనవి. బ్రహ్మా నుండి విష్ణువుగా ఎలా
అవుతారు? అన్నదాని గురించి ఎవ్వరికీ తెలియదు. విష్ణు నాభి నుండి బ్రహ్మాను
చూపిస్తారు. గాంధీ నాభి నుండి నెహ్రూను చూపించినట్లుగా చూపిస్తారు. కానీ వంశావళి
అయితే కావాలి కదా. బ్రాహ్మణ కులములో రాజ్యము లేదు. బ్రాహ్మణ సాంప్రదాయులే దైవీ
వంశావళివారిగా అవుతారు. ఆ తర్వాత చంద్రవంశీ రాజ్యములోకి వెళ్తారు, ఆ తర్వాత వైశ్య
వంశావళిలోకి వెళ్తారు. ఇలా ప్రతి ఒక్క వంశావళి నడుస్తుంది కదా. సత్యయుగము నిర్వికారీ
ప్రపంచము, కలియుగము వికారీ ప్రపంచము. ఈ రెండు పదాలు కూడా ఎవరి బుద్ధిలోనూ లేవు.
లేదంటే వికారుల నుండి నిర్వికారులుగా ఎలా అవుతారు అన్నది బుద్ధిలో తప్పకుండా ఉండాలి.
మనుష్యులకు నిర్వికారుల గురించీ తెలియదు, వికారుల గురించీ తెలియదు. దేవతలు
నిర్వికారులు అని మీకు అర్థం చేయించడం జరుగుతుంది. బ్రాహ్మణులు నిర్వికారులు అని
ఎప్పుడూ వినలేదు. కొత్త ప్రపంచము నిర్వికారీ ప్రపంచము, పాత ప్రపంచము వికారీ ప్రపంచము.
కావున తప్పకుండా సంగమయుగాన్ని చూపించవలసి ఉంటుంది. దీని గురించి ఎవ్వరికీ తెలియదు.
పురుషోత్తమ మాసమును జరుపుకుంటారు కదా. వారు 3 సంవత్సరాల తర్వాత ఒక నెలను అలా
జరుపుకుంటారు. మీకు 5000 సంవత్సరాల తర్వాత ఒక్క సంగమయుగము వస్తుంది. మనుష్యులకు
ఆత్మ మరియు పరమాత్మలను గురించి యథార్థముగా తెలియదు. కేవలం ఒక అద్భుతమైన సితార
మెరుస్తూ ఉంటుంది అని అంటారు. రామకృష్ణ పరమహంసుని శిష్యుడైన వివేకానంద, నేను గురువు
ఎదురుగా కూర్చున్నాను అని అనేవారు కదా, ఇలా గురువును కూడా ధ్యానము చేస్తారు కదా.
ఇప్పుడు తండ్రి - నన్నొక్కరినే స్మృతి చేయండి అని అంటారు. ఇందులో ధ్యానము యొక్క
విషయమేదీ లేదు, గురువు స్మృతి అయితే ఉండనే ఉంటుంది. ప్రత్యేకముగా కూర్చొని స్మృతి
చేయడం ద్వారా వారేమైనా గుర్తుకు వస్తారా? వారికి వారి గురువు పట్ల, ఇతను భగవంతుడు
అన్న భావన ఉండేది కావున గురువు ఆత్మ బయటకు వచ్చి నాలో లీనమైపోయింది అన్నట్లు అతను
చూసారు. కానీ ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళి కూర్చొంది, ఆ తర్వాత ఏమయ్యింది అని దాని
గురించి వర్ణన ఏమీ లేదు. నాకు భగవంతుని సాక్షాత్కారము కలిగింది అని అతను సంతోషించారు,
అంతే. భగవంతుడు ఎవరు అన్నది వారికి తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మెట్ల
చిత్రముపై మీరు అర్థం చేయించండి. ఇది భక్తి మార్గము. ఒకటేమో భక్తి యొక్క నావ,
ఇంకొకటి జ్ఞానము యొక్క నావ అని మీకు తెలుసు. జ్ఞానము వేరు, భక్తి వేరు. బాబా అంటారు,
నేను మీకు కల్పపూర్వము జ్ఞానాన్ని ఇచ్చాను, విశ్వాధిపతులుగా తయారుచేసాను, ఇప్పుడు
మీరు ఎక్కడ ఉన్నారు. పిల్లలైన మీ బుద్ధిలో - ఇతర వంశావళులు ఎలా వస్తాయి, వృక్షం ఎలా
పెరుగుతుంది అని మొత్తం జ్ఞానమంతా ఉంది. పుష్పగుచ్చము ఉంటుంది కదా, అలా ఈ సృష్టి
రూపీ వృక్షము కూడా పుష్పగుచ్చము వంటిది. మధ్యలో మీ ధర్మము ఉంది, ఆ తర్వాత దీని నుండి
ఇతర మూడు ధర్మాలు వెలువడుతాయి, ఇక అక్కడ నుండి వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ వృక్షాన్ని
కూడా స్మృతి చేయాలి. ఎన్ని శాఖోపశాఖలు మొదలైనవి వెలువడుతూ ఉంటాయి. చివరిలో
వచ్చేవారికి గౌరవము కూడా ఉంటుంది. మర్రివృక్షము ఉంటుంది కదా, దానికి కాండము లేదు.
కానీ మొత్తం వృక్షమంతా నిలబడి ఉంటుంది. అలా దేవీ-దేవతా ధర్మము కూడా అంతమైపోయింది,
పూర్తిగా కుళ్ళిపోయింది. భారతవాసులకు తమ ధర్మము గురించి అసలు ఏ మాత్రమూ తెలియదు,
మిగిలినవారందరికీ తమ ధర్మాల గురించి తెలుసు లేదా మేము ధర్మమునే నమ్మము అని అంటారు.
ముఖ్యమైనవి నాలుగు ధర్మాలు. మిగతా చిన్న-చిన్నవైతే ఎన్నో ఉన్నాయి. ఈ వృక్షము గురించి
మరియు సృష్టి చక్రము గురించి మీకు ఇప్పుడే తెలుసు. దేవీ-దేవతా ధర్మము పేరునే మాయం
చేసేసారు. ఆ తర్వాత తండ్రి దానిని స్థాపన చేసి మిగిలిన అని ధర్మాలనూ వినాశనం
చేసేస్తారు. చక్రము చిత్రము వైపుకు కూడా తప్పకుండా తీసుకువెళ్ళాలి. ఇది సత్యయుగము,
ఇది కలియుగము. కలియుగములో ఎన్ని ధర్మాలు ఉన్నాయి, సత్యయుగములో ఒకే ధర్మము ఉంది. ఏక
ధర్మ స్థాపనను, అనేక ధర్మాల వినాశనాన్ని ఎవరు చేస్తూ ఉండవచ్చు? భగవంతుడు కూడా
తప్పకుండా ఎవరో ఒకరి ద్వారానే చేయిస్తారు కదా. తండ్రి అంటారు, బ్రహ్మా ద్వారా ఆది
సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేయిస్తాను. బ్రాహ్మణుల నుండి విష్ణుపురిలోని
దేవతలుగా అవుతారు.
సంగమములో బ్రాహ్మణులైన మీరు పవిత్రముగా అయ్యే గుప్తమైన శ్రమనే చేయవలసి ఉంటుంది.
బ్రహ్మా పిల్లలైన మీరు సంగమములో సోదరీ-సోదరులు. సోదరీ-సోదరుల మధ్యన అశుద్ధమైన దృష్టి
ఉండకూడదు. స్త్రీ, పురుషులిరువురూ తమను తాము బి.కే.లుగా భావిస్తారు, ఇందులో ఎంతో
శ్రమ ఉంది. స్త్రీ, పురుషుల ఆకర్షణ ఎటువంటిదంటే ఇక ముట్టుకోకుండా ఉండలేకపోతారు.
ఇక్కడ సోదరీ, సోదరులు ఎప్పుడూ ఒకరినొకరు ముట్టుకోకూడదు, లేదంటే పాపం ఫీలింగ్
కలుగుతుంది. మనం బి.కే.లము - ఈ విషయాన్ని మర్చిపోతే ఇక అంతమైపోతారు. ఇందులో చాలా
గుప్తమైన శ్రమ ఉంది. యుగళులుగా ఉంటారు కానీ ఎవరికేమి తెలుసు? తాము బి.కే.లము,
ఫరిశ్తాలము అని వారికి స్వయమే తెలుసు. ఎప్పుడూ ముట్టుకోకూడదు. ఇలా చేస్తూ-చేస్తూ
సూక్ష్మవతనవాసులైన ఫరిశ్తాలుగా అయిపోతారు. లేదంటే ఫరిశ్తాలుగా అవ్వలేరు. ఫరిశ్తాలుగా
అవ్వాలంటే పవిత్రముగా ఉండవలసి ఉంటుంది. ఇటువంటి జంటగా తయారైతే నంబర్ వన్ లోకి
వెళ్తారు. కొందరు అంటారు - దాదా అయితే అన్నీ అనుభవం చేసారు, చివరిలో సన్యసించారు,
ఎవరైతే జంటగా ఉంటారో వారికే చాలా కష్టము అని. ఇందులో జ్ఞానము మరియు యోగము కూడా
కావాలి. అనేకులను తమ సమానముగా చేస్తేనే గొప్ప రాజులుగా అవుతారు. కేవలం ఒక్క విషయమే
కాదు కదా. తండ్రి అంటారు, మీరు శివబాబాను స్మృతి చేయండి. ఇతను ప్రజాపిత. కొందరు
ఎలాంటివారు ఉన్నారంటే - మా పని శివబాబాతోనే ఉంది, మేము అసలు బ్రహ్మాను ఎందుకు స్మృతి
చేయాలి, వారికి అసలు ఉత్తరం ఎందుకు వ్రాయాలి అని అంటారు. అటువంటివారు కూడా ఉన్నారు.
మీరు శివబాబాను స్మృతి చేయాలి, అందుకే బాబా ఫోటోలు మొదలైనవి కూడా ఇవ్వరు. వీరిలోకి
శివబాబా వస్తారు, వీరు దేహధారి కదా. ఇప్పుడైతే పిల్లలైన మీకు తండ్రి నుండి వారసత్వము
లభిస్తుంది. ఆ గురువులు స్వయాన్ని ఈశ్వరునిగా భావిస్తారు, మరి వారి నుండి ఏమి
లభిస్తుంది. భారతవాసులు ఎంతగా నష్టపోయారు. భారతవాసులు పూర్తిగా దివాలా తీసేశారు.
ప్రజల నుండి భిక్ష యాచిస్తూ ఉంటారు.10-20 సంవత్సరాలు అప్పులు తీసుకుంటూ ఉంటారు, ఆ
తర్వాత ఇచ్చేది కూడా ఉండదు. ఇచ్చేవారు, తీసుకునేవారు ఇరువురూ అంతమైపోతారు. మొత్తం
ఆటే అంతమైపోనున్నది. అనేక కష్టాలు తలపై ఉన్నాయి. దివాలా తీయడం, రోగగ్రస్థమవ్వడం
మొదలైనవి ఎన్నో ఉన్నాయి. కొందరు షావుకార్ల వద్ద ఉంచుతారు, ఒకవేళ వాళ్ళు దివాలా
తీస్తే ఆ పేదవారికి ఎంత దుఃఖము కలుగుతుంది. అడుగడుగులోనూ దుఃఖమే దుఃఖము ఉంది.
అకస్మాత్తుగా కూర్చుని, కూర్చుని మరణిస్తారు. ఇది ఉన్నదే మృత్యులోకము. అమరలోకములోకి
మీరు ఇప్పుడు వెళ్తున్నారు. మీరు అమరపురికి చక్రవర్తులుగా అవుతారు. అమరనాథుడు
పార్వతులైన మీకు సత్యాతి-సత్యమైన అమరకథను వినిపిస్తున్నారు. బాబా అమరుడని, వారి
నుండి మనం అమరకథను వింటున్నామని మీకు తెలుసు. ఇప్పుడు అమరలోకములోకి వెళ్ళాలి. ఈ
సమయములో మీరు సంగమయుగములో ఉన్నారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. విచార సాగర మంథనము చేసి ‘‘బ్రహ్మా నుండి విష్ణువు’’గా ఎలా అవుతారు అన్న టాపిక్
పై వినిపించాలి. బుద్ధిని జ్ఞాన మంథనములో బిజీగా ఉంచుకోవాలి.
2. రాజ్యపదవిని ప్రాప్తి చేసుకునేందుకు జ్ఞానము మరియు యోగముతో పాటుగా తమ సమానముగా
తయారుచేసే సేవను కూడా చేయాలి. మీ దృష్టిని చాలా శుద్ధముగా చేసుకోవాలి.
వరదానము:-
సర్వ సంబంధాల అనుభవాన్ని ఒక్క తండ్రితో చేసే అలసిపోని మరియు
విఘ్న వినాశక భవ
ఏ పిల్లలకు సర్వ సంబంధాలు ఒక్క తండ్రితో ఉన్నాయో, వారికి
ఇతర సంబంధాలన్నీ నిమిత్తమాత్రముగా అనుభవమవుతాయి, వారు సదా సంతోషములో నాట్యము
చేసేవారిగా ఉంటారు, ఎప్పుడూ అలసటను అనుభవము చేయరు, అలసిపోనివారిగా ఉంటారు. తండ్రి
మరియు సేవ, ఈ తపనలోనే నిమగ్నమై ఉంటారు. విఘ్నాల కారణముగా ఆగిపోయేందుకు బదులుగా సదా
విఘ్న వినాశకులుగా ఉంటారు. సర్వ సంబంధాల అనుభూతి ఒక్క తండ్రితో ఉన్న కారణముగా డబుల్
లైట్ గా ఉంటారు, ఎటువంటి భారమూ ఉండదు, ఫిర్యాదులన్నీ సమాప్తమైపోతాయి, కంప్లీట్
స్థితి (సంపన్న స్థితి) అనుభవమవుతుంది, సహజయోగులుగా ఉంటారు.
స్లోగన్:-
సంకల్పములో కూడా ఏ దేహధారి వైపుకైనా ఆకర్షితమవ్వటము అనగా అవిశ్వాసపాత్రులుగా అవ్వటము.
అవ్యక్త ప్రేరణలు -
ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి
ఏ విధంగా
అంతరిక్షయానము చేసేవారు పైన ఉన్న కారణముగా మొత్తం భూమిపై ఎక్కడి చిత్రాన్ని ఫొటో
తీయాలనుకున్నా తీయగలరో, అదే విధంగా సైలెన్స్ శక్తితో అంతర్ముఖీ యానము ద్వారా, మనసా
శక్తి ద్వారా ఏ ఆత్మలకైనా చరిత్రవంతులుగా అయ్యే, శ్రేష్ఠ ఆత్మలుగా అయ్యే ప్రేరణను
ఇవ్వగలుగుతారు.
| | |