20-12-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ ఉన్నతమైన భాగ్యాన్ని తయారుచేయడానికి సద్గురువు వచ్చారు కావున మీ నడవడిక చాలా-చాలా రాయల్ గా ఉండాలి’’

ప్రశ్న:-
డ్రామాలో ఏ ప్లాన్ తయారై ఉన్న కారణముగా ఎవరిపైనా దోషము మోపలేరు?

జవాబు:-
డ్రామాలో ఈ పాత ప్రపంచపు వినాశనము యొక్క ప్లాన్ తయారై ఉంది, ఇందులో ఎవరి దోషమూ లేదు. ఈ సమయములో దీని వినాశనము కోసం ప్రకృతికి తీవ్రముగా కోపం వచ్చింది. నలువైపులా భూకంపాలు వస్తాయి, ఇళ్ళు కూలిపోతాయి, వరదలు వస్తాయి, కరువు కాటకాలు వస్తాయి, అందుకే తండ్రి అంటారు - పిల్లలూ, ఇప్పుడు ఈ పాత ప్రపంచము నుండి మీరు మీ బుద్ధియోగాన్ని తొలగించండి, సద్గురువు యొక్క శ్రీమతముపై నడవండి. జీవిస్తూనే దేహ భానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసే పురుషార్థము చేస్తూ ఉండండి.

పాట:-
మనము ఆ మార్గములో నడవాలి...

ఓంశాంతి
ఏ మార్గములో నడవాలి? గురువు యొక్క మార్గములో నడవాలి. వీరు ఏ గురువు? లేస్తూ-కూర్చుంటూ మనుష్యుల నోటి నుండి వాహ్ గురు అని వెలువడుతుంది. గురువులైతే అనేకమంది ఉన్నారు. వాహ్ గురు అని ఎవరిని అంటారు? ఎవరి మహిమను గానము చేస్తారు? సద్గురువు ఒక్క తండ్రి మాత్రమే. భక్తి మార్గములో అనేకమంది గురువులు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని మహిమ చేస్తుంటారు. సత్యమైన సద్గురువు వారొక్కరేనని పిల్లల బుద్ధిలో ఉంది, వారినే వాహ్, వాహ్ అని అనడము జరుగుతుంది. సత్యమైన సద్గురువు ఉన్నారంటే తప్పకుండా అసత్యమైనవారు కూడా ఉంటారు. సత్యమైనవారు సంగమయుగములోనే ఉంటారు. భక్తి మార్గములో కూడా సత్యమైనవారి యొక్క మహిమను గానము చేస్తారు. ఉన్నతోన్నతమైన తండ్రి మాత్రమే సత్యమైనవారు, వారే ముక్తిదాతగా, మార్గదర్శకునిగా కూడా అవుతారు. ఈ రోజుల్లోని గురువులైతే గంగా స్నానాలకు లేక తీర్థయాత్రలకు తీసుకువెళ్ళేందుకు మార్గదర్శకులుగా అవుతారు. ఈ సద్గురువు అయితే అటువంటివారు కాదు. అందరూ వీరిని ఓ పతిత-పావనా రండి అని గుర్తు చేస్తుంటారు. పతిత-పావనుడని సద్గురువును మాత్రమే అంటారు. వారే పావనముగా తయారుచేయగలరు. ఆ గురువులు పావనముగా తయారుచేయలేరు. ఆ గురువులెవ్వరూ - నన్నొక్కరినే స్మృతి చేయండి అని ఈ విధముగా చెప్పరు. గీతను కూడా చదువుతారు కానీ అర్థము ఏ మాత్రమూ తెలియదు. ఒకవేళ సద్గురువు ఒక్కరేనని భావిస్తే ఇక స్వయాన్ని గురువుగా చెప్పుకోరు. డ్రామానుసారముగా భక్తి మార్గపు డిపార్టుమెంటే వేరు, అందులో అనేకమంది గురువులు, అనేకమంది భక్తులు ఉన్నారు. వీరైతే ఒక్కరే. ఆ తర్వాత ఈ దేవీ-దేవతలు మొదటి నంబరులోకి వస్తారు. ఇప్పుడు వారు చివరిలో ఉన్నారు. తండ్రి వచ్చి వారికి సత్యయుగము యొక్క రాజ్యాధికారాన్ని ఇస్తారు, మిగిలినవారందరూ ఆటోమేటిక్ గా తిరిగి వెళ్ళాలి, అందుకే సర్వుల సద్గతిదాత ఒక్కరేనని అంటారు. కల్ప-కల్పము సంగమయుగములోనే దేవీ-దేవతా ధర్మము యొక్క స్థాపన జరుగుతుందని మీరు అర్థం చేసుకుంటారు. మీరు పురుషోత్తములుగా అవుతారు. మీరు ఇంకే పనీ చేయరు. గతి-సద్గతిదాత ఒక్కరేనని అంటూ ఉంటారు కూడా. ఈ మహిమ కేవలం తండ్రిది మాత్రమే. గతి-సద్గతి సంగమయుగములోనే లభిస్తుంది. సత్యయుగములోనైతే ఒకే ధర్మముంటుంది. ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయము కదా. కానీ ఈ బుద్ధిని ఎవరు ఇస్తారు? తండ్రియే వచ్చి యుక్తిని తెలియజేస్తారని మీరు అర్థం చేసుకుంటారు. శ్రీమతాన్ని ఎవరికి ఇస్తారు? ఆత్మలకు. వారు తండ్రి కూడా, సద్గురువు కూడా, టీచర్ కూడా. వారు జ్ఞానాన్ని నేర్పిస్తారు కదా. మిగిలిన గురువులందరూ భక్తిని మాత్రమే నేర్పిస్తారు. తండ్రి ఇచ్చే జ్ఞానము ద్వారా మీకు సద్గతి లభిస్తుంది. ఇక తర్వాత ఈ పాత ప్రపంచము నుండి వెళ్ళిపోతారు. ఇది మీ అనంతమైన సన్యాసము కూడా. తండ్రి అర్థం చేయించారు, ఇప్పుడు మీ 84 జన్మల చక్రము పూర్తయ్యింది. ఇప్పుడు ఈ ప్రపంచము సమాప్తమవ్వనున్నది. ఏ విధముగానైతే ఎవరికైనా అనారోగ్యముగా సీరియస్ గా ఉంటే, ఇప్పుడు ఇతను మరణించనున్నారు, ఇతడిని ఏమి తలచుకుంటాము అని అంటారు. శరీరము సమాప్తమైపోతుంది. ఇకపోతే ఆత్మ వెళ్ళి మరొక శరీరము తీసుకుంటుంది. ఆశ కోల్పోతారు. బెంగాల్ లోనైతే బ్రతుకుతారనే ఆశ లేకపోతే గంగ వద్దకు తీసుకువెళ్ళి ప్రాణము పోవాలని ముంచేస్తారు. మూర్తులను కూడా పూజించి వెళ్ళి మునిగిపో, మునిగిపో... అని అంటారు. ఇప్పుడు మీకు తెలుసు - ఈ పాత ప్రపంచమంతా మునిగిపోనున్నది. వరదలు వస్తాయి, నిప్పు అంటుకుంటుంది, ఆకలితో మనుష్యులు మరణిస్తారు. ఈ పరిస్థితులన్నీ రానున్నాయి. భూకంపాలలో ఇళ్ళు మొదలైనవి కూలిపోతాయి. ఈ సమయములో ప్రకృతికి కోపమొస్తే అందరినీ సమాప్తము చేసేస్తుంది. ఈ పరిస్థితులన్నీ మొత్తము ప్రపంచమంతటికీ రానున్నాయి. అనేక రకాలుగా మృత్యువు వస్తుంది. బాంబులలో కూడా విషము నిండి ఉంటుంది. కొద్దిగా వాటి వాసన పీల్చగానే స్పృహ కోల్పోతారు. ఏమేమి జరగనున్నాయి అనేది పిల్లలైన మీకు తెలుసు. ఇవన్నీ ఎవరు చేయిస్తారు? తండ్రి అయితే చేయించరు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎవ్వరి పైనా దోషము మోపరు. డ్రామా ప్లాన్ తయారై ఉంది. పాత ప్రపంచమే మళ్ళీ తప్పకుండా కొత్తదిగా అవుతుంది. ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. వినాశనము జరగవలసిందే. ఈ పాత ప్రపంచము నుండి బుద్ధియోగాన్ని తొలగించండి, దీనిని అనంతమైన సన్యాసమని అంటారు.

ఇప్పుడు మీరు అంటారు - వాహ్ సద్గురువు వాహ్! మీరు మాకు ఈ మార్గాన్ని తెలియజేసారు. సద్గురువును నిందింపజేసే విధమైన నడవడికను నడవకండి అని పిల్లలకు కూడా అర్థం చేయిస్తారు. మీరు ఇక్కడ జీవిస్తూనే మరణిస్తారు. దేహాన్ని విడిచి స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. దేహము నుండి అతీతమైన ఆత్మగా అయి తండ్రిని స్మృతి చేయాలి. వాహ్ సద్గురువు వాహ్! అని వీరు చాలా బాగా అంటారు. పారలౌకిక సద్గురువుకు మాత్రమే వాహ్-వాహ్ జరుగుతుంది. లౌకిక గురువులైతే అనేకమంది ఉన్నారు. సత్యాతి సత్యమైన సద్గురువు అయితే ఒక్కరే, భక్తి మార్గములో కూడా వారి పేరే కొనసాగుతూ వస్తుంది. మొత్తము సృష్టి అంతటికీ తండ్రి అయితే ఒక్కరే. కొత్త సృష్టి స్థాపన ఎలా జరుగుతుంది, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ప్రళయము జరిగిందని, ఆ తర్వాత రావి ఆకుపై శ్రీకృష్ణుడు వచ్చారని శాస్త్రాలలో చూపిస్తారు. రావి ఆకుపై ఎలా వస్తారు అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. శ్రీకృష్ణుని మహిమ చేయడము వలన లాభమేమీ ఉండదు. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కే కళలోకి తీసుకువెళ్ళేందుకు సద్గురువు లభించారు. మీ ఎక్కే కళతో సర్వులకు మేలు జరుగుతుందని అంటారు కదా. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. 84 జన్మలు కూడా ఆత్మయే తీసుకుంది. ప్రతి ఒక్క జన్మలో నామ-రూపాలు మారిపోతాయి. ఫలానావారు 84 జన్మలు తీసుకున్నారని అనరు. అలా కాదు. ఆత్మ 84 జన్మలు తీసుకుంది. శరీరాలైతే మారిపోతూ ఉంటాయి. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. మొత్తము జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. ఎవరైనా వస్తే వారికి అర్థం చేయించాలి. ఆదిలో దేవీ-దేవతల రాజ్యమే ఉండేది, తర్వాత మధ్యలో రావణ రాజ్యము వచ్చింది. మెట్లు దిగుతూ వచ్చారు. సత్యయుగములో సతోప్రధానమని అంటారు, ఆ తర్వాత సతో, రజో, తమోలలోకి దిగిపోతారు. చక్రము తిరుగుతూ ఉంటుంది. కొంతమంది అంటారు, బాబాకు ఏమి అవసరము వచ్చిందని మమ్మల్ని 84 జన్మల చక్రములోకి తీసుకువచ్చారు. కానీ ఈ సృష్టిచక్రము అనాదిగా తయారై ఉంది, దీని ఆదిమధ్యాంతాలను తెలుసుకోవాలి. మనుష్యులై ఉండి ఒకవేళ ఇది తెలుసుకోకపోతే వారు నాస్తికులైనట్లు. తెలుసుకున్నట్లయితే మీకు ఎంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. ఈ చదువు ఎంత ఉన్నతమైనది. పెద్ద పరీక్షను పాస్ అయినవారికి మనసులో సంతోషముంటుంది కదా - మేము అన్నింటికన్నా పెద్ద పదవిని పొందుతాము అని. ఈ లక్ష్మీ-నారాయణులు తమ పూర్వ జన్మలో నేర్చుకుని మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారని మీకు తెలుసు.

ఈ చదువు ద్వారా ఈ రాజధాని స్థాపనవుతుంది. చదువు ద్వారా ఎంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. ఇది అద్భుతము కదా. ఇంత పెద్ద-పెద్ద మందిరాలను ఎవరైతే నిర్మిస్తారో లేక గొప్ప-గొప్ప విద్వాంసులు మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, వారిని - సత్యయుగ ఆదిలో వీరు జన్మ ఎలా తీసుకున్నారని అడిగితే, వారు చెప్పలేరు. ఇది గీత యొక్క రాజయోగమేనని మీకు తెలుసు. గీతను చదువుతూ వచ్చారు కానీ దాని వలన లాభమేమీ లేదు. ఇప్పుడు మీకు తండ్రి కూర్చుని వినిపిస్తున్నారు. మీరు అంటారు - బాబా, మేము 5 వేల సంవత్సరాల క్రితము కూడా మిమ్మల్ని కలిసాము. ఎందుకు కలిసారు? స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు, లక్ష్మీ-నారాయణులుగా అయ్యేందుకు కలిసాము. పిల్లలు, పెద్దలు, వృద్ధులు మొదలైనవారు ఎవరు వచ్చినా సరే, ఈ మాటను తప్పకుండా నేర్చుకునే వస్తారు. లక్ష్యము-ఉద్దేశ్యము ఇదే. ఇది సత్యనారాయణుని సత్యమైన కథ కదా. రాజ్యము స్థాపనవుతుందని కూడా మీకు తెలుసు. ఎవరైతే మంచి రీతిలో అర్థం చేసుకుంటారో, వారికి ఆంతరిక సంతోషము ఉంటుంది. బాబా అడుగుతారు - రాజ్యము తీసుకునే ధైర్యముంది కదా? ఏమని సమాధానమిస్తారంటే - ఎందుకు లేదు బాబా, మేము నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకే చదువుకుంటున్నాము. ఇంత కాలము మనము స్వయాన్ని దేహముగా భావిస్తూ కూర్చున్నాము, ఇప్పుడు తండ్రి మనకు ధర్మయుక్తమైన మార్గాన్ని తెలియజేసారు. దేహీ-అభిమానులుగా అవ్వడములో శ్రమ అనిపిస్తుంది. పదే-పదే తమ నామ-రూపాలలో చిక్కుకుంటారు. తండ్రి అంటారు, ఈ నామ-రూపాలకు అతీతముగా అవ్వాలి. ఇప్పుడు ఆత్మ అనేది కూడా పేరే కదా. తండ్రి సుప్రీమ్ పరమపిత, లౌకిక తండ్రిని పరమపిత అని అనరు. పరమ అనే పదము ఒక్క తండ్రికి మాత్రమే ఇచ్చారు. వాహ్ గురువు అని కూడా వారినే అంటారు. మీరు సిక్కు ధర్మము వారికి కూడా అర్థం చేయించవచ్చు. గ్రంథ్ సాహెబ్ లోనైతే పూర్తిగా వర్ణించబడింది. గ్రంథ్ లో, జప్ సాహెబ్ లో, సుఖమణిలో ఉన్నంత వర్ణన ఇంకే శాస్త్రములోనూ లేదు. ముఖ్యమైన పదాలు ఈ రెండే ఉన్నాయి. తండ్రి అంటారు, సాహెబ్ ను స్మృతి చేసినట్లయితే మీకు 21 జన్మల కొరకు సుఖము లభిస్తుంది. ఇందులో తికమకపడే విషయమే లేదు. తండ్రి చాలా సహజము చేసి అర్థం చేయిస్తారు. ఎంతమంది హిందువులు ట్రాన్స్ఫర్ అయి సిక్కులుగా అయ్యారు.

మీరు మనుష్యులకు మార్గాన్ని తెలియజేసేందుకు ఎన్ని చిత్రాలు మొదలైనవి తయారుచేస్తారు. ఎంత సహజముగా అర్థం చేయించగలరు. మీరు ఒక ఆత్మ, ఆ తర్వాత రకరకాల ధర్మాలలోకి వచ్చారు. ఇది వెరైటీ ధర్మాల వృక్షము. క్రైస్ట్ ఎలా వస్తారు అనేది ఇంకెవ్వరికీ తెలియదు. తండ్రి అర్థం చేయించారు, కొత్త ఆత్మకు కర్మభోగము ఉండదు. క్రైస్ట్ ఆత్మ శిక్షలు అనుభవించేందుకు అసలు వారు వికర్మలేమీ చేయలేదు. వారు సతోప్రధాన ఆత్మగా వస్తారు, ఎవరిలోకైతే వారు వచ్చి ప్రవేశిస్తారో వారిని శిలువపైకి ఎక్కిస్తారు, అంతేకానీ క్రైస్టును కాదు. క్రైస్ట్ అయితే వెళ్ళి మరో జన్మ తీసుకుని గొప్ప పదవిని పొందుతారు. పోప్ ల యొక్క చిత్రాలు కూడా ఉన్నాయి.

ఈ సమయములో ఈ ప్రపంచమంతా పూర్తిగా పైసకు కూడా కొరగానిదిగా ఉంది. మీరు కూడా అలాగే ఉండేవారు. ఇప్పుడు మీరు ఎంతో విలువైనవారిగా అవుతున్నారు. ప్రపంచములోనివారి విషయములో వారి వారసులు చివరిలో తింటారని కాదు, అలాంటిదేమీ ఉండదు. మీరు మీ చేతులను నిండుగా చేసుకుని వెళ్తారు, మిగిలినవారంతా ఖాళీ చేతులతో వెళ్తారు. మీరు నిండుగా అయ్యేందుకే చదువుకుంటున్నారు. ఎవరైతే కల్పక్రితము వచ్చారో, వారే వస్తారని కూడా మీకు తెలుసు. కొంచెము విన్నా కూడా వచ్చేస్తారు. అందరినీ కలిసి ఒకేసారి చూడలేరు కూడా. మీరు అనేకమంది ప్రజలను తయారుచేస్తారు, బాబా అందరినీ చూడలేకపోవచ్చు. ఎంతోకొంత విన్నా కూడా ప్రజలు తయారవుతూ ఉంటారు. మీరు లెక్కపెట్టలేరు కూడా.

పిల్లలైన మీరు సేవలో ఉన్నారు, బాబా కూడా సేవలోనే ఉన్నారు. బాబా సేవ చేయకుండా ఉండలేరు. రోజూ ఉదయాన్నే సేవ చేయడానికి వస్తారు. సత్సంగాలు మొదలైనవి కూడా ఉదయాన్నే చేస్తారు. ఆ సమయములో అందరికీ తీరిక ఉంటుంది. బాబా అయితే అంటారు - పిల్లలైన మీరు ఇంటి నుండి చాలా తెల్లవారుజామున కూడా రాకూడదు, అలాగే రాత్రి కూడా రాకూడదు ఎందుకంటే రోజురోజుకు ప్రపంచము చాలా పాడైపోతూ ఉంటుంది, అందుకే ప్రతి వీధిలోనూ సెంటర్లు ఎంత సమీపముగా ఉండాలంటే, ఇంటి నుండి బయటకు రాగానే సెంటరుకు వచ్చేయగలగాలి, సహజమైపోవాలి. మీ వృద్ధి జరుగుతుంది, అప్పుడు రాజధాని స్థాపనవుతుంది. తండ్రి అయితే చాలా సహజముగా అర్థం చేయిస్తారు. ఈ రాజయోగము ద్వారా స్థాపన చేస్తున్నారు. ఇకపోతే ఈ ప్రపంచమంతా ఉండనే ఉండదు. ప్రజలైతే ఎంతమంది తయారవుతారు. మాల కూడా తయారవ్వనున్నది. ముఖ్యమైన విషయమేమిటంటే, ఎవరైతే అనేకుల సేవ చేసి తమ సమానముగా తయారుచేస్తారో, వారే మాలలో మణులుగా అవుతారు. మనుష్యులు మాలను తిప్పుతారు కానీ దాని అర్థం తెలియదు. చాలామంది గురువులు - బుద్ధి అందులో నిమగ్నమై ఉండాలని మాలను తిప్పడానికి ఇస్తారు. కామము మహాశత్రువు, రోజురోజుకు చాలా కఠినమైపోతూ ఉంటుంది. తమోప్రధానముగా అవుతూ ఉంటారు. ఈ ప్రపంచము చాలా అశుద్ధమైనది. బాబాకు చాలామంది చెప్తుంటారు - మేమైతే చాలా విసిగిపోయాము, త్వరగా సత్యయుగములోకి తీసుకువెళ్ళండి అని. తండ్రి అంటారు, కాస్త ఓర్పు వహించండి, స్థాపన జరిగేదే ఉంది. ఇది బాబా పాలన. ఈ పాలనయే మిమ్మల్ని తీసుకువెళ్తుంది. ఆత్మలైన మీరు పరంధామము నుండి వచ్చారు, మళ్ళీ అక్కడకు వెళ్ళాలి, మళ్ళీ పాత్రను అభినయించేందుకు వస్తారు అని పిల్లలకు ఇది కూడా తెలియజేసారు. కావున పరంధామాన్ని గుర్తు చేయవలసి ఉంటుంది. తండ్రి కూడా అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఈ సందేశాన్నే అందరికీ ఇవ్వాలి, ఇంకే సందేశకులు, మెసెంజర్లు ఎవరూ లేరు. వారైతే ముక్తిధామము నుండి కిందకు తీసుకువస్తారు, ఇక ఆ తర్వాత వారు మెట్లు కిందికి దిగవలసిందే. ఎప్పుడైతే పూర్తిగా తమోప్రధానముగా అయిపోతారో, అప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి అందరినీ సతోప్రధానముగా తయారుచేస్తారు. మీ కారణముగా అందరూ తిరిగి వెళ్ళవలసి ఉంటుంది ఎందుకంటే మీకు కొత్త ప్రపంచము కావాలి కదా - ఇది కూడా డ్రామాగా తయారై ఉంది. పిల్లలకు చాలా నషా ఉండాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ దేహము యొక్క నామ-రూపాల నుండి అతీతముగా అయి దేహీ-అభిమానులుగా అవ్వాలి. సద్గురువును నిందింపజేసే విధమైన నడవడికను నడవకూడదు.

2. మాలలోని మణులుగా అయ్యేందుకు చాలామందిని తమ సమానముగా తయారుచేసే సేవ చేయాలి. మేము రాజ్యాన్ని తీసుకునేందుకు చదువుకుంటున్నాము అన్న ఆంతరిక సంతోషములో ఉండాలి. ఇది నరుని నుండి నారాయణునిగా తయారయ్యే చదువు.

వరదానము:-
నిరంతర స్మృతి ద్వారా అవినాశీ సంపాదనను జమ చేసుకునే సర్వ ఖజానాల అధికారీ భవ

నిరంతర స్మృతి ద్వారా ప్రతి అడుగులోనూ సంపాదనను జమ చేసుకుంటూ ఉన్నట్లయితే సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ... ఈ ఖజానాలన్నిటి యొక్క అధికారాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. ఏ కష్టాలు కష్టాలుగా అనుభవమవ్వవు. సంగమయుగములో బ్రాహ్మణులకు ఏ కష్టము ఉండజాలదు. ఒకవేళ ఏదైనా కష్టము వచ్చినా కానీ, అది బాబా స్మృతిని కలిగించేందుకే. ఏ విధముగా గులాబీ పుష్పముతోపాటు ముల్లు దానిని రక్షించే సాధనముగా ఉంటుందో, అలా ఈ కష్టాలు ఇంకా ఎక్కువగా బాబా స్మృతిని కలిగించేందుకు నిమిత్తమవుతాయి.

స్లోగన్:-
స్నేహ రూపము యొక్క అనుభవాన్ని అయితే వినిపిస్తూ ఉంటారు, ఇప్పుడు శక్తి రూపము యొక్క అనుభవాన్ని వినిపించండి.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి

ఏ విధముగా సాకారములో బాబాను చూసారు, వారి చివరి కర్మాతీత స్థితి యొక్క పాత్ర కేవలము ఆశీర్వాదాలను ఇవ్వటముగానే ఉండేది, బ్యాలెన్స్ యొక్క విశేషత కూడా ఉండేది మరియు బ్లెస్సింగ్స్ (ఆశీర్వాదాల) యొక్క అద్భుతము కూడా ఉండేది. అలా ఫాలో ఫాదర్ చేయండి. సహజమైన మరియు శక్తిశాలి సేవ ఇదే. ఇప్పుడు విశేష ఆత్మల పాత్ర ఏమిటంటే - ఆశీర్వాదాలు ఇవ్వటము. నయనాల ద్వారానైనా ఇవ్వండి లేదా మస్తకమణి ద్వారానైనా ఇవ్వండి.