21-05-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఆత్మలైన మీ ప్రేమ ఒక్క తండ్రితోనే ఉంది, తండ్రి మీకు ఆత్మను ప్రేమించడం నేర్పించారు, అంతేకానీ శరీరాన్ని కాదు’’

ప్రశ్న:-
ఏ పురుషార్థములోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది? మాయాజీతులుగా అయ్యేందుకు యుక్తి ఏమిటి?

జవాబు:-
మేము తండ్రిని స్మృతి చేసి మా పాపాలను భస్మము చేసుకోవాలి అని మీరు పురుషార్థము చేస్తారు, ఈ స్మృతిలోనే మాయ విఘ్నాలు కలుగుతాయి. గురువు అయిన తండ్రి మీకు మాయాజీతులుగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తున్నారు. మీరు ఆ గురువును గుర్తించి వారిని స్మృతి చేసినట్లయితే సంతోషము కూడా ఉంటుంది, పురుషార్థము కూడా చేస్తూ ఉంటారు మరియు సేవ కూడా ఎంతో చేస్తారు. మాయాజీతులుగా కూడా అవుతారు.

పాట:-
ఈ పాపపు ప్రపంచము నుండి...

ఓంశాంతి
ఆత్మిక పిల్లలు పాట విన్నారు, అర్థాన్ని అర్థం చేసుకున్నారు. ప్రపంచములో ఎవ్వరూ దీని అర్థాన్ని అర్థం చేసుకోరు. మన ఆత్మకు పరమపిత పరమాత్మతో ప్రేమ ఉంది అని ఇప్పుడు పిల్లలు భావిస్తారు. ఆత్మ తన తండ్రి అయిన పరమపిత పరమాత్మను పిలుస్తుంది. ప్రేమ ఆత్మపై ఉందా లేక శరీరము పైనా? ప్రేమ ఆత్మపైనే ఉండాలని ఇప్పుడు తండ్రి నేర్పిస్తున్నారు. శరీరమైతే అంతమైపోనున్నది. ప్రేమ ఆత్మపై ఉంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీ ప్రేమ పరమాత్మ అయిన తండ్రిపై ఉండాలి, శరీరాలపై కాదు. పుణ్యాత్ముల ప్రపంచములోకి తీసుకువెళ్ళండి అని ఆత్మయే తన తండ్రిని పిలుస్తుంది. మనం పాపాత్ములుగా ఉండేవారమని, ఇప్పుడు మళ్ళీ పుణ్యాత్ములుగా అవుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. బాబా మిమ్మల్ని యుక్తిగా పుణ్యాత్ములుగా తయారుచేస్తున్నారు. మేము తండ్రి ద్వారా తండ్రి స్మృతితో పవిత్ర పుణ్యాత్ములుగా అవుతున్నాము అని తండ్రి చెప్తేనే కదా పిల్లలు అర్థం చేసుకుంటారు. యోగబలము ద్వారా మన పాపాలు భస్మమవుతున్నాయి. అంతేకానీ గంగ మొదలైనవాటి ద్వారా పాపాలేమీ కడగబడవు. మనుష్యులు గంగా స్నానాలు చేస్తారు, శరీరానికి మట్టిని పూసుకుంటారు, కానీ వాటి వల్ల పాపాలేవీ కడగబడవు. ఆత్మలోని పాపాలు యోగబలము ద్వారానే తొలగుతాయి. మలినాలు తొలగుతాయి. మేము బాబాను స్మృతి చేసినట్లయితే మా పాపాలు భస్మమవుతాయి అన్న విషయము పిల్లలకే తెలుసు మరియు వారికి నిశ్చయము ఉంది. నిశ్చయముంటే మరి పురుషార్థము చెయ్యాలి కదా. ఈ పురుషార్థములోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. శక్తివంతునితో మాయ కూడా మంచి శక్తివంతముగా అయి పోరాడుతుంది. అపరిపక్వముగా ఉన్నవారితో ఏం పోరాడుతుంది! మేము మాయాజీతులుగా, జగత్ జీతులుగా అవ్వాలి అని పిల్లలు సదా ఈ ఆలోచనే పెట్టుకోవాలి. మాయను జయించినవారే జగత్తును జయిస్తారు అన్నదాని అర్థాన్ని కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. మీరు ఏ విధంగా మాపై విజయాన్ని పొందగలరు అనేది ఇప్పుడు పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. మాయ కూడా సమర్థమైనది కదా. పిల్లలైన మీకు గురువు లభించారు. ఆ గురువు గురించి కూడా నంబరువారుగా ఏ ఒక్కరికో తెలుసు. ఎవరికైతే తెలుసో, వారికి సంతోషము కూడా ఉంటుంది, వారు పురుషార్థము కూడా స్వయం చేస్తారు. సేవ కూడా ఎంతో చేస్తారు. అమర్ నాథ్ కు ఎంతోమంది వెళ్తారు.

విశ్వములో శాంతి ఎలా ఏర్పడగలదు అని ఇప్పుడు మనుష్యులంతా అంటారు. సత్యయుగములో సుఖ-శాంతులు ఏ విధంగా ఉండేవి అనేది ఇప్పుడు మీరు అందరికీ నిరూపించి చెప్తారు. ఆ సమయములో మొత్తము విశ్వములో శాంతి ఉండేది. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది. ఇంకే ఇతర ధర్మము ఉండేది కాదు. సత్యయుగము గతించి నేటికి 5000 సంవత్సరాలవుతోంది, మళ్ళీ సృష్టి తప్పకుండా చక్రము తిరగాలి. చిత్రాల ద్వారా మీరు పూర్తిగా స్పష్టముగా తెలియజేస్తారు. కల్పక్రితము కూడా ఇటువంటి చిత్రాలను తయారుచేసారు. రోజురోజుకు అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. కొన్నిచోట్ల పిల్లలు చిత్రాలలో తిథి-తారీఖులు వ్రాయడం మర్చిపోతారు. లక్ష్మీ-నారాయణుల చిత్రములో తిథి-తారీఖులు తప్పకుండా ఉండాలి. మేము స్వర్గవాసులుగా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ అలా అవ్వాలి అని పిల్లలైన మీ బుద్ధిలో కూర్చుంది కదా. ఎవరు ఎంత పురుషార్థము చేస్తారో, అంత పదవిని పొందుతారు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు జ్ఞాన అథారిటీలుగా అయ్యారు. భక్తి ఇప్పుడు అంతమైపోనున్నది. సత్య, త్రేతాయుగాలలో భక్తి ఉండదు. తర్వాత అర్ధకల్పము భక్తి నడుస్తుంది. ఇది కూడా పిల్లలైన మీకు ఇప్పుడు అర్థమవుతుంది. అర్ధకల్పము తర్వాత రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. మొత్తము ఆట అంతా భారతవాసులైన మీకు సంబంధించే ఉంది. 84 జన్మల చక్రము భారత్ కు సంబంధించే ఉంది. భారత్ యే అవినాశీ ఖండము, ఇది కూడా ఇంతకుముందు తెలియదు. లక్ష్మీ-నారాయణులను దేవీ-దేవతలు అని అంటారు కదా. ఇది ఎంత ఉన్నతమైన పదవి మరియు ఈ చదువు ఎంత సహజమైనది. ఈ 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసి మళ్ళీ మనము తిరిగి వెళ్తాము. 84 జన్మల చక్రము అని అనగానే బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము అన్నీ గుర్తున్నాయి. సూక్ష్మవతనము అంటే ఏమిటి అనేది ఇంతకుముందు తెలిసేది కాదు. అక్కడ ఏ విధంగా మూవీలో మాట్లాడుకుంటారు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మూవీ సినిమా కూడా వెలువడింది కదా. మీకు అర్థం చేయించడం సహజమవుతుంది. సైలెన్స్, మూవీ, టాకీ. లక్ష్మీ-నారాయణుల రాజ్యము నుండి మొదలుకుని ఇప్పటివరకూ మొత్తము చక్రమంతా బుద్ధిలో ఉంది, మీకు అంతా తెలుసు.

మీకు గృహస్థ వ్యవహారములో ఉంటూ - మేము పావనముగా అవ్వాలి అన్న ఒక్క చింతే ఉండాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, గృహస్థ వ్యవహారములో ఉంటూ కూడా ఈ పాత ప్రపంచము నుండి మమకారాన్ని తొలగించండి. పిల్లలు మొదలైనవారిని కూడా సంభాళించండి, కానీ బుద్ధి తండ్రి వైపు ఉండాలి. చేతులతో పని చేస్తూ బుద్ధి తండ్రి వైపు ఉండాలి అని అంటారు కదా. పిల్లలకు తినిపించండి, తాగించండి, వారికి స్నానము చేయించండి, కానీ బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి, ఎందుకంటే ఆత్మపై పాపాల భారము ఎంతగానో ఉందని మీకు తెలుసు, అందుకే బుద్ధి తండ్రి వైపు జోడింపబడి ఉండాలి. ఆ ప్రియుడిని చాలా-చాలా స్మృతి చేయాలి. ప్రియుడైన తండ్రి ఆత్మలైన మీ అందరికీ చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి. ఈ పాత్ర కూడా ఇప్పుడు జరుగుతోంది, మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. తండ్రి ఎంత సహజమైన యుక్తిని తెలియజేస్తున్నారు. ఇందులో ఎటువంటి కష్టమూ లేదు. మేము ఇది చేయలేము, మాకు చాలా కష్టమనిపిస్తోంది, స్మృతియాత్ర చాలా కష్టము అని ఎవరైనా అంటారా? అరే, మీరు బాబాను స్మృతి చేయలేరా! తండ్రిని మర్చిపోవచ్చా! తండ్రినైతే బాగా స్మృతి చేయాలి, అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. లేకపోతే అలా అవ్వరు. మీకు చాలా మంచి చక్కని సలహా లభిస్తుంది. ఇది చాలా చక్కని మందు కదా. ఈ యోగబలము ద్వారా మీరు 21 జన్మల కొరకు ఎప్పుడూ రోగగ్రస్థులుగా అవ్వరు అని నేను గ్యారంటీ ఇస్తున్నాను. కేవలం తండ్రిని స్మృతి చేయండి - ఇది ఎంతటి సహజమైన యుక్తి. భక్తి మార్గములో తెలియకుండా స్మృతి చేసేవారు. ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మేము కల్పక్రితము కూడా బాబా వద్దకు వచ్చాము, అప్పుడు పురుషార్థము చేసేవారము అని మీరు అర్థం చేసుకున్నారు. పక్కా నిశ్చయము ఏర్పడింది. మేమే రాజ్యము చేసేవారము, మళ్ళీ మేమే పోగొట్టుకున్నాము, ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చారు, వారి నుండి రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి మరియు రాజ్యాన్ని స్మృతి చేయండి. మన్మనాభవ. అంతిమ స్మృతిని బట్టి మరుసటి జన్మ జరుగుతుంది. ఇప్పుడు నాటకము పూర్తవుతుంది, తిరిగి వెళ్తారు. ఏ విధంగా వరుడు వధువును తీసుకువెళ్ళేందుకు వస్తాడో, అలా బాబా అందరినీ తీసుకువెళ్ళేందుకు వచ్చారు. మేము మా మెట్టినింటికి వెళ్తున్నామని వధువులకు ఎంతో సంతోషము ఉంటుంది. మీరందరూ ఒక్క రాముని సీతలే. రాముడే మిమ్మల్ని రావణుని జైలు నుండి విడిపించి తీసుకువెళ్తాడు. ముక్తిప్రదాత ఒక్కరే, వారు రావణ రాజ్యము నుండి విముక్తులుగా చేస్తారు. ఇది రావణ రాజ్యము అని అంటారు కూడా, కానీ యథార్థ రీతిలో అర్థం చేసుకోరు. ఇప్పుడు పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది, ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా మంచి-మంచి పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది. బాబా అర్థం చేయించారు - విశ్వములో శాంతిని కల్పక్రితము వలె తండ్రి స్థాపన చేస్తున్నారు. బ్రహ్మా ద్వారా స్థాపన జరుగుతోంది. విష్ణువు రాజ్యము ఉన్నప్పుడు విశ్వములో శాంతి ఉండేది కదా. విష్ణువే లక్ష్మీ-నారాయణులు, ఇది కూడా ఎవరూ అర్థం చేసుకోరు. విష్ణువును మరియు లక్ష్మీ-నారాయణులను మరియు రాధా-కృష్ణులను వేరువేరుగా భావిస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్వదర్శన చక్రధారులు కూడా మీరే. శివబాబా వచ్చి సృష్టిచక్ర జ్ఞానాన్ని ఇస్తారు. వారి ద్వారా ఇప్పుడు మనము కూడా మాస్టర్ జ్ఞానసాగరులుగా అయ్యాము. మీరు జ్ఞాన నదులు కదా. ఇవి పిల్లల పేర్లే.

భక్తి మార్గములో మనుష్యులు ఎన్ని స్నానాలు చేస్తారు, ఎంతగా భ్రమిస్తారు. ఎన్నో దానపుణ్యాలు మొదలైనవి చేస్తారు. షావుకారులైతే ఎన్నో దానాలు చేస్తారు. బంగారాన్ని కూడా దానము చేస్తారు. మేము ఎంత భ్రమించేవారము అని మీరు కూడా ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనము హఠయోగులమేమీ కాము. మనము రాజయోగులము. పవిత్ర గృహస్థ ఆశ్రమానికి చెందినవారము. మళ్ళీ రావణ రాజ్యములో అపవిత్రముగా అయ్యాము. డ్రామా అనుసారముగా తండ్రి మళ్ళీ గృహస్థ ధర్మాన్ని తయారుచేస్తున్నారు, ఇంకెవ్వరూ దానిని తయారుచేయలేరు. మీరందరూ పవిత్రముగా అయితే మరి ప్రపంచము ఎలా నడుస్తుంది అని మనుష్యులు మీతో అంటారు. మీరు చెప్పండి - ఇంతమంది సన్యాసులు పవిత్రముగా ఉంటారు, మరి ప్రపంచము ఏమైనా ఆగిపోతుందా ఏమిటి? అరే, సృష్టి ఎంతగా పెరిగిపోయింది, తినడానికి ధాన్యము కూడా లేదు, సృష్టిని ఇంకా ఏమి పెంచుతాము. బాబా మన సమ్ముఖములో ఉన్నారని, వారు హాజరై ఉండి అన్నీ చూస్తూ ఉన్నారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు, కానీ వారిని ఈ కళ్ళతో చూడలేరు. బాబా ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారని, వారు ఇప్పుడు మన ముందు హాజరై అన్నీ చూస్తూ ఉన్నారని బుద్ధి ద్వారా తెలుసుకుంటారు.

ఎవరైతే విశ్వశాంతి గురించి మాట్లాడుతారో వారికి మీరు చెప్పండి - విశ్వములో శాంతిని తండ్రి స్థాపిస్తున్నారు. అందుకొరకే పాత ప్రపంచపు వినాశనము ఎదురుగా నిలబడి ఉంది, 5000 సంవత్సరాల క్రితం కూడా వినాశనము జరిగింది. ఇప్పుడు కూడా ఈ వినాశనము ఎదురుగా నిలబడి ఉంది, ఆ తర్వాత విశ్వశాంతి ఏర్పడుతుంది. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలే ఉన్నాయి. ఇవి ప్రపంచములో ఎవ్వరికీ తెలియవు. ఈ విషయాలు బుద్ధిలో ఉన్నవారు ఎవ్వరూ లేరు. సత్యయుగములో మొత్తము విశ్వములో శాంతి ఉండేదని మీకు తెలుసు. ఒక్క భారత ఖండము తప్ప వేరే ఏ ఖండమూ లేదు. ఆ తర్వాత ఇతర ఖండాలు వచ్చాయి. ఇప్పుడు ఎన్ని ఖండాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆట కూడా సమాప్తమవ్వనున్నది. భగవంతుడు తప్పకుండా ఉంటారు అని అంటారు కూడా, కానీ భగవంతుడు ఎవరు మరియు వారు ఏ రూపములో వస్తారు, ఇది వారికి తెలియదు. శ్రీకృష్ణుడైతే కారు. ఎవ్వరూ ప్రేరణ ద్వారా లేక శక్తి ద్వారా పని చేయించలేరు. తండ్రి అయితే అతి ప్రియమైనవారు, వారి నుండి వారసత్వము లభిస్తుంది. తండ్రియే స్వర్గ స్థాపన చేస్తారు కావున తప్పకుండా పాత ప్రపంచపు వినాశనము కూడా వారే చేయిస్తారు. సత్యయుగములో ఈ లక్ష్మీ-నారాయణులు ఉండేవారు అని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ స్వయం పురుషార్థము ద్వారా ఇలా తయారవుతున్నారు. నషా ఉండాలి కదా. వారు భారత్ లో రాజ్యము చేసేవారు. శివబాబా రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళారు, అంతేకానీ శివబాబా రాజ్యము చేసి వెళ్ళారు అని అనరు. అలా కాదు. వారు భారత్ కు రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళారు. లక్ష్మీ-నారాయణులు రాజ్యము చేసేవారు కదా. మళ్ళీ బాబా రాజ్యము ఇవ్వడానికి వచ్చారు. వారు అంటారు - మధురాతి మధురమైన పిల్లలూ, మీరు నన్ను స్మృతి చేయండి మరియు చక్రాన్ని స్మృతి చేయండి, మీరే 84 జన్మలు తీసుకున్నారు. తక్కువ పురుషార్థము చేస్తున్నారంటే వారు తక్కువ భక్తి చేసారని అర్థం చేసుకోండి. ఎక్కువ భక్తి చేసేవారు పురుషార్థము కూడా ఎక్కువే చేస్తారు. ఎంత స్పష్టముగా అర్థం చేయిస్తున్నారు, కానీ అది బుద్ధిలో కూర్చోవాలి కదా. మీ పని పురుషార్థము చేయించడము. తక్కువ భక్తి చేసి ఉన్నట్లయితే యోగము జోడించబడదు. శివబాబా స్మృతి బుద్ధిలో నిలవదు. ఎప్పుడూ పురుషార్థములో చల్లబడిపోకూడదు. మాయను శక్తివంతముగా చూసి హార్ట్ ఫెయిల్ అయిపోకూడదు. మాయా తుఫానులైతే ఎన్నో వస్తాయి. ఆత్మయే అన్నీ చేస్తుందని, శరీరము అంతమైపోతుందని ఇది కూడా పిల్లలకు అర్థం చేయించారు. ఆత్మ వెళ్ళిపోతే శరీరము మట్టిగా మారిపోతుంది. ఆ శరీరము తిరిగి లభించేది లేదు. మరి దానిని తలచుకుని ఏడవడం వలన లాభమేముంది. అదే శరీరము మళ్ళీ లభిస్తుందా? ఆత్మ వెళ్ళి ఇంకొక శరీరము తీసుకుంది. ఇప్పుడు మీరు ఎంత ఉన్నతమైన సంపాదన చేసుకుంటారు. మీదే జమ అవుతుంది, మిగిలినవారందరిదీ జమ అవ్వదు.

బాబా భోళా వ్యాపారి, అందుకే కదా వారు మీకు పిడికెడు బియ్యానికి బదులుగా 21 జన్మలకు మహళ్ళు ఇస్తారు, వారు ఎంత వడ్డీ ఇస్తారు. భవిష్యత్తు కోసం మీకు ఎంత కావాలనుకుంటే అంత జమ చేసుకోండి. అలాగని అంతిమములో తీసుకువచ్చి జమ చేయండి అని అంటే, ఆ సమయములో తీసుకుని ఏం చేస్తాము. ఉపయోగపడనిదానిని తీసుకుని వడ్డీ ఇస్తూ ఉండడానికి వారు తెలివితక్కువ వ్యాపారి ఏమీ కారు కదా. అటువంటివారిది తీసుకోరు. మీకు పిడికెడు బియ్యానికి బదులుగా 21 జన్మల కొరకు మహళ్ళు లభిస్తాయి. ఎంత వడ్డీ లభిస్తుంది. బాబా అంటారు, నంబర్ వన్ భోళాను అయితే నేనే. చూడండి, మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తాను, మీరు కేవలం నా వారిగా అయి సేవ చేయండి. వారు భోళానాథుడు కావుననే అందరూ వారిని స్మృతి చేస్తారు. ఇప్పుడు మీరు జ్ఞాన మార్గములో ఉన్నారు. ఇప్పుడు తండ్రి శ్రీమతముపై నడవండి మరియు రాజ్యాధికారాన్ని తీసుకోండి. బాబా, మేము రాజ్యాన్ని తీసుకునేందుకు వచ్చాము, అది కూడా సూర్యవంశములో... అని అంటారు కూడా. అచ్ఛా, మీ నోరు తీపిగాక. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శ్రీమతముపై నడుస్తూ రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. పిడికెడు బియ్యం ఇచ్చి 21 జన్మల కొరకు మహళ్ళు తీసుకోవాలి. భవిష్యత్తు కొరకు సంపాదనను జమ చేసుకోవాలి.

2. గృహస్థ వ్యవహారములో ఉంటూ ఈ పాత ప్రపంచముపై మమకారాన్ని తొలగించి పూర్తిగా పావనముగా అవ్వాలి. అన్నీ చేస్తూ బుద్ధి తండ్రి వైపు జోడించబడి ఉండాలి.

వరదానము:-
మనసా శుభ భావన ద్వారా ఇతరులను ముందుకు తీసుకువెళ్ళే విశ్వ కళ్యాణకారీ భవ

ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తుంటే, వారిని పరవశమై ఉన్నవారిగా భావిస్తూ దయా దృష్టితో పరివర్తన చెయ్యండి, వాదించకండి. ఒకవేళ ఎవరైనా దారిలో రాయి కారణముగా ఆగిపోతే, మీ పని దానిని దాటి వెళ్ళిపోవటమూ మరియు వారిని కూడా మీ సహచరునిగా చేసుకుని మీతోపాటు తీసుకువెళ్ళడము. దీని కొరకు ప్రతి ఒక్కరిలోనూ విశేషతలను చూడండి, బలహీనతలను వదిలిపెడుతూ వెళ్ళండి. ఇప్పుడిది ఎవరినీ వాణి ద్వారా సావధానపరిచే సమయము కాదు, కానీ మనసా శుభ భావన ద్వారా ఇతరులకు సహయోగులుగా అయ్యి ముందుకు వెళ్ళండి మరియు ఇతరులను ముందుకు తీసుకువెళ్ళండి, అప్పుడే విశ్వ కళ్యాణకారి అని అంటారు.

స్లోగన్:-
దృఢ సంకల్పమనే బెల్టును బంధించుకుని ఉన్నట్లయితే సీట్ నుండి అప్సెట్ అవ్వరు.

అవ్యక్త సూచనలు - ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి

ఎప్పుడైతే పవిత్రత అనే దీపాన్ని నలువైపులా వెలిగిస్తారో అప్పుడే ప్రత్యక్షత అనే సూర్యుడు ఉదయిస్తాడు. ఎలా అయితే వారు దీపాన్ని పట్టుకుని నలువైపులా తిరుగుతారో అలా పవిత్రతా దీపాన్ని నలువైపులా ప్రకాశింపజేసినట్లయితే అందరూ తండ్రిని చూడగలరు, తెలుసుకోగలరు. పవిత్రత అనే దీపము ఎంత అచలంగా ఉంటుందో అంత సహజంగా అందరూ తండ్రిని గుర్తించగలరు మరియు పవిత్రత యొక్క జయజయకారాలు ప్రతిధ్వనిస్తాయి.