21-10-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఉదయముదయమే లేచి బాబాతో
మధురాతి-మధురమైన మాటలు మాట్లాడండి, విచార సాగర మంథనము చేసేందుకు ఉదయము సమయము చాలా
మంచిది’’
ప్రశ్న:-
భక్తులు
కూడా భగవంతుడిని సర్వశక్తివంతుడని అంటారు మరియు పిల్లలైన మీరు కూడా అంటారు, కానీ ఈ
రెండింటికీ మధ్యన వ్యత్యాసము ఏమిటి?
జవాబు:-
భక్తులు అంటారు
- భగవంతుడు ఏది కావాలంటే అది చేయగలరు, అంతా వారి చేతిలోనే ఉంది అని. కానీ మీకు
తెలుసు, బాబా చెప్పారు, నేను కూడా డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నాను. డ్రామా
సర్వశక్తివంతమైనది. తండ్రిని సర్వశక్తివంతుడని ఎందుకంటారంటే వారి వద్ద సర్వులకు
సద్గతినిచ్చే శక్తి ఉంది. వారు ఎటువంటి రాజ్యాన్ని స్థాపన చేస్తారంటే, దానిని
ఎప్పుడూ ఎవ్వరూ లాక్కోలేరు.
ఓంశాంతి
ఇలా ఎవరు అన్నారు? బాబా అన్నారు. ఓం శాంతి - ఇది ఎవరు అన్నారు? దాదా అన్నారు.
ఇప్పుడు పిల్లలైన మీరు ఇది గుర్తించారు. ఉన్నతోన్నతమైనవారి మహిమ చాలా గొప్పది. వారు
సర్వశక్తివంతుడు కనుక వారు చేయలేనిదంటూ ఏముంది అని అంటారు. ఇప్పుడు ఈ భక్తి మార్గము
వారు, సర్వశక్తివంతుడు అన్నదానికి అర్థాన్ని చాలా గొప్పగా చెప్తారు. తండ్రి అంటారు
- డ్రామానుసారముగా అంతా జరుగుతుంది, నేను ఏమీ చేయను. నేను కూడా డ్రామా బంధనములో
బంధింపబడి ఉన్నాను. కేవలం మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే సర్వశక్తివంతులుగా
అవుతారు, పవిత్రముగా అయినట్లయితే తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. తండ్రి
సర్వశక్తివంతుడు, వారు ఇలా నేర్పించవలసి ఉంటుంది - పిల్లలూ, నన్ను స్మృతి
చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, ఆ తర్వాత సర్వశక్తివంతులుగా అయి విశ్వముపై
రాజ్యము చేస్తారు. శక్తి లేకపోతే రాజ్యము ఎలా చేస్తారు. శక్తి అనేది యోగము ద్వారా
లభిస్తుంది, అందుకే భారత్ యొక్క ప్రాచీన యోగము చాలా మహిమ చేయబడింది. పిల్లలైన మీరు
నంబరువారుగా స్మృతి చేసి సంతోషాన్ని పొందుతారు. ఆత్మలమైన మనము తండ్రిని స్మృతి
చేసినట్లయితే విశ్వముపై రాజ్యాన్ని ప్రాప్తి చేసుకోగలమని మీకు తెలుసు. దానిని
లాక్కునే శక్తి ఎవ్వరికీ లేదు. ఉన్నతోన్నతమైన తండ్రి మహిమను అందరూ చేస్తారు కానీ ఏమీ
అర్థం చేసుకోరు. ఇది నాటకమని తెలిసిన మనుష్యులు ఒక్కరు కూడా లేరు. ఒకవేళ దీనిని
నాటకమని భావిస్తే, మరి ప్రారంభము నుండి చివరి వరకు అంతా గుర్తుకురావాలి, లేకపోతే
నాటకము అని అనడమే తప్పు అవుతుంది. ఇది నాటకమని, మనము పాత్రను అభినయించడానికి
వచ్చామని అంటారు కూడా, మరి ఆ నాటకము యొక్క ఆదిమధ్యాంతాలను కూడా తెలుసుకోవాలి కదా.
మనము పై నుండి వస్తామని, అందుకే వృద్ధి జరుగుతూ ఉంటుంది కదా అని కూడా అంటారు.
సత్యయుగములోనైతే కొద్దిమంది మనుష్యులే ఉండేవారు. ఇంతమంది ఆత్మలు ఎక్కడ నుండి వచ్చారు.
ఇది అనాదిగా తయారై, తయారుచేయబడిన అవినాశీ డ్రామా అని ఎవ్వరికీ తెలియదు. ఇది ఆది
నుండి అంతిమము వరకు రిపీట్ అవుతూ ఉంటుంది. మీరు సినిమాను మొదటి నుండి చివరి వరకు
చూడండి, ఒకవేళ మళ్ళీ రెండవ సారి రిపీట్ చేసి చూసినట్లయితే చక్రము తప్పకుండా
యథావిధిగా రిపీట్ అవుతూ ఉంటుంది. కొద్దిగా కూడా తేడా ఉండదు.
తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు ఎలా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వారు ఎంత
మధురమైన తండ్రి. బాబా, మీరు ఎంత మధురమైనవారు. బాబా, ఇక చాలు, ఇప్పుడిక మేము మా
సుఖధామానికి వెళ్తాము. ఆత్మ పావనముగా అయినప్పుడు అక్కడ పాలు కూడా పావనమైనవే
లభిస్తాయని ఇప్పుడు తెలుసుకున్నారు. శ్రేష్ఠాచారీ మాతలు చాలా మధురముగా ఉంటారు, వారు
సమయానికి తమంతట తామే పిల్లలకు పాలు పడతారు. పిల్లలు ఏడ్చే అవసరముండదు. ఈ విధముగా ఇది
కూడా విచార సాగర మంథనము చేయవలసి ఉంటుంది. ఉదయము వేళ బాబాతో మాట్లాడితే చాలా ఆనందముగా
అనిపిస్తుంది. బాబా, శ్రేష్ఠాచారీ రాజ్య స్థాపన చేసేందుకు మీరు ఎంత మంచి యుక్తులను
తెలియజేస్తున్నారు. తర్వాత, మనము శ్రేష్ఠాచారీ మాతల ఒడిలోకి వెళ్తాము. అనేక సార్లు
మనమే ఆ కొత్త సృష్టిలోకి వెళ్ళాము. ఇప్పుడు మన సంతోషకరమైన రోజులు వస్తాయి. ఇది
సంతోషమనే ఔషధము, అందుకే అతీంద్రియ సుఖము గురించి అడగాలంటే గోప-గోపికలను అడగండి అని
గాయనము కూడా ఉంది. ఇప్పుడు మనకు అనంతమైన తండ్రి లభించారు. వారు మనల్ని మళ్ళీ
స్వర్గానికి యజమానులుగా, శ్రేష్ఠాచారులుగా తయారుచేస్తారు. కల్ప-కల్పము మనము మన
రాజ్య భాగ్యాన్ని తీసుకుంటాము. ఓడిపోతాము, మళ్ళీ విజయము పొందుతాము. ఇప్పుడు తండ్రిని
స్మృతి చేయడము ద్వారానే రావణుడిపై విజయము పొందాలి, అప్పుడు మనము పావనముగా అయిపోతాము.
అక్కడ యుద్ధము, దుఃఖము మొదలైన విషయాలే ఉండవు, ఏ ఖర్చూ ఉండదు. భక్తి మార్గములో
జన్మ-జన్మాంతరాలు ఎంత ఖర్చు చేశారు, ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నారు, ఎంతమంది గురువులను
ఆశ్రయించారు. ఇప్పుడు మళ్ళీ అర్ధకల్పము మనము ఏ గురువును ఆశ్రయించము. శాంతిధామానికి,
సుఖధామానికి వెళ్తాము. తండ్రి అంటున్నారు, మీరు సుఖధామానికి వెళ్ళే యాత్రికులు.
ఇప్పుడు దుఃఖధామము నుండి సుఖధామములోకి వెళ్ళాలి. వాహ్ మన బాబా, వారు మనల్ని ఎలా
చదివిస్తున్నారు. మన స్మృతిచిహ్నము కూడా ఇక్కడే ఉంది. ఇది చాలా అద్భుతము. ఈ దిల్వాడా
మందిరానికైతే అపారమైన మహిమ ఉంది. ఇప్పుడు మనము రాజయోగము నేర్చుకుంటున్నాము. దీని
స్మృతిచిహ్నము తప్పకుండా తయారవుతుంది కదా. ఇది యథావిధిగా మన స్మృతిచిహ్నమే. బాబా,
మమ్మా మరియు పిల్లలు కూర్చుని ఉన్నారు. కింద యోగము నేర్చుకుంటున్నారు, పైన స్వర్గ
రాజ్యాధికారముంది. వృక్షములో కూడా ఎంత స్పష్టముగా ఉంది. బాబా ఎలా సాక్షాత్కారము
చేయించి ఆ తర్వాత కూర్చుని చిత్రాలను తయారుచేయించారు. బాబాయే సాక్షాత్కారము
చేయించారు, ఆ తర్వాత కరెక్ట్ కూడా చేసారు. ఎంత అద్భుతము. ఇది అంతా కొత్త జ్ఞానము.
ఎవ్వరికీ ఈ జ్ఞానము గురించి తెలియదు. తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తున్నారు,
మనుష్యులు ఎంత తమోప్రధానముగా అవుతూ ఉంటారు. మనుష్య సృష్టి పెరుగుతూ ఉంటుంది. భక్తి
కూడా వృద్ధి చెందుతూ-చెందుతూ తమోప్రధానముగా అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మీరు
సతోప్రధానముగా అయ్యే పురుషార్థము చేస్తారు. గీతలో కూడా మన్మనాభవ అన్న పదముంది. కేవలం
భగవంతుడు ఎవరు అన్నది మాత్రము తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు ఉదయముదయమే లేచి,
మనుష్యులకు భగవంతుని పరిచయాన్ని ఎలా ఇవ్వాలి అని విచార సాగర మంథనము చేయాలి. భక్తిలో
కూడా మనుష్యులు ఉదయముదయమే లేచి గదిలో కూర్చొని భక్తి చేస్తారు. అది కూడా విచార సాగర
మంథనమే కదా. ఇప్పుడు మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభిస్తుంది. తండ్రి మూడవ
నేత్రాన్ని ఇచ్చే కథను వినిపిస్తారు. దీనినే తీజరీ కథ అని అంటారు. తీజరీ కథ (మూడవ
నేత్రము యొక్క కథ), అమరకథ, సత్యనారాయణ కథ కూడా ప్రసిద్ధిమైనవి. వీటిని వినిపించేవారు
ఒక్క తండ్రి మాత్రమే, ఇవి తర్వాత భక్తి మార్గములో కొనసాగుతాయి. జ్ఞానముతో పిల్లలైన
మీరు సంపన్నులుగా అవుతారు, అందుకే దేవతలను పదమపతులు అని అంటారు. దేవతలు చాలా
ధనవంతులుగా, పదమపతులుగా అవుతారు. కలియుగాన్ని కూడా చూడండి మరియు సత్యయుగాన్ని కూడా
చూడండి - రాత్రికి, పగలుకు ఉన్నంత వ్యత్యాసము ఉంది. మొత్తం ప్రపంచమంతా
శుభ్రమవ్వడానికి సమయము పడుతుంది కదా. ఇది అనంతమైన ప్రపంచము. భారత్ అవినాశీ ఖండము.
ఇది ఎప్పుడూ కనుమరుగవ్వదు. అర్ధకల్పము ఒక్క ఖండము మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత
నంబరువారుగా ఇతర ఖండాలు ఇమర్జ్ అవుతాయి. పిల్లలైన మీకు ఎంత జ్ఞానము లభిస్తుంది.
ప్రపంచ చరిత్ర-భౌగోళికాల చక్రము ఎలా తిరుగుతుందో వచ్చి తెలుసుకోండి అని చెప్పండి.
ప్రాచీన ఋషులు-మునులకు ఎంత గౌరవముంది, కానీ వారికి కూడా సృష్టి ఆదిమధ్యాంతాలు
తెలియవు. వారు హఠయోగులు. అయితే, వారిలో పవిత్రతా శక్తి ఉంది, దాని ద్వారా భారత్ ను
నిలబెడుతున్నారు. లేకపోతే భారత్ ఏమైపోయి ఉండేదో తెలియదు. ఇంటికి వైట్ వాష్ మొదలైనవి
చేస్తారు కదా, అప్పుడు శోభిస్తుంది. భారత్ చాలా ఉన్నతముగా, పవిత్రముగా ఉండేది,
ఇప్పుడు అదే పతితముగా అయిపోయింది. అక్కడ మీ సుఖము కూడా చాలా సమయము నడుస్తుంది. మీ
వద్ద చాలా ధనముంటుంది. మీరు భారత్ లోనే ఉండేవారు. మీ రాజ్యము ఉండేది, ఇది నిన్నటి
విషయము. ఆ తర్వాత ఇతర ధర్మాలు వచ్చాయి. వారు వచ్చి కొద్దిగా తీర్చిదిద్ది తమ పేరును
ప్రసిద్ధము చేసుకున్నారు. ఇప్పుడు వారు కూడా అందరూ తమోప్రధానముగా అయిపోయారు. ఇప్పుడు
పిల్లలైన మీకు ఎంత సంతోషముండాలి. ఈ విషయాలన్నీ కొత్తవారికి వినిపించకూడదు.
మొట్టమొదటైతే తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి యొక్క నామ, రూప, దేశ, కాలాలు తెలుసా?
ఉన్నతోన్నతమైన తండ్రి పాత్ర అయితే ప్రఖ్యాతి చెందుతుంది కదా. ఆ తండ్రియే మనకు
డైరెక్షన్లు ఇస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మీరు మళ్ళీ మీ రాజధానిని స్థాపన
చేస్తున్నారు. పిల్లలైన మీరు నాకు సహాయకులు. మీరు పవిత్రముగా అవుతున్నారు. మీ కోసం
పవిత్ర ప్రపంచము తప్పకుండా స్థాపనవ్వనున్నది. పాత ప్రపంచము మారిపోతూ ఉందని మీరు
వ్రాయవచ్చు. ఆ తర్వాత ఈ సూర్యవంశీయుల, చంద్రవంశీయుల రాజ్యము ఉంటుంది. ఆ తర్వాత రావణ
రాజ్యము ఉంటుంది. చిత్రాలపై అర్థం చేయించడం చాలా మధురముగా అనిపిస్తుంది, వీటిలో
తిథి-తారీఖు అన్నీ వ్రాయబడి ఉన్నాయి. భారత్ యొక్క ప్రాచీన రాజయోగమంటే స్మృతి. స్మృతి
ద్వారా వికర్మలు వినాశనమవుతాయి మరియు చదువు ద్వారా హోదా లభిస్తుంది. దైవీ గుణాలను
ధారణ చేయాలి. మాయా తుఫానులైతే తప్పకుండా వస్తాయి. ఉదయమే లేచి బాబాతో మాట్లాడడం చాలా
మంచిది. భక్తి మరియు జ్ఞానము, రెండింటికీ ఈ సమయము మంచిది. మధురాతి మధురమైన విషయాలను
మాట్లాడాలి. ఇప్పుడు మనము శ్రేష్ఠాచారీ ప్రపంచములోకి వెళ్తాము. మేము శరీరాన్ని వదిలి
గర్భములోకి వెళ్తామని వృద్ధుల మనసులోనైతే ఉంటుంది కదా. బాబా ఎంత నషాను ఎక్కిస్తారు.
ఇటువంటి విషయాలను కూర్చుని మాట్లాడుకున్నా సరే మీకు జమ అవుతుంది. శివబాబా మనల్ని
నరకవాసుల నుండి స్వర్గవాసులుగా చేస్తున్నారు. మొట్టమొదట మనము వస్తాము, మొత్తం
ఆల్రౌండ్ పాత్రను మనము అభినయించాము. ఇప్పుడు బాబా చెప్తున్నారు, ఈ ఛీ-ఛీ శరీరాన్ని
వదిలేయండి. దేహ సహితముగా మొత్తం ప్రపంచమంతటినీ మర్చిపోండి. ఇది అనంతమైన సన్యాసము.
అక్కడ కూడా మీరు వృద్ధులుగా అయినప్పుడు మేము పిల్లలుగా అవుతామని మీకు
సాక్షాత్కారమవుతుంది. సంతోషము కలుగుతుంది. బాల్యము అయితే అన్నింటికన్నా మంచిది.
ఉదయమే కూర్చొని ఈ విధముగా విచార సాగర మంథనము చేయాలి. పాయింట్లు వెలువడితే మీకు
సంతోషము కలుగుతుంది. సంతోషములో గంట గంటన్నర గడిచిపోతుంది. ఎంతగా అభ్యాసము అవుతూ
ఉంటుందో అంతగా సంతోషము పెరుగుతూ ఉంటుంది, చాలా ఆనందముగా అనిపిస్తుంది. అంతేకాక
నడుస్తూ-తిరుగుతూ స్మృతి చేయాలి. తీరికైతే చాలా ఉంది, అయితే విఘ్నాలు కలుగుతాయి,
ఇందులో అనుమానమేమీ లేదు. వ్యాపారములో మనుష్యులకు నిద్ర రాదు. సోమరులు నిద్రపోతారు.
మీరు ఎంత వీలైతే అంత శివబాబానే స్మృతి చేస్తూ ఉండండి. శివబాబా కోసం మేము భోజనము
తయారుచేస్తున్నాము, శివబాబా కోసం మేము ఇది చేస్తున్నాము అని మీకు బుద్ధిలో ఉంటుంది.
భోజనము కూడా శుద్ధతతో తయారుచేయాలి. గొడవలు కలిగించే విషయాలేవీ ఉండకూడదు. బాబా స్వయం
కూడా స్మృతి చేస్తారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఉదయముదయమే లేచి బాబాతో మధురాతి మధురమైన మాటలు మాట్లాడాలి. రోజూ సంతోషమనే
ఔషధాన్ని తింటూ అతీంద్రియ సుఖాన్ని అనుభవము చేయాలి.
2. సత్యయుగీ రాజధానిని స్థాపించడములో తండ్రికి పూర్తి సహాయకులుగా అయ్యేందుకు
పావనముగా అవ్వాలి, స్మృతి ద్వారా వికర్మలను వినాశనము చేసుకోవాలి, భోజనాన్ని కూడా
శుద్ధతతో తయారుచేయాలి.
వరదానము:-
దివ్య గుణాల ఆహ్వానము ద్వారా సర్వ అవగుణాలను ఆహుతి ఇచ్చే
సంతుష్ట ఆత్మా భవ
దీపావళి సమయములో విశేషముగా శుభ్రము చేయడము పట్ల మరియు
సంపాదన పట్ల శ్రద్ధ పెడతారు. అలా మీరు కూడా అన్ని రకాల శుభ్రత మరియు సంపాదన పట్ల
లక్ష్యము పెట్టుకుని సంతుష్ట ఆత్మగా అవ్వండి. సంతుష్టత ద్వారానే సర్వ దివ్య గుణాల
ఆహ్వానమును చెయ్యగలరు. అప్పుడిక అవగుణాల ఆహుతి స్వతహాగానే జరిగిపోతుంది. లోపల ఏవైతే
బలహీనతలు, లోపాలు, నిర్బలత మరియు కోమలత ఉండిపోయాయో, వాటిని సమాప్తము చేసి ఇప్పుడు
కొత్త ఖాతాను ప్రారంభించండి మరియు నూతన సంస్కారాలు అనే నూతన వస్త్రాలను ధరించి
సత్యమైన దీపావళిని జరుపుకోండి.
స్లోగన్:-
స్వమానము అనే సీట్ పై ఎల్లప్పుడూ సెట్ అయ్యి ఉండాలంటే దృఢ సంకల్పమనే బెల్ట్ ను బాగా
కట్టుకోండి.
మాతేశ్వరిగారి
అమూల్యమైన మహావాక్యాలు
‘‘ఈ అవినాశీ ఈశ్వరీయ
జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఏ భాషనూ నేర్చుకోవలసిన అవసరము లేదు’’
మన ఈ ఈశ్వరీయ జ్ఞానము
ఏదైతే ఉందో, ఇది చాలా సహజమైనది మరియు మధురమైనది, దీని ద్వారా జన్మ-జన్మాంతరాల కొరకు
సంపాదన జమ అవుతుంది. ఈ జ్ఞానము ఎంత సహజమైనదంటే, దీనిని ఏ మహాన్ ఆత్మలైనా, అహల్య వంటి
రాతి బుద్ధి కలవారైనా, ఏ ధర్మానికి చెందినవారైనా, పిల్లల నుండి వృద్ధుల వరకు, దీనిని
ఎవ్వరైనా ప్రాప్తి చేసుకోగలరు. చూడండి, ఈ జ్ఞానము ఇంత సహజమైనదైనప్పటికీ ప్రపంచములోని
వారు ఈ జ్ఞానాన్ని చాలా కష్టమైనదిగా భావిస్తారు. కొంతమంది, మేము చాలా వేదాలు,
శాస్త్రాలు, ఉపనిషత్తులు చదివి గొప్ప-గొప్ప విద్వాంసులుగా అయ్యాము అని అనుకుంటారు,
కానీ దాని కోసం భాష నేర్చుకోవలసి ఉంటుంది. వారు చాలా హఠయోగము చేసినప్పుడే ప్రాప్తి
లభిస్తుంది, కానీ ఈ జ్ఞానమైతే చాలా సహజమైనది మరియు సరళమైనది అని మనము అనుభవముతో
తెలుసుకున్నాము, ఎందుకంటే దీనిని స్వయముగా పరమాత్మ చదివిస్తున్నారు. ఇందులో ఏ
విధమైన హఠక్రియలు కానీ, జపతపాదులు కానీ, శాస్త్రాలు తెలిసిన పండితులుగా అవ్వడము కానీ,
లేక దీని కోసం సంస్కృత భాషను నేర్చుకోవలసిన అవసరము కానీ లేదు. ఇక్కడైతే ఆత్మ తన
పరమపిత పరమాత్మతో న్యాచురల్ గా యోగము జోడించాలి. ఒకవేళ ఎవరైనా ఈ జ్ఞానాన్ని ధారణ
చేయలేకపోయినా కానీ కేవలం యోగము ద్వారా కూడా చాలా లాభము ఉంటుంది. దీని ద్వారా, ఒకటేమో
పవిత్రముగా అవుతారు, రెండు, కర్మ బంధనాలు భస్మమవుతాయి మరియు కర్మాతీతులుగా అవుతారు.
సర్వశక్తివంతుడైన పరమాత్ముని స్మృతిలో ఇంతటి శక్తి ఉంది. వారు సాకార బ్రహ్మా తనువు
ద్వారా మనకు యోగాన్ని నేర్పిస్తున్నారు కానీ స్మృతి అనేది డైరెక్ట్ ఆ జ్యోతి
స్వరూపుడైన శివ పరమాత్ముడినే స్మృతి చేయాలి, ఆ స్మృతి ద్వారానే కర్మ బంధనాల
మాలిన్యము తొలగిపోతుంది. అచ్ఛా. ఓం శాంతి.
అవ్యక్త సూచనలు
- స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగము చెయ్యండి
శాంతి శక్తిని ముందుగా స్వయముపై, తనువు యొక్క వ్యాధులపై ప్రయోగము చేసి చూడండి. ఈ
శక్తి ద్వారా కర్మ బంధనాల రూపము మధురమైన సంబంధాల రూపములోకి మారిపోతుంది. ఈ
కర్మభోగము, కర్మ యొక్క కఠినమైన బంధనము సైలెన్స్శక్తి ద్వారా నీటిపై గీత వలె
అనుభవమవుతుంది. అనుభవించేవారిగా కాకుండా, కర్మను అనుభవిస్తున్నాను అన్నట్లు కాకుండా
సాక్షీదృష్టాగా అయ్యి ఈ లెక్కాచారాల దృశ్యాన్ని కూడా చూస్తూ ఉంటారు.
| | | |