22-05-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తారో,
ఇదంతా పాత ప్రపంచము యొక్క సామాగ్రి, ఇది సమాప్తము అవ్వనున్నది, అందుకే ఈ
దుఃఖధామాన్ని బుద్ధి ద్వారా మర్చిపోండి’’
ప్రశ్న:-
మనుష్యులు తండ్రిపై ఏ దోషాన్ని మోపారు, కానీ ఆ దోషము ఎవరిదీ కూడా కాదు?
జవాబు:-
ఇంత పెద్ద
వినాశనము ఏదైతే జరుగుతుందో, దానిని భగవంతుడే చేయిస్తారు, దుఃఖాన్ని వారే ఇస్తారు,
సుఖాన్ని కూడా వారే ఇస్తారు అని మనుష్యులు భావిస్తారు. ఈ విధంగా చాలా పెద్ద దోషాన్ని
మోపారు. తండ్రి అంటారు - పిల్లలూ, నేను సదా సుఖదాతను, నేను ఎవరికీ దుఃఖాన్ని
ఇవ్వలేను. ఒకవేళ నేను వినాశనము చేయిస్తే, ఆ పాపమంతా నా పైకి వస్తుంది. అదంతా
డ్రామానుసారముగా జరుగుతుంది, నేను చేయించను.
పాట:-
రాత్రి
ప్రయాణీకుడా...
ఓంశాంతి
పిల్లలకు నేర్పించేందుకు ఎన్నో పాటలు చాలా బాగున్నాయి. పాటల అర్థాన్ని తెలుసుకుంటే
వాణి తెరుచుకుంటుంది. మేమందరమూ పగలు యొక్క యాత్రలో ఉన్నామని, రాత్రి యొక్క యాత్ర
పూర్తవుతుందని పిల్లల బుద్ధిలోనైతే ఉంది. భక్తి మార్గము అంటేనే రాత్రి యొక్క యాత్ర.
అంధకారములో ఎదురుదెబ్బలు తినాల్సి వస్తుంది. అర్ధకల్పము అంధకారములో యాత్ర చేస్తూ
దిగుతూ వచ్చారు. ఇప్పుడు పగలు యొక్క యాత్ర చేసేందుకు వచ్చారు. ఈ యాత్రను ఒక్కసారి
మాత్రమే చేస్తారు. మీకు తెలుసు - స్మృతి యాత్ర ద్వారా మనము తమోప్రధానము నుండి
సతోప్రధానముగా అయ్యి, ఆ తర్వాత సతోప్రధాన సత్యయుగానికి యజమానులుగా అవుతాము.
సతోప్రధానులుగా అవ్వడము వలన సత్యయుగానికి యజమానులుగా, తమోప్రధానముగా అవ్వడము వలన
కలియుగానికి యజమానులుగా అవుతారు. దానిని స్వర్గము అని అంటారు, దీనిని నరకము అని
అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేస్తారు. తండ్రి ద్వారా సుఖమే
లభిస్తుంది. ఎవరైతే ఏమీ చెప్పలేరో, వారు కేవలం - శాంతిధామము ఆత్మలమైన మన యొక్క ఇల్లు,
సుఖధామము స్వర్గ రాజ్యము మరియు ఇప్పుడు ఇది దుఃఖధామము, రావణ రాజ్యము అన్నది
గుర్తుంచుకోవాలి. ఇప్పుడు తండ్రి అంటారు - ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. మీరు ఇక్కడ
ఉన్నా కానీ ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తారో, అదంతా రావణ రాజ్యమేనని బుద్ధిలో ఉంచుకోండి.
ఈ శరీరాలను చూస్తారు, ఇదంతా కూడా పాత ప్రపంచము యొక్క సామాగ్రియే. ఈ సామాగ్రి అంతా ఈ
యజ్ఞములో స్వాహా అవ్వాలి. ఆ పతిత బ్రాహ్మణులు యజ్ఞాన్ని రచిస్తారు, అందులో
యవలు-నువ్వులు మొదలైన సామాగ్రిని స్వాహా చేస్తారు. ఇక్కడైతే వినాశనము జరగనున్నది.
ఉన్నతోన్నతమైనవారు తండ్రి, ఆ తర్వాత బ్రహ్మా మరియు విష్ణువు. శంకరుడికి అంతగా పాత్ర
ఏమీ లేదు. వినాశనము ఎలాగూ జరగవలసిందే. ఎవరికైతే ఏ పాపమూ అంటుకోదో, తండ్రి వారి
ద్వారానే వినాశనము చేయిస్తారు. ఒకవేళ భగవంతుడే వినాశనము చేయిస్తారు అని అంటే, ఆ
దోషమంతా వారిపైకి వస్తుంది, అందుకే ఇదంతా డ్రామాలో రచించబడి ఉంది. ఇది అనంతమైన
డ్రామా, దీని గురించి ఎవరికీ తెలియదు. రచయిత మరియు రచనల గురించి ఎవరికీ తెలియదు.
తెలియని కారణముగా అనాథలుగా అయిపోయారు. వారికి నాథుడంటూ ఎవరూ లేరు. ఏ ఇంట్లోనైనా
తండ్రి లేకపోతే, పరస్పరము గొడవపడుతూ ఉంటే - వీరికి నాథుడంటూ ఎవరూ లేరా అని అంటారు.
ఇప్పుడు కోట్లాది మంది మనుష్యులు ఉన్నారు, వారికి నాథుడంటూ ఎవరూ లేరు. దేశాలు
పరస్పరములో గొడవపడుతూ ఉంటాయి. ఒకే ఇంట్లో పిల్లలు తండ్రితో, పతి-పత్నితో గొడవపడుతూ
ఉంటారు. దుఃఖధామములో ఉండేది అశాంతి. తండ్రి అయిన భగవంతుడు దుఃఖాన్ని రచిస్తారని కాదు.
తండ్రియే సుఖ-దుఃఖాలను ఇస్తారని మనుష్యులు భావిస్తారు కానీ తండ్రి ఎప్పుడూ దుఃఖాన్ని
ఇవ్వలేరు. వారిని సుఖదాత అని అన్నప్పుడు మరి వారు దుఃఖాన్ని ఎలా ఇస్తారు. తండ్రి
అంటారు - నేను మిమ్మల్ని చాలా సుఖవంతులుగా చేస్తాను. ఒకటేమో స్వయాన్ని ఆత్మగా
భావించండి. ఆత్మ అవినాశీ, శరీరము వినాశీ. ఆత్మలమైన మన నివాస స్థానము పరంధామము,
దానినే శాంతిధామము అని కూడా అంటారు. ఈ పదము సరైనది. స్వర్గాన్ని పరంధామము అని అనరు.
పరమ్ అనగా అతీతమైనది. స్వర్గమైతే ఇక్కడే ఉంటుంది. మూలవతనము అన్నింటికన్నా అతీతముగా
ఉంటుంది, అక్కడ ఆత్మలమైన మనము నివసిస్తాము. సుఖ-దుఃఖాల పాత్రను మీరు ఇక్కడ
అభినయిస్తారు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని ఏదైతే అంటారో, అది పూర్తిగా రాంగ్.
స్వర్గము ఇక్కడ లేదు. ఇప్పుడు ఇది కలియుగము. ఈ సమయములో మీరు సంగమయుగవాసులు.
మిగిలినవారందరూ కలియుగవాసులు. ఒకే ఇంట్లో తండ్రి సంగమయుగవాసి అయితే పిల్లలు
కలియుగవాసులుగా ఉన్నారు. స్త్రీ సంగమయుగవాసి, పతి కలియుగవాసి... ఎంత తేడా ఉంటుంది.
పత్ని జ్ఞానము తీసుకుంటారు, పతి జ్ఞానము తీసుకోకపోతే ఒకరికొకరు సహయోగులుగా ఉండలేరు.
ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. పత్ని పుష్పములా అవుతారు, పతి ముల్లుగానే ఉండిపోతారు.
ఒకే ఇంట్లో, నేను సంగమయుగీ పురుషోత్తమ పవిత్ర దేవతగా అవుతున్నాను అని కొడుకుకి
తెలుసు, కానీ తండ్రి - వివాహము చేసుకుని నరకవాసిగా అవ్వమని చెప్తారు. ఇప్పుడు
ఆత్మిక తండ్రి అంటారు - పిల్లలూ, పవిత్రముగా అవ్వండి. ఇప్పటి పవిత్రత 21 జన్మల వరకూ
కొనసాగుతుంది. ఈ రావణ రాజ్యము సమాప్తం అవ్వనున్నది. ఎవరి పట్ల శత్రుత్వము ఉంటుందో,
వారి దిష్టిబొమ్మను కాలుస్తారు కదా. రావణుడిని కాలుస్తారు. శత్రువు పట్ల ఎంత ద్వేషము
ఉండాలి. కానీ రావణుడు అంటే ఎవరో ఎవరికీ తెలియదు. ఎంతో ఖర్చు చేస్తారు. మనిషిని
కాల్చడానికి అంతగా ఖర్చు చేయరు. స్వర్గములో అటువంటి విషయమేమీ ఉండదు. అక్కడ కరెంట్
లో పెట్టగానే సమాప్తము. వారి మట్టి ఉపయోగపడుతుందా అన్న ఆలోచన అక్కడ ఎవరికీ రాదు.
అక్కడి ఆచార-వ్యవహారాలు ఎలా ఉంటాయంటే, ఎటువంటి ఇబ్బంది కానీ అలసట యొక్క విషయము కానీ
ఉండదు. ఎంతో సుఖము ఉంటుంది. కావున ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు - నన్నొక్కరినే
స్మృతి చేసే పురుషార్థము చేయండి. ఈ స్మృతి చేయడములోనే యుద్ధము ఉంటుంది. తండ్రి
పిల్లలకు అర్థం చేయిస్తారు - మధురమైన పిల్లలూ, మీ పైన మీరు అటెన్షన్ అనే కాపలాదారును
పెట్టుకోండి. మాయ ముక్కు, చెవులు కట్ చేయకుండా చూసుకోండి ఎందుకంటే అది శత్రువు కదా.
మీరు తండ్రిని స్మృతి చేస్తారు మరియు మాయ తుఫానులో ఎగిరిపోయేలా చేస్తుంది, అందుకే
బాబా అంటారు - ప్రతి ఒక్కరూ రోజంతటి యొక్క చార్టును వ్రాయాలి - ఎంతగా తండ్రిని
స్మృతి చేసాను? మనసు ఎక్కడికైనా పరిగెత్తిందా? ఎంత సమయము తండ్రిని స్మృతి చేసాను అని
డైరీలో నోట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి, అప్పుడు - వీరు చాలా
ధైర్యవంతులు, తమపై తాము మంచిగా అటెన్షన్ పెడుతున్నారు అని మాయ కూడా అర్థం
చేసుకుంటుంది. పూర్తి గమనము ఉంచుకోవాలి. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి వచ్చి తమ
పరిచయాన్ని ఇస్తారు. వారంటారు - మీ ఇల్లు-వాకిళ్ళను సంభాళించండి కానీ కేవలం తండ్రిని
స్మృతి చేయండి. వీరు ఆ సన్యాసుల వలె ఏమీ కాదు. వారు భిక్షముపైనే ఆధారపడతారు, అయినా
కర్మలైతే చేయాల్సి ఉంటుంది కదా. మీరు హఠయోగులు, రాజయోగాన్ని నేర్పించేవారు ఒక్క
భగవంతుడేనని మీరు వారికి తెలియజేయవచ్చు. ఇప్పుడు పిల్లలైన మీరు సంగమములో ఉన్నారు. ఈ
సంగమయుగాన్నే స్మృతి చేయాలి. ఇప్పుడు మనము సంగమయుగములో సర్వోత్తమమైన దేవతలుగా
అవుతాము. మనము ఉత్తమ పురుషులుగా అనగా పూజ్య దేవతలుగా ఉండేవారము, ఇప్పుడు కనిష్టులుగా
అయిపోయాము. ఎందుకూ పనికిరాకుండా అయిపోయాము. ఇప్పుడు మనం ఏ విధంగా తయారవుతాము.
మనుష్యులు ఏ సమయములోనైతే బ్యారిస్టరీ మొదలైనవి చదువుతారో, ఆ సమయములో పదవి ఏమీ
లభించదు. పరీక్ష పాస్ అయిన తర్వాత పదవి యొక్క టోపీ లభిస్తుంది. వారు వెళ్ళి
గవర్నమెంట్ యొక్క సేవలో నిమగ్నమవుతారు. మనల్ని ఉన్నతోన్నతుడైన భగవంతుడు
చదివిస్తున్నారు కావున వారు తప్పకుండా ఉన్నతోన్నతమైన పదవిని ఇస్తారు అని ఇప్పుడు
మీకు తెలుసు. ఇదే లక్ష్యము-ఉద్దేశ్యము. ఇప్పుడు తండ్రి అంటారు - నన్నొక్కరినే స్మృతి
చేయండి, నేను ఎవరినో, ఎలా ఉన్నానో, అంతా అర్థం చేయించాను. ఆత్మల యొక్క తండ్రినైన
నేను బిందువును, నాలో జ్ఞానమంతా ఉంది. ఆత్మ ఒక బిందువు అన్న జ్ఞానము ఇంతకుముందు మీకు
కూడా లేదు. ఆత్మలో పూర్తి 84 జన్మల పాత్ర అవినాశీగా రచించబడి ఉంది. క్రైస్టు పాత్రను
అభినయించి వెళ్ళారు, మళ్ళీ వారు తప్పకుండా వస్తారు కదా. క్రైస్టుకు సంబంధించినవారంతా
ఇప్పుడు వెళ్ళిపోతారు. క్రైస్టు ఆత్మ కూడా ఇప్పుడు తమోప్రధానముగా ఉంటుంది.
ఉన్నతోన్నతమైన ధర్మ స్థాపకులు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో, వారు తమోప్రధానముగా ఉన్నారు.
అనేక జన్మల అంతిమములో నేను తమోప్రధానముగా అయ్యాను, ఇప్పుడు మళ్ళీ సతోప్రధానముగా
అవుతాను అని వీరు కూడా అంటారు. తతత్వం.
మీకు తెలుసు - ఇప్పుడు మనము దేవతలుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా అయ్యాము. విరాట
రూపపు చిత్రము యొక్క అర్థము ఎవరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - ఆత్మ
స్వీట్ హోమ్ లో (మధురమైన ఇంట్లో) ఉన్నప్పుడు పవిత్రముగా ఉంటుంది. ఇక్కడికి రావడముతో
పతితముగా అయ్యింది. అందుకే - ఓ పతిత-పావనా, మీరు వచ్చి మమ్మల్ని పవిత్రముగా చేయండి,
తద్వారా మేము మా ఇల్లు అయిన ముక్తిధామానికి వెళ్తాము అని అంటారు. ఈ పాయింటును కూడా
ధారణ చేయాలి. ముక్తి-జీవన్ముక్తిధామము అని దేనిని అంటారో మనుష్యులకు తెలియదు.
ముక్తిధామాన్ని శాంతిధామము అని కూడా అంటారు. జీవన్ముక్తిధామాన్ని సుఖధామము అని
అంటారు. ఇక్కడ దుఃఖపు బంధనము ఉంది. జీవనముక్తిని సుఖపు సంబంధము అని అంటారు. ఇప్పుడు
దుఃఖపు బంధనాలు దూరమైపోతాయి. ఉన్నత పదవిని పొందేందుకు మనము పురుషార్థం చేస్తాము. మరి
ఆ నషా ఉండాలి. ఇప్పుడు మనం శ్రీమతముపై మన రాజ్యభాగ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము.
జగదాంబ నంబరువన్ లోకి వెళ్తారు. మనము కూడా వారిని ఫాలో చేయాలి. ఏ పిల్లలైతే ఇప్పుడు
తల్లిదండ్రుల హృదయాన్ని అధిరోహిస్తారో, వారే భవిష్యత్తులో సింహాసనాధికారులుగా
అవుతారు. ఎవరైతే రాత్రింబవళ్ళు సేవలో బిజీగా ఉంటారో, వారే హృదయాన్ని అధిరోహిస్తారు.
తండ్రిని స్మృతి చేయండి అని అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. ఎవ్వరి వద్దా డబ్బు
మొదలైనవేవీ తీసుకోకూడదు. వీరు రాఖీ కట్టడానికి వచ్చారు, వీరికి ఏదో ఒకటి ఇవ్వవలసి
ఉంటుందని వారు భావిస్తారు. వారికి చెప్పండి - మాకు ఇంకేమీ వద్దు, కేవలం 5 వికారాలను
దానమివ్వండి. ఈ దానమును తీసుకునేందుకు మేము వచ్చాము, అందుకే పవిత్రతా రాఖీని
కడుతున్నాము. తండ్రిని స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి తద్వారా ఈ విధంగా (దేవతలుగా)
తయారవుతారు. అంతేకానీ మేము డబ్బు మొదలైనవేవీ తీసుకోము. మేము ఆ బ్రాహ్మణులము కాము.
కేవలము 5 వికారాలను దానమిచ్చినట్లయితే గ్రహణము తొలగిపోతుంది. ఇప్పుడు ఏ కళలూ లేవు.
అందరికీ గ్రహణము పట్టి ఉంది. మీరు బ్రాహ్మణులు కదా. ఎక్కడికి వెళ్ళినా ఈ విధంగా
చెప్పండి - దానమిచ్చినట్లయితే గ్రహణము తొలగిపోతుంది. పవిత్రముగా అవ్వండి.
వికారాలలోకి ఎప్పుడూ వెళ్ళకండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు
వినాశనమవుతాయి మరియు మీరు పుష్పాలుగా అవుతారు. మీరే పుష్పాలుగా ఉండేవారు, మీరే మళ్ళీ
ముల్లులా అయిపోయారు. 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ పడిపోతూనే వచ్చారు. ఇప్పుడు
తిరిగి వెళ్ళాలి. బాబా వీరి ద్వారా డైరెక్షన్ ను ఇచ్చారు. వారు ఉన్నతోన్నతుడైన
భగవంతుడు. వారికి శరీరము లేదు. అచ్ఛా, బ్రహ్మా-విష్ణు-శంకరులకు శరీరము ఉందా? అవును,
సూక్ష్మ శరీరము ఉంది అని మీరు అంటారు. కానీ అది మనుష్య సృష్టి కాదు. ఆట అంతా ఇక్కడే
ఉంది. సూక్ష్మ వతనంలో నాటకము ఎలా జరుగుతుంది? అలాగే మూలవతనములో కూడా సూర్య-చంద్రులే
లేనప్పుడు మరి నాటకము ఎలా జరుగుతుంది! ఇది చాలా పెద్ద రంగస్థలము. పునర్జన్మలు కూడా
ఇక్కడే ఉంటాయి. సూక్ష్మవతనములో పునర్జన్మలు ఉండవు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం
అనంతమైన ఆట అంతా ఉంది. దేవీ-దేవతలుగా ఉన్న మనము మళ్ళీ వామ మార్గములోకి ఎలా వస్తాము
అనేది ఇప్పుడు మీకు తెలిసింది. వామ మార్గము అని వికారీ మార్గాన్ని అంటారు. అర్ధ
కల్పము మనము పవిత్రముగా ఉన్నాము, గెలుపు-ఓటముల ఆట మనదే. భారత్ అవినాశీ ఖండము. ఇది
ఎప్పటికీ వినాశనము అవ్వదు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉన్నప్పుడు ఇతర ధర్మాలేవీ
ఉండేవి కావు. ఎవరైతే కల్పక్రితం ఈ విషయాలను అంగీకరించారో, వారే ఈ విషయాలను
అంగీకరిస్తారు. 5 వేల సంవత్సరాల కన్నా పురాతన వస్తువు ఏదీ ఉండదు. సత్యయుగములోకి మీరు
మొట్టమొదట వెళ్ళి మీ మహళ్ళను తయారుచేసుకుంటారు. అంతేకానీ బంగారు ద్వారక సముద్రములో
ఉంది, అది బయటకు వస్తుంది అని కాదు. సముద్రములో నుండి దేవతలు రత్నాలను పళ్ళాల
నింపుగా ఇచ్చేవారని చూపిస్తారు. వాస్తవానికి జ్ఞానసాగరుడు తండ్రి, వారు పిల్లలైన
మీకు జ్ఞాన రత్నాలను పళ్ళాల నింపుగా ఇస్తున్నారు. శంకరుడు పార్వతికి కథ
వినిపించినట్లు, జ్ఞాన రత్నాలతో జోలెను నింపినట్లు చూపిస్తారు. శంకరుడు - భాంగ్,
ఉమ్మెత్త పువ్వుల మత్తు రసాన్ని త్రాగేవారు అని అంటారు, మళ్ళీ వారి ఎదురుగా వెళ్ళి
- మా జోలెను నింపండి, మాకు ధనమునివ్వండి అని అంటారు. శంకురుడిని కూడా నిందించారు.
అందరికన్నా ఎక్కువగా నన్ను నిందిస్తారు. ఇది కూడా ఒక ఆట, ఇది మళ్ళీ జరుగుతుంది. ఈ
నాటకము గురించి ఎవరికీ తెలియదు. నేను వచ్చి మీకు ఆది నుండి అంతిమము వరకు ఉన్న
రహస్యాలన్నింటి గురించి అర్థం చేయిస్తాను. ఉన్నతోన్నతమైనవారు తండ్రి అని మీకు తెలుసు.
విష్ణువు బ్రహ్మాగా, బ్రహ్మా విష్ణువుగా ఎలా అవుతారు అనేది ఎవరూ అర్థం చేసుకోలేరు.
మనము విష్ణు కులము వారిగా అవ్వాలి అని ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేస్తారు.
విష్ణుపురికి యజమానులుగా అయ్యేందుకు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణులమైన మేము
మా కొరకు సూర్యవంశీ-చంద్రవంశీ రాజధానిని శ్రీమతము ద్వారా స్థాపన చేసుకుంటున్నామని
మీ హృదయములో ఉంది. ఇందులో యుద్ధము మొదలైనవాటి విషయమేమీ లేదు. దేవతలకు మరియు అసురులకు
ఎప్పుడూ యుద్ధము జరుగదు. దేవతలు సత్యయుగములో ఉంటారు. అక్కడ యుద్ధము ఎలా జరుగుతుంది.
ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు యోగబలము ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతారు. బాహుబలము
వారు వినాశనాన్ని పొందుతారు. మీరు సైలెన్సు బలము ద్వారా సైన్సుపై విజయాన్ని
పొందుతారు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. మనము ఆత్మలము, మనము మన ఇంటికి
వెళ్ళాలి. ఆత్మలు వేగవంతమైనవి. ఒక్క గంటలో ఎంతో దూరము వెళ్ళిపోగల విమానాలను కూడా
తయారుచేస్తున్నారు. కానీ ఆత్మ వేగము దానికన్నా ఎంతో తీవ్రమైనది. ఇప్పుడు ఏరోప్లేన్లు
ఎటువంటివి వెలువడ్డాయి అంటే అవి ఒక్క గంటలో ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతాయి. మరి
ఆత్మ దాని కన్నా చురుకైనది. ఒక్క క్షణములో ఆత్మ ఎక్కడ ఉన్నది ఎక్కడికి వెళ్ళి జన్మ
తీసుకుంటుంది. కొందరు విదేశాలకు కూడా వెళ్ళి జన్మ తీసుకుంటారు. ఆత్మ అన్నింటికన్నా
వేగవంతమైన రాకెట్. ఇందులో మెషినరీ మొదలైనవాటి విషయమే లేదు. శరీరము వదలగానే
పారిపోతుంది. మేము ఇంటికి వెళ్ళాలి అని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది, పతిత
ఆత్మ వెళ్ళలేదు. మీరు పావనంగా అయ్యే వెళ్తారు, మిగిలినవారందరూ శిక్షలను అనుభవించి
వెళ్తారు. ఎన్నో శిక్షలు లభిస్తాయి. అక్కడ గర్భ మహలులో విశ్రాంతిగా ఉంటారు. పిల్లలకు
సాక్షాత్కారాలు జరిగాయి. కృష్ణుని జన్మ ఎలా జరుగుతుంది, అక్కడ అశుద్ధత అన్న మాటే
ఉండదు. ఒక్కసారిగా ప్రకాశముతో నిండిపోతుంది. ఇప్పుడు మీరు వైకుంఠానికి యజమానులుగా
అవుతారు కావున అటువంటి పురుషార్థము చెయ్యాలి. ఆహార-పానీయాలు శుద్ధముగా, పవిత్రంగా
ఉండాలి. పప్పన్నము అన్నింటికన్నా మంచిది. ఋషికేష్ లో సన్యాసులు ఆహారాన్ని ఒక కిటికీ
నుండి తీసుకుని వెళ్ళిపోతారు, ఒకొక్కరూ ఒకొక్కలా ఉంటారు. అచ్ఛా.
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. స్వయంపై అటెన్షన్ అనే కాపలాదారును పూర్తి రీతిలో ఉంచాలి. మాయ నుండి మిమ్మల్ని
మీరు సంభాళించుకోవాలి. స్మృతి యొక్క సత్యాతి-సత్యమైన చార్టును పెట్టాలి.
2. తల్లిదండ్రులను ఫాలో చేసి హృదయ సింహాసనాధికారులుగా అవ్వాలి. రాత్రింబవళ్ళు
సేవలో తత్పరులై ఉండాలి. తండ్రిని స్మృతి చేయండి అని అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. 5
వికారాలను దానమిచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది.
వరదానము:-
సెన్స్ మరియు ఎసెన్స్ (సారము) యొక్క బ్యాలెన్స్ ద్వారా నాది
అన్నదానిని స్వాహా చేసే విశ్వ పరివర్తక భవ
సెన్స్ అనగా జ్ఞానము యొక్క పాయింట్లు, వివేకము మరియు
ఎసెన్స్ అనగా సర్వశక్తి స్వరూపము, స్మృతి మరియు సమర్థ స్వరూపము. ఈ రెండింటి యొక్క
బ్యాలెన్స్ ఉన్నట్లయితే నాది అనేది మరియు పాతవన్నీ స్వాహా అయిపోతాయి. ప్రతి క్షణము,
ప్రతి సంకల్పము, ప్రతి మాట మరియు ప్రతి కర్మ విశ్వ పరివర్తన సేవ కొరకు స్వాహా
అయినట్లయితే విశ్వ పరివర్తకులుగా స్వతహాగా అవుతారు. ఎవరైతే తమ దేహపు స్మృతి సహితంగా
స్వాహా అవుతారో, వారి శ్రేష్ఠ వైబ్రేషన్లల ద్వారా వాయుమండలం యొక్క పరివర్తన సహజంగా
జరుగుతుంది.
స్లోగన్:-
ప్రాప్తులను స్మృతి చేసినట్లయితే దుఃఖము లేక వ్యాకులతకు చెందిన విషయాలను మర్చిపోతారు.
అవ్యక్త సూచనలు -
ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి
శ్రేష్ఠ కర్మలకు
పునాది ‘‘పవిత్రత’’. కానీ పవిత్రత అంటే కేవలము బ్రహ్మచర్యము కాదు. ఇది కూడా
శ్రేష్ఠమైనదే కానీ మనసా సంకల్పాలలో ఒకవేళ ఏ ఆత్మ పట్లనైనా విశేషంగా ఆకర్షణ లేక
ఇష్టము కలిగినా, ఏ ఆత్మ యొక్క విశేషతకు ప్రభావితమైనా లేక వారి పట్ల
నెగెటివ్సంకల్పాలు నడిచినా, మర్యాదపూర్వకంగా లేని మాటలు కానీ పదాలు కానీ వెలువడినా,
దానిని కూడా పవిత్రత అని అనరు.
| | |