22-12-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తండ్రి ఎవరో, ఎలా ఉన్నారో, వారిని
యథార్థముగా గుర్తించి స్మృతి చేయండి, దీని కోసం మీ బుద్ధిని విశాలముగా
తయారుచేసుకోండి’’
ప్రశ్న:-
తండ్రిని పేదల పాలిటి పెన్నిధి అని ఎందుకంటారు?
జవాబు:-
ఎందుకంటే ఈ
సమయములో మొత్తం ప్రపంచము నిరుపేదగా అనగా దుఃఖమయముగా అయినప్పుడు అందరినీ దుఃఖము నుండి
విడిపించేందుకు తండ్రి వచ్చారు. అంతేకానీ ఎవరిపైనైనా దయ కలిగి బట్టలు ఇవ్వడము, ధనము
ఇవ్వడము, అవేవీ అద్భుతమైన విషయాలు కావు. వీటితో వారేమీ షావుకారులుగా అవ్వరు. నేను ఈ
ఆటవికులకు ధనాన్ని ఇచ్చి పేదల పాలిటి పెన్నిధిగా పిలిపించుకోను. నేనైతే పేదలకు అనగా
పతితులకు, ఎవరిలోనైతే జ్ఞానము లేదో, వారికి జ్ఞానాన్ని ఇచ్చి పావనముగా తయారుచేస్తాను.
పాట:-
ప్రపంచాన్ని
మర్చిపోయే వసంత కాలమిదే...
ఓంశాంతి
మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు. పాటను అయితే ప్రపంచములోని మనుష్యులు పాడారని
పిల్లలకు తెలుసు. ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి అన్న ఈ పదాలు చాలా బాగున్నాయి.
ఇంతకుముందు ఇలా అర్థం చేసుకునేవారు కాదు. కొత్త ప్రపంచములోకి వెళ్ళాలంటే తప్పకుండా
పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి అని కలియుగీ మనుష్యులకు కూడా అర్థం కాదు. వారు పాత
ప్రపంచాన్ని విడిచిపెట్టాలని అర్థం చేసుకుంటారు కానీ దానికి ఇంకా చాలా సమయము ఉందని
భావిస్తారు. కొత్తది నుండి పాతదిగా అవుతుందనైతే అర్థం చేసుకుంటారు కానీ ఎక్కువ
సమయాన్ని వ్రాయడము వలన మర్చిపోయారు. ఇప్పుడు కొత్త ప్రపంచము స్థాపనవుతుంది కావున
పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి అని మీకు ఇప్పుడు స్మృతిని ఇప్పించడము జరుగుతుంది. ఈ
విషయాన్ని మర్చిపోతే ఏమవుతుంది? మనము ఈ శరీరాన్ని వదిలి కొత్త ప్రపంచములోకి వెళ్తాము.
కానీ అజ్ఞాన కాలములో ఇటువంటి విషయాల యొక్క అర్థము వైపుకు ఎవరి ధ్యాస వెళ్ళదు. తండ్రి
ఏ విధముగానైతే అర్థం చేయిస్తారో, ఆ విధముగా అర్థం చేయించేవారు ఎవ్వరూ లేరు. మీరు
దీని అర్థాన్ని అర్థం చేసుకోగలరు. తండ్రి చాలా సాధారణముగా ఉంటారని కూడా పిల్లలకు
తెలుసు. అనన్యులైన మంచి-మంచి పిల్లలు కూడా పూర్తిగా అర్థం చేసుకోరు. వీరిలోకి
శివబాబా వస్తారని మర్చిపోతుంటారు. ఏదైనా డైరెక్షన్ ఇస్తే, ఇది శివబాబా డైరెక్షన్ అని
అర్థం చేసుకోరు. శివబాబాను రోజంతా మర్చిపోయినట్లుగా ఉంటారు. పూర్తిగా అర్థం చేసుకోని
కారణముగా వారు చెప్పిన ఆ పని చేయరు. మాయ స్మృతి చేయనివ్వదు. ఆ స్మృతి స్థిరముగా
నిలవదు. కృషి చేస్తూ-చేస్తూ చివరికి అంతిమములో ఆ అవస్థ తప్పకుండా ఏర్పడనున్నది. ఈ
సమయములో కర్మాతీత అవస్థను పొందేవారు ఎవ్వరూ లేరు. తండ్రి ఎవరో, ఎలా ఉన్నారో, వారిని
తెలుసుకునేందుకు విశాల బుద్ధి కావాలి.
వెచ్చదనాన్ని ఇచ్చే చలికాలం బట్టలను బాప్ దాదా ధరిస్తారా అని మిమ్మల్ని అడుగుతారు.
ఇద్దరూ ధరించే ఉన్నారని మీరు చెప్తారు. శివబాబా అంటారు - నేను ఏమీ వెచ్చదనాన్ని
ఇచ్చే బట్టలను ధరించను. నాకు చలి అనిపించదు. అయితే, ఎవరిలోనైతే ప్రవేశించానో వారికి
చలి అనిపిస్తుంది. నాకు ఆకలి గాని, దాహం గాని ఏమీ అనిపించదు. నేనైతే నిర్లేపిని.
సేవ చేస్తూ కూడా ఈ విషయాలన్నిటి నుండి అతీతముగా ఉంటాను. నేను తినను, తాగను. ఒక
సాధువు కూడా ‘‘నేను తినను, తాగను...’’ అని అనేవారు కదా. అతను తర్వాత ఆర్టిఫిషియల్
వేషాన్ని ధరించారు. దేవతల పేర్లను కూడా చాలామంది పెట్టుకున్నారు. ఇంకే ధర్మములోనూ
దేవీ-దేవతలుగా అవ్వరు. ఇక్కడ ఎన్ని మందిరాలు ఉన్నాయి. బయట అయితే ఒక్క శివబాబాను
మాత్రమే నమ్ముతారు. తండ్రి ఒక్కరే ఉంటారని బుద్ధి కూడా చెప్తుంది. తండ్రి నుండే
వారసత్వము లభిస్తుంది. కల్పము యొక్క ఈ పురుషోత్తమ సంగమయుగములోనే బాబా నుండి
వారసత్వము లభిస్తుందని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మనము సుఖధామములోకి వెళ్ళినప్పుడు
మిగిలినవారంతా శాంతిధామములో ఉంటారు. మీలో కూడా ఈ వివేకము నంబరువారుగా ఉంది. ఒకవేళ
జ్ఞానము యొక్క ఆలోచనల్లోనే ఉన్నట్లయితే వారి మాటల్లో కూడా అవే వెలువడుతాయి. మీరు
బాబా ద్వారా రూప్, బసంత్ గా అవుతున్నారు. మీరు రూప్ కూడా మరియు బసంత్ కూడా (యోగ
స్వరూపులు మరియు జ్ఞాన స్వరూపులు). మేము రూప్, బసంత్ లమని ప్రపంచములో ఇంకెవ్వరూ
అనలేరు. మీరు ఇప్పుడు చదువుకుంటున్నారు, చివరి కల్లా నంబరువారు పురుషార్థానుసారముగా
చదివేసుకుంటారు. శివబాబా ఆత్మలమైన మన తండ్రి కదా. ఇది కూడా మనస్ఫూర్తిగా
అనిపిస్తుంది కదా. భక్తి మార్గములో మనస్ఫూర్తిగా అనిపించదు. ఇక్కడ మీరు సమ్ముఖములో
కూర్చున్నారు. తండ్రి ఈ సమయములోనే వస్తారని, తర్వాత ఇంకే సమయములోనూ తండ్రి వచ్చే
అవసరము ఉండదని మీకు తెలుసు. సత్యయుగము నుండి త్రేతాయుగము వరకు వారు రారు. ద్వాపరము
నుండి కలియుగము వరకు కూడా వారు రారు. వారు కల్పము యొక్క సంగమయుగములోనే వస్తారు.
తండ్రి పేదల పాలిటి పెన్నిధి అనగా దుఃఖమయముగా, నిరుపేదగా అయిన మొత్తం ప్రపంచానికి
వారు తండ్రి. వారి హృదయములో ఏముంటుంది? నేను పేదల పాలిటి పెన్నిధిని, అందరి దుఃఖము
మరియు పేదరికము తొలగిపోవాలని నా హృదయములో ఉంటుంది. అది జ్ఞానముతో తప్ప ఇంకదేనితోనూ
తొలగదు. అంతేకానీ బట్టలు మొదలైనవి ఇచ్చినంత మాత్రాన ఎవరూ షావుకారులుగా అయితే అయిపోరు
కదా. పేదవారిని చూస్తే వారికి బట్టలు ఇవ్వాలని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నేను
పేదల పాలిటి పెన్నిధిని అని గుర్తుకొస్తుంది కదా. దానితో పాటు ఈ విధముగా కూడా
అనుకుంటాను - నేనేమీ ఈ ఆటవికులకు మాత్రమే పేదల పాలిటి పెన్నిధిని కాదు. నేను పేదల
పాలిటి పెన్నిధిని, ఎవరైతే పూర్తిగా పతితముగా ఉన్నారో, వారిని పావనముగా
తయారుచేస్తాను. నేను పతిత-పావనుడిని. నేను పేదల పాలిటి పెన్నిధిని అని ఆలోచన
నడుస్తుంది కానీ ధనము మొదలైనవి ఎలా ఇస్తాను. ధనము మొదలైనవి ఇచ్చేవారైతే ప్రపంచములో
చాలామంది ఉన్నారు. చాలా ఫండ్స్ వస్తాయి, వాటిని అనాథాశ్రమాలకు పంపిస్తారు. అక్కడ
అనాథలు ఉంటారని వారికి తెలుసు, అనాథలు అంటే నాథుడు లేనివారు అని అర్థము. అనాథలు అనగా
పేదవారు. మీకు కూడా నాథుడు ఉండేవారు కాదు అనగా తండ్రి ఉండేవారు కాదు. మీరు పేదవారిగా
ఉండేవారు, జ్ఞానము ఉండేది కాదు. రూప్, బసంత్ కానీ వారు నిరుపేదలు, అనాథలు. రూప్,
బసంత్ అయినవారిని సనాథలు అని అంటారు. సనాథలు అని షావుకారులను, అనాథలు అని పేదవారిని
అనడం జరుగుతుంది. అందరూ పేదవారిగా ఉన్నారని, వారికేదైనా ఇవ్వాలని మీ బుద్ధిలో ఉంది.
తండ్రి పేదల పాలిటి పెన్నిధి కావున సదా కోసం షావుకారులుగా తయారయ్యేలాంటి వస్తువేదైనా
ఇవ్వమని వారు చెప్తారు. ఇకపోతే ఈ బట్టలు మొదలైనవి ఇవ్వడమనేది సాధారణమైన విషయమే.
వాటిలోకి మనము ఎందుకు వెళ్ళాలి. మనమైతే వారిని అనాథల నుండి సనాథులుగా చేయాలి. ఎవరు
ఎంత పదమపతి అయినా కానీ, అదంతా కూడా అల్పకాలము కొరకే. ఇది ఉన్నదే అనాథల ప్రపంచము.
ధనవంతులైనా కానీ అది కూడా అల్పకాలికముగానే. అక్కడ సదా సనాథులుగా ఉంటారు. అక్కడ ఈ
విధముగా కర్మలను నిందించుకోరు. ఇక్కడ ఎంతమంది పేదవారు ఉన్నారు. ఎవరి వద్దనైతే
ధనముందో, వారికైతే - మేము స్వర్గములో ఉన్నాము అన్న నషా ఎక్కి ఉంటుంది. కానీ
వాస్తవానికి అలా కాదని మీకు తెలుసు. ఈ సమయములో మనుష్యులెవ్వరూ సనాథులు కారు, అందరూ
అనాథలే. ఈ ధనము మొదలైనవన్నీ అయితే మట్టిలో కలిసిపోనున్నాయి. మా వద్ద ఇంత ధనము ఉంది,
దీనిని పుత్రులు-మనవలు తింటూ ఉంటారు, పరంపరగా కొనసాగుతూ ఉంటుంది అని మనుష్యులు
భావిస్తారు. కానీ అలా ఏమీ కొనసాగదు. ఇదంతా వినాశనమైపోతుంది, అందుకే మీకు ఈ మొత్తం
పాత ప్రపంచము పట్ల వైరాగ్యముంది.
కొత్త ప్రపంచాన్ని స్వర్గమని, పాత ప్రపంచాన్ని నరకమని అంటారని మీకు తెలుసు.
మనల్ని బాబా కొత్త ప్రపంచము కొరకు షావుకారులుగా తయారుచేస్తున్నారు. ఈ పాత ప్రపంచమైతే
సమాప్తమవ్వనున్నది. తండ్రి ఎంత షావుకారులుగా తయారుచేస్తారు. ఈ లక్ష్మీ-నారాయణులు
షావుకారులుగా ఎలా అయ్యారు? వారికి ఎవరైనా షావుకారుల నుండి వారసత్వము లభించిందా లేక
వారు యుద్ధము చేసారా? ఏ విధముగా ఇతరులు రాజ్య సింహాసనాన్ని పొందుతారో, వీరు కూడా
అలాగే పొందారా? లేక కర్మల అనుసారముగా ఈ ధనము లభించిందా? తండ్రి కర్మలు నేర్పించే
విధానము పూర్తిగా అతీతమైనది. కర్మ-అకర్మ-వికర్మ అనే పదాలు కూడా స్పష్టముగా ఉన్నాయి
కదా. శాస్త్రాలలో కొన్ని పదాలు ఉన్నాయి, పిండిలో ఉప్పు అంత ఉన్నాయి. ఇన్ని కోట్లమంది
మనుష్యులు ఎక్కడ, ఆ తర్వాత 9 లక్షల మంది మిగులుతారు. 1/4 శాతము కూడా కానట్టు. కావున
దీనిని పిండిలో ఉప్పంత అని అంటారు. ప్రపంచమంతా వినాశనమైపోతుంది. చాలా కొద్దిమందే
సంగమయుగములో ఉంటారు. కొంతమంది ముందే శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు. వాళ్ళు తర్వాత
రిసీవ్ చేసుకుంటారు. ముగలి అనే బిడ్డ ఉండేది (కరాచీలో బంధనములో ఉన్న ఒక బిడ్డ, ఆమె
బంధనములోనే దేహము విడిచిపెట్టారు), ఆమె చాలా మంచిది కావున చాలా మంచి ఇంటిలోనే జన్మ
తీసుకుని ఉంటుంది. సుఖములోనే నంబరువారుగా జన్మ తీసుకుంటారు. వారు సుఖాన్ని ఎలాగూ
చూస్తారు, కొంచెము దుఃఖాన్ని కూడా చూస్తారు. కర్మాతీత అవస్థ అనేది ఎవ్వరిదీ
తయారవ్వలేదు. వారు చాలా సుఖమయమైన కుటుంబములోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు. ఇక్కడ
సుఖమయమైన ఇళ్ళు ఏవీ లేవని భావించకండి. మంచిగా ఉండే పరివారాలు ఎన్ని ఉన్నాయో, ఇక
అడగకండి. బాబా వాటిని చూసారు. ఒకే ఇంటిలో కోడళ్ళు ఎంతో శాంతిగా, కలుపుగోలుగా ఉంటారు,
అందరూ కలిసి భక్తి చేస్తారు, గీత చదువుకుంటారు... ఇంతమంది కలిసి ఉంటున్నారు, గొడవలు
మొదలైనవి జరగవా అని బాబా వారిని అడిగారు. అప్పుడు వారు - మా వద్దనైతే స్వర్గముంది,
మేమంతా కలిసి ఉంటాము, ఎప్పుడూ కొట్లాడుకోము, గొడవపడము, శాంతిగా ఉంటాము అని చెప్పారు.
ఇక్కడైతే స్వర్గములా ఉందని అంటారు అనగా స్వర్గము తప్పకుండా ఒకప్పుడు ఉండి గతించింది,
అందుకే ఇక్కడ స్వర్గమే ఉన్నట్లు ఉంది అని అంటారు. కానీ ఇక్కడైతే చాలామందిలో
స్వర్గవాసులుగా అయ్యే స్వభావము కనిపించడము లేదు. దాస-దాసీలు కూడా తయారవ్వాలి కదా.
ఇక్కడ రాజధాని స్థాపనవుతోంది. ఇకపోతే ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారు దైవీ
వంశములో రానున్నారు కానీ నంబరువారుగా ఉన్నారు. కొందరైతే చాలా మధురముగా ఉంటారు,
అందరినీ ప్రేమిస్తూ ఉంటారు. ఎప్పుడూ ఎవరిపైనా కోప్పడరు. కోప్పడితే దుఃఖము కలుగుతుంది.
ఎవరైతే మనసా-వాచా-కర్మణా ఇతరులకు దుఃఖమునే ఇస్తూ ఉంటారో - వారిని దుఃఖిత ఆత్మ అని
అంటారు. ఉదాహరణకు పుణ్యాత్మ, పాపాత్మ అని అంటారు కదా. అక్కడ శరీరము పేరు తీసుకుంటారా?
వాస్తవానికి ఆత్మయే అలా అవుతుంది. పాపాత్ములందరూ కూడా ఒకేలా ఉండరు. పుణ్యాత్ములు
కూడా అందరూ ఒకేలా ఉండరు. నంబరువారు పురుషార్థానుసారముగా ఉంటారు. విద్యార్థులకు
స్వయము తెలుస్తూ ఉండవచ్చు కదా - మా క్యారెక్టర్స్, అవస్థ ఎలా ఉన్నాయి? మేము ఎలా
నడుచుకుంటున్నాము? అందరితో మధురముగా మాట్లాడుతున్నామా? ఎవరైనా ఏదైనా అంటే మేము
తప్పుడు జవాబులైతే ఇవ్వడము లేదు కదా? బాబాతో చాలామంది పిల్లలు అంటుంటారు - పిల్లలపై
కోపమొచ్చేస్తుంది అని. బాబా అంటారు, ఎంత వీలైతే అంత ప్రేమతో వ్యవహరించండి.
నిర్మోహులుగా కూడా అవ్వాలి.
మనము ఈ లక్ష్మీ-నారాయణులుగా అవ్వాలని పిల్లలైన మీకు తెలుసు. లక్ష్యము-ఉద్దేశ్యము
ఎదురుగా నిలబడి ఉంది. ఇది ఎంత ఉన్నతమైన లక్ష్యము-ఉద్దేశ్యము. చదివించేవారు కూడా చాలా
ఉన్నతమైనవారు కదా. సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపన్నులు... అని శ్రీకృష్ణుని మహిమను
ఎంతగా పాడుతుంటారు. మనము అలా అవుతున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మీరు
ఇక్కడకు వచ్చిందే అలా తయారవ్వడము కోసము. మీ ఈ సత్యమైన సత్యనారాయణ కథ నరుని నుండి
నారాయణునిగా తయారయ్యేందుకు కథ, ఇది అమరపురికి వెళ్ళేందుకు అమరకథ. సన్యాసులు
మొదలైనవారికెవ్వరికీ ఈ విషయాలు తెలియవు. మనుష్యమాత్రులెవ్వరినీ కూడా జ్ఞానసాగరుడు
లేక పతిత-పావనుడు అని అనరు. సృష్టి అంతా పతితముగా ఉన్నప్పుడు మనము పతిత-పావనుడు అని
ఎవరిని అనాలి? ఇక్కడ పుణ్యాత్ములెవ్వరూ ఉండరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ
ప్రపంచము పతితమైనది. శ్రీకృష్ణుడు మొదటి నంబరు వారు. వారిని కూడా భగవంతుడని అనలేరు.
జనన-మరణ రహితుడు ఒక్క నిరాకార తండ్రి మాత్రమే. శివ పరమాత్మాయ నమః అని అంటూ ఉంటారు,
బ్రహ్మా-విష్ణు-శంకరులను దేవతలని అంటూ, శివుడిని పరమాత్మ అని అంటారు. శివుడు
అందరికన్నా పైన ఉన్నట్లు కదా. వారు అందరికీ తండ్రి. వారసత్వము కూడా తండ్రి నుండే
లభించనున్నది, సర్వవ్యాపి అనడముతో వారసత్వము లభించదు. తండ్రి స్వర్గాన్ని స్థాపన
చేసేవారు కావున వారు తప్పకుండా స్వర్గము యొక్క వారసత్వాన్నే ఇస్తారు. ఈ
లక్ష్మీ-నారాయణులు నంబరు వన్. వీరు చదువు ద్వారా ఈ పదవిని పొందారు. భారత్ యొక్క
ప్రాచీన యోగము ఎందుకు ప్రసిద్ధమవ్వదు ఎందుకంటే దీని ద్వారా మనుష్యులు విశ్వానికి
యజమానులుగా అవుతారు. దీనిని సహజ యోగము, సహజ జ్ఞానమని అంటారు. నిజానికి ఇది చాలా
సహజమే, ఒక్క జన్మ పురుషార్థముతో ఎంత ప్రాప్తి లభిస్తుంది. భక్తి మార్గములోనైతే
జన్మ-జన్మలుగా ఎదురుదెబ్బలు తింటూ వచ్చారు కానీ ఏమీ లభించదు. ఇక్కడైతే ఒక్క జన్మలోనే
లభిస్తుంది కావున దీనిని సహజమని అంటారు. క్షణములో జీవన్ముక్తి అని అంటారు. ఈ
రోజుల్లోనైతే ఎటువంటి ఆవిష్కరణలు చేస్తున్నారో చూడండి. సైన్స్ ది కూడా అద్భుతము.
సైలెన్స్ యొక్క అద్భుతము కూడా ఎలా ఉందో చూడండి? అక్కడ అవన్నీ చూడటానికి కనిపిస్తాయి,
ఇక్కడేవీ కనిపించవు. మీరు శాంతిగా కూర్చున్నారు, మీరు ఉద్యోగాలు మొదలైనవి కూడా
చేస్తారు. చేతులు పని వైపు మరియు ఆత్మ యొక్క మనసు ప్రియుని వైపు. ప్రేయసి ప్రియుల
గురించి కూడా చెప్పుకుంటూ ఉంటారు కదా. వారు ఒకరి రూపముపై ఒకరు ప్రేమ కలిగి ఉంటారు,
వికారాల విషయమేమీ ఉండదు. ఎక్కడ కూర్చున్నా సరే వారు గుర్తుకొస్తూ ఉంటారు. రోటీ తింటూ
ఉంటారు, అంతే, ఎదురుగా తనను చూస్తూ ఉంటారు. అంతిమములో మీకు ఈ అవస్థ ఏర్పడుతుంది.
కేవలం తండ్రిని మాత్రమే స్మృతి చేస్తూ ఉంటారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. రూప్-బసంత్ గా అయి నోటి ద్వారా సదా సుఖాన్ని ఇచ్చే మాటలే మాట్లాడాలి,
దుఃఖాన్ని ఇచ్చేవారిగా అవ్వకూడదు. జ్ఞానము యొక్క ఆలోచనల్లో ఉండాలి, నోటి నుండి
జ్ఞాన రత్నాలే వెలువడాలి.
2. నిర్మోహులుగా అవ్వాలి, ప్రతి ఒక్కరితోనూ ప్రేమగా వ్యవహరించాలి,
కోపగించుకోకూడదు. అనాథలను సనాథలుగా చేసే సేవ చేయాలి.
వరదానము:-
తమ ఫరిశ్తా రూపము ద్వారా గతి, సద్గతుల ప్రసాదాన్ని పంచే
మాస్టర్ గతి, సద్గతిదాత భవ
వర్తమాన సమయములో విశ్వములోని అనేక ఆత్మలు పరిస్థితులకు
వశమై ఆర్తనాదాలు చేస్తున్నారు. కొందరు ధరల కారణముగా, కొందరు ఆకలితో, కొందరు తనువు
యొక్క రోగాలతో, మరికొందరు మనసు యొక్క అశాంతి వలన ఆర్తనాదాలు చేస్తున్నారు. అందరి
దృష్టి శాంతి స్తంభము వైపుకు వెళ్తుంది. ఈ హాహాకారాల తర్వాత జయజయకారాలు ఎప్పుడు
జరుగుతాయి అని అందరూ చూస్తున్నారు. కావున ఇప్పుడు మీ సాకారీ ఫరిశ్తా రూపము ద్వారా
విశ్వము యొక్క దుఃఖాలను దూరము చేయండి. మాస్టర్ గతి, సద్గతిదాతలుగా అయి భక్తులకు గతి
మరియు సద్గతుల ప్రసాదాన్ని పంచండి.
స్లోగన్:-
మనసును
ఎంత శక్తిశాలిగా తయారుచేసుకోండి అంటే ఇక ఏ పరిస్థితి మనసును అలజడిలోకి
తీసుకురాలేకపోవాలి.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి
ఇప్పుడు సేవ యొక్క
కర్మ బంధనములోకి కూడా రాకండి. నా స్థానము, నా సేవ, నా విద్యార్థులు, నా సహయోగీ
ఆత్మలు, ఇలా అనుకోవటము కూడా సేవ యొక్క కర్మ బంధనమే, ఈ కర్మ బంధనము నుండి
కర్మాతీతముగా అవ్వండి. కావున కర్మాతీతముగా అవ్వాలి మరియు ‘‘వీరు వారే, వీరే
సర్వస్వము’’ అన్న ఈ అనుభూతిని కలిగించి ఆత్మలను సమీపముగా ఉన్న ఆశ్రయ స్థానానికి
తీసుకురావాలి.
| | | |