ఓంశాంతి
తండ్రి పిల్లలను అడుగుతున్నారు - పిల్లలూ, ఆత్మాభిమానులుగా అయి కూర్చున్నారా?
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చున్నారా? ఆత్మలైన మనల్ని పరమాత్మ తండ్రి
చదివిస్తున్నారు. నేను దేహము కాదు, ఆత్మను అని పిల్లలకు స్మృతి కలిగింది. పిల్లలను
దేహీ-అభిమానులుగా చేసేందుకే శ్రమించాల్సి వస్తుంది. పిల్లలు ఆత్మాభిమానులుగా ఉండలేరు.
ఘడియ-ఘడియ దేహాభిమానములోకి వచ్చేస్తారు, అందుకే బాబా అడుగుతారు - ఆత్మాభిమానులుగా
ఉంటున్నారా? ఆత్మాభిమానులుగా ఉన్నట్లయితే తండ్రి స్మృతి ఉంటుంది, ఒకవేళ
దేహాభిమానులుగా ఉన్నట్లయితే లౌకిక సంబంధీకులు గుర్తుకువస్తారు. మొట్టమొదట ఈ
విషయాన్ని గుర్తుంచుకోవాలి, నేను ఆత్మను. ఆత్మనైన నాలో 84 జన్మల పాత్ర నిండి ఉంది.
ఇది పక్కా చేసుకోవాలి. నేను ఆత్మను. అర్ధకల్పం మీరు దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు
కేవలం సంగమయుగములోనే పిల్లలను ఆత్మాభిమానులుగా చేయడం జరుగుతుంది. స్వయాన్ని దేహముగా
భావించినట్లయితే తండ్రి గుర్తుకు రారు, అందుకే మొట్టమొదట ఈ పాఠాన్ని పక్కా చేసుకోండి
- ఆత్మలమైన మనం అనంతమైన తండ్రి పిల్లలము. దైహిక తండ్రిని స్మృతి చేయడం ఎప్పుడూ
నేర్పించడం జరగదు. ఇప్పుడు తండ్రి అంటారు - పారలౌకిక తండ్రినైన నన్ను స్మృతి చేయండి,
ఆత్మాభిమానులుగా అవ్వండి. దేహాభిమానులుగా అవ్వడం వలన దైహిక సంబంధాలు గుర్తుకువస్తాయి,
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, ఇందులోనే శ్రమ ఉంది. ఇది ఎవరు
అర్థం చేయిస్తున్నారు. ఆత్మలమైన మన యొక్క తండ్రి అర్థం చేయిస్తున్నారు, వారినే -
బాబా రండి, మీరు వచ్చి దుఃఖాల నుండి విముక్తులుగా చేయండి అని అందరూ తలచుకుంటూ ఉంటారు.
ఈ చదువు ద్వారా మనము భవిష్యత్తు కొరకు ఉన్నత పదవిని పొందుతామని పిల్లలకు తెలుసు.
ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగములో ఉన్నారు. ఈ మృత్యులోకములో ఇప్పుడిక అసలు
ఉండేది లేదు. మన ఈ చదువు ఉన్నదే భవిష్య 21 జన్మల కొరకు. మనం సత్యయుగము, అమరలోకము
కోసము చదువుతున్నాము. అమరుడైన బాబా మనకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు కావున ఇక్కడ
కూర్చున్నప్పుడు మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో ఉండాలి,
అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడు మనం సంగమయుగములో ఉన్నాము. బాబా మనల్ని
పురుషోత్తములుగా తయారుచేస్తున్నారు. వారంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీరు
పురుషోత్తములుగా అవుతారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి నేను వచ్చాను.
సత్యయుగములో మీరు దేవతలుగా ఉండేవారు, ఏ విధముగా మెట్లు దిగుతూ వచ్చారు అనేది ఇప్పుడు
మీకు తెలుసు. మీ ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఇది ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు,
ఆ భక్తి మార్గము వేరు, ఈ జ్ఞాన మార్గము వేరు. ఏ ఆత్మలనైతే తండ్రి చదివిస్తారో,
వారికే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. ఇది భవిష్యత్తు కొరకు గుప్తమైన ఖజానా. మీరు
చదువుకునేది అమరలోకము కొరకు, అంతేకానీ ఈ మృత్యులోకము కొరకు కాదు. ఇప్పుడు తండ్రి
అంటారు - ఉదయమే లేచి విహరించండి, తిరగండి. మొట్టమొదటి పాఠాన్ని గుర్తుంచుకోండి -
నేను ఆత్మను, శరీరాన్ని కాను. మా ఆత్మిక తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు. ఈ దుఃఖపు
ప్రపంచము ఇప్పుడు మారనున్నది. సత్యయుగము సుఖమయమైన ప్రపంచము, బుద్ధిలో మొత్తం
జ్ఞానమంతా ఉంది. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. జ్ఞానసాగరుడైన తండ్రి ఆత్మిక తండ్రి. వారు
దేహీ (ఆత్మ) కు తండ్రి. మిగిలినవారంతా దైహిక సంబంధీకులే. ఇప్పుడు దేహ సంబంధాలను
తెంచి ఒక్కరితో సంబంధాన్ని జోడించాలి. నాకు ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని అంటూ
ఉంటారు కూడా. మేము ఒక్క తండ్రినే స్మృతి చేస్తాము. దేహాన్ని కూడా స్మృతి చేయము. ఈ
పాత దేహమును వదలాల్సి ఉంటుంది. ఈ శరీరాన్ని ఎలా వదలాలి అన్న జ్ఞానము కూడా మీకు
లభిస్తుంది. స్మృతి చేస్తూ-చేస్తూ శరీరాన్ని వదలాలి, అందుకే బాబా అంటారు -
దేహీ-అభిమానులుగా అవ్వండి. తండ్రిని, బీజాన్ని మరియు వృక్షాన్ని స్మృతి చేయాలి అని
మీలో మీరు అభ్యసించుకుంటూ ఉండండి. శాస్త్రాలలో ఈ కల్పవృక్షము యొక్క ఉదాహరణ ఉంది.
పిల్లలకు ఈ విషయము కూడా తెలుసు - మమ్మల్ని జ్ఞానసాగరుడైన తండ్రి చదివిస్తున్నారు,
మనుష్యులెవ్వరూ చదివించడం లేదు. దీనిని పక్కా చేసుకోవాలి. చదవాలి కదా. సత్యయుగములో
కూడా దేహధారులు చదివిస్తారు, వీరు దేహధారి కారు. వీరు అంటారు - నేను పాత దేహము
యొక్క ఆధారాన్ని తీసుకొని మిమ్మల్ని చదివిస్తాను. కల్పకల్పమూ నేను మిమ్మల్ని ఇలా
చదివిస్తాను. మళ్ళీ కల్పం తర్వాత కూడా ఇలా చదివిస్తాను. ఇప్పుడు నన్ను స్మృతి
చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి, నేనే పతిత పావనుడను. నన్నే సర్వశక్తివంతుడు
అని అంటారు. కానీ మాయ కూడా తక్కువేమీ కాదు, అది కూడా శక్తివంతమైనదే, ఎక్కడి నుండి
పడేసింది. ఇప్పుడు గుర్తుకొస్తుంది కదా. 84 జన్మల చక్రము యొక్క గాయనము కూడా ఉంది.
ఇది మనుష్యుల విషయమే. జంతువుల విషయమేమిటి అని ఎంతోమంది అడుగుతారు. అరే, ఇక్కడ ఇది
జంతువుల విషయం కాదు. తండ్రి కూడా పిల్లలతో మాట్లాడుతారు, బయటివారికి తండ్రి గురించి
తెలియనే తెలియదు, మరి వారేమి మాట్లాడుతారు. మేము బాబాను కలుసుకోవాలనుకుంటున్నాము అని
కొందరు అంటారు, వారికి అసలేమీ తెలియదు, కూర్చొని కేవలం తలతిక్క ప్రశ్నలు అడుగుతారు.
7 రోజుల కోర్సు పూర్తి చేసిన తర్వాత కూడా, వీరు మన అనంతమైన తండ్రి అన్నది పూర్తిగా
అర్థం చేసుకోరు. పాత భక్తులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఎంతో భక్తిని చేసి ఉంటారో, వారి
బుద్ధిలో జ్ఞానపు విషయాలన్నీ కూర్చుంటాయి. తక్కువ భక్తి చేసి ఉంటే, బుద్ధిలో
తక్కువగా కూర్చుంటుంది. మీరు అందరికన్నా పాత భక్తులు. భగవంతుడు భక్తి ఫలాన్ని
ఇచ్చేందుకు వస్తారు అన్న గాయనము కూడా ఉంది. కానీ ఇది ఎవరికీ తెలియదు. జ్ఞానమార్గము
మరియు భక్తి మార్గము పూర్తిగా వేర్వేరు. మొత్తం ప్రపంచమంతా భక్తిమార్గములో ఉంది.
కోట్లలో ఏ ఒక్కరో వచ్చి ఇది చదువుకుంటారు. వివరణ అయితే చాలా మధురముగా ఉంది. 84
జన్మల చక్రము గురించి కూడా మనుష్యులే తెలుసుకుంటారు కదా. మీకు ఇంతకుముందు ఏమీ
తెలిసేది కాదు. శివుని గురించి కూడా తెలియదు. శివుని మందిరాలు ఎన్ని లెక్కలేనన్ని
ఉన్నాయి. శివుడిని పూజిస్తారు, జలము అర్పిస్తారు, శివాయ నమః అని అంటారు, వారిని
ఎందుకు పూజిస్తారు అనేది ఏమీ తెలియదు. లక్ష్మీనారాయణుల పూజను ఎందుకు చేస్తారు, వారు
ఎక్కడికి వెళ్ళారు అనేది ఏమీ తెలియదు. భారతవాసులకే తమ పూజ్యుల గురించి ఏ మాత్రమూ
తెలియదు. క్రైస్టు ఫలానా సంవత్సరములో వచ్చారు, వచ్చి స్థాపన చేసారు అని
క్రిస్టియన్లకు తెలుసు. శివబాబా గురించి ఎవరికీ తెలియదు. పతితపావనుడు అని కూడా
శివుడినే అంటారు. వారే ఉన్నతోన్నతమైనవారు. అందరికన్నా ఎక్కువగా వారి సేవ చేస్తారు.
వారు సర్వుల సద్గతిదాత. మిమ్మల్ని ఎలా చదివిస్తారో చూడండి. మీరు వచ్చి పావనముగా
చేయండి అని తండ్రిని పిలుస్తారు కూడా. మందిరాలలో ఎంతగా పూజ చేస్తారు, ఎంత ఆడంబరముగా,
ఎంత ఖర్చు చేస్తారు. ఎంతో ఖర్చు చేస్తారు. శ్రీనాథ మందిరానికి, జగన్నాథ మందిరానికి
వెళ్ళి చూడండి. వాస్తవానికి ఇరువురూ ఒక్కరే. జగన్నాథుడు (జగత్తుకు నాథుడు), వారి
వద్ద కుండలో అన్నాన్ని వండుతారు. శ్రీనాథునికి ఎన్నో పిండివంటలను తయారుచేస్తారు.
తేడా ఎందుకు ఉంది? అందుకు కారణం ఉండాలి కదా. శ్రీనాథుడిని నల్లగా చూపిస్తారు, అలాగే
జగన్నాథుడిని కూడా నల్లగా చూపిస్తారు, కానీ కారణము ఏ మాత్రమూ అర్థం చేసుకోరు.
జగన్నాథుడు అని లక్ష్మీ-నారాయణులను అంటారా లేక రాధాకృష్ణులను అంటారా? రాధాకృష్ణులకు,
లక్ష్మీనారాయణులకు సంబంధం ఏమిటి అన్నది కూడా ఎవరికీ తెలియదు. మనము పూజ్య దేవతలుగా
ఉండేవారము, మళ్ళీ పూజారులుగా అయ్యాము అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలిసింది. చక్రమును
తిరిగి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు మనం చదువుతాము. దీనిని మనుష్యులు
ఎవరూ చదివించరు. భగవానువాచ ఉంది. జ్ఞానసాగరుడు అని కూడా భగవంతుడిని అంటారు.
పతితపావనుడు, జ్ఞానసాగరుడైన తండ్రిని స్మృతి చేసే భక్తిసాగరులు ఇక్కడ ఎంతోమంది
ఉన్నారు. మీరు పతితులుగా అయ్యారు, మళ్ళీ తప్పకుండా పావనులుగా అవ్వాలి. ఇది పతిత
ప్రపంచము. ఇది స్వర్గము కాదు. వైకుంఠము ఎక్కడ ఉంది అన్నది ఎవరికీ తెలియదు.
వైకుంఠానికి వెళ్ళారు అని అంటారు. మరి అటువంటప్పుడు వారికి నరకము యొక్క భోజనాన్ని
ఎందుకు తినిపిస్తారు. సత్యయుగములో ఎన్నో ఫలాలు, పుష్పాలు మొదలైనవి ఉంటాయి.
ఇక్కడేముంది? ఇది నరకము. ఇప్పుడు మీకు తెలుసు, బాబా ద్వారా మనం స్వర్గవాసులుగా
అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నాము. పతితుల నుండి పావనులుగా అవ్వాలి. తండ్రి
యుక్తినైతే తెలియజేసారు, కల్పకల్పమూ తండ్రి యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. నన్ను
స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మనం పురుషోత్తమ సంగమయుగములో ఉన్నామని
ఇప్పుడు మీకు తెలుసు. బాబా, మేము 5 వేల సంవత్సరాల క్రితం ఇలా అయ్యాము అని మీరే
అంటారు. కల్పకల్పమూ ఈ అమరకథను బాబా నుండి వింటాము అని మీకే తెలుసు. శివబాబాయే
అమరనాథుడు. అంతేకానీ వారు కూర్చుని పార్వతికి కథను వినిపిస్తారని కాదు. అది భక్తి.
జ్ఞానము మరియు భక్తి గురించి మీరు అర్థం చేసుకున్నారు. బ్రాహ్మణుల పగలు మరియు
బ్రాహ్మణుల రాత్రి. తండ్రి అర్థం చేయిస్తారు - మీరు బ్రాహ్మణులు కదా. ఆదిదేవ్ కూడా
బ్రాహ్మణుడే, వారిని దేవత అని అనరు. ఆదిదేవ్ వద్దకు కూడా వెళ్తారు, దేవీలకు కూడా
ఎన్ని పేర్లు ఉన్నాయి. మీరు సేవ చేసారు, కావుననే మీకు గాయనము ఉంది. భారత్ ఏదైతే
నిర్వికారిగా ఉండేదో, అది మళ్ళీ వికారీగా అయిపోతుంది. ఇప్పుడు ఇది రావణరాజ్యము కదా.
సంగమయుగములో పిల్లలైన మీరు ఇప్పుడు పురుషోత్తములుగా అవుతారు, మీపై బృహస్పతి దశ
అవినాశీగా కూర్చుంటుంది, కావుననే మీరు అమరపురికి యజమానులుగా అవుతారు. మనుష్యుల నుండి
దేవతలుగా తయారుచేయడానికి తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు. స్వర్గాధిపతులుగా
అవ్వడానిని బృహస్పతి దశ అని అంటారు. మీరు స్వర్గానికి, అమరపురిలోకి తప్పకుండా
వెళ్తారు. చదువులోనైతే దశలు కిందకీ-పైకీ అవుతూ ఉంటాయి. స్మృతినే మర్చిపోతారు. నన్ను
స్మృ తి చేయండి అని తండ్రి అన్నారు. గీతలో కూడా ఉంది, భగవానువాచ - కామం మహాశత్రువు
అని. అది చదువుతారు కానీ వికారాలను జయించరు. భగవంతుడు ఎప్పుడు అన్నారు? అలా అని 5
వేల సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు మళ్ళీ భగవంతుడు అంటారు - కామం మహాశత్రువు, దీనిపై
విజయాన్ని పొందాలి. ఇది ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది. ముఖ్యమైనది కామము యొక్క
విషయము, దీని కారణంగానే పతితులు అని అంటారు. ఇప్పుడు తెలిసింది. ఈ చక్రము తిరుగుతూ
ఉంటుంది. మనం పతితులుగా అవుతాము, మళ్ళీ తండ్రి వచ్చి డ్రామానుసారముగా పావనముగా
తయారుచేస్తారు. బాబా పదే-పదే అంటారు - మొట్టమొదట అల్ఫ్ ను (భగవంతుడిని) స్మృతి
చేయండి, శ్రీమతముపై నడవడం ద్వారానే మీరు శ్రేష్ఠముగా అవుతారు. మనము మొదట శ్రేష్ఠముగా
ఉండేవారము, తర్వాత భ్రష్టులుగా అయ్యామని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు
మళ్ళీ శ్రేష్ఠముగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాము. దైవీగుణాలను ధారణ చేయాలి.
ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. అందరికీ మార్గాన్ని చూపిస్తూ వెళ్ళండి, తండ్రి అంటారు
- నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి. పతిత-పావనా అని మీరు నన్నే అంటారు
కదా. పతిత పావనుడు ఏ విధముగా వచ్చి పావనముగా తయారుచేస్తారు అనేది ఎవరికీ తెలియదు.
కల్పక్రితం కూడా తండ్రి అన్నారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇది యోగాగ్ని, దీని
ద్వారా పాపాలు దగ్ధమవుతాయి. మాలిన్యం తొలగడం ద్వారా ఆత్మ పవిత్రముగా అవుతుంది.
మాలిన్యము బంగారములోనే కలుపుతారు. దానితో నగ కూడా అలాగే తయారవుతుంది. ఆత్మలో
మాలిన్యం ఏ విధంగా చేరుకుంది అని ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు,
దానిని తొలగించాలి. డ్రామాలో తండ్రికి కూడా పాత్ర ఉంది, వారు వచ్చి పిల్లలైన
మిమ్మల్ని దేహీ-అభిమానులుగా తయారుచేస్తారు. పవిత్రముగా కూడా అవ్వాలి. సత్యయుగములో
మనం వైష్ణవులుగా ఉండేవారమని మీకు తెలుసు. అప్పుడు పవిత్ర గృహస్థ ఆశ్రమము ఉండేది.
ఇప్పుడు మనం పవిత్రముగా అయి విష్ణుపురికి యజమానులుగా అవుతాము. మీరు డబుల్
వైష్ణవులుగా అవుతారు. సత్యాతి-సత్యమైన వైష్ణవులు మీరే. వారు వికారీ వైష్ణవ ధర్మానికి
చెందినవారు, మీరు నిర్వికారీ వైష్ణవ ధర్మానికి చెందినవారు. ఇప్పుడు, ఒకటేమో తండ్రిని
స్మృతి చేస్తారు మరియు తండ్రిలో ఏ జ్ఞానమైతే ఉందో దానిని మీరు ధారణ చేస్తారు. మీరు
రాజులకే రాజులుగా అవుతారు. వారు అల్పకాలికముగా ఒక్క జన్మ కొరకు రాజులుగా అవుతారు.
మీ రాజ్యము 21 తరాలకు సంబంధించినది అనగా సంపూర్ణ ఆయుష్షును పూర్తి చేస్తారు. అక్కడ
ఎప్పుడూ అకాల మరణాలు జరగవు. మీరు మృత్యువుపై విజయాన్ని పొందుతారు. ఎప్పుడైతే సమయం
పూర్తవుతుందో, అప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకోవాలని అర్థం చేసుకుంటారు.
మీకు సాక్షాత్కారమవుతుంది. సంతోషపు భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి. తమోప్రధాన శరీరాన్ని
వదిలి సతోప్రధాన శరీరాన్ని తీసుకోవడము అనేది సంతోషకరమైన విషయము కదా. అక్కడ సగటున
150 సంవత్సరాల ఆయుష్షు ఉంటుంది. ఇక్కడైతే అకాల మరణాలు జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే
ఇక్కడ భోగీలుగా ఉన్నారు. ఏ పిల్లల యోగమైతే యధార్థంగా ఉంటుందో, వారి సర్వ
కర్మేంద్రియాలూ యోగబలం ద్వారా వశములో ఉంటాయి. పూర్తిగా యోగములో ఉండడం ద్వారా
కర్మేంద్రియాలు శీతలమవుతాయి. సత్యయుగములో కర్మేంద్రియాలేవీ మిమ్మల్ని మోసం చేయవు,
కర్మేంద్రియాలు వశములో లేవు అని ఎప్పుడూ ఇలా అనరు. మీరు చాలా ఉన్నతోన్నతమైన పదవిని
పొందుతారు. దీనిని బృహస్పతి యొక్క అవినాశీ దశ అని అంటారు. వృక్షపతి, మనుష్య సృష్టికి
బీజరూపుడు తండ్రి. బీజము పైన ఉన్నారు, వారిని స్మృతి చేయడం కూడా పైనే చేస్తారు.
ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుంది. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన
మీకు తెలుసు. అమరకథను వినిపించేందుకు వారు రావడము కూడా ఒక్కసారే వస్తారు. అమరకథ
అనండి, సత్యనారాయణ కథ అనండి, ఆ కథ యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. సత్యనారాయణ
కథ ద్వారా నరుడి నుండి నారాయణుడిగా అవుతారు. అమరకథ ద్వారా మీరు అమరులుగా అవుతారు.
బాబా ప్రతి విషయాన్ని స్పష్టము చేసి అర్థం చేయిస్తారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.