24-12-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - అవినాశీ జ్ఞాన రత్నాల దానమే మహాదానము,
ఈ దానము ద్వారానే రాజ్యము ప్రాప్తిస్తుంది, అందుకే మహాదానులుగా అవ్వండి’’
ప్రశ్న:-
ఏ
పిల్లలకైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో, వారి ముఖ్యమైన గుర్తులేమిటి?
జవాబు:-
1. వారికి పాత
ప్రపంచము యొక్క వాతావరణము అస్సలు బాగా అనిపించదు, 2. వారికి అనేకుల సేవ చేసి తమ
సమానముగా తయారుచేయడములోనే సంతోషముంటుంది, 3. వారికి చదువుకోవడము మరియు
చదివించడములోనే ప్రశాంతముగా అనిపిస్తుంది, 4. జ్ఞానాన్ని అర్థం చేయిస్తూ, అర్థం
చేయిస్తూ గొంతు పాడైపోయినా కూడా వారు సంతోషముగానే ఉంటారు, 5. వారికి ఎవరి ఆస్తి
అవసరము లేదు, వారు ఎవరి ఆస్తి వెనుక తమ సమయాన్ని పోగొట్టుకోరు, 6. వారి మోహ బంధాలు
అన్ని వైపుల నుండి తెగిపోయి ఉంటాయి, 7. వారు తండ్రి సమానముగా ఉదారచిత్తులుగా ఉంటారు,
వారికి సేవ తప్ప ఇంకేదీ మధురముగా అనిపించదు.
పాట:-
ఓం నమః శివాయ...
ఓంశాంతి
ఏ ఆత్మిక తండ్రి మహిమనైతే విన్నారో వారు కూర్చుని పిల్లలకు పాఠాలు చదివిస్తున్నారు,
ఇది పాఠశాల కదా. మీరందరూ ఇక్కడ టీచర్ ద్వారా పాఠాలు చదువుకుంటున్నారు. వీరు సుప్రీమ్
టీచర్, వీరిని పరమపిత అని కూడా అంటారు. పరమపిత అని ఆత్మిక తండ్రినే అంటారు. లౌకిక
తండ్రిని ఎప్పుడూ పరమపిత అని అనరు. ఇప్పుడు మేము పారలౌకిక తండ్రి వద్ద కూర్చున్నామని
మీరంటారు. కొంతమంది ఇక్కడే కూర్చుని ఉన్నారు, కొంతమంది అతిథులుగా వస్తారు. మనము
వారసత్వము తీసుకునేందుకు అనంతమైన తండ్రి వద్ద కూర్చున్నామని మీకు తెలుసు కావున
లోలోపల ఎంతటి సంతోషముండాలి. పాపం మనుష్యులైతే ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. ఈ సమయములో
ప్రపంచములోని వారంతా ప్రపంచములో శాంతి ఏర్పడాలని అంటూ ఉంటారు. శాంతి అంటే ఏమిటి
అనేది పాపం వారికి తెలియదు. జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడైన తండ్రియే శాంతిని స్థాపన
చేసేవారు. నిరాకారీ ప్రపంచములోనైతే శాంతియే ఉంటుంది. ప్రపంచములో శాంతి ఎలా ఏర్పడగలదు
అని ఇక్కడ ఆర్తనాదాలు చేస్తుంటారు. కొత్త ప్రపంచమైన సత్యయుగములో ఒకే ధర్మము
ఉన్నప్పుడు శాంతి ఉండేది. కొత్త ప్రపంచాన్ని ప్యారడైజ్, దేవతల ప్రపంచము అని అంటారు.
శాస్త్రాలలో అక్కడక్కడ అశాంతికి సంబంధించిన విషయాలను వ్రాసేశారు. ద్వాపరములో కంసుడు
ఉన్నట్లుగా చూపిస్తారు, అలాగే హిరణ్యకశిపుడిని సత్యయుగములో చూపిస్తారు,
త్రేతాయుగములో రావణుడి గొడవను చూపిస్తారు... అన్ని చోట్ల అశాంతిని చూపించారు.
మనుష్యులు పాపం ఎంతటి ఘోర అంధకారములో ఉన్నారు. అనంతమైన తండ్రిని పిలుస్తారు కూడా.
ఎప్పుడైతే గాడ్ ఫాదర్ వస్తారో, అప్పుడు వారే శాంతిని స్థాపన చేస్తారు. గాడ్ గురించి
పాపం వారికి తెలియదు. శాంతి అనేది కొత్త ప్రపంచములోనే ఉంటుంది. పాత ప్రపంచములో ఉండదు.
కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేవారైతే తండ్రియే. మీరు వచ్చి శాంతిని స్థాపన చేయండి
అని వారినే పిలుస్తారు. ఆర్య సమాజము వారు కూడా శాంతిదేవా అని పాడుతూ ఉంటారు.
తండ్రి అంటారు, మొట్టమొదటి విషయము పవిత్రత. ఇప్పుడు మీరు పవిత్రముగా
తయారవుతున్నారు. అక్కడ పవిత్రత కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది, ఆరోగ్యము-సంపద
అన్నీ ఉంటాయి. ధనము లేకపోతే మనుష్యులు ఉదాసీనులుగా అయిపోతారు. మీరు ఈ
లక్ష్మీ-నారాయణుల వలె ధనవంతులుగా అవ్వడానికి ఇక్కడకు వస్తారు. వీరు విశ్వానికి
యజమానులుగా ఉండేవారు కదా. మీరు విశ్వానికి యజమానులుగా అయ్యేందుకే వచ్చారు, కానీ ఆ
బుద్ధి అందరికీ నంబరువారుగా ఉంది. బాబా అన్నారు, ప్రభాత యాత్రలు చేసినప్పుడు
లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని తప్పకుండా తీసుకువెళ్ళండి. అటువంటి యుక్తిని రచించండి.
ఇప్పుడు పిల్లల బుద్ధి పారసబుద్ధిగా తయారవ్వనున్నది. ఈ సమయములో ప్రస్తుతము
తమోప్రధానము నుండి రజో వరకు వెళ్ళారు. ఇప్పుడు సతో, సతోప్రధానము వరకు వెళ్ళాలి. ఆ
శక్తి ఇప్పుడు లేదు. స్మృతిలో ఉండటము లేదు. యోగబలము చాలా తక్కువగా ఉంది. వెంటనే
సతోప్రధానముగా అవ్వలేరు. క్షణములో జీవన్ముక్తి అనే గాయనము ఏదైతే ఉందో, అది సరైనదే.
మీరు బ్రాహ్మణులుగా అయ్యారు కావున జీవన్ముక్తులుగా అయినట్లే, మళ్ళీ జీవన్ముక్తిలో
కూడా సర్వోత్తములు, మధ్యములు, కనిష్టులు ఉంటారు. ఎవరైతే తండ్రికి చెందినవారిగా
అవుతారో, వారికి జీవన్ముక్తి తప్పకుండా లభిస్తుంది. తండ్రికి చెందినవారిగా అయి
తర్వాత తండ్రిని వదిలివేసినా కానీ, జీవన్ముక్తి అయితే తప్పకుండా లభిస్తుంది,
స్వర్గములో ఊడ్చేవారిగా అవుతారు. స్వర్గములోకైతే వెళ్తారు కానీ తక్కువ పదవి
లభిస్తుంది. తండ్రి అవినాశీ జ్ఞానాన్ని ఇస్తారు, అది ఎప్పుడూ వినాశనమవ్వదు. పిల్లల
లోపల సంతోషపు భజంత్రీలు మ్రోగాలి. అయ్యో-అయ్యో అన్న ఆర్తనాదాల తర్వాత మళ్ళీ
వాహ్-వాహ్ జరగనున్నది.
మీరు ఇప్పుడు ఈశ్వరీయ సంతానము, ఆ తర్వాత దైవీ సంతానముగా అవుతారు. ఈ సమయములో మీ ఈ
జీవితము వజ్రతుల్యమైనది. మీరు భారత్ యొక్క సేవ చేసి భారత్ ను శాంతియుతంగా చేస్తారు.
అక్కడ పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉంటాయి. మీ ఈ జీవితము దేవతల జీవితము కంటే
ఉన్నతమైనది. ఇప్పుడు మీకు రచయిత అయిన తండ్రి గురించి మరియు సృష్టి చక్రము గురించి
తెలుసు. ఈ పండుగలు మొదలైనవన్నీ పరంపరగా కొనసాగుతూ వస్తున్నాయని అంటారు. కానీ
ఎప్పటినుండి? ఇది ఎవ్వరికీ తెలియదు. ఎప్పటినుండైతే సృష్టి మొదలయ్యిందో, అప్పటినుండే
రావణుడిని కాల్చడము మొదలైనవి పరంపరగా కొనసాగుతూ వస్తున్నాయని భావిస్తారు. ఇప్పుడు
సత్యయుగములోనైతే రావణుడు ఉండడు. అక్కడ ఎవ్వరూ దుఃఖితులుగా ఉండరు కావున భగవంతుడిని
కూడా స్మృతి చేయరు. ఇక్కడ అందరూ భగవంతుడిని స్మృతి చేస్తూ ఉంటారు. భగవంతుడే
విశ్వములో శాంతిని నెలకొల్పుతారని భావిస్తారు, అందుకే - మీరు వచ్చి దయ చూపించండి,
మమ్మల్ని దుఃఖము నుండి విముక్తులుగా చేయండి అని అంటారు. పిల్లలే తండ్రిని పిలుస్తారు
ఎందుకంటే పిల్లలే సుఖాన్ని చూసారు. తండ్రి అంటారు, మిమ్మల్ని పవిత్రముగా తయారుచేసి
నాతోపాటు తీసుకువెళ్తాను. ఎవరైతే పవిత్రముగా అవ్వరో, వారు శిక్షలు అనుభవిస్తారు.
ఇందులో మనసా, వాచా, కర్మణా పవిత్రముగా ఉండాలి. మనసు కూడా చాలా బాగుండాలి. చివరిలో
మనసులో ఎటువంటి వ్యర్థ సంకల్పాలు రానంతగా కష్టపడాలి. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ
గుర్తు రాకూడదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎప్పటివరకైతే కర్మాతీత అవస్థ
తయారవ్వదో, అప్పటివరకూ మనసాలో వస్తాయి. హనుమంతుని వలె అచలముగా తయారవ్వండి, అందులోనే
చాలా కష్టపడాలి. ఎవరైతే ఆజ్ఞాకారులైన, నమ్మకస్థులైన, సుపుత్రులైన పిల్లలు ఉంటారో,
తండ్రికి కూడా వారి పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది. పంచ వికారాలపై విజయము పొందనివారు
అంత ప్రియముగా అనిపించరు. మనము కల్ప-కల్పము తండ్రి నుండి ఈ వారసత్వాన్ని
తీసుకుంటామని పిల్లలైన మీకు తెలుసు కావున సంతోషము యొక్క పాదరసము ఎంతగా పైకి ఎక్కాలి.
ఇది కూడా మీకు తెలుసు - స్థాపన అయితే తప్పకుండా జరగనున్నది, ఈ పాత ప్రపంచము
తప్పకుండా శ్మశానవాటికగా అవ్వనున్నది. మనము పరిస్తాన్ లోకి వెళ్ళేందుకు కల్పక్రితము
వలె పురుషార్థము చేస్తూ ఉంటాము. ఇది శ్మశానము కదా. పాత ప్రపంచము మరియు కొత్త
ప్రపంచము యొక్క వివరణ మెట్ల వరుస చిత్రములో ఉంది. ఈ మెట్ల వరుస చిత్రము ఎంత బాగుంది,
అయినా మనుష్యులు అర్థం చేసుకోరు. ఇక్కడ ఈ సాగర తీరములో ఉండేవారు కూడా పూర్తిగా అర్థం
చేసుకోరు. మీరు జ్ఞాన ధనాన్ని తప్పకుండా దానము చేయాలి. ధనము ఇచ్చినా ధనము తరగదు.
దానీ, మహాదానీ అని అంటారు కదా. ఎవరైతే ఆసుపత్రులు, ధర్మశాలలు మొదలైనవి నిర్మిస్తారో,
వారిని మహాదానులని అంటారు. ఆ ఫలము మళ్ళీ మరుసటి జన్మలో అల్పకాలము కొరకు లభిస్తుంది.
ఉదాహరణకు ధర్మశాలను కట్టించారనుకోండి, మరుసటి జన్మలో ఇంటి సుఖము లభిస్తుంది. కొందరు
చాలా-చాలా ధనాన్ని దానము చేస్తారు, వారు రాజుల ఇంటిలో లేక షావుకారుల ఇంటిలో జన్మ
తీసుకుంటారు. వారు దానముతో ఆ విధముగా అవుతారు, మీరు చదువుతో రాజ్య పదవిని పొందుతారు.
ఇది చదువు కూడా, దానము కూడా. ఇక్కడ డైరెక్ట్ గా జరుగుతుంది, భక్తి మార్గములో ఇన్
డైరెక్ట్ గా జరుగుతుంది. శివబాబా మిమ్మల్ని చదువు ద్వారా ఈ విధముగా తయారుచేస్తారు.
శివబాబా వద్దనైతే అవినాశీ జ్ఞాన రత్నాలు ఉన్నాయి. ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల
విలువైనది. భక్తి కోసం ఈ విధముగా అనరు. దీనిని జ్ఞానమని అంటారు. శాస్త్రాలలో భక్తి
యొక్క జ్ఞానము ఉంటుంది, భక్తి ఎలా చేయాలి అన్నదాని కోసం శిక్షణ లభిస్తుంది.
పిల్లలైన మీకు జ్ఞానము యొక్క అపారమైన నషా ఉంది. మీకు భక్తి తర్వాత జ్ఞానము
లభిస్తుంది. జ్ఞానముతో విశ్వ రాజ్యాధికారము యొక్క అపారమైన నషా ఎక్కుతుంది. ఎవరైతే
ఎక్కువ సేవ చేస్తారో, వారికి నషా ఎక్కుతుంది. ప్రదర్శినీలలో లేక మ్యూజియంలలో కూడా
బాగా భాషణ చేసేవారిని పిలుస్తారు కదా. అక్కడ కూడా తప్పకుండా నంబరువారుగా ఉంటారు.
మహారథులు, గుర్రపుస్వారి వారు, పాదచారులు ఉంటారు. దిల్వాడా మందిరములో కూడా
స్మృతిచిహ్నము తయారై ఉంది. మీరు అంటారు - ఇది చైతన్యమైన దిల్వాడా, అది జడమైనది. మీరు
గుప్తముగా ఉన్నారు, అందుకే మీ గురించి వారికి తెలియదు.
మీరు రాజఋషులు, వారు హఠయోగీ ఋషులు. ఇప్పుడు మీరు జ్ఞాన జ్ఞానేశ్వరులు. జ్ఞాన
సాగరుడు మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. మీరు అవినాశీ సర్జన్ కు పిల్లలు. సర్జన్ యే
నాడిని చూస్తారు. ఎవరికైతే తమ నాడి గురించే తెలియదో, వారు ఇతరులది ఎలా తెలుసుకుంటారు.
మీరు అవినాశీ సర్జన్ కు పిల్లలు కదా. జ్ఞాన అంజనాన్ని సద్గురువు ఇచ్చారు... ఇది
జ్ఞాన ఇంజెక్షన్ కదా. ఆత్మకు ఇంజెక్షన్ ఇవ్వడము జరుగుతుంది కదా. ఈ మహిమ కూడా
ఇప్పటిదే. సద్గురువుకే మహిమ ఉంది. గురువులకు కూడా జ్ఞాన ఇంజెక్షన్ ను సద్గురువే
ఇస్తారు. మీరు అవినాశీ సర్జన్ యొక్క పిల్లలు కావున మీ వ్యాపారమే జ్ఞాన ఇంజెక్షన్ ను
ఇవ్వడము. డాక్టర్లలో కూడా కొంతమంది నెలకు లక్ష సంపాదిస్తే, కొంతమంది 500 కూడా కష్టం
మీద సంపాదిస్తారు. నంబరువారుగా ఒకరి తర్వాత ఒకరి వద్దకు వెళ్తూ ఉంటారు కదా. ఉరి
వేయమని హైకోర్టు, సుప్రీమ్ కోర్టులలో జడ్జిమెంటు లభిస్తుంది, అప్పుడు వారు
ప్రెసిడెంట్ వద్ద అప్పీల్ చేసుకుంటే వారు క్షమిస్తారు కూడా.
పిల్లలైన మీకైతే నషా ఉండాలి, ఉదారచిత్తులుగా ఉండాలి. ఈ భగీరథునిలో తండ్రి
ప్రవేశించారు కావున తండ్రి వీరిని ఉదారచిత్తులుగా తయారుచేసారు కదా. స్వయము వారే
అయితే ఏమైనా చేయగలరు కదా. వారు వీరిలోకి వచ్చి యజమానిగా అయి కూర్చున్నారు. ఇదంతా
భారత్ యొక్క కళ్యాణము కోసం వినియోగించండి అని వీరికి చెప్పారు. మీరు భారత్ యొక్క
కళ్యాణము కోసమే మీ ధనాన్ని వినియోగిస్తారు. ధనము ఎక్కడ నుండి వస్తుంది అని ఎవరైనా
అడిగితే, మీరు చెప్పండి - మేము మా తనువు, మనసు, ధనములతోనే సేవ చేస్తాము. మేమే
రాజ్యము చేస్తాము కావున ధనము కూడా మేమే పెడతాము. మా ఖర్చులను మేమే పెట్టుకుంటాము.
బ్రాహ్మణులమైన మేము శ్రీమతముపై రాజ్య స్థాపన చేస్తాము. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో,
వారే ఖర్చు చేస్తారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు, తర్వాత దేవతలుగా అవ్వాలి.
బాబా అయితే అంటారు, మనుష్యులకు ఆకర్షణ కలిగే విధముగా అన్ని చిత్రాలు ట్రాన్స్ లైట్
వి తయారుచేయండి. ఎవరికైనా వెంటనే బాణము తగిలేలా ఉండాలి. కొంతమంది ఇంద్రజాలము
చేస్తారేమో అనే భయముతో రానే రారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడము - ఇది
ఇంద్రజాలమే కదా. భగవానువాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. హఠయోగులు ఎప్పుడూ
రాజయోగాన్ని నేర్పించలేరు. ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మీరు
మందిరయోగ్యులుగా అవుతున్నారు. ఈ సమయములో ఈ విశ్వమంతా అనంతమైన లంకగా ఉంది.
విశ్వమంతటిపైనా రావణుని రాజ్యముంది. ఇకపోతే సత్య, త్రేతాయుగాలలో ఈ రావణుడు
మొదలైనవారు ఎలా ఉండగలరు.
తండ్రి అంటున్నారు, ఇప్పుడు నేను ఏదైతే వినిపిస్తున్నానో అది వినండి. ఈ కళ్ళతో
ఏమీ చూడకండి. ఈ పాత ప్రపంచమే వినాశనమవ్వనున్నది, అందుకే మనము మన శాంతిధామాన్ని,
సుఖధామాన్నే స్మృతి చేస్తాము. ఇప్పుడు మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతున్నారు.
వీరు నంబరువన్ పూజారిగా ఉండేవారు, నారాయణుడిని చాలా పూజించేవారు. ఇప్పుడు మళ్ళీ
పూజ్య నారాయణునిగా అవుతున్నారు. మీరు కూడా పురుషార్థము చేసి అలా తయారవ్వగలరు.
రాజధాని అయితే కొనసాగుతుంది కదా. కింగ్ ఎడ్వర్డ్ ది ఫస్ట్, సెకండ్, థర్డ్... అలా
కొనసాగుతూ వస్తుంది. తండ్రి అంటారు, మీరు సర్వవ్యాపి అని అంటూ నన్ను తిరస్కరిస్తూ
వచ్చారు. అయినా నేను మీకు ఉపకారమే చేస్తాను. ఈ ఆటే ఆ విధముగా అద్భుతముగా
తయారుచేయబడింది. పురుషార్థము తప్పకుండా చేయాలి. ఎవరైతే కల్పక్రితము పురుషార్థము
చేసారో, వారే డ్రామానుసారముగా మళ్ళీ చేస్తారు. ఏ పిల్లలకైతే సేవ పట్ల అభిరుచి
ఉంటుందో, వారికి రాత్రింబవళ్ళు ఇదే చింతన ఉంటుంది. పిల్లలైన మీకు తండ్రి నుండి
మార్గము లభించింది కావున పిల్లలైన మీకు సేవ తప్ప ఇంకేదీ మంచిగా అనిపించదు.
ప్రాపంచిక వాతావరణము మీకు మంచిగా అనిపించదు. సేవ చేసేవారికైతే సేవ లేకపోతే ప్రశాంతత
ఉండదు. టీచర్ కు చదివించడములో ఆనందము కలుగుతుంది. ఇప్పుడు మీరు చాలా ఉన్నతమైన టీచర్
గా అయ్యారు. మీ వ్యాపారమే ఇది. టీచర్ ఎంత బాగా అనేకులను తమ సమానముగా తయారుచేస్తారో,
వారికి అంతటి బహుమానము లభిస్తుంది. వారికి చదివించకపోతే ప్రశాంతముగా అనిపించదు.
ప్రదర్శినీ మొదలైనవాటిలో రాత్రి 12 గంటలైపోయినా కూడా సంతోషము కలుగుతుంది. అలసట
కలుగుతుంది, గొంతు పాడైపోతుంది, అయినా కూడా సంతోషముగానే ఉంటారు. ఇది ఈశ్వరీయ సేవ కదా.
ఇది చాలా ఉన్నతమైన సేవ, వారికి ఇంకేదీ మధురముగా అనిపించదు. మేము ఈ ఇళ్ళు మొదలైనవి
తీసుకుని కూడా ఏం చేయాలి, మేమైతే చదివించాలి, ఇదే సేవ చేయాలి అని అంటారు.
ఆస్తిపాస్తుల విషయాలలో ఏదైనా గొడవ ఉంటే, చెవులు కోసేటటువంటి ఈ బంగారము దేనికి
పనికొస్తుంది అని అంటారు. సేవ ద్వారానైతే నావ తీరానికి చేరుకుంటుంది. బాబా అంటారు -
ఇల్లు కూడా వారి పేరు మీదే ఉండనివ్వండి, బి.కె.లైతే సేవ చేయాలి. ఈ సేవలో బయటి
బంధనాలేవీ బాగా అనిపించవు. కొందరికి మోహము ఉంటుంది, కొందరికి మోహము తెగిపోయి ఉంటుంది.
బాబా అంటారు, మన్మనాభవగా ఉన్నట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. చాలా సహాయము
లభిస్తుంది. ఈ సేవలో నిమగ్నమైపోవాలి. ఇందులో చాలా సంపాదన ఉంది. ఇల్లు మొదలైనవాటి
విషయమేమీ లేదు. ఇల్లు ఇచ్చి బంధనాలు పెడితే అలాంటివి తీసుకోరు. ఎవరికైతే సేవ చేయడము
రాదో, వారు మనకు ఉపయోగపడరు. టీచర్ తమ సమానముగా తయారుచేస్తారు, అలా తయారవ్వకపోతే వారు
దేనికి పనికొస్తారు. హ్యాండ్స్ అవసరము చాలా ఉంటుంది కదా. అందులోనూ కన్యలు, మాతల
అవసరము ఎక్కువగా ఉంటుంది. తండ్రి టీచర్ కావున పిల్లలు కూడా టీచర్లుగా అవ్వాలి అని
పిల్లలు భావిస్తారు. అలాగని టీచర్ ఇంకే పనీ చేయలేరని కాదు. అన్ని పనులు చేయాలి.
అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. రాత్రింబవళ్ళు సేవ యొక్క చింతనలోనే ఉండాలి, మోహ బంధనాలన్నింటినీ తెంచివేయాలి.
సేవ లేకపోతే ప్రశాంతత ఉండదు, సేవ చేసి తమ సమానముగా తయారుచేయాలి.
2. తండ్రి సమానముగా ఉదారచిత్తులుగా అవ్వాలి. అందరి నాడిని చూసి సేవ చేయాలి. మీ
తనువు-మనసు-ధనములను భారత్ యొక్క కళ్యాణము కోసం వినియోగించాలి. అచలముగా, స్థిరముగా
అయ్యేందుకు ఆజ్ఞాకారులుగా, నమ్మకస్థులుగా అవ్వాలి.
వరదానము:-
ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల వలయము నుండి సదా ముక్తులుగా ఉండే
విశ్వ సేవాధారీ చక్రవర్తి భవ
ఎప్పుడైతే స్వదర్శన చక్రము సరైన దిశలో తిరిగేందుకు బదులుగా
తప్పుడు దిశలో తిరుగుతుందో, అప్పుడు మాయాజీతులుగా అయ్యేందుకు బదులుగా పరదర్శన యొక్క
చిక్కుల చక్రములోకి వచ్చేస్తారు. దాని వలన ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల వలయము
తయారవుతుంది. దానిని స్వయమే రచిస్తారు, మళ్ళీ అందులో స్వయమే చిక్కుకుపోతారు. అందుకే
నాలెడ్జ్ ఫుల్ గా అయి స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి, అప్పుడు ఎందుకు, ఏమిటి
అనే ప్రశ్నల వలయము నుండి విముక్తులై యోగయుక్తులుగా, జీవన్ముక్తులుగా, చక్రవర్తులుగా
అయి బాబాతోపాటు విశ్వ కళ్యాణ సేవలో తిరుగుతూ ఉంటారు, విశ్వ సేవాధారులు చక్రవర్తీ
రాజులుగా అయిపోతారు.
స్లోగన్:-
ప్లెయిన్ బుద్ధితో ప్లాన్ ను ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చినట్లయితే అందులో సఫలత
ఇమిడి ఉంటుంది.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి
ఎప్పుడైతే కర్మాతీత
స్థితికి సమీపముగా చేరుకుంటారో, అప్పుడు ఏ ఆత్మ వైపుకు కూడా బుద్ధి వెళ్ళి, కర్మ
బంధనాన్ని తయారవ్వనివ్వదు. కర్మాతీతము అనగా సర్వ కర్మ బంధనాల నుండి ముక్తులుగా,
అతీతులుగా అయ్యి, ప్రకృతి ద్వారా నిమిత్తమాత్రముగా కర్మలు చేయించటము. కర్మాతీత
అవస్థను అనుభవము చేసేందుకు అతీతులుగా అయ్యే పురుషార్థాన్ని పదే-పదే చేయవలసిన అవసరము
రాకూడదు, సహజముగా మరియు స్వతహాగానే - చేయించేవారు మరియు చేసే ఈ కర్మేంద్రియాలు
ఉన్నదే వేరుగా అన్న అనుభవము అవ్వాలి.
| | | |