26-12-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీ భాగ్యాన్ని ఉన్నతముగా
తయారుచేసుకోవాలంటే ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరిని చూస్తున్నా సరే, బుద్ధియోగాన్ని
ఒక్క తండ్రితోనే జోడించండి’’
ప్రశ్న:-
కొత్త
ప్రపంచ స్థాపన కోసం నిమిత్తమయ్యే పిల్లలకు తండ్రి నుండి ఏ డైరెక్షన్ లభించింది?
జవాబు:-
పిల్లలూ, మీకు
ఈ పాత ప్రపంచముతో ఎటువంటి సంబంధము లేదు. మీ మనసును ఈ పాత ప్రపంచముపై పెట్టుకోకండి.
చెక్ చేసుకోండి - మేము శ్రీమతానికి విరుద్ధమైన కర్మలేవీ చేయడము లేదు కదా? ఆత్మిక
సేవకు నిమిత్తముగా అవుతున్నామా?
పాట:-
భోళానాథుని
కన్నా అతీతమైనవారు...
ఓంశాంతి
ఇప్పుడిక పాటలు వినవలసిన అవసరముండదు. పాటలను చాలావరకు భక్తులే పాడుతుంటారు మరియు
వింటుంటారు. మీరైతే చదువు చదువుకుంటున్నారు. ఈ పాటలు కూడా విశేషముగా పిల్లల కోసమే
తయారుచేయబడ్డాయి. తండ్రి మన భాగ్యాన్ని ఉన్నతముగా తయారుచేస్తున్నారని పిల్లలకు
తెలుసు. ఇప్పుడు మనము ఆ తండ్రినే స్మృతి చేయాలి మరియు దైవీ గుణాలను ధారణ చేయాలి. తమ
లెక్కాపత్రాన్ని చూసుకోవాలి - జమ అవుతూ ఉందా లేక నష్టము కలుగుతూ ఉందా? నాలో ఎటువంటి
లోపాలు లేవు కదా? ఒకవేళ నా భాగ్యానికి నష్టము కలిగించేలా ఏవైనా లోపాలు ఉండి ఉంటే
వాటిని తొలగించాలి. ఈ సమయములో ప్రతి ఒక్కరూ తమ భాగ్యాన్ని ఉన్నతముగా తయారుచేసుకోవాలి.
ఒకవేళ ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయకపోతేనే మనము ఈ విధముగా
లక్ష్మీ-నారాయణులుగా అవ్వగలమని మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు. ఎవరితో
మాట్లాడుతున్నా, ఎవరిని చూస్తున్నా సరే బుద్ధియోగము అక్కడ ఒక్కరితోనే జోడింపబడి
ఉండాలి. ఆత్మలమైన మనము తండ్రినే స్మృతి చేయాలి. ఒక్క నాపై తప్ప ఇంకెవ్వరిపైన మనసు
పెట్టుకోకండి మరియు దైవీ గుణాలను ధారణ చేయండి అని తండ్రి ఆజ్ఞ లభించి ఉంది. తండ్రి
అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు మళ్ళీ మీరు
వెళ్ళి రాజ్యములో మొదటి నంబరు తీసుకోండి. రాజ్య పదవి నుండి కిందపడి ప్రజల్లోకి, ఆ
ప్రజల్లో కూడా కిందకు వెళ్ళిపోయేలా అవ్వకండి. అలా కాదు. మీరు స్వయాన్ని చెక్
చేసుకుంటూ ఉండండి. దీనిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. తండ్రిని, టీచర్
ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మనకు ఎటువంటి శిక్షలు లభించకూడదు అన్న భయముంటుంది.
పాప కర్మలు చేయడము వలన మేము శిక్షలు అనుభవించవలసి ఉంటుందని భక్తిలో కూడా భావిస్తారు.
పెద్ద తండ్రి (శివబాబా) యొక్క డైరెక్షన్లు అయితే ఈ సమయములోనే లభిస్తాయి, వాటినే
శ్రీమతము అని అంటారు. శ్రీమతము ద్వారా మనము శ్రేష్ఠముగా అవుతామని పిల్లలకు తెలుసు.
స్వయాన్ని చెక్ చేసుకోవాలి - ఎక్కడా మేము శ్రీమతానికి విరుద్ధముగా ఏమీ చేయడము లేదు
కదా? ఏ విషయమైతే బాగా అనిపించదో, అది చేయకూడదు. మంచి-చెడుల గురించైతే ఇప్పుడు మీరు
అర్థం చేసుకున్నారు, ఇంతకుముందు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మీరు ఎటువంటి కర్మలను
నేర్చుకుంటారంటే, ఇక జన్మ-జన్మాంతరాల కొరకు మీరు చేసే కర్మలు అకర్మలుగా అవుతాయి. ఈ
సమయములోనైతే అందరిలోనూ 5 భూతాలు ప్రవేశించి ఉన్నాయి. ఇప్పుడు మంచి రీతిలో
పురుషార్థము చేసి కర్మాతీతముగా అవ్వాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. సమయము
నాజుకుగా అవుతూ ఉంటుంది, ప్రపంచము పాడైపోతూ ఉంటుంది. రోజురోజుకు ఇంకా పాడవుతూనే
ఉంటుంది. ఈ ప్రపంచముతో మీకు ఎటువంటి సంబంధము లేనట్లుగా ఉంది. మీకు కొత్త ప్రపంచముతో
సంబంధము ఉంది, అది స్థాపన అవుతోంది. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి మీరు
నిమిత్తము అవుతారు అని మీకు తెలుసు. కావున లక్ష్యము-ఉద్దేశ్యము ఏదైతే ఎదురుగా ఉందో,
అలా తయారవ్వాలి. ఎటువంటి ఆసురీ గుణాలు లోపల ఉండకూడదు. ఆత్మిక సేవలో నిమగ్నమై
ఉన్నట్లయితే చాలా ఉన్నతి జరుగుతుంది. ప్రదర్శనీలు, మ్యూజియంలు మొదలైనవి తయారుచేస్తూ
ఉంటారు. ఏమని భావిస్తారంటే - ఎంతోమంది వస్తారు, వారికి తండ్రి పరిచయాన్ని ఇస్తాము,
ఆ తర్వాత వారు కూడా తండ్రిని స్మృతి చేయడము మొదలుపెడతారు. మొత్తము రోజంతా ఇవే
ఆలోచనలు నడుస్తూ ఉండాలి. సేవాకేంద్రాలను తెరిచి సేవను పెంచాలి. ఈ రత్నాలన్నీ మీ
వద్ద ఉన్నాయి. తండ్రి దైవీ గుణాలను కూడా ధారణ చేయిస్తారు మరియు ఖజానాలను ఇస్తారు.
మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు, మీకు సృష్టి ఆదిమధ్యాంతాలను గురించి తెలుసు అని మీకు
బుద్ధిలో ఉంది. మీరు పవిత్రముగా కూడా ఉంటారు. మనసా-వాచా-కర్మణా ఎటువంటి చెడు కర్మలు
జరగకూడదు, దాని కోసం పూర్తిగా చెక్ చేసుకోవలసి ఉంటుంది. తండ్రి వచ్చిందే పతితులను
పావనముగా చేయడానికి. దాని కోసం యుక్తులు కూడా తెలియజేస్తూ ఉంటారు. అందులోనే రమిస్తూ
ఉండాలి. సేవాకేంద్రాలను తెరిచి అనేకమందికి ఆహ్వానము ఇవ్వాలి. ప్రేమగా కూర్చుని అర్థం
చేయించాలి. ఈ పాత ప్రపంచము అంతమవ్వనున్నది. మొదటైతే కొత్త ప్రపంచ స్థాపన చాలా అవసరము.
స్థాపన సంగమయుగములో జరుగుతుంది. ఇప్పుడు ఇది సంగమయుగమని కూడా మనుష్యులకు తెలియదు.
కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనము యొక్క సంగమ సమయము ఇప్పుడు ఉంది అని
కూడా అర్థం చేయించాలి. కొత్త ప్రపంచ స్థాపన శ్రీమతము అనుసారముగా జరుగుతుంది. తండ్రి
తప్ప ఇంకెవ్వరూ కొత్త ప్రపంచ స్థాపన కోసం డైరెక్షన్లు ఇవ్వరు. తండ్రియే వచ్చి
పిల్లలైన మీ ద్వారా కొత్త ప్రపంచ ప్రారంభోత్సవాన్ని చేయిస్తారు. వారు ఒంటరిగా అయితే
చేయరు కదా. పిల్లలందరి సహాయాన్ని తీసుకుంటారు. బయటివారు ఈ విధముగా ప్రారంభోత్సవము
చేయడానికి ఇలా సహాయము తీసుకోరు. వారు వచ్చి కత్తెరతో రిబ్బన్ కత్తిరిస్తారు.
ఇక్కడైతే అటువంటి విషయము లేదు. ఇందులో బ్రాహ్మణ కుల భూషణులైన మీరు సహాయకులుగా
అవుతారు. మనుష్యమాత్రులందరూ దారి తెలియక తికమక చెంది ఉన్నారు. పతిత ప్రపంచాన్ని
పావనముగా చేయడము - ఇది తండ్రి కర్తవ్యమే. తండ్రియే కొత్త ప్రపంచాన్ని స్థాపన
చేస్తారు, దాని కోసం ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తారు. తండ్రి వద్ద కొత్త ప్రపంచాన్ని
స్థాపన చేయడానికి యుక్తులు ఉన్నాయని మీకు తెలుసు. భక్తి మార్గములో - ఓ పతిత-పావనా
రండి అని వారిని పిలుస్తారు కదా. శివుడిని పూజిస్తూ ఉంటారు కూడా కానీ పతిత-పావనుడు
ఎవరు అన్నది వారికి తెలియదు. దుఃఖములో - ఓ భగవంతుడా, ఓ రామా అని అయితే తలచుకుంటారు.
రాముడు అని కూడా నిరాకారుడినే అంటారు. నిరాకారుడినే ఉన్నతమైన భగవంతుడని అంటారు. కానీ
మనుష్యులు చాలా తికమక చెంది ఉన్నారు. తండ్రి వచ్చి దాని నుండి బయటకు తీసారు. ఏ
విధముగా పొగ మంచులో మనుష్యులు తికమకపడుతూ ఉంటారు కదా. ఇది అనంతమైన విషయము. మీరు చాలా
పెద్ద అడవిలోకి వచ్చి పడ్డారు. మనము ఇంతకుముందు ఏ అడవిలో పడి ఉండేవారము అన్నది
తండ్రి మనకు అనుభవము చేయించారు. ఇది పాత ప్రపంచమని, ఇప్పుడిది అంతమవుతుందని ఇది కూడా
ఇప్పుడు మీకు తెలిసింది. మనుష్యులకైతే అసలు మార్గము తెలియనే తెలియదు. తండ్రిని
పిలుస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు పిలవరు. ఇప్పుడు పిల్లలైన మీకు డ్రామా ఆదిమధ్యాంతాల
గురించి తెలుసు, అది కూడా నంబరువారుగా తెలుసు. ఎవరికైతే తెలుసో, వారు చాలా సంతోషములో
ఉంటారు. ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేయడానికి తత్పరులై ఉంటారు. తండ్రి అయితే
పెద్ద-పెద్ద సెంటర్లు తెరవమని చెప్తూ ఉంటారు. చిత్రాలు పెద్ద-పెద్దవి ఉంటే మనుష్యులు
సహజముగా అర్థం చేసుకోగలరు. పిల్లల కోసం మ్యాప్స్ (చిత్రాలు) తప్పకుండా కావాలి. ఇది
కూడా ఒక స్కూల్ అని చెప్పాలి. ఇవి ఇక్కడి అద్భుతమైన మ్యాప్స్, ఆ స్కూల్లోని మ్యాప్స్
లో హద్దులోని విషయాలు ఉంటాయి. ఇవి అనంతమైన విషయాలు. ఇది కూడా పాఠశాలే, ఇక్కడ తండ్రి
మనకు సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని తెలియజేసి యోగ్యులుగా తయారుచేస్తున్నారు. ఇది
మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే ఈశ్వరీయ పాఠశాల. ఈశ్వరీయ విశ్వ విద్యాలయమనే
వ్రాయబడి ఉంది. ఇది ఆత్మిక పాఠశాల. కేవలం ఈశ్వరీయ విశ్వ విద్యాలయమని వ్రాసినంత
మాత్రాన మనుష్యులు అర్థం చేసుకోలేరు, యూనివర్శిటీ అని కూడా వ్రాయాలి. ఇటువంటి
ఈశ్వరీయ విశ్వ విద్యాలయము ఇంకేదీ లేదు. బాబా కార్డులు చూసారు, అందులో కొన్ని పదాలు
వ్రాయడము మర్చిపోయారు. ప్రజాపిత అన్న పదాన్ని తప్పకుండా వ్రాయండి అని బాబా ఎన్ని
సార్లు చెప్పారు, అయినా పిల్లలు మర్చిపోతూ ఉంటారు. మ్యాటర్ పూర్తిగా వ్రాయబడి ఉండాలి,
తద్వారా - ఇది ఈశ్వరుని పెద్ద కాలేజ్ అని మనుష్యులకు తెలియాలి. పిల్లలు ఎవరైతే సేవలో
ఉంటారో, ఎవరైతే మంచి సేవాధారులో, వారికి కూడా మనసులో ఉంటుంది - ఫలానా సెంటర్ డల్ గా
ఉంది, మేము వెళ్ళి దానిని పైకి తీసుకువారాలి, వారిని మేలుకొలపాలి అని, ఎందుకంటే మాయ
ఎటువంటిదంటే అది పదే-పదే నిద్రపోయేలా చేస్తుంది. నేను స్వదర్శన చక్రధారిని అని ఇది
కూడా మర్చిపోతారు. మాయ చాలా అపోజిషన్ చేస్తుంది. మీరు యుద్ధ మైదానములో ఉన్నారు. మాయ
తలను పక్కకు తిప్పేసి వ్యతిరేక మార్గములోకి తీసుకువెళ్ళకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి.
మాయా తుఫానులైతే అందరికీ చాలా వస్తూ ఉంటాయి. చిన్నవారు, పెద్దవారు అందరూ యుద్ధ
మైదానములోనే ఉన్నారు. పహల్వానులను మాయ తుఫానులు కదిలించలేవు, అటువంటి అవస్థ కూడా
రానున్నది.
తండ్రి అర్థం చేయిస్తున్నారు, సమయము చాలా అశుద్ధముగా ఉంది, పరిస్థితులు కూడా
పాడైపోయాయి. ఇప్పటి ఈ రాజ్యాధికారమంతా సమాప్తమయ్యేదే ఉంది. అందరినీ దించేస్తారు. ఆ
తర్వాత ప్రపంచమంతటా ప్రజలపై ప్రజల రాజ్యము ఏర్పడుతుంది. మీరు మీ కొత్త రాజ్యాన్ని
స్థాపన చేసినప్పుడు, ఇక్కడ రాజ్యము అన్న పేరు కూడా సమాప్తమైపోతుంది. పంచాయితీ
రాజ్యము ఏర్పడుతూ ఉంటుంది. ప్రజల రాజ్యము ఉన్నప్పుడు పరస్పరములో కొట్లాడుకుంటూ,
గొడవపడుతూ ఉంటారు. స్వ రాజ్యము అనగా రామ రాజ్యము అనేది వాస్తవానికి ఇప్పుడు లేదు,
అందుకే మొత్తము ప్రపంచమంతటా గొడవలే జరుగుతూ ఉంటాయి. ఈ రోజుల్లోనైతే అన్ని చోట్ల
గొడవలు జరుగుతూ ఉన్నాయి. మనము మన రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నామని మీకు తెలుసు.
మీరు అందరికీ మార్గాన్ని తెలియజేస్తారు. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి.
తండ్రి స్మృతిలో ఉంటూ ఇతరులకు కూడా ఈ విధముగా అర్థం చేయించండి - దేహీ-అభిమానులుగా
అవ్వండి, దేహాభిమానాన్ని వదలండి అని. అలాగని మీలో అందరూ దేహీ-అభిమానులుగా అయ్యారని
కాదు. ఇంకా అవ్వలేదు, ఇప్పుడు ఇంకా అవ్వాలి. మీరు పురుషార్థము చేస్తారు, ఇతరుల చేత
కూడా పురుషార్థము చేయిస్తారు. స్మృతి చేయడానికి ప్రయత్నిస్తారు, మళ్ళీ మర్చిపోతారు.
ఇదే పురుషార్థము చేయాలి. ముఖ్యమైన విషయము తండ్రిని స్మృతి చేయడము. పిల్లలకు ఎంతగా
అర్థం చేయిస్తూ ఉంటారు. చాలా మంచి జ్ఞానము లభిస్తుంది. ముఖ్యమైన విషయము పవిత్రముగా
ఉండటము. తండ్రి పావనముగా తయారుచేయడానికి వచ్చారు కావున ఇక మళ్ళీ పతితులుగా అవ్వకూడదు.
స్మృతి ద్వారానే మీరు సతోప్రధానముగా అయిపోతారు. ఇది మర్చిపోకూడదు. మాయ ఇందులోనే
విఘ్నాలను కలిగించి మరపింపజేస్తుంది. మేము తండ్రిని స్మృతి చేసి సతోప్రధానముగా
అవ్వాలి అని రాత్రింబవళ్ళు ఇదే చింత ఉండాలి. స్మృతి అనేది ఎంత పక్కాగా ఉండాలంటే -
చివరిలో ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. ప్రదర్శనీలో కూడా మొట్టమొదట ఏం
అర్థం చేయించాలంటే - వీరు అందరికీ తండ్రి, వీరు ఉన్నతోన్నతమైన భగవంతుడు. అందరికీ
తండ్రి, పతిత-పావనుడు, సద్గతిదాత వీరే. వీరే స్వర్గ రచయిత.
ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - తండ్రి రావడమే సంగమయుగములో వస్తారు. తండ్రియే
రాజయోగాన్ని నేర్పిస్తారు. పతిత-పావనుడు వారొక్కరు తప్ప ఇంకెవ్వరూ ఉండరు.
మొట్టమొదటైతే తండ్రి పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరికీ ఒక్కొక్క
చిత్రము గురించి కూర్చుని అర్థం చేయిస్తే, అంత గుంపుకు ఎలా అర్థం చేయించగలరు. కానీ
మొట్టమొదట తండ్రి చిత్రముపై అర్థం చేయించడము ముఖ్యము. భక్తి అపారముగా ఉంది కానీ
జ్ఞానమైతే ఇదొక్కటే అని అర్థం చేయించవలసి ఉంటుంది. తండ్రి పిల్లలకు ఎన్ని యుక్తులను
తెలియజేస్తూ ఉంటారు. పతిత-పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. వారు మార్గాన్ని కూడా
తెలియజేస్తారు. గీతను ఎప్పుడు వినిపించారు? ఇది కూడా ఎవ్వరికీ తెలియదు.
ద్వాపరయుగాన్ని సంగమయుగమని అనడము జరగదు. ప్రతి యుగములోనూ తండ్రి రారు. మనుష్యులైతే
పూర్తిగా తికమక చెంది ఉన్నారు. ఇతరులకు ఎలా-ఎలా అర్థం చేయించాలి అని రోజంతా ఇవే
ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. తండ్రి డైరెక్షన్లు ఇవ్వవలసి ఉంటుంది. టేప్ ద్వారా కూడా
మురళిని పూర్తిగా వినవచ్చు. కొందరు అంటారు - మేము టేప్ ద్వారా వింటున్నాము, వెళ్ళి
డైరెక్టుగా ఎందుకు వినకూడదు, అందుకే సమ్ముఖములోకి వస్తారు. పిల్లలు చాలా సేవ చేయాలి.
మార్గము తెలియజేయాలి. ప్రదర్శినీలకు వస్తారు - బాగుంది, బాగుంది అని కూడా అంటారు,
మళ్ళీ బయటకు వెళ్ళగానే మాయ యొక్క వాయుమండలములో అంతా ఎగిరిపోతుంది. స్మరణ చేయరు.
అటువంటివారిని ఫాలో అప్ చేస్తూ ఉండాలి. బయటకు వెళ్ళగానే మాయ తనవైపు లాగేసుకుంటుంది.
వ్యాపార-వ్యవహారాల్లో నిమగ్నమైపోతారు, అందుకే మధుబన్ కు మహిమ ఉంది. మీకైతే ఇప్పుడు
జ్ఞానము లభించింది. గీతా భగవంతుడు ఎవరు అనేది మీరు అక్కడకు కూడా వెళ్ళి అర్థం
చేయిస్తారు. ఇంతకుముందైతే మీరు కూడా ఇలాగే వెళ్ళి తల వంచి నమస్కరించేవారు. ఇప్పుడైతే
మీరు పూర్తిగా మారిపోయారు. మీరు ఇప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు.
బుద్ధిలో మొత్తము జ్ఞానమంతా ఉంది. ప్రజాపిత బ్రహ్మాకుమార-కుమారీలు ఎవరు అన్నది
ఇతరులకేమి తెలుసు. మీరు ఈ విధముగా అర్థం చేయిస్తారు - వాస్తవానికి మీరు కూడా
ప్రజాపిత బ్రహ్మాకుమార, బ్రహ్మాకుమారీలే. ఈ సమయములోనే బ్రహ్మా ద్వారా స్థాపన
జరుగుతుంది. బ్రాహ్మణ కులము కూడా తప్పకుండా కావాలి కదా. సంగమయుగములోనే బ్రాహ్మణ
కులముంటుంది. ఇంతకుముందు బ్రాహ్మణుల పిలక ప్రసిద్ధముగా ఉండేది. పిలక వలన లేక జంధ్యము
వలన వీరు హిందువులని గుర్తించేవారు. ఇప్పుడు ఆ గుర్తులు కూడా లేవు. మనము
బ్రాహ్మణులమని ఇప్పుడు మీకు తెలుసు. బ్రాహ్మణులుగా అయిన తర్వాత మళ్ళీ దేవతలుగా
అవ్వగలరు. బ్రాహ్మణులే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసారు. యోగబలముతో సతోప్రధానముగా
అవుతున్నారు. స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఎటువంటి ఆసురీ గుణము ఉండకూడదు. ఉప్పునీరులా
అవ్వకూడదు. ఇది యజ్ఞము కదా. యజ్ఞము ద్వారానే అందరి సంభాళన జరుగుతూ ఉంటుంది. యజ్ఞములో
సంభాళించే ట్రస్టీలు కూడా ఉంటారు. యజ్ఞానికి యజమాని శివబాబా. ఈ బ్రహ్మా కూడా
ట్రస్టీయే. యజ్ఞాన్ని సంభాళించవలసి ఉంటుంది. పిల్లలైన మీకు ఏది కావాలన్నా యజ్ఞము
నుండి తీసుకోవాలి. ఇతరులెవరి నుండైనా తీసుకుని ధరిస్తే వారే గుర్తుకువస్తూ ఉంటారు.
ఇందులో బుద్ధి లైన్ చాలా క్లియర్ గా (స్పష్టముగా) ఉండాలి. ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి.
సమయము చాలా తక్కువగా ఉంది, అందుకే స్మృతియాత్ర పక్కాగా ఉండాలి. ఈ పురుషార్థమే చేయాలి.
అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తమ ఉన్నతి కోసం ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి. ఏ జ్ఞాన రత్నాలైతే లభించాయో,
వాటిని ధారణ చేసి ఇతరుల చేత ధారణ చేయించాలి.
2. స్వయాన్ని చెక్ చేసుకోవాలి - నాలో ఎటువంటి ఆసురీ గుణాలు లేవు కదా? నేను
ట్రస్టీగా ఉంటున్నానా? ఎప్పుడూ ఉప్పునీరులా అవ్వడము లేదు కదా? బుద్ధి లైన్ క్లియర్
గా ఉందా?
వరదానము:-
పురుషార్థములోని సూక్ష్మ సోమరితనాన్ని కూడా త్యాగము చేసే
ఆల్రౌండర్ అలర్ట్ భవ
పురుషార్థములో అలసట అనేది సోమరితనానికి గుర్తు. సోమరితనము
కలవారు త్వరగా అలసిపోతారు, ఉత్సాహము కలవారు అలసట లేకుండా ఉంటారు. ఎవరైతే
పురుషార్థములో నిరుత్సాహులుగా అవుతారో, వారికే సోమరితనము వస్తుంది. వారు ఎలా
ఆలోచిస్తారంటే - ఏం చేయను, ఇంతే వీలవుతుంది, ఎక్కువ చేయలేను, ధైర్యము లేదు, నడవడమైతే
నడుస్తున్నాను, చేయడమైతే చేస్తూన్నాను - ఇప్పుడు ఈ సూక్ష్మ సోమరితనము యొక్క
నామ-రూపాలు కూడా ఉండకూడదు, దాని కోసం సదా అలర్ట్ గా, ఎవర్రెడీగా మరియు ఆల్రౌండర్ గా
అవ్వండి.
స్లోగన్:-
సమయము
యొక్క మహత్వాన్ని ఎదురుగా ఉంచుకుని సర్వ ప్రాప్తుల ఖాతాను పూర్తిగా జమ చేసుకోండి.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి
శబ్దము నుండి అతీతముగా
మీ శ్రేష్ఠ స్థితిలో స్థితులైనట్లయితే సర్వ వ్యక్త ఆకర్షణల నుండి దూరముగా శక్తిశాలి,
అతీతమైన మరియు ప్రియమైన స్థితి తయారవుతుంది. ఒక్క క్షణమైనా ఈ శ్రేష్ఠ స్థితిలో
స్థితులైనట్లయితే దీని ప్రభావము మొత్తము రోజంతటిలో కర్మలు చేస్తూ కూడా స్వయములో
విశేషముగా శాంతి శక్తిని అనుభవము చేస్తారు, ఈ స్థితినే కర్మాతీత స్థితి, బాబా
సమానమైన సంపూర్ణ స్థితి అని అంటారు.
| | | |