27-05-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ ముఖము ఇప్పుడు స్వర్గం వైపు ఉంది, మీరు నరకం నుండి పక్కకు తప్పుకుని స్వర్గం వైపుకు వెళ్తున్నారు, అందుకే మీ బుద్ధియోగాన్ని నరకం వైపు నుండి తొలగించండి’’

ప్రశ్న:-
అన్నింటికన్నా ఉన్నతమైన మరియు సూక్ష్మమైన గమ్యము ఏమిటి, దానిని ఎవరు దాటగలరు?

జవాబు:-
పిల్లలైన మీరు స్వర్గం వైపు మీ ముఖాన్ని ఉంచుతారు, మాయ మీ ముఖాన్ని నరకము వైపుకు తిప్పేస్తుంది, అనేక తుఫాన్లను తీసుకువస్తుంది, ఆ తుఫానులను దాటడమే సూక్ష్మమైన గమ్యము. ఈ గమ్యాన్ని దాటేందుకు నష్టోమోహులుగా అవ్వాల్సి ఉంటుంది. నిశ్చయము మరియు ధైర్యము ఆధారంపై దీనిని దాటగలరు. వికారుల మధ్యన ఉంటూ నిర్వికారీ హంసలుగా అవ్వడములోనే శ్రమ ఉంది.

పాట:-
నిర్బలులతో బలవంతుని యుద్ధము...

ఓంశాంతి
పిల్లలు ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో, వారు దీని అర్థాన్ని మంచి రీతిలో అర్థం చేసుకుంటారు, ఎవరి బుద్ధియోగమైతే శాంతిధామము మరియు స్వర్గం వైపు ఉంటుందో, వారికే తుఫానులు వస్తాయి. తండ్రి ఇప్పుడు మీ ముఖాన్ని తిప్పుతారు. అజ్ఞాన కాలంలో కూడా పాత ఇంటి నుండి ముఖము తిరిగిపోతుంది, ఆ తర్వాత - ఎప్పుడు తయారవుతుంది అంటూ కొత్త ఇంటిని తలచుకుంటూ ఉంటారు. మన స్వర్గ స్థాపన ఎప్పుడు జరుగుతుంది, మళ్ళీ సుఖధామంలోకి ఎప్పుడు వస్తాము అని ఇప్పుడు పిల్లలైన మీకు కూడా ధ్యాసలో ఉంది. ఈ దుఃఖధామం నుండైతే అందరూ వెళ్ళాలి. మొత్తం సృష్టిలోని మనుష్యమాత్రులకు తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు - పిల్లలూ, ఇప్పుడిక స్వర్గ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఇప్పుడు మీ బుద్ధి యోగము స్వర్గము వైపు ఉండాలి. స్వర్గంలోకి వెళ్ళేవారిని పవిత్రులు అని అంటారు. నరకంలోకి వెళ్ళేవారిని అపవిత్రులు అని అంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా బుద్ధియోగాన్ని స్వర్గం వైపుకు జోడించాలి. తండ్రి బుద్ధియోగం స్వర్గం వైపు మరియు పిల్లలది నరకం వైపు ఉన్నప్పుడు ఇరువురూ ఒకే ఇంట్లో ఎలా ఉండగలరు. హంస మరియు కొంగ కలిసి ఉండలేవు. అది చాలా కష్టము. వారి బుద్ధియోగము 5 వికారాల వైపే ఉంటుంది. వారు నరకం వైపు వెళ్ళేవారు, వీరు స్వర్గం వైపు వెళ్ళేవారు, ఇరువురూ కలిసి ఉండలేరు. ఇది చాలా పెద్ద గమ్యము. నా పిల్లల ముఖం నరకం వైపు ఉంది అని తండ్రి చూస్తారు, వారు నరకం వైపుకు వెళ్ళకుండా ఉండలేరు, అప్పుడేమి చేయాలి! తప్పకుండా ఇంట్లో గొడవ జరుగుతుంది. ఇది కూడా ఒక జ్ఞానమేనా, కొడుకు వివాహం చేసుకోకూడదా... అని అంటారు. గృహస్థ వ్యవహారంలోనైతే ఎందరో ఉంటారు కదా. కొడుకు ముఖము నరకం వైపు ఉంటుంది, నరకంలోకి వెళ్ళాలని వారు కోరుకుంటారు. నరకం వైపు మీ బుద్ధియోగాన్ని ఉంచకండి అని తండ్రి అంటారు. కానీ తండ్రి మాటను కూడా వినరు. అప్పుడేమి చేయాలి? ఇందులో చాలా నష్టోమోహా స్థితి కావాలి. ఈ జ్ఞానమంతా ఆత్మలో ఉంది. తండ్రి ఆత్మ అంటుంది - ఇతడిని నేను రచించాను, నా మాట వినడం లేదు అని. కొందరు బ్రాహ్మణులుగా కూడా అయ్యారు, మళ్ళీ బుద్ధి నరకం వైపుకు వెళ్ళిపోతుంది. అనగా వారు పూర్తిగా రసాతలంలోకి వెళ్ళిపోతారు.

ఇది జ్ఞానసాగరుని దర్బారు అని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. భక్తి మార్గములో ఇంద్రుని దర్బారు కూడా మహిమ చేయబడుతుంది. పుష్యరాగము, ఇంద్రనీలము, మాణిక్యము, ఇలా ఎన్నో పేర్లను పెట్టారు ఎందుకంటే జ్ఞాన డ్యాన్స్ చేస్తారు కదా. రకరకాల దేవకన్యలు ఉంటారు. వారు కూడా పవిత్రమైనవారే కావాలి. ఒకవేళ ఎవరైనా అపవిత్రులను తీసుకువస్తే శిక్ష పడుతుంది. ఇందులో చాలా పావనమైనవారు కావాలి. ఈ గమ్యము చాలా ఉన్నతమైనది అందుకే వృక్షము త్వరత్వరగా వృద్ధి చెందదు. తండ్రి ఏ జ్ఞానమునైతే ఇస్తారో, దాని గురించి ఎవరికీ తెలియదు. శాస్త్రాలలో కూడా ఈ జ్ఞానము లేదు, అందుకే కాస్త నిశ్చయము ఏర్పడగానే మళ్ళీ మాయ ఒక్క చెంపదెబ్బతో పడేస్తుంది. ఇది తుఫాను కదా. చిన్న దీపాన్ని తుఫాను గాలి ఒక్కసారిగా ఆర్పివేస్తుంది. ఇతరులు వికారాలలో పడిపోవడం చూసి స్వయము కూడా పడిపోతారు. ఇందులో అర్థం చేసుకునేందుకు చాలా విశాలబుద్ధి కావాలి. అబలలపై అత్యాచారాలు జరిగాయి అన్న గాయనం కూడా ఉంది. తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలూ, కామము మహాశత్రువు, దానిపై మీకు చాలా ద్వేషం కలగాలి. ఇప్పుడు బాబా దాని పట్ల ఎంతో ద్వేషాన్ని కలిగిస్తారు, ఇంతకుముందు ఆ విషయం లేదు. నరకము ఇప్పుడే ఉంది కదా. ద్రౌపది పిలిచారు, అది ఇప్పటి విషయమే. ఎంత మంచి రీతిలో అర్థం చేయించడం జరుగుతుంది. అయినా కానీ బుద్ధిలో కూర్చోదు.

ఈ సృష్టి చక్రము చిత్రము చాలా బాగుంది - గేట్ వే టు హెవెన్ (స్వర్గానికి దారి). ఈ సృష్టి చక్రం చిత్రం ద్వారా చాలా బాగా అర్థం చేసుకోగలరు. దీని ద్వారా ఎంతైతే అర్థం చేసుకుంటారో, మెట్ల చిత్రం ద్వారా అంత అర్థం చేసుకోలేరు. రోజు-రోజుకూ కరెక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. తండ్రి అంటారు - ఈ రోజు మీకు పూర్తిగా కొత్త డైరెక్షన్ ను ఇస్తాను. ముందు నుండే అన్ని డైరెక్షన్లు ఏమైనా లభిస్తాయా. ఇది ఎటువంటి ప్రపంచము, ఇందులో ఎంత దుఃఖము ఉంది. పిల్లలపై ఎంతగా మోహం ఉంటుంది. కొడుకు చనిపోతే పూర్తిగా పిచ్చివారి వలె అయిపోతారు, అపారమైన దుఃఖముంది. షావుకారులుగా ఉంటే సుఖంగా ఉన్నారని కాదు. అనేక రకాల రోగాలు ఉంటూ ఉంటాయి. మళ్ళీ హాస్పిటల్ లో పడి ఉంటారు. పేదవారు జనరల్ వార్డులో పడి ఉంటారు, షావుకార్లకు వేరుగా స్పెషల్ రూమ్ లభిస్తుంది. కానీ దుఃఖమైతే షావుకారులకు ఎలా ఉంటుందో, పేదవారికీ అలాగే ఉంటుంది. కేవలం వారికి మంచి స్థానం లభిస్తుంది. సంభాళన బాగా జరుగుతుంది, అంతే. ఇప్పుడు మనల్ని తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి అనేక సార్లు చదివించారు. మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి - మేము చదువుతున్నామా లేదా? ఎంతమందిని చదివిస్తున్నాము? ఒకవేళ చదివించకపోతే ఏ పదవి లభిస్తుంది! ప్రతి రోజు రాత్రి మీ చార్టును చూసుకోండి - ఈ రోజు ఎవరికీ దుఃఖమైతే ఇవ్వలేదు కదా? ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకండి మరియు అందరికీ మార్గాన్ని చూపించండి అని శ్రీమతం చెప్తుంది. ఎవరైతే మన వంశానికి చెందినవారు ఉంటారో వారికి వెంటనే టచ్ అవుతుంది. ఇందులో బంగారు పాత్ర కావాలి, అందులోనే అమృతము నిలుస్తుంది. పులి పాలు కొరకు బంగారు పాత్ర కావాలని అంటారు ఎందుకంటే ఆ పాలు చాలా గొప్ప శక్తి కలిగినది. తనకు తన పిల్లలపై మోహం ఉంటుంది. ఎవరినైనా చూస్తే వెంటనే ఎదుర్కుంటుంది, పిల్లలను చంపేస్తారేమోనని భావిస్తుంది. అలాగే తమ పతి పట్ల, పిల్లల పట్ల మోహము కలిగినవారు ఇక్కడ కూడా ఎంతోమంది ఉన్నారు. స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. కృష్ణుని చిత్రంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఈ యుద్ధం తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. అక్కడ చాలా కొద్దిమంది మనుష్యులు ఉంటారు. మిగిలినవారంతా ముక్తిధామానికి వెళ్ళిపోతారు. ఎన్నో శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఏయే పాప కర్మలైతే చేసారో, ఒక్కొక్క జన్మవి సాక్షాత్కారం చేయిస్తారు, శిక్షలను అనుభవిస్తూ ఉంటారు. తర్వాత చాలా చిన్న పదవిని పొందుతారు. స్మృతిలో ఉండని కారణంగా వికర్మలు వినాశనమవ్వవు.

కొంతమంది పిల్లలు మురళిని కూడా మిస్ చేస్తారు, చాలా మంది పిల్లలు ఇందులో నిర్లక్ష్యులుగా ఉంటారు. నేను చదవకపోతే ఏమవుతుంది! నేనైతే దాటేసాను అని వారు భావిస్తారు. మురళిని లెక్కచేయరు. ఇటువంటి దేహాభిమానులు ఎందరో ఉన్నారు, వారు తమను తామే నష్టపర్చుకుంటారు. ఇది బాబాకు తెలుసు, అందుకే ఇక్కడకు వచ్చినప్పుడు కూడా - చాలా మురళీలు చదవకపోయి ఉండవచ్చు, అందులో ఏమైనా మంచి పాయింట్లు ఉండవచ్చు అని నేను అంటాను. పాయింట్లు అయితే ప్రతిరోజూ వెలువడుతాయి కదా. ఇటువంటివారు కూడా ఎంతోమంది సెంటర్లకు వస్తారు. కానీ వారికి ధారణ ఏమీ లేదు, జ్ఞానమూ లేదు. శ్రీమతంపై నడవకపోతే పదవి ఏమైనా లభిస్తుందా. సత్యమైన తండ్రిని, సత్యమైన టీచర్ ను నిందింపజేసేవారికి ఉన్నత పదవి ఎప్పుడూ లభించదు. కానీ అందరూ అయితే రాజులుగా అవ్వరు. ప్రజలు కూడా తయారవుతారు. పదవులు నంబరువారుగా ఉంటాయి కదా. మొత్తం ఆధారమంతా స్మృతిపైనే ఉంది, ఏ తండ్రి నుండైతే విశ్వ రాజ్యము లభిస్తుందో, వారిని స్మృతి చేయలేరా. భాగ్యంలోనే లేకపోతే ఇక పురుషార్థం కూడా ఏం చేస్తారు. స్మృతియాత్ర ద్వారానే పాపాలు భస్మమవుతాయని తండ్రి అంటారు, మరి పురుషార్థం చేయాలి కదా. ఆహార-పానీయాలు తీసుకోకండి అనైతే బాబా చెప్పరు కదా. ఇదేమీ హఠయోగము కాదు. నడుస్తూ-తిరుగుతూ అన్ని పనులూ చేస్తూ, ఏ విధంగా ప్రేయసి ప్రియుడిని స్మృతి చేస్తుందో, అలా స్మృతిలో ఉండండి. వారికి నామరూపాలతో కూడిన ప్రేమ ఉంటుంది. ఈ లక్ష్మీ-నారాయణులు విశ్వాధిపతులుగా ఎలా అయ్యారు? ఇది ఎవరికీ తెలియదు. ఇది నిన్నటి విషయమేనని మీరు అంటారు. వీరు రాజ్యము చేసేవారు, మనుష్యులైతే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. మాయ మనుష్యులను పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా చేసేసింది. ఇప్పుడు మీరు రాతిబుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా అవుతారు. పారసనాథుని మందిరం కూడా ఉంది. కానీ వారు ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. మనుష్యులు పూర్తిగా ఘోరమైన అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు తండ్రి ఎన్ని మంచి-మంచి విషయాలను అర్థం చేయిస్తారు. ఇక ప్రతి ఒక్కరి బుద్ధిపై ఆధారపడి ఉంది. చదివించేవారైతే ఒక్కరే, చదువుకునేవారు లెక్కలేనంతమంది అవుతూ ఉంటారు. వీధి-వీధిలోనూ మీ స్కూలు ఉంటుంది. గేట్ వే టు హెవెన్. తాము నరకంలో ఉన్నామని భావించే మనుష్యులు ఒక్కరు కూడా లేరు. అందరూ పూజారులేనని తండ్రి అర్థం చేయిస్తారు. పూజ్యులు సత్యయుగంలోనే ఉంటారు. పూజారులు కలియుగంలో ఉంటారు. మనుష్యులు ఏమని భావిస్తారంటే - భగవంతుడే పూజ్యునిగా, భగవంతుడే పూజారిగా అవుతారు, మీరే భగవంతుడు, మీరే ఆటనంతా రచిస్తారు, మీరూ భగవంతుడు, నేనూ భగవంతుడను అని, అసలేమీ అర్థం చేసుకోరు, ఇది ఉన్నదే రావణ రాజ్యము. మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా అవుతారు. పిల్లలకు చాలా నషా ఉండాలి. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పుణ్యాత్మగా అవుతారు అని మాత్రమే తండ్రి అంటారు.

తండ్రి పిల్లలకు పుణ్య ఆత్మగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తారు - పిల్లలూ, ఇప్పుడిది పాత ప్రపంచం యొక్క అంతిమము. ఇప్పుడు నేను డైరెక్టుగా వచ్చాను, ఇది చివరి సమయం యొక్క దానము, పూర్తిగా సరెండర్ అయిపోండి. బాబా, ఇదంతా మీదే. తండ్రి ఇచ్చేందుకే అలా చేయిస్తారు. వీరి భవిష్యత్తు ఎంతో కొంత తయారవ్వాలి అని చేయిస్తారు. మనుష్యులు ఈశ్వరార్థము దానపుణ్యాలు చేస్తారు, అది ఇన్ డైరెక్టు. దాని ఫలము మరుసటి జన్మలో లభిస్తుంది. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఇప్పుడు నేను డైరెక్టుగా ఉన్నాను. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తారో, దానికి ప్రతిఫలముగా పదమాల రెట్లు లభిస్తుంది. సత్యయుగంలో దాన-పుణ్యాల విషయమేమీ ఉండదు. ఇక్కడ ఎవరి వద్దనైనా ధనం ఉంటే, బాబా అంటారు - అచ్ఛా, మీరు వెళ్ళి సెంటర్లు తెరవండి. ప్రదర్శనీలు తయారుచేయండి. ఎవరైనా పేదవారు ఉంటే, అచ్ఛా, మీ ఇంట్లోనే కేవలం ‘గేట్ వే టు హెవెన్’ అన్న బోర్డును పెట్టండి. స్వర్గము మరియు నరకము ఉన్నాయి కదా. ఇప్పుడు మనం నరకవాసులము, ఇది కూడా ఎవరూ అర్థం చేసుకోరు. ఒకవేళ వారు స్వర్గస్థులైతే, మళ్ళీ వారిని నరకంలోకి ఎందుకు పిలుస్తారు. స్వర్గంలో ఎవరైనా స్వర్గస్థులయ్యారు అని అంటారా. వారు ఉన్నదే స్వర్గములో. పునర్జన్మలు స్వర్గంలోనే లభిస్తాయి. ఇక్కడ పునర్జన్మలు నరకంలోనే లభిస్తాయి. ఈ విషయాలు కూడా మీరు అర్థం చేయించవచ్చు. భగవానువాచ - నన్నొక్కరినే స్మృతి చేయండి, ఎందుకంటే వారే పతితపావనుడు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతారు. స్వర్గంలో అందరూ అయితే సుఖముగా ఉంటారు కానీ పదవులు నంబరువారుగా ఉంటాయి. ఇది చాలా పెద్ద గమ్యము. కుమారీలకు సేవ చేయాలనే ఉత్సాహము చాలా కలగాలి. మేము భారత్ ను స్వర్గంగా తయారుచేసి చూపిస్తాము. కుమారీలు అనగా 21 కులాలను ఉద్ధరించేవారు అనగా వారు 21 జన్మల ఉద్ధరణను చేయగలుగుతారు. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇది పాత ప్రపంచము యొక్క అంతిమము, తండ్రి డైరెక్టుగా వచ్చారు కావున సరెండర్ అవ్వాలి - బాబా, ఇదంతా మీదే... ఈ యుక్తి ద్వారా పుణ్యాత్మగా అవుతారు.

2. మురళీని ఎప్పుడూ మిస్ చేయకూడదు, మురళి విషయంలో నిర్లక్ష్యులుగా ఉండకూడదు. నేను చదవకపోతే ఏమవుతుంది, నేనైతే దాటివేసాను అని కాదు. అలా కాదు. ఇది దేహాభిమానము. మురళి తప్పకుండా చదవాలి.

వరదానము:-
స్వయాన్ని మలచుకొని సత్యమైన బంగారముగా అయి ప్రతి కార్యములోనూ సఫలతను పొందేటువంటి స్వ పరివర్తక భవ

ఎవరైతే ప్రతి పరిస్థితిలోనూ స్వయాన్ని పరివర్తన చేసుకుని స్వ పరివర్తకులుగా అవుతారో, వారు సదా సఫలతను పొంది ఉంటారు. అందుకే స్వయాన్ని మార్చుకోవాలి అన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. ఇతరులు మారితే నేను మారుతాను అని కాదు. ఇతరులు మారినా, మారకపోయినా నేను మారాలి. నేను అర్జునుడిలా అవ్వాలి. సదా పరివర్తన చేసుకోవడములో మొదట నేను. ఎవరైతే ఇందులో మొదట నేను అని అంటారో, వారే మొదటి నంబరును తీసుకుంటారు ఎందుకంటే స్వయాన్ని మలచుకునేవారే సత్యమైన బంగారముగా అవుతారు. సత్యమైన బంగారానికే విలువ ఉంటుంది.

స్లోగన్:-
మీ శ్రేష్ఠ జీవితం యొక్క ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయండి.

అవ్యక్త సూచనలు - ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి

తండ్రి సమానంగా అవ్వాలన్నా లేక తండ్రికి సమీపంగా వెళ్ళాలన్నా అపవిత్రత అనగా కామము మహాశత్రువు స్వప్నములో కూడా దాడి చెయ్యకూడదు. సదా సోదర భావము యొక్క స్మృతి సహజంగా మరియు స్వతహాగా స్వరూపములో ఉండాలి. ఆత్మ యొక్క అసలైన గుణ స్వరూపము మరియు శక్తి స్వరూప స్థితి నుండి కిందకు రాకండి.