ఓంశాంతి
ఈ విధంగా కల్ప-కల్పము పిల్లలకు చెప్పడం జరుగుతుంది మరియు పిల్లలకు తెలుసు, త్వరగా
సత్యయుగము వస్తే ఇక ఈ దుఃఖము నుండి విముక్తులవుతాము అని మనసుకు అనిపిస్తుంది. కానీ
డ్రామా చాలా మెల్ల-మెల్లగా నడుస్తుంది. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని తండ్రి
ఓర్పును ఇస్తారు. ప్రపంచము మారనున్నది అని గొప్ప-గొప్ప వ్యక్తుల నుండి కూడా
శబ్దాన్ని వింటూ ఉంటారు. పోప్ వంటి గొప్ప-గొప్పవారు ఎవరైతే ఉన్నారో, వారు కూడా -
ప్రపంచము మారనున్నది అని అంటారు. అచ్ఛా, మరి శాంతి ఎలా ఏర్పడుతుంది? ఈ సమయములో అందరూ
ఉప్పునీరు వలె ఉన్నారు. ఇప్పుడు మనము క్షీరఖండము వలె అవుతున్నాము. అటువైపు ఉన్నవారు
రోజు-రోజుకూ ఉప్పునీరు వలె అవుతూ ఉంటారు. పరస్పరం కొట్లాడుకుంటూ-గొడవపడుతూ
సమాప్తమవ్వనున్నారు, అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ డ్రామా చక్రము ఇప్పుడు
పూర్తవుతుంది. పాత ప్రపంచము పూర్తవుతుంది. కొత్త ప్రపంచము యొక్క స్థాపన జరుగుతుంది.
కొత్త ప్రపంచము పాతదిగా, పాత ప్రపంచము కొత్తదిగా మళ్ళీ అవుతుంది. దీనిని ప్రపంచము
యొక్క చక్రము అని అంటారు, ఇది తిరుగుతూనే ఉంటుంది. అంతేకానీ లక్షల సంవత్సరాల తర్వాత
పాత ప్రపంచము కొత్తదిగా అవుతుందని కాదు. అలా కాదు. పిల్లలైన మీరు మంచి రీతిలో
తెలుసుకున్నారు, భక్తి పూర్తిగా వేరు. భక్తి యొక్క కనెక్షన్ రావణుడితో ఉంది. జ్ఞానము
యొక్క కనెక్షన్ రాముడితో ఉంది. ఈ విషయాలను మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు.
ఇప్పుడు తండ్రిని - ఓ పతిత-పావనా రండి, మీరు వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయండి
అని పిలుస్తారు కూడా. కొత్త ప్రపంచములో తప్పకుండా సుఖము ఉంటుంది. ఇప్పుడు పిల్లలు,
చిన్నవారు మరియు పెద్దవారు అందరూ తెలుసుకున్నారు - ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. ఈ
నాటకం పూర్తవుతుంది. మనము మళ్ళీ సత్యయుగములోకి వెళ్తాము, మళ్ళీ 84 జన్మల చక్రాన్ని
తిరగాలి. ఆత్మకు స్వ దర్శనము అనగా సృష్టి చక్రము యొక్క దర్శనము జరుగుతుంది అనగా
ఆత్మకు జ్ఞానపు మూడవ నేత్రము లభిస్తుంది, వారిని త్రినేత్రులు అని అంటారు. ఇప్పుడు
మీరు త్రినేత్రులు మరియు మిగిలిన మనుష్యులందరికీ ఈ స్థూలమైన నేత్రాలు ఉన్నాయి.
జ్ఞానమనే నేత్రము ఎవరికీ లేదు. త్రినేత్రులుగా అయినప్పుడే త్రికాలదర్శులుగా అవుతారు
ఎందుకంటే ఆత్మకు జ్ఞానము లభిస్తుంది కదా. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి
తీసుకుంటుంది. సంస్కారాలు ఆత్మలో ఉంటాయి. ఆత్మ అవినాశీ. ఇప్పుడు తండ్రి అంటారు -
నామ-రూపాలకు అతీతముగా అవ్వండి. స్వయాన్ని అశరీరులుగా భావించండి. దేహముగా భావించకండి.
మనము అర్ధకల్పం నుండి పరమాత్మను స్మృతి చేస్తూ వచ్చామని కూడా మీకు తెలుసు. ఇందులో
ఎప్పుడైతే ఎక్కువ దుఃఖం కలుగుతుందో, అప్పుడు ఎక్కువగా స్మృతి చేస్తారు, ఇప్పుడు ఎంత
దుఃఖము ఉంది. ఇంతకుముందు ఇంత దుఃఖం లేదు. ఎప్పటి నుండైతే బయటివారు వచ్చారో, అప్పటి
నుండే ఈ రాజులు కూడా పరస్పరము గొడవపడడం మొదలుపెట్టారు. వేరు అయిపోయారు. సత్యయుగములో
ఒకే రాజ్యము ఉండేది.
ఇప్పుడు మనము సత్యయుగము నుండి మొదలుకొని కలియుగ అంతిమము వరకు ఉన్న
చరిత్ర-భౌగోళికాల గురించి అర్థం చేసుకుంటున్నాము. సత్య-త్రేతాయుగాలలో ఒకే రాజ్యము
ఉండేది. ఈ విధంగా ఒకే వంశము ఎవరికీ ఉండదు. క్రిస్టియన్లలో కూడా చూడండి
విభజించబడ్డారు, అక్కడైతే మొత్తం విశ్వమంతా ఒక్కరి చేతిలో ఉంటుంది. ఆ విధంగా కేవలం
సత్య-త్రేతాయుగాలలోనే ఉంటుంది. ఈ అనంతమైన చరిత్ర-భౌగోళికము ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది.
ఇంకే సత్సంగాలలో చరిత్ర-భౌగోళికము అన్న పదాలను వినరు. అక్కడ రామాయణము, మహాభారతము
మొదలైనవే వింటారు. ఇక్కడ ఆ విషయాలు లేవు. ఇక్కడ ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికాలు
ఉంటాయి. మన తండ్రి ఉన్నతోన్నతమైనవారని మీ బుద్ధిలో ఉంది. ఈ మొత్తం జ్ఞానమంతటినీ
వినిపించిన తండ్రికి కృతజ్ఞతలు. ఒకటేమో ఆత్మల వృక్షము, ఇంకొకటి మనుష్యుల వృక్షము.
మనుష్యుల వృక్షములో పైన ఎవరున్నారు? గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని బ్రహ్మానే
అంటారు. బ్రహ్మా ముఖ్యమైనవారు అనైతే తెలుసు కానీ బ్రహ్మా వెనుక ఉన్న
చరిత్ర-భౌగోళికము ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. ఉన్నతోన్నతుడైన తండ్రి ఉండేది
పరంధామములో అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. అంతేకాక సూక్ష్మవతనము గురించి కూడా మీకు
తెలుసు. మనుష్యులే ఫరిశ్తాలుగా అవుతారు, అందుకే సూక్ష్మ వతనాన్ని చూపించారు.
ఆత్మలైన మీరు వెళ్తారు, శరీరాలైతే సూక్ష్మవతనములోకి వెళ్ళవు. ఎలా వెళ్తారు, దానినే
మూడవ నేత్రము, దివ్యదృష్టి లేక ధ్యానము అని కూడా అంటారు. మీరు ధ్యానములో
బ్రహ్మా-విష్ణు-శంకరులను చూస్తారు. శంకరుడు కళ్ళు తెరవడంతో వినాశనం జరుగుతుందని
మనుష్యులు చూపిస్తారు. ఇప్పుడు దీని ద్వారానైతే ఎవరూ అర్థం చేసుకోలేరు. వినాశనమైతే
డ్రామానుసారముగా జరగాల్సిందేనని ఇప్పుడు మీకు తెలుసు. పరస్పరం కొట్లాడుకొని
వినాశనమైపోతారు. మరి శంకరుడు ఏం చేస్తారు! డ్రామా అనుసారంగా పేరును పెట్టారు. కావున
అర్థం చేయించవలసి ఉంటుంది. బ్రహ్మా-విష్ణు-శంకరులు ముగ్గురు ఉన్నారు. స్థాపన కొరకు
బ్రహ్మాను చూపించారు, పాలన కొరకు విష్ణువును, వినాశనము కొరకు శంకరుడిని చూపించారు.
వాస్తవానికి ఇది తయారై తయారుచేయబడిన డ్రామా. శంకరుడికి పాత్ర ఏమీ లేదు. బ్రహ్మా
మరియు విష్ణువు పాత్ర మొత్తం కల్పమంతా ఉంది. బ్రహ్మాయే విష్ణువు, విష్ణువే బ్రహ్మా.
బ్రహ్మాకు 84 జన్మలు పూర్తి అయితే విష్ణువుకు కూడా పూర్తి అయినట్లే. శంకరుడైతే
జనన-మరణాలకు అతీతుడు, అందుకే శివుడిని మరియు శంకరుడిని కలిపేసారు. వాస్తవానికి
శివుని పాత్ర ఎంతో ఉంది, వారు చదివిస్తారు.
భగవంతుడిని నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. ఒకవేళ వారు ప్రేరణతో కార్యము చేసినట్లయితే
సృష్టి చక్రము యొక్క జ్ఞానాన్ని ఎలా ఇస్తారు! అందుకే తండ్రి అర్థం చేయిస్తారు -
పిల్లలూ, ప్రేరణ యొక్క విషయమేమీ లేదు. తండ్రికైతే రావలసి ఉంటుంది. తండ్రి అంటారు -
పిల్లలు, నాలో సృష్టి చక్రము యొక్క జ్ఞానము ఉంది. నాకు ఈ పాత్ర లభించి ఉంది అందుకే
నన్నే జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. జ్ఞానము అని దేనిని అంటారో, అది
లభించినప్పుడే తెలుస్తుంది. లభించనే లభించకపోతే దాని అర్థము ఎలా తెలుస్తుంది.
ఇంతకుముందు మీరు కూడా ఈ విధంగా అనేవారు - ఈశ్వరుడు ప్రేరణను ఇస్తారు. వారికి అన్నీ
తెలుసు. మనము ఏ పాపాలు చేస్తామో, వాటిని ఈశ్వరుడు చూస్తారు అని. బాబా అంటారు - ఈ
వ్యాపారము నేను చేయను. ఎవరు ఎలాంటి కర్మలు చేస్తే, దాని అనుసారంగా వారు స్వయమే
శిక్షలను అనుభవిస్తారు, నేను ఎవరికీ ఇవ్వను. అలాగే ప్రేరణ ద్వారా కూడా శిక్షలను
ఇవ్వను. నేను ప్రేరణ ద్వారా చేసినట్లయితే నేను శిక్షించినట్లు అవుతుంది. వీరిని
హతమార్చండి అని ఎవరికైనా చెప్పడం కూడా దోషమే అవుతుంది. అలా చెప్పేవారు కూడా
చిక్కుకుపోతారు. శంకరుడు ప్రేరణను ఇస్తే, వారు కూడా చిక్కుకుపోతారు. తండ్రి అంటారు
- నేను పిల్లలైన మీకు సుఖాన్ని ఇస్తాను. బాబా మీరు వచ్చి దుఃఖాలను హరించండి అని మీరు
నా మహిమను చేస్తారు. నేనేమైనా దుఃఖాన్ని ఇస్తానా.
ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి సమ్ముఖంలో కూర్చుని ఉన్నారు. మరి ఎంత సంతోషము
ఉండాలి! ఇక్కడ డైరెక్టుగా అనుభూతి కలుగుతుంది. బాబా మమ్మల్ని చదివిస్తారు. దీనిని
మేళా అని అంటారు. మీరు సెంటర్లకు వెళ్తారు, అక్కడ దానిని ఆత్మలు మరియు పరమాత్మ
యొక్క మేళా అని అనరు. ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళా ఇక్కడ జరుగుతుంది. మేళా
జరుగుతుంది అని కూడా మీకు తెలుసు. తండ్రి పిల్లల మధ్యకు వచ్చారు. ఆత్మలందరూ ఇక్కడ
ఉన్నారు. తండ్రి రావాలని ఆత్మనే స్మృతి చేస్తుంది. ఇది అన్నింటికన్నా మంచి మేళా.
తండ్రి వచ్చి ఆత్మలందరినీ రావణ రాజ్యము నుండి విడిపిస్తారు. ఇది మంచి మేళా కదా, దీని
ద్వారా మనుష్యులు పారసబుద్ధి కలవారిగా అవుతారు. ఆ మేళాలలోనైతే మనుష్యులు మురికిగా
అయిపోతారు. డబ్బులు వృధా చేస్తూ ఉంటారు, అసలేమీ లభించదు. దానిని మాయావీ, ఆసురీ మేళా
అని అంటారు. ఇది ఈశ్వరీయ మేళా. రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. మీరు కూడా ఆసురీ
మేళాలో ఉండేవారు. ఇప్పుడు ఈశ్వరీయ మేళాలో ఉన్నారు. బాబా వచ్చి ఉన్నారని మీకే తెలుసు.
ఈ విషయము అందరికీ తెలిస్తే ఎంత గుంపు ఏర్పడుతుందో తెలియదు. నివసించేందుకు ఇన్ని
ఇళ్ళు మొదలైనవి ఎక్కడి నుండి తీసుకువస్తారు! అహో ప్రభూ నీ లీల అని చివర్లో పాడుతారు
కదా. అది ఏ లీల? సృష్టిని పరివర్తన చేసే లీల. ఇది అన్నింటికన్నా పెద్ద లీల. పాత
ప్రపంచము సమాప్తయ్యే కన్నా ముందు కొత్త ప్రపంచము యొక్క స్థాపన జరుగుతుంది, అందుకే
ఎల్లప్పుడు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు మొదట స్థాపన, వినాశనము, ఆ తర్వాత పాలన అని
చెప్పాలి. ఎప్పుడైతే స్థాపన పూర్తవుతుందో, అప్పుడు మళ్ళీ వినాశనము ప్రారంభమవుతుంది,
ఆ తర్వాత పాలన జరుగుతుంది. కావున పిల్లలైన మీకు - మేము సర్వదర్శన చక్రధారి
బ్రాహ్మణులము అన్న ఈ సంతోషం ఉంటుంది. మళ్ళీ మనము చక్రవర్తి రాజులుగా అవుతాము. ఈ
దేవతల రాజ్యము ఎక్కడికి వెళ్ళింది అనేది ఎవరికీ తెలియదు. నామరూపాలు మాయమైపోయాయి.
దేవతకు బదులుగా తమను తాము హిందువులు అని పిలుచుకుంటారు. హిందుస్థాన్ లో ఉండేవారు
హిందువులు. లక్ష్మీ-నారాయణులను ఈ విధంగా ఎప్పుడూ అనరు. వారినైతే దేవతలు అని అంటారు.
కావున ఇప్పుడు ఈ మేళాలోకి డ్రామానుసారంగా మీరు వచ్చారు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది.
మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ ఉంటుంది. మీ పాత్ర ఏదైతే నడుస్తుందో, అది మళ్ళీ కల్పము
తర్వాత నడుస్తుంది. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ రావణ రాజ్యములో ఆసురీ పాలన
ఉంటుంది. ఇప్పుడు మీరు ఈశ్వరునికి పిల్లలుగా, తర్వాత దైవీ పిల్లలుగా ఆ తర్వాత
క్షత్రియులుగా అవుతారు. మీరు ఎవరైతే అపవిత్ర ప్రవృత్తి మార్గానికి చెందినవారిగా
అయ్యారో, మళ్ళీ మీరే పవిత్ర ప్రవృత్తి మార్గానికి చెందినవారిగా అవుతారు. ఆ మాటకొస్తే
వీరు కూడా దైవీ గుణాలు కల మనుష్యులే కదా. అంతేకానీ ఇన్ని భుజాలు మొదలైనవి చూపించారు,
విష్ణువు ఎవరు అనేది ఎవరూ తెలియజేయలేరు. మహాలక్ష్మిని కూడా పూజిస్తారు. జగదాంబ నుండి
ఎప్పుడూ ధనాన్ని యాచించరు. ధనము ఎక్కువగా లభిస్తే, లక్ష్మిని పూజించారు అందుకే వారు
భండారా నింపారు అని అంటారు. ఇక్కడైతే మీరు జగదాంబ నుండి పరమపిత పరమాత్మ శివుని
ద్వారా పొందుతున్నారు, ఇచ్చేవారు వారే. పిల్లలైన మీరు బాప్ దాదా కన్నా అదృష్టవంతులు.
చూడండి, జగదాంబకు ఎన్ని మేళాలు జరుగుతాయి, బ్రహ్మాకు అంతగా జరగవు. బ్రహ్మాను ఒకేచోట
కూర్చోబెట్టేసారు, అజ్మేర్ లో పెద్ద మందిరం ఉంది. దేవీల మందిరాలు ఎన్నో ఉన్నాయి
ఎందుకంటే ఈ సమయములో మీకు ఎంతో మహిమ ఉంది. మీరు భారత్ యొక్క సేవను చేస్తారు. పూజ కూడా
మీదే ఎక్కువగా జరుగుతుంది. మీరు అదృష్టవంతులు. జగదాంబ సర్వవ్యాపి అని వారి గురించి
ఎప్పుడూ ఇలా అనరు. మీ మహిమ జరుగుతూ ఉంటుంది. బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడా
సర్వవ్యాపి అని అనరు, కణ-కణములోనూ ఉన్నారు అని నన్నే అంటారు, ఎంతగా నిందిస్తారు.
మీ మహిమను నేను ఎంతగా పెంచుతాను. భారతమాతకు జై అని అంటారు కదా. భారతమాతలు మీరే
కదా. ధరణి కాదు. ధరణి మొదలైనవి ఏవైతే ఇప్పుడు తమోప్రధానముగా ఉన్నాయో, అవి
సత్యయుగములో సతోప్రధానముగా అవుతాయి అందుకే - దేవతల పాదాలు పతిత ప్రపంచములోకి రావు
అని అంటారు. ఎప్పుడైతే సతోప్రధాన ధరణి ఉంటుందో, అప్పుడు వస్తారు. ఇప్పుడు మీరు
సతోప్రధానులుగా అవ్వాలి. శ్రీమతంపై నడుస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే
ఉన్నత పదవిని పొందుతారు. ఇది గుర్తుంచుకోవాలి. స్మృతి చేసినట్లయితే వికర్మలు
వినాశనమవుతాయి. శ్రీమతము లభిస్తూ ఉంటుంది. సత్యయుగములో మీ ఆత్మ పవిత్రముగా బంగారముగా
అవుతుంది కావున శరీరము కూడా బంగారముదే లభిస్తుంది. బంగారములో మాలిన్యము
చేరుకున్నప్పుడు నగ కూడా అటువంటిదే తయారవుతుంది. ఆత్మ అసత్యమైనదైతే, శరీరము కూడా
అసత్యమైనదే. మాలిన్యము చేరుకోవడం వలన బంగారము యొక్క విలువ తగ్గిపోతుంది. ఇప్పుడు
మీకు ఎటువంటి విలువ లేదు. మొదట మీరు విశ్వానికి యజమానులుగా, 24 క్యారెట్లుగా
ఉండేవారు. ఇప్పుడు 9 క్యారెట్లు అని అంటారు. ఈ విధంగా తండ్రి పిల్లలతో ఆత్మిక
సంభాషణ చేస్తారు. వారు కూర్చొని పిల్లలను ఆహ్లాదపరుస్తారు, అవి మీరు వింటూ-వింటూ
మారిపోతారు. మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు. అక్కడ వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉంటాయి,
స్వర్గమంటే ఏమనుకున్నారు! అక్కడి శూభీరసము మొదలైనవి కూడా మీరు త్రాగి వస్తారు.
అక్కడి ఫలాలు కూడా ఎంత పెద్ద-పెద్దగా ఉంటాయి. ఇక్కడ అవి లభించవు. సూక్ష్మ
వతనములోనైతే ఏమీ లేవు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా వెళ్తారు. ఇది ఆత్మ మరియు
పరమాత్మల మేళా, దీని ద్వారా మీరు ఉజ్వలంగా అవుతారు.
పిల్లలైన మీరు ఇక్కడకు వచ్చినప్పుడు ఫ్రీగా ఉంటారు, ఇళ్ళూ-వాకిళ్ళూ, వ్యాపార
వ్యవహారాలు మొదలైనవాటి చింత ఏమీ ఉండదు. కావున ఇక్కడ మీకు స్మృతి యాత్రలో ఉండేందుకు
మంచి అవకాశం ఉంది. అక్కడైతే ఇళ్ళూ-వాకిళ్ళూ మొదలైనవి గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక్కడ
అవేమీ లేవు. రాత్రి వేళ 2 గంటలకు లేచి ఇక్కడ కూర్చోండి. సెంటర్లకైతే రాత్రి వేళ మీరు
వెళ్ళలేరు. ఇక్కడైతే ఇది సహజము. శివబాబా స్మృతిలో వచ్చి కూర్చోండి, ఇంకెవ్వరూ
గుర్తుకు రాకూడదు. ఇక్కడ మీకు సహాయము కూడా లభిస్తుంది. త్వరగా పడుకోండి మరియు త్వరగా
లేవండి. 3 నుండి 5 గంటల వరకు వచ్చి కూర్చోండి. బాబా కూడా వస్తారు, పిల్లలు
సంతోషిస్తారు. బాబా యోగమును నేర్పించేవారు. వీరు కూడా నేర్చుకునేవారే, కావున బాప్
మరియు దాదా ఇరువురూ వస్తారు, అప్పుడు ఇక్కడ యోగములో కూర్చోవడానికి మరియు అక్కడ
కూర్చోవడానికి మధ్యన ఉన్న తేడా కూడా తెలుస్తుంది. ఇక్కడ ఏమీ గుర్తుకు రావు, ఇందులో
ఎంతో లాభం ఉంది. బాబా సలహా ఇస్తారు - ఇది చాలా బాగా జరగగలదు. ఇప్పుడు చూద్దాము
పిల్లలు లేవగలరా? కొంతమందికి ఉదయమే లేచే అభ్యాసము ఉంది. మీది 5 వికారాలతో సన్యాసము
మరియు మొత్తం పాత ప్రపంచము పట్ల వైరాగ్యము ఉంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.