ఓంశాంతి
మధురాతి-మధురమైన స్వీట్ చిల్డ్రన్, మధురాతి-మధురమైన చాలా కాలం దూరమై తర్వాత కలిసిన
పిల్లలు పాటను విన్నారు. అర్ధకల్పం ఏ ప్రియుడినైతే స్మృతి చేసామో, చివరికి వారు
లభించారని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనం అర్ధకల్పం భక్తి చేస్తామని, ప్రియుడైన
తండ్రిని పిలుస్తామని ప్రపంచంలోని వారికి తెలియదు. మనము ప్రేయసులము, వారు ప్రియుడు
- ఇది కూడా ఎవరికీ తెలియదు. తండ్రి అంటారు - రావణుడు మిమ్మల్ని పూర్తిగా తుచ్ఛబుద్ధి
కలవారిగా చేసాడు. అందులోనూ విశేషంగా భారతవాసులను. మీరు దేవీ-దేవతలుగా ఉండేవారు
అన్నది కూడా మర్చిపోయారు అంటే తుచ్ఛబుద్ధి కలవారిగా అయినట్లు. తమ ధర్మాన్ని
మర్చిపోవడమనేది తుచ్ఛబుద్ధి కలవారి పనే. ఇప్పుడు ఇది కేవలం మీకు మాత్రమే తెలుసు.
భారతవాసులమైన మనం స్వర్గవాసులుగా ఉండేవారము. ఈ భారత్ స్వర్గంగా ఉండేది. ఇది జరిగి
కొంతకాలమే అయ్యింది. 1250 సంవత్సరాలు సత్యయుగం ఉండేది మరియు 1250 సంవత్సరాలు
రామరాజ్యం కొనసాగింది. ఆ సమయంలో అపారమైన సుఖం ఉండేది. సుఖాన్ని తలచుకున్నప్పుడు
రోమాలు నిక్కబొడుచుకోవాలి. సత్య, త్రేతాయుగాలు... గతించిపోయాయి. సత్యయుగ ఆయువు ఎంత
ఉండేదో కూడా ఎవరికీ తెలియదు. అది లక్షల సంవత్సరాలు ఎలా ఉండగలదు. మిమ్మల్ని మాయ ఎంతగా
తుచ్ఛబుద్ధి కలవారిగా చేసేసింది అని ఇప్పుడు తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు.
ప్రపంచంలో ఎవరూ తమను తుచ్ఛబుద్ధి కలవారిగా భావించరు. మీకు తెలుసు - నిన్న మనం
తుచ్ఛబుద్ధి కలవారిగా ఉండేవారము. ఇప్పుడు బాబా మనకు ఎంతటి బుద్ధిని ఇచ్చారంటే, దాని
ద్వారా రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి తెలుసుకున్నాము. నిన్న తెలియదు, ఈ
రోజు తెలుసుకున్నాము. ఎంతెంతగా తెలుసుకుంటూ ఉంటారో, అంతంతగా సంతోషంలో రోమాలు
నిక్కబొడుచుకుంటాయి. మనం మళ్ళీ మన స్థానానికి చేరుకుంటాము. తప్పకుండా తండ్రి మనకు
స్వర్గ రాజ్యాన్ని ఇచ్చారు, మళ్ళీ మనం పోగొట్టుకున్నాము. ఇప్పుడు పతితులుగా
అయిపోయాము. సత్యయుగాన్ని పతితము అని అనరు. అది పావన ప్రపంచము. ఓ పతితపావనా రండి అని
మనుష్యులు పిలుస్తారు. రావణ రాజ్యంలో పావనులు, ఉన్నతమైనవారు ఎవరూ ఉండరు.
ఉన్నతోన్నతుడైన తండ్రికి పిల్లలుగా అయ్యారంటే మీరు ఉన్నతంగా అయినట్లు. పిల్లలైన మీరు
తండ్రిని తెలుసుకున్నారు, అది కూడా నంబరువారు పురుషార్థం అనుసారంగా తెలుసుకున్నారు.
ఉదయమే లేచి మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి, అమృతవేళ సమయం మంచిది. ఉదయమే అమృతవేళలో
కూర్చొని ఈ ఆలోచన చేయండి. బాబా మనకు తండ్రి కూడా, టీచర్ కూడా. ఓ గాడ్ ఫాదర్, ఓ
పరమపిత పరమాత్మా అనైతే అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - ఓ భగవంతుడా అని
ఎవరినైతే తలచుకుంటామో, ఇప్పుడు వారు మనకు లభించారు. మనం మళ్ళీ అనంతమైన వారసత్వాన్ని
తీసుకుంటున్నాము. వారు లౌకిక తండ్రి, వీరు అనంతమైన తండ్రి. మీ లౌకిక తండ్రి కూడా ఆ
అనంతమైన తండ్రినే స్మృతి చేస్తారు. కావున వారు తండ్రులకే తండ్రి, పతులకే పతి. ఇలా
కూడా భారతవాసులే అంటారు ఎందుకంటే ఇప్పుడు నేను తండ్రులకే తండ్రిగా, పతులకే పతిగా
అవుతాను. ఇప్పుడు నేను మీకు తండ్రిని కూడా. మీరు పిల్లలుగా అయ్యారు. బాబా, బాబా అంటూ
ఉంటారు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని విష్ణుపురిలోకి, అత్తవారింటికి తీసుకువెళ్తాను. ఇది
మీ తండ్రి ఇల్లు, తర్వాత అత్తవారింటికి వెళ్తారు. మనల్ని చాలా బాగా అలంకరించడం
జరుగుతుంది అని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మీరు అత్తవారింట్లో ఉన్నారు కదా. మిమ్మల్ని
చదివించడం కూడా జరుగుతుంది. మీరు ఈ జ్ఞానం ద్వారా అలంకరించబడి విశ్వ
మహారాజు-మహారాణులుగా అవుతారు. విశ్వానికి యజమానులుగా అయ్యేందుకే మీరు ఇక్కడకు
వచ్చారు. సత్యయుగం ఉన్నప్పుడు భారతవాసులైన మీరే విశ్వానికి యజమానులుగా ఉండేవారు.
మేము విశ్వానికి యజమానులము అని ఇప్పుడు మీరు అనలేరు. ఇప్పుడు మీకు తెలుసు - భారత్
యొక్క యజమానులు కలియుగానికి చెందినవారు, మనమైతే సంగమయుగవాసులము. మళ్ళీ మనం
సత్యయుగంలో మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతాము. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలోకి
రావాలి. విశ్వరాజ్యాధికారాన్ని ఇచ్చేవారు వచ్చారని మీకు తెలుసు. ఇప్పుడు సంగమయుగంలో
వారు వచ్చారు. జ్ఞానదాత తండ్రి ఒక్కరే. తండ్రిని తప్ప ఇంకే మనుష్యమాత్రులను
జ్ఞానదాత అని అనరు ఎందుకంటే తండ్రి వద్ద ఎటువంటి జ్ఞానం ఉందంటే, దాని ద్వారా మొత్తం
విశ్వము యొక్క సద్గతి జరుగుతుంది. తత్వాల సహితంగా అన్నింటి సద్గతి జరుగుతుంది.
మనుష్యుల వద్ద సద్గతి జ్ఞానము లేదు.
ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా తత్వాల సహితంగా తమోప్రధానంగా ఉంది. ఇందులో ఉండేవారు
కూడా తమోప్రధానంగా ఉన్నారు. కొత్త ప్రపంచము సత్యయుగము. అందులో ఉండేవారు కూడా దేవతలే,
మళ్ళీ రావణుడు విజయాన్ని పొందాడు. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి ఉన్నారు. పిల్లలైన
మీరు అంటారు - మేము బాప్ దాదా వద్దకు వెళ్తాము. బాబా మాకు దాదా ద్వారా స్వర్గ
రాజ్యాధికారపు వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి అయితే స్వర్గ రాజ్యాధికారాన్నే ఇస్తారు,
ఇంకేమిస్తారు. పిల్లలైన మీ బుద్ధిలోకి ఈ విషయమైతే రావాలి కదా. కానీ మాయ
మరపింపజేస్తుంది. సంతోషాన్ని స్థిరంగా ఉండనివ్వదు. ఎవరైతే మంచి రీతిలో
చదువుతారో-చదివిస్తారో, వారే ఉన్నత పదవిని పొందుతారు. క్షణంలో జీవన్ముక్తి అని కూడా
అంటూ ఉంటారు. ఒకేసారి గుర్తించాలి కదా. ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే, ఆ ఆత్మలందరి
తండ్రి వచ్చి ఉన్నారు. కానీ అందరూ వారిని కలుసుకోలేరు. అది అసంభవము. తండ్రి అయితే
చదివించేందుకు వస్తారు. మీరందరూ కూడా టీచర్లే. గీతా పాఠశాల అని అంటారు కదా. ఈ పదము
కూడా సామాన్యమైనదే. కృష్ణుడు గీతను వినిపించారని అంటారు. ఇప్పుడు ఇది కృష్ణుని
పాఠశాల అయితే కాదు. కృష్ణుని ఆత్మ చదువుకుంటుంది. సత్యయుగంలో ఎవరైనా గీతా పాఠశాలలలో
చదువుకోవడము, చదివించడము జరుగుతుందా? కృష్ణుడు సత్యయుగంలోనే ఉంటారు, తర్వాత 84
జన్మలు తీసుకుంటారు. ఒక శరీరము ఇంకొక శరీరంతో కలవదు. డ్రామా ప్లాన్ అనుసారంగా ప్రతి
ఆత్మలోనూ తమ 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఒక క్షణం ఇంకొక క్షణంతో కలవదు. 5 వేల
సంవత్సరాలు మీరు పాత్రను అభినయిస్తారు. ఒక్క క్షణంలోని పాత్ర మరుసటి క్షణంతో కలవదు.
ఇది ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయము. ఇది డ్రామా కదా. పాత్ర రిపీట్ అవుతూ ఉంటుంది.
మిగిలిన ఆ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. అర్ధకల్పం భక్తి కొనసాగుతుంది,
మళ్ళీ నేనే వచ్చి అందరికీ సద్గతిని ఇస్తాను. మీకు తెలుసు - 5 వేల సంవత్సరాల క్రితం
మనం రాజ్యం చేసేవారము, సద్గతిలో ఉండేవారము, అక్కడ దుఃఖము అన్న మాటే లేదు, ఇప్పుడైతే
దుఃఖమే దుఃఖము ఉంది. దీనిని దుఃఖధామము అని అంటారు. శాంతిధామము, సుఖధామము మరియు
దుఃఖధామము. నేను వచ్చి భారతవాసులకే సుఖధామము యొక్క మార్గాన్ని తెలియజేస్తాను.
కల్పకల్పమూ మళ్ళీ నేను రావలసి ఉంటుంది. అనేక సార్లు వచ్చాను, మళ్ళీ వస్తూనే ఉంటాను.
దీనికి అంతము లేదు. మీరు చక్రాన్ని తిరిగి దుఃఖధామంలోకి వస్తారు, అప్పుడు మళ్ళీ నేను
రావలసి వస్తుంది. ఇప్పుడు మీకు 84 జన్మల చక్రము యొక్క స్మృతి కలిగింది. ఇప్పుడు
తండ్రిని రచయిత అని అంటారు. డ్రామా యొక్క రచయిత ఎవరో ఉన్నారని కాదు. రచయిత అనగా ఈ
సమయంలో వచ్చి సత్యయుగాన్ని రచిస్తారు. సత్యయుగంలో ఎవరి రాజ్యమైతే ఉండేదో, మళ్ళీ
ఎవరైతే దానిని పోగొట్టుకున్నారో, వారికే కూర్చోబెట్టి చదివిస్తాను. పిల్లలను దత్తత
తీసుకుంటాను. మీరు నా పిల్లలు కదా. మిమ్మల్ని సాధు-సన్యాసులు ఎవరూ చదివించడం లేదు.
చదివించేవారు ఒక్క తండ్రియే. వారినే అందరూ తలచుకుంటారు. ఎవరినైతే తలచుకుంటారో వారు
తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు వస్తారు కదా. అసలు ఎందుకు స్మృతి చేస్తున్నారు అనేది
కూడా ఎవరికీ అర్థమవ్వడం లేదు. కావున తప్పకుండా పతిత-పావనుడైన తండ్రి వస్తారు.
క్రైస్టును - మళ్ళీ రండి అని అనరు. వారు లీనమైపోయారు అని భావిస్తారు. కావున మళ్ళీ
వచ్చే విషయమే లేదు. ఎంతైనా ఆ పతితపావనుడినే స్మృతి చేస్తారు. ఆత్మలైన మాకు మళ్ళీ
వారసత్వాన్ని ఇవ్వండి అని అంటారు. బాబా వచ్చి ఉన్నారని ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి
కలిగింది. వారు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. వారు (ఇతర ధర్మ స్థాపకులు) వారి
సమయానికి రజో, తమోలోనే వస్తారు. మనము మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా అవుతున్నామని ఇప్పుడు
పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు.
పిల్లలైన మిమ్మల్ని చదివించి విశ్వానికి యజమానులుగా తయారుచేసేవారు ఒక్క తండ్రియే.
వారు స్వయం ఆ విధంగా తయారవ్వరు అందుకే వారిని నిష్కామ సేవాధారి అని అంటారు. మేము
ఫలాన్ని ఆశించము, నిష్కామ సేవ చేస్తాము అని మనుష్యులు అంటారు. కానీ అలా జరగదు.
ఎటువంటి సంస్కారాలను తీసుకువెళ్తారో, దాని అనుసారంగా జన్మ లభిస్తుంది. కర్మలకు ఫలము
తప్పకుండా లభిస్తుంది. సన్యాసులు కూడా గృహస్థుల వద్ద పునర్జన్మలు తీసుకుని, మళ్ళీ
సంస్కారాల అనుసారంగా సన్యాస ధర్మంలోకి వెళ్ళిపోతారు. బాబా యుద్ధం చేసేవారి యొక్క
ఉదాహరణను కూడా ఇస్తారు. ఎవరైతే యుద్ధ మైదానంలో మరణిస్తారో, వారు స్వర్గంలోకి
వెళ్తారని గీతలో వ్రాయబడి ఉందని అంటారు, కానీ స్వర్గపు సమయం కూడా కావాలి కదా.
స్వర్గము లక్షల సంవత్సరాలని అనేస్తారు. తండ్రి ఏమి అర్థం చేయిస్తారు, గీతలో ఏమి
వ్రాసి ఉంది అన్నది ఇప్పుడు మీకు తెలుసు. నేను సర్వవ్యాపిని అని భగవానువాచ ఉందని
వారంటారు. తండ్రి అంటారు - ఈ విధంగా నేను సర్వవ్యాపిని అని, కుక్క-పిల్లి అన్నింటిలో
ఉన్నానని నన్ను నేను ఎలా నిందించుకుంటాను. నన్ను జ్ఞానసాగరుడు అని అంటారు. మరి నన్ను
నేను ఇలా ఎందుకు అంటాను? ఇది ఎంత అసత్యము. జ్ఞానమైతే ఎవరిలోనూ లేదు. సన్యాసులు
మొదలైనవారికి ఎంత గౌరవముంది, ఎందుకంటే వారు పవిత్రంగా ఉంటారు. సత్యయుగంలో గురువులు
ఎవరూ ఉండరు. ఇక్కడ స్త్రీకి - పతియే గురువు, ఈశ్వరుడు ఇంకే గురువునూ ఆశ్రయించకండి
అని అంటారు. అది కూడా ఎప్పుడైతే భక్తి సతోప్రధానముగా ఉండేదో, అప్పుడు అలా అర్థం
చేయించడం జరిగేది. సత్యయుగంలో గురువులు లేరు. భక్తి ప్రారంభంలో కూడా గురువులు ఉండరు.
పతియే సర్వస్వము. గురువును ఆశ్రయించేవారు కాదు. ఈ విషయాలన్నింటి గురించి ఇప్పుడు
మీరు అర్థం చేసుకుంటారు.
కొంతమంది మనుష్యులైతే బ్రహ్మాకుమారీ-బ్రహ్మాకుమారుల పేరు వినగానే భయపడిపోతారు
ఎందుకంటే వీరు సోదరీ-సోదరులుగా చేస్తారు అని భావిస్తారు. అరే, ప్రజాపిత బ్రహ్మాకు
సంతానంగా అవ్వడము మంచిదే కదా. బి.కె.లే స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు
మీరు తీసుకుంటున్నారు. మీరు బి.కె.లుగా అయ్యారు. మేము సోదరీ, సోదరులము అని ఇరువురూ
అంటారు. శరీర భానము, వికారాల దుర్గంధము తొలగిపోతుంది. ఒకే తండ్రికి పిల్లలము,
సోదరీ-సోదరులమైన మేము వికారాలలోకి ఎలా వెళ్ళగలము. ఇది మహా పాపము. పవిత్రంగా
ఉండేందుకు ఈ యుక్తి డ్రామాలో ఉంది. సన్యాసులది నివృత్తి మార్గము. మీరు ప్రవృత్తి
మార్గానికి చెందినవారు. ఇప్పుడు మీరు ఈ ఛీఛీ ప్రపంచపు ఆచార-వ్యవహారాలను వదిలి అసలు
ఈ ప్రపంచాన్నే మర్చిపోవాలి. మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు, మళ్ళీ రావణుడు
ఎంత అశుద్ధంగా చేసాడు. ఇది కూడా బాబా అర్థం చేయించారు. మేము 84 జన్మలు తీసుకున్నాము
అన్నది ఎలా నమ్మాలి అని కొందరు అంటారు. 84 జన్మలు తీసుకున్నారని మంచిగానే
చెప్తున్నాము కదా. 84 జన్మలు తీసుకోకపోతే వారు అసలు నిలవలేరు. వీరు దేవీ-దేవతా
ధర్మానికి చెందినవారు కాదు, వారు స్వర్గంలోకి రాలేరు అని భావించడం జరుగుతుంది.
ప్రజల్లో కూడా తక్కువ పదవిని పొందుతారు. ప్రజల్లో కూడా మంచి పదవి, తక్కువ పదవి
ఉన్నాయి కదా. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. భగవంతుడు వచ్చి రాజ్యాన్ని స్థాపన
చేస్తారు. శ్రీకృష్ణుడు వైకుంఠానికి యజమానిగా ఉండేవారు. వైకుంఠం యొక్క స్థాపనను
తండ్రి చేస్తారు. తండ్రి గీతను వినిపించారు, దాని ద్వారా ఈ పదవిని పొందారు, ఆ
తర్వాత మళ్ళీ చదవాల్సిన-చదివించాల్సిన అవసరమే లేదు. మీరు చదువుకుని పదవిని పొందుతారు.
ఆ తర్వాత గీతా జ్ఞానాన్ని ఏమైనా చదువుతారా. జ్ఞానం ద్వారా సద్గతి లభించింది, మరి
ఎంత పురుషార్థం చేస్తే అంత ఉన్నత పదవిని పొందుతారు. కల్పక్రితము ఎంత పురుషార్థము
చేసారో, అంతే చేస్తూ ఉంటారు. సాక్షిగా అయి చూడాలి. టీచర్ ను కూడా చూడాలి, వీరు
మనల్ని చదివించారు, మనం వీరి కన్నా తెలివైనవారిగా అవ్వాలి. చాలా మార్జిన్ (అవకాశం)
ఉంది. ఉన్నతోన్నతముగా అయ్యేందుకు ప్రయత్నించాలి. తమోప్రధానము నుండి సతోప్రధానముగా
అవ్వడమే ముఖ్యమైన విషయము. ఇది అర్థం చేసుకోవలసిన విషయము కదా. గృహస్థ వ్యవహారంలోనూ
ఉండాలి, తండ్రిని కూడా స్మృతి చేయాలి, తద్వారా పావనముగా అవుతారు. ఇక్కడ అందరూ
పతితులుగా ఉన్నారు, ఇక్కడ అంతా దుఃఖమే దుఃఖము ఉంది. సుఖమయమైన రాజ్యము ఎప్పుడు ఉండేది
అన్నది ఎవరికీ తెలియదు. దుఃఖములో ఉన్నప్పుడు - ఓ భగవంతుడా, ఓ రామా, ఈ దుఃఖాలను
ఎందుకిచ్చారు అని అంటారు. మరి భగవంతుడైతే ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వరు. రావణుడు
దుఃఖాన్ని ఇస్తాడు. ఇప్పుడు మీకు తెలుసు - మన రాజ్యములో వేరే ఏ ధర్మమూ ఉండదు.
తర్వాత వేరే ధర్మాలు వస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా, చదువు మీతో పాటు ఉంటుంది,
మన్మనాభవ అన్న లక్ష్యమైతే లభించింది, తండ్రిని స్మృతి చేయండి. తండ్రి నుండి మనం
స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. దీనిని కూడా గుర్తుంచుకోలేకపోతారు. ఈ స్మృతి
పక్కాగా ఉండాలి. అప్పుడు అంతిమ స్మృతిని బట్టి మరుసటి జన్మ లభిస్తుంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.