30-05-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇప్పుడు శాంతిధామములోకి, సుఖధామంలోకి వెళ్ళేందుకు ఈశ్వరీయ ధామములో కూర్చుని ఉన్నారు, ఇది సత్యమైన సాంగత్యము, ఇక్కడ మీరు పురుషోత్తములుగా అవుతున్నారు’’

ప్రశ్న:-
పిల్లలైన మీరు తండ్రి కన్నా కూడా ఉన్నతమైనవారు, నీచులు కారు - అది ఎలా?

జవాబు:-
బాబా అంటారు - పిల్లలూ, నేను విశ్వానికి యజమానిగా అవ్వను, మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తాను, అలాగే బ్రహ్మాండానికి కూడా యజమానులుగా తయారుచేస్తాను. ఉన్నతోన్నతమైన తండ్రినైన నేను పిల్లలైన మీకు నమస్కరిస్తాను, అందుకే మీరు నా కన్నా కూడా ఉన్నతమైనవారు, నేను యజమానులైన మీకు సలాం చేస్తాను. మీరు మళ్ళీ ఆ విధంగా తయారుచేసేటువంటి తండ్రికి సలాం చేస్తారు.

ఓంశాంతి
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు నమస్తే. ‘బాబా నమస్తే’ అని పిల్లలు రెస్పాండ్ (నమస్తే) కూడా చేయరు, ఎందుకంటే పిల్లలకు తెలుసు కదా, బాబా మనల్ని బ్రహ్మాండానికి యజమానులుగా కూడా తయారుచేస్తారు మరియు విశ్వానికి కూడా యజమానులుగా తయారుచేస్తారు. తండ్రి కేవలం బ్రహ్మాండానికి యజమానిగా అవుతారు, విశ్వానికి యజమానిగా అవ్వరు. పిల్లలను బ్రహ్మాండానికి మరియు విశ్వానికి రెండింటికీ యజమానులుగా తయారుచేస్తారు, మరి చెప్పండి - ఎవరు గొప్పవారు అయినట్లు? పిల్లలే గొప్పవారు అయినట్లు కదా, అందుకే పిల్లలు మళ్ళీ నమస్కరిస్తారు. బాబా, మీరే మమ్మల్ని బ్రహ్మాండానికి మరియు విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు అందుకే మీకు నమస్తే. ముసల్మానులు కూడా మాలేకమ్ సలాం, సలాం మాలేకమ్ అని అంటారు కదా. పిల్లలైన మీలో ఎవరికైతే నిశ్చయముందో వారికి ఈ సంతోషముంది, నిశ్చయం లేకుండానైతే ఎవరూ ఇక్కడికి రాలేరు కూడా. ఇక్కడికి ఎవరైతే వస్తారో వారికి తెలుసు, మేము మానవ గురువుల వద్దకేమీ వెళ్ళడం లేదు. మానవ తండ్రి వద్దకు, టీచరు వద్దకు లేక మానవ గురువు వద్దకు వెళ్ళడం లేదు. మీరు ఆత్మిక తండ్రి, ఆత్మిక టీచరు, ఆత్మిక సద్గురువు వద్దకు వస్తారు. ఆ మనుష్యులైతే అనేకమంది ఉన్నారు. వీరు ఒక్కరే ఉన్నారు. ఈ పరిచయం ఇంతకుముందు ఎవరికీ కూడా లేదు. రచయిత మరియు రచనల గురించి ఎవరికీ కూడా తెలియదని భక్తి మార్గములోని శాస్త్రాలలో కూడా ఉంది. తెలియని కారణంగా, వారిని అనాథలు అని అంటారు. ఎవరైతే బాగా చదువుకున్నవారు ఉంటారో, వారు ఆత్మలైన మనందరికీ తండ్రి ఒక్క నిరాకారుడేనని అర్థం చేసుకోగలరు. వారు వచ్చి తండ్రిగా, టీచరుగా, సద్గురువుగా కూడా అవుతారు. గీతలో శ్రీ కృష్ణుని పేరు ప్రసిద్ధి చెంది ఉంది. గీత సర్వ శాస్త్రమయి శిరోమణి, అన్నింటికన్నా ఉత్తమోత్తమమైనది. గీతనే మాతా పిత అని అంటారు, మిగిలిన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, వాటిని మాతా-పిత అని అనరు. శ్రీమత్ భగవద్గీత మాతగా మహిమ చేయబడుతుంది. భగవంతుని ముఖ-కమలం నుండి వెలువడిన గీతా జ్ఞానము. తండ్రి ఉన్నతోన్నతమైనవారు కావున తప్పకుండా ఉన్నతోన్నతమైనవారి ద్వారా చెప్పబడిన గీత రచయిత అయ్యింది. మిగిలిన శాస్త్రాలన్నీ దాని ఆకులు, రచన. రచన నుండి ఎప్పుడూ వారసత్వం లభించదు. ఒకవేళ లభించినా కూడా అది అల్పకాలము కోసమే. మిగిలిన ఇన్ని లెక్కలేనన్ని శాస్త్రాలు, వీటిని చదవడం వలన ఒక్క జన్మ కొరకు అల్పకాలికమైన సుఖము లభిస్తుంది. వాటిని మనుష్యులే మనుష్యులకు చదివిస్తారు. అన్ని రకాల చదువులు ఏవైతే ఉన్నాయో, అవి అల్పకాలికంగా మనుష్యులు, మనుష్యులకు చదివిస్తారు. అల్పకాలికమైన సుఖము లభిస్తుంది, తర్వాత మరుసటి జన్మలో ఇంకొక చదువును చదవవలసి ఉంటుంది. ఇక్కడైతే ఒక్క నిరాకారుడైన తండ్రియే 21 జన్మల కోసం వారసత్వాన్ని ఇస్తారు. దీనిని మనుష్యులెవ్వరూ ఇవ్వలేరు. వారు విలువలేనివారిగా చేస్తారు. తండ్రి విలువైనవారిగా చేస్తారు. ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. మీరందరూ ఈశ్వరుని పిల్లలు కదా. సర్వవ్యాపి అని అనడంతో అర్థము ఏ మాత్రమూ అర్థం చేసుకోరు. అందరిలోనూ పరమాత్మ ఉన్నట్లయితే మరి తండ్రి భావం ఏర్పడుతుంది. అందరూ తండ్రులైతే మరి వారసత్వం ఎక్కడి నుండి లభిస్తుంది! ఎవరి దుఃఖాన్ని ఎవరు హరిస్తారు! తండ్రినే దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. అందరూ తండ్రులే అన్నదానికి అర్థమేమీ లేదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు - ఇది ఉన్నదే రావణ రాజ్యము. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది అందుకే చిత్రాలలో కూడా స్పష్టంగా చూపించారు.

మేము పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నాము అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి పురుషోత్తములుగా చేయడానికి వచ్చి ఉన్నారు. ఏ విధంగా బ్యారిస్టరీ, డాక్టరీ మొదలైనవి చదువుకుంటారు, దాని ద్వారా పదవులు పొందుతారు. ఈ చదువు ద్వారా మేము ఫలానా వారిగా అవుతాము అని భావిస్తారు. ఇక్కడ మీరు సత్యమైనవారి సాంగత్యంలో కూర్చున్నారు, దీని ద్వారా మీరు సుఖధామంలోకి వెళ్తారు. సత్యమైన ధామాలు కూడా రెండు ఉన్నాయి - ఒకటి సుఖధామము, ఇంకొకటి శాంతిధామము. ఇది ఈశ్వరుని ధామము. తండ్రి రచయిత కదా. ఎవరైతే తండ్రి ద్వారా అర్థం చేసుకొని తెలివైనవారిగా అవుతూ ఉంటారో - వారి కర్తవ్యము సేవ చేయడము. తండ్రి అంటారు, ఇప్పుడు మీరు అర్థం చేసుకుని తెలివైనవారిగా అయ్యారు, కావున శివుని మందిరాలకు వెళ్ళి అర్థం చేయించండి, వారిని అడగండి, వీరిపై ఫలాలు, పుష్పాలు, వెన్న, నెయ్యి, జిల్లేడు పుష్పాలు, గులాబి పుష్పాలు ఇలా వెరైటీలు ఎందుకు అర్పిస్తారు? కృష్ణుని మందిరంలో జిల్లేడు పుష్పాలను అర్పించరు. అక్కడకు చాలా మంచి సుగంధభరితమైన పుష్పాలను తీసుకువెళ్తారు. శివుని ముందు జిల్లేడు పుష్పాలు, అలాగే గులాబి పుష్పాలు కూడా అర్పిస్తారు. దీని అర్థము ఎవరికీ తెలియదు. ఈ సమయంలో పిల్లలైన మిమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు, మనుష్యులెవ్వరూ చదివించడం లేదు. మిగిలిన ప్రపంచమంతటిలోనూ మనుష్యులకు మనుష్యులు చదివిస్తారు. మీకు భగవంతుడు చదివిస్తారు. మనుష్యులెవ్వరినీ భగవంతుడు అని ఎప్పటికీ అనలేము. లక్ష్మీ-నారాయణులను కూడా భగవంతుడు అని అనలేము, వారిని దేవీ-దేవతలు అని అనడం జరుగుతుంది. బ్రహ్మా-విష్ణు-శంకరులను కూడా దేవతలు అని అంటారు. భగవంతుడు తండ్రి ఒక్కరే, వారు ఆత్మలందరికీ తండ్రి. ఓ పరమపిత పరమాత్మా అని అందరూ అంటారు కూడా. వారి సత్యాతి-సత్యమైన పేరు శివ మరియు పిల్లలైన మీరు సాలిగ్రామాలు. పండితులు రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు శివుని చాలా పెద్ద లింగాన్ని తయారుచేస్తారు మరియు సాలిగ్రామాలు చిన్న-చిన్నవి తయారుచేస్తారు. సాలిగ్రామము అని ఆత్మను అంటారు. శివ అని పరమాత్మను అంటారు. వారు అందరికీ తండ్రి, మనమందరమూ పరస్పరంలో సోదరులము, సోదర భావము అని అంటారు కూడా. తండ్రి పిల్లలమైన మనము పరస్పరంలో సోదరులము. మరి సోదరీ-సోదరులుగా ఎలా అయ్యాము? ప్రజాపిత బ్రహ్మా ముఖము ద్వారా ప్రజలను రచించడం జరుగుతుంది. వారు బ్రాహ్మణులు మరియు బ్రాహ్మణీలు. మనం ప్రజాపిత బ్రహ్మా యొక్క సంతానము, అందుకే బి.కె.లుగా పిలవబడతాము. అచ్ఛా, బ్రహ్మాను ఎవరు పుట్టించారు? భగవంతుడు. బ్రహ్మా, విష్ణు, శంకరులు... వీరంతా రచన. సూక్ష్మవతనాన్ని కూడా రచించడం జరిగింది. బ్రహ్మా ముఖ కమలం నుండి పిల్లలైన మీరు వెలువడ్డారు. బ్రాహ్మణ-బ్రాహ్మణీలుగా పిలువబడతారు. బ్రహ్మా ముఖవంశావళులైన మీరు దత్తత తీసుకోబడ్డవారు. ప్రజాపిత బ్రహ్మా పిల్లలకు ఎలా జన్మనిస్తారు, తప్పకుండా దత్తత తీసుకుంటారు. ఏ విధంగా గురువు యొక్క అనుచరులు దత్తత తీసుకోబడతారు, వారిని శిష్యులు అని అంటారు. కావున ప్రజాపిత బ్రహ్మా మొత్తం ప్రపంచానికి తండ్రి అయ్యారు. వారిని గ్రేట్-గ్రేట్-గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ప్రజాపిత బ్రహ్మా అయితే ఇక్కడే కావాలి కదా. సూక్ష్మవతనంలో కూడా బ్రహ్మా ఉన్నారు. బ్రహ్మా, విష్ణు, శంకరులు అన్న పేర్లు గాయనం చేయబడి ఉన్నాయి కానీ సూక్ష్మవతనంలో ప్రజలైతే ఉండరు. ప్రజాపిత బ్రహ్మా ఎవరు, ఇవన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఆ బ్రాహ్మణులు కూడా స్వయాన్ని బ్రహ్మా సంతానంగా పిలుచుకుంటారు. ఇప్పుడు బ్రహ్మా ఎక్కడ ఉన్నారు? ఇక్కడ కూర్చుని ఉన్నారని మీరు అంటారు, ఒకప్పుడు ఉండి వెళ్ళారు అని వారంటారు. వారు మళ్ళీ తమను తాము పూజారీ బ్రాహ్మణులుగా పిలుచుకుంటారు. ఇప్పుడు మీరైతే ప్రాక్టికల్ గా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మా యొక్క పిల్లలు పరస్పరంలో సోదరీ-సోదరులు అయినట్లు. బ్రహ్మాను శివబాబా దత్తత తీసుకున్నారు. నేను ఈ వృద్ధ తనువులోకి ప్రవేశించి మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను అని వారంటారు. మనుష్యులను దేవతలుగా తయారుచేయడము - ఇది మనుష్యుల పని కాదు. తండ్రినే రచయిత అని అంటారు. శివ జయంతి కూడా జరుపుకోబడుతుంది అని భారతవాసులకు తెలుసు. శివుడు తండ్రి. దేవీ-దేవతలకు ఈ రాజ్యాన్ని ఎవరు ఇచ్చారు అన్నది కూడా మనుష్యులకు తెలియదు. స్వర్గ రచయిత పరమ ఆత్మ, వారిని పతిత-పావనుడు అని అంటారు. వాస్తవానికి ఆత్మ పవిత్రంగా ఉంటుంది, తర్వాత సతో-రజో-తమోలలోకి వస్తుంది. ఈ సమయంలో కలియుగంలో అందరూ తమోప్రధానంగా ఉన్నారు, సత్యయుగంలో సతోప్రధానంగా ఉండేవారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉండేది. 2500 సంవత్సరాలు దేవతల వంశము కొనసాగింది. వారి పిల్లలు కూడా రాజ్యం చేశారు కదా. లక్ష్మీ-నారాయణ ది ఫస్ట్, ది సెకండ్, ఇలా కొనసాగుతూ వస్తుంది. మనుష్యులకు ఈ విషయాల గురించి ఏమీ తెలియదు. ఈ సమయంలో అందరూ తమోప్రధానముగా, పతితంగా ఉన్నారు. ఇక్కడ మనుష్యులు ఒక్కరు కూడా పావనంగా ఉండలేరు. ఓ పతిత-పావనా రండి అని అందరూ పిలుస్తారు. మరి ఇది పతిత ప్రపంచము అయినట్లు కదా. దీనినే కలియుగము, నరకము అని అంటారు. కొత్త ప్రపంచాన్ని స్వర్గము, పావన ప్రపంచము అని అంటారు. మళ్ళీ పతితులుగా ఎలా అయ్యారు అన్నది ఎవరికీ తెలియదు. తమ 84 జన్మల గురించి తెలిసిన మనుష్యులు భారత్ లో ఒక్కరు కూడా లేరు. మనుష్యులు ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు తీసుకుంటారు, తక్కువలో తక్కువ ఒక్క జన్మ తీసుకుంటారు.

భారత్ ను అవినాశీ ఖండము అని అంటారు ఎందుకంటే ఇక్కడే శివబాబా అవతరణ జరుగుతుంది. భారత్ ఖండం ఎప్పటికీ వినాశనమవ్వదు. మిగిలిన అనేక ఖండాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ వినాశనమైపోతాయి. ఈ సమయంలో ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము కనుమరుగైపోయింది. ఎవరూ తమను తాము దేవతలుగా పిలుచుకోరు ఎందుకంటే దేవతలు సతోప్రధానముగా, పావనంగా ఉండేవారు. ఇప్పుడైతే అందరూ పతితులుగా, పూజారులుగా అయిపోయారు. ఇది కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు, భగవానువాచ ఉంది కదా. భగవంతుడు అందరికీ తండ్రి, వారు ఒక్కసారి మాత్రమే భారత్ లోకి వస్తారు. ఎప్పుడు వస్తారు? పురుషోత్తమ సంగమయుగంలో వస్తారు. ఈ సంగమయుగాన్నే పురుషోత్తమము అని అనడం జరుగుతుంది. ఈ సంగమయుగము కలియుగం నుండి సత్యయుగంగా, పతితుల నుండి పావనులుగా అయ్యే యుగము. కలియుగంలో పతిత మనుష్యులు ఉంటారు, సత్యయుగంలో పావన దేవతలు ఉంటారు అందుకే దీనిని పురుషోత్తమ సంగమయుగము అని అంటారు, ఇప్పుడే తండ్రి వచ్చి పతితుల నుండి పావనులుగా తయారుచేస్తారు. మనుష్యుల నుండి దేవతలుగా, పురుషోత్తములుగా అయ్యేందుకే మీరు వచ్చారు. ఆత్మలమైన మనం నిర్వాణధామంలో ఉంటాము అన్నది కూడా మనుష్యులకు తెలియదు. పాత్రను అభినయించేందుకు అక్కడి నుండి వస్తారు. ఈ నాటకం యొక్క ఆయువు 5000 సంవత్సరాలు. మనం ఈ అనంతమైన నాటకంలో పాత్రను అభినయిస్తాము. ఈ మనుష్యులందరూ పాత్రధారులు. ఈ డ్రామా చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పటికీ ఆగదు. మొట్టమొదట ఈ నాటకంలోకి సత్యయుగంలో పాత్రను అభినయించేందుకు దేవీ-దేవతలు వస్తారు. తర్వాత త్రేతాలో క్షత్రియులు వస్తారు. ఈ నాటకము గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఇది ఉన్నదే ముళ్ళ అడవి. మనుష్యులందరూ దుఃఖితులుగా ఉన్నారు. కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. కలియుగంలో లెక్కలేనంతమంది మనుష్యులు ఉన్నారు, సత్యయుగంలో ఎంతమంది ఉంటారు? చాలా కొద్దిమంది ఉంటారు. ఆది సనాతన సూర్యవంశీ దేవీ-దేవతలే ఉంటారు. ఈ పాత ప్రపంచం ఇప్పుడు మారనున్నది. మనుష్య సృష్టి నుండి మళ్ళీ దేవతల సృష్టిగా మారుతుంది. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం ఉండేది. కానీ ఇప్పుడు తమను తాము దేవతలుగా పిలుచుకోరు. తమ ధర్మాన్నే మర్చిపోయారు. కేవలం భారతవాసులే తమ ధర్మాన్ని మర్చిపోయారు, హిందుస్థాన్ లో ఉన్న కారణంగా హిందూ ధర్మము అని అనేస్తారు. దేవతలైతే పావనంగా ఉండేవారు, వీరు పతితులుగా ఉన్నారు అందుకే తమను తాము దేవతలుగా పిలుచుకోలేరు. దేవతల పూజను చేస్తూ ఉంటారు. స్వయాన్ని పాపులు, నీచులు అని అంటారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు - మీరే పూజ్యులుగా ఉండేవారు, మళ్ళీ మీరే పూజారులుగా, పతితులుగా అయ్యారు. హం సో యొక్క అర్థాన్ని కూడా అర్థం చేయించారు. ఆత్మయే పరమాత్మ అని వారు అంటారు. ఇది అసత్యమైన అర్థము, అసత్యమైన శరీరము, అసత్యమైన మాయ... సత్యయుగంలో ఇలా అనరు. సత్యఖండము యొక్క స్థాపన తండ్రి చేస్తారు, అసత్యఖండంగా మళ్ళీ రావణుడు చేస్తాడు. ఆత్మ ఏమిటి, పరమాత్మ ఎవరు అన్నది కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఇది కూడా ఎవరికీ తెలియదు. తండ్రి అంటారు - ఆత్మలైన మీరు ఒక బిందువు, మీలో 84 జన్మల పాత్ర రచించబడి ఉంది. ఆత్మలమైన మనము ఎలా ఉంటాము అన్నది కూడా ఎవరికీ తెలియదు. నేను బ్యారిస్టరును, నేను ఫలానాను అన్నది తెలుసు కానీ ఆత్మ గురించి ఒక్కరికి కూడా తెలియదు. తండ్రే వచ్చి పరిచయాన్ని ఇస్తారు. మీ ఆత్మలో 84 జన్మల పాత్ర అవినాశీగా రచించబడి ఉంది, అది ఎప్పటికీ వినాశనమవ్వదు. ఇదే భారత్ పుష్పాల తోటగా ఉండేది. సుఖమే సుఖము ఉండేది, ఇప్పుడు దుఃఖమే దుఃఖము ఉంది. ఈ జ్ఞానాన్ని తండ్రి ఇస్తారు.

పిల్లలైన మీరు తండ్రి ద్వారా ఇప్పుడు కొత్త-కొత్త విషయాలను వింటారు. అన్నింటికన్నా కొత్త విషయము - మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. మీకు తెలుసు, మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువును మనుష్యులెవ్వరూ చదివించరు, భగవంతుడు చదివిస్తారు. ఆ భగవంతుడిని సర్వవ్యాపి అని అనడము వారిని నిందించినట్లే అవుతుంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు - నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి భారత్ ను స్వర్గంగా చేస్తాను. రావణుడు నరకముగా చేస్తాడు. ఈ విషయాలు ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియవు. తండ్రే వచ్చి మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. మురికిపట్టిన వస్త్రాలను శుభ్రపరుస్తారు... అన్న గాయనము కూడా ఉంది. అక్కడ వికారాలు ఉండవు. అది సంపూర్ణ నిర్వికారీ ప్రపంచము. ఇప్పుడు ఇది వికారీ ప్రపంచము. పతిత-పావనా రండి, మమ్మల్ని రావణుడు పతితంగా చేసాడు అని పిలుస్తారు కూడా, కానీ రావణుడు ఎప్పుడు వచ్చాడు, ఏం జరిగింది అన్నది తెలియదు. రావణుడు ఎంత నిరుపేదగా చేసాడు. భారత్ 5 వేల సంవత్సరాల క్రితం ఎంత షావుకారుగా ఉండేది. బంగారము, వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉండేవి. ఎంతటి ధనం ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది! కిరీటధారులుగా తండ్రి తప్ప ఎవరూ తయారుచేయలేరు. శివబాబా భారత్ ను స్వర్గంగా చేస్తారని ఇప్పుడు మీరంటారు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని ఇప్పుడు తండ్రి అంటారు. మీరు వానప్రస్థులు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అందుకే స్వయాన్ని ఆత్మగా భావించండి, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మమవుతాయి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మనం బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులము, స్వయంగా భగవంతుడు మనల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసే చదువును చదివిస్తున్నారు, ఈ నషా మరియు సంతోషములో ఉండాలి. పురుషోత్తమ సంగమయుగంలో పురుషోత్తములుగా అయ్యే పురుషార్థము చేయాలి.

2. ఇప్పుడిది మన వానప్రస్థావస్థ, మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది, తిరిగి ఇంటికి వెళ్ళాలి... అందుకే తండ్రి స్మృతితో అన్ని పాపాలను భస్మం చేసుకోవాలి.

వరదానము:-
నాలెడ్జ్ రూపీ తాళము చెవి ద్వారా భాగ్యము యొక్క తరగని ఖజానాను ప్రాప్తి చేసుకునే సుసంపన్న భవ

సంగమయుగంలో పిల్లలందరికీ భాగ్యం తయారుచేసుకునేందుకు జ్ఞానము రూపీ తాళము చెవి లభిస్తుంది. ఈ తాళము చెవిని ఉపయోగించండి మరియు ఎంత కావాలనుకుంటే అంత భాగ్యం యొక్క ఖజానాను తీసుకోండి. తాళము చెవి లభించింది మరియు సుసంపన్నులుగా అయిపోయారు. ఎవరెంతగా సుసంపన్నులుగా అవుతారో, అంతగా సంతోషం స్వతహాగా ఉంటుంది. సంతోషపు జలపాతము తరగకుండా అవినాశీగా ప్రవహిస్తూ ఉన్నట్లుగా అనుభవమవుతుంది. వారు సర్వ ఖజానాలతో నిండుగా సుసంపన్నులుగా కనిపిస్తారు. వారి వద్ద ఏ రకమైన అప్రాప్తి ఉండదు.

స్లోగన్:-
తండ్రితో కనెక్షన్ సరిగ్గా ఉంచుకున్నట్లయితే సర్వ శక్తుల కరెంటు లభిస్తూ ఉంటుంది.

అవ్యక్త సూచనలు- ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి

ఎంతగా పవిత్రత ఉంటుందో, అంతగానే బ్రాహ్మణ జీవితపు పర్సనాలిటీ ఉంటుంది. ఒకవేళ పవిత్రత తక్కువగా ఉన్నట్లయితే పర్సనాలిటీ కూడా తక్కువగా ఉంటుంది. ఈ ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ సేవలో కూడా సహజంగా సఫలతను ఇప్పిస్తుంది. కానీ ఒకవేళ ఒక్క వికారమైనా అంశమాత్రము ఉన్నా, ఇతర సహచరులు కూడా దానితోపాటు తప్పకుండా ఉంటాయి. ఏ విధంగా పవిత్రతకు సుఖశాంతులతో లోతైన సంబంధము ఉందో, అలాగే అపవిత్రతకు కూడా పంచ వికారాలతో లోతైన సంబంధము ఉంది అందుకే ఏ వికారమూ అంశమాత్రము కూడా ఉండకూడదు, అప్పుడు పవిత్రతా పర్సనాలిటీ ద్వారా సేవ చేసేవారు అని అంటారు.