30-12-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - పాపాల నుండి తేలికగా అయ్యేందుకు
విశ్వాసపాత్రులుగా, నిజాయితీపరులుగా అయి మీ కర్మల కథను తండ్రికి రాసి ఇచ్చినట్లయితే
క్షమించబడతారు’’
ప్రశ్న:-
సంగమయుగములో పిల్లలైన మీరు ఏ బీజాన్ని నాటలేరు?
జవాబు:-
దేహాభిమానమనే
బీజము. ఈ బీజము ద్వారా అన్ని వికారాల వృక్షాలు వెలువడుతాయి. ఈ సమయంలో మొత్తం
ప్రపంచంలో 5 వికారాల వృక్షాలు వెలువడ్డాయి. అందరూ కామ-క్రోధాల బీజాలను నాటుతూ ఉంటారు.
మీకు తండ్రి యొక్క డైరెక్షన్ ఉంది, పిల్లలూ, యోగబలముతో పావనంగా అవ్వండి, ఈ బీజాలు
నాటడము మానేయండి.
పాట:-
మిమ్మల్ని
పొంది మేము సర్వమును పొందాము...
ఓంశాంతి
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు! ఇప్పుడైతే కొంతమందే ఉన్నారు, అనేక
మంది పిల్లలు అవుతారు. ఈ సమయంలో కొద్దిమందే ప్రాక్టికల్ గా అయ్యారు, అయినా ఈ
ప్రజాపిత బ్రహ్మా అయితే అందరికీ తెలుసు కదా. వీరి పేరే ప్రజాపిత బ్రహ్మా. ఎంత మంది
ప్రజలున్నారు. అన్ని ధర్మాలవారు వీరిని తప్పకుండా అంగీకరిస్తారు. వీరి ద్వారానే
మనుష్యమాత్రుల రచన జరిగింది కదా. బాబా అర్థం చేయించారు, లౌకిక తండ్రి కూడా హద్దు
బ్రహ్మా ఎందుకంటే వారి వంశము కూడా తయారవుతుంది కదా. ఇంటి పేరుతో వంశము కొనసాగుతుంది.
వారు హద్దుకు చెందినవారు, వీరు అనంతమైన తండ్రి. వీరి పేరే ప్రజాపిత. ఆ లౌకిక తండ్రి
అయితే ప్రజలను పరిమితంగా రచిస్తారు. కొంతమంది రచించరు కూడా. వీరైతే తప్పకుండా
రచిస్తారు. ప్రజాపిత బ్రహ్మాకు సంతానము లేదని ఈ విధంగా ఎవరైనా అంటారా. మొత్తం
ప్రపంచమంతా వీరి సంతానమే. మొట్టమొదటివారు ప్రజాపిత బ్రహ్మాయే. ముసల్మానులు కూడా ఆదమ్
బీబీ అని ఎవరినైతే అంటారో, అలా తప్పకుండా ఎవరో ఒకరి గురించి అంటారు కదా. ఏడమ్ ఈవ్,
ఆది దేవ్, ఆది దేవి అని ప్రజాపిత బ్రహ్మా కోసమే అంటారు. అన్ని ధర్మాలవారు ఎవరైతే
ఉన్నారో, అందరూ వీరిని అంగీకరిస్తారు. తప్పకుండా ఒకరు హద్దు తండ్రి, రెండవవారు
అనంతమైనవారు. ఈ అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇచ్చేవారు. మీరు అనంతమైన స్వర్గ
సుఖము కోసమే పురుషార్థము కూడా చేస్తారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ
వారసత్వాన్ని పొందేందుకు ఇక్కడకు వచ్చారు. స్వర్గంలో అనంతమైన సుఖము, నరకంలో అనంతమైన
దుఃఖము అని కూడా అనవచ్చు. దుఃఖాలు కూడా ఎన్నో రానున్నాయి. అయ్యో-అయ్యో అని అంటూ
ఉంటారు. తండ్రి మీకు మొత్తం విశ్వం యొక్క ఆది-మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించారు.
పిల్లలైన మీరు ఎదురుగా కూర్చున్నారు మరియు పురుషార్థము కూడా చేస్తారు. వీరైతే
మాత-పిత, ఇరువురూ అయినట్లే కదా. ఎంత మంది పిల్లలు ఉన్నారు. అనంతమైన మాత-పితలతో
ఎప్పుడూ ఎవ్వరూ శతృత్వాన్ని పెట్టుకోరు. మాత-పితల నుండి ఎంత సుఖము లభిస్తుంది. నీవే
తల్లివి, తండ్రివి... అని పాడుతారు కూడా. ఇదైతే పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు.
ఇతర ధర్మాల వారందరూ ఫాదర్ ను మాత్రమే పిలుస్తారు. మాత-పిత అని అనరు. కేవలం ఇక్కడ
మాత్రమే నీవే తల్లివి, తండ్రివి, మేము మీ పిల్లలము... అని పాడుతారు. పిల్లలైన మీకు
తెలుసు, మేము చదువుకుని మనుష్యుల నుండి దేవతలుగా, ముళ్ళ నుండి పుష్పాలుగా
అవుతున్నాము. తండ్రి నావికుడు కూడా, తోట యజమాని కూడా. ఇకపోతే బ్రాహ్మణులైన మీరంతా
అనేక రకాల తోటమాలులు. ముఘల్ గార్డెన్ కు కూడా తోటమాలి ఉంటారు కదా. వారి జీతము కూడా
ఎంత బాగుంటుంది. మాలులు కూడా నంబరువారుగా ఉన్నారు కదా. కొంతమంది తోటమాలులు ఎంత
మంచి-మంచి పుష్పాలను తయారుచేస్తారు. పుష్పాలలో ఒకటి, రాజా పుష్పము కూడా ఉంటుంది.
సత్యయుగంలో రాజా రాణి పుష్పాలు కూడా ఉన్నాయి కదా. ఇక్కడ మహారాజులు-మహారాణులు
ఉండవచ్చు కానీ పుష్పాల వలె లేరు. పతితులుగా అవ్వడంతో ముళ్ళుగా అయిపోతారు. మార్గంలో
నడుస్తూ-నడుస్తూ ముళ్ళు గుచ్చుకుని పారిపోతారు. అజామిళ్ అని కూడా వారినే అంటారు.
అందరికన్నా ఎక్కువ భక్తి కూడా మీరే చేస్తారు. వామ మార్గములో పడిపోయినవారి చిత్రాలు
చూడండి, ఎలా-ఎలా అశుద్ధంగా తయారుచేయబడి ఉన్నాయి. దేవతల చిత్రాలనే అలా చూపించారు.
ఇప్పుడు అవి వామ మార్గం యొక్క చిత్రాలు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాలను అర్థం
చేసుకున్నారు. మీరిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. మనము వికారాల నుండి చాలా
దూరం-దూరంగా వెళ్ళిపోతాము. బ్రాహ్మణులలో సోదరుడు-సోదరితో వికారాలలోకి వెళ్ళడము -
ఇదైతే చాలా పెద్ద అశుద్ధ కర్మ అవుతుంది. పేరే పాడైపోతుంది, అందుకే బాల్యము నుండే
ఏవైనా తప్పుడు పనులు చేసి ఉంటే, వాటిని కూడా బాబాకు వినిపిస్తే సగము క్షమించబడతాయి.
అవైతే గుర్తుంటాయి కదా. ఫలానా సమయంలో మేము ఈ అశుద్ధమైన పనిని చేశాను. బాబాకు రాసి
ఇస్తారు. ఎవరైతే చాలా విశ్వాసపాత్రులుగా, నిజాయితీపరులుగా ఉంటారో, వారు బాబాకు
రాస్తారు, బాబా, మేము ఈ-ఈ తప్పుడు పనులు చేశాము. క్షమించండి. తండ్రి అంటారు,
క్షమాపణ అయితే ఉండదు, ఇకపోతే సత్యము చెప్పినందుకు వారు తేలికైపోతారు. అంతేకానీ
మర్చిపోతారని కాదు. మర్చిపోలేరు. మున్ముందు మళ్ళీ అటువంటి పనులేవీ జరగకూడదు, దాని
గురించి అప్రమత్తం చేస్తాను. ఇకపోతే, మనస్సు తప్పకుండా తింటుంది. బాబా, మేమైతే
అజామిళ్ లాగ ఉండేవారిమి అని అంటారు. అది ఈ జన్మ యొక్క విషయమే. ఇది కూడా ఇప్పుడు మీకు
తెలుసు. ఎప్పటి నుండి వామ మార్గములోకి వచ్చి పాపాత్ములుగా అయ్యారు? ఇప్పుడు తండ్రి
మళ్ళీ మనల్ని పుణ్యాత్ములుగా చేస్తారు. పుణ్యాత్ముల ప్రపంచమే వేరుగా ఉంటుంది.
ప్రపంచము ఒక్కటే కావచ్చు కానీ రెండు భాగాలుగా ఉంటుందని అర్థం చేసుకున్నారు. ఒకటేమో
పుణ్యాత్ముల ప్రపంచము, దానిని స్వర్గమని అంటారు. రెండవది పాపాత్ముల ప్రపంచము, దానిని
నరకము, దుఃఖధామమని అంటారు. సుఖమయమైన ప్రపంచము మరియు దుఃఖపు ప్రపంచము. దుఃఖపు
ప్రపంచములో, మాకు ముక్తిని కలిగించండి, మన ఇంటికి తీసుకువెళ్ళండి అని అందరూ మొర
పెట్టుకుంటూ ఉంటారు. ఇంటికి వెళ్ళి కూర్చోవడము కాదు, మళ్ళీ పాత్రను అభినయించేందుకు
రావాలని కూడా పిల్లలకు అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో మొత్తం ప్రపంచం పతితంగా ఉంది.
ఇప్పుడు తండ్రి ద్వారా మీరు పావనంగా అవుతున్నారు. లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా
నిలబడి ఉంది. మేము ఈ విధంగా తయారవుతున్నాము అన్న లక్ష్యము-ఉద్దేశ్యాన్ని ఇంకెవ్వరూ
చూపించరు. తండ్రి అంటారు, పిల్లలూ, మీరు ఈ విధంగా ఉండేవారు, ఇప్పుడు ఆలా లేరు.
పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయిపోయారు, మళ్ళీ పూజ్యులుగా అయ్యేందుకు
పురుషార్థము కావాలి. తండ్రి ఎంత మంచి పురుషార్థము చేయిస్తారు. మేము రాకుమారునిగా
అవుతాను అని ఈ బాబా భావిస్తారు కదా. వీరు నంబరువన్ లో ఉన్నారు, అయినా ప్రతి క్షణము
స్మృతి నిలిచి ఉండదు. మర్చిపోతారు. ఎవరు ఎంత శ్రమ చేసినా కానీ ఇప్పుడు ఆ అవస్థ
ఏర్పడదు. ఎప్పుడైతే యుద్ధ సమయము వస్తుందో అప్పుడు కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది.
పురుషార్థమైతే అందరూ చేయాలి కదా. వీరు కూడా చేయాలి. చిత్రంలో చూడండి, బాబా చిత్రము
ఎక్కడుంది? అని మీరు అర్థం చేయిస్తారు కూడా. పూర్తిగా వృక్షం చివర్లో పతిత ప్రపంచంలో
నిలబడి ఉన్నారు మరియు కింద మళ్ళీ తపస్య చేస్తున్నారు. ఎంత సహజంగా అర్థం చేయించడము
జరుగుతుంది. ఈ విషయాలన్నీ తండ్రియే అర్థం చేయించారు. ఇంతకుముందు వీరికి కూడా తెలియదు.
తండ్రియే నాలెడ్జ్ ఫుల్, వారినే అందరూ - ఓ పరమపిత పరమాత్మ, వచ్చి మా దుఃఖాన్ని
హరించండి అని స్మృతి చేస్తారు. బ్రహ్మా-విష్ణు-శంకరులైతే దేవతలు. మూలవతనంలో ఉండే
ఆత్మలను దేవతలు అని ఏమైనా అనడం జరుగుతుందా. బ్రహ్మా-విష్ణు-శంకరుల రహస్యాన్ని కూడా
తండ్రి అర్థం చేయించారు. బ్రహ్మా, లక్ష్మీ-నారాయణులు, వీరందరూ అయితే ఇక్కడే ఉన్నారు
కదా. కేవలం పిల్లలైన మీకే ఇప్పుడు సూక్ష్మవతనము యొక్క సాక్షాత్కారమవుతుంది. ఈ బాబా
కూడా ఫరిశ్తాగా అయిపోతారు. మెట్ల చిత్రములో ఎవరైతే పైన నిలబడి ఉన్నారో, వారే మళ్ళీ
కింద తపస్య చేస్తున్నారని పిల్లలకు తెలుసు. చిత్రములో చాలా స్పష్టంగా చూపించారు.
వారు తమను తాము భగవంతుడు అని ఎక్కడ చెప్పుకుంటున్నారు. వారంటారు, మేము పైసాకు విలువ
చేయనివారిగా ఉండేవాడిని, తతత్వమ్. ఇప్పుడు ఎంతో విలువైనవారిగా అవుతున్నాను, తతత్వమ్.
ఇవి ఎంత సహజంగా అర్థం చేసుకునే విషయాలు. ఎవరైనా ఎప్పుడైనా అడిగితే చెప్పండి, చూడండి,
వీరైతే కలియుగాంతములో నిలబడి ఉన్నారు కదా. తండ్రి అంటారు, ఎప్పుడైతే శిథిలావస్థ,
వానప్రస్థము ఏర్పడుతుందో, అప్పుడు నేను వీరిలో ప్రవేశిస్తాను. ఇప్పుడు రాజయోగ తపస్య
చేస్తున్నారు. తపస్య చేసేవారిని దేవతలని ఎలా అంటారు? రాజయోగము నేర్చుకొని ఈ విధంగా
తయారవుతారు. పిల్లలైన మిమ్మల్ని కూడా ఇటువంటి కిరీటధారులుగా తయారుచేస్తారు కదా. వీరే
దేవతగా అవుతారు. ఈ విధముగా 10 - 20 మంది పిల్లల చిత్రాలను కూడా పెట్టవచ్చు. వీరు అలా
తయారవుతారని చూపించేందుకు పెట్టవచ్చు. ఇంతకుముందు అందరివీ అటువంటి ఫోటోలు
తయారుచేయబడి ఉండేవి. ఇది అర్థం చేయించే విషయము కదా. ఒకవైపు సాధారణమైనవారు, రెండవవైపు
డబల్ కిరీటధారులు. మేము ఇలా తయారవుతున్నామని మీకు అర్థం చేసుకుంటారు. ఎవరి లైను
అయితే క్లియర్ గా ఉంటుందో, వారే తయారవుతారు మరియు చాలా మధురంగా కూడా అవ్వాలి. ఈ
సమయంలో మనుష్యులలో కామము-క్రోధము మొదలైన బీజాలు ఎంత ఎక్కువ అయిపోయాయి. అందరిలోనూ 5
వికారాల రూపీ బీజాల యొక్క వృక్షాలు వెలువడ్డాయి. ఇప్పుడు తండ్రి అంటారు, ఇటువంటి
బీజాలు నాటకండి. సంగమయుగములో మీరు దేహాభిమానమనే బీజాన్ని నాటకూడదు. కామము యొక్క
బీజాన్ని నాటకూడదు. అర్థకల్పము వరకు మళ్ళీ రావణుడే ఉండడు. ప్రతి ఒక్క విషయాన్ని
తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ముఖ్యమైన విషయమైతే ఒక్కటే - మన్మనాభవ.
నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు. అందరికన్నా చివరిలో వీరు ఉన్నారు, మళ్ళీ
అందరికన్నా ముందు కూడా వీరే ఉన్నారు. యోగబలముతో ఎంత పావనంగా అవుతారు. ప్రారంభంలోనైతే
పిల్లలకు చాలా సాక్షాత్కారాలు జరిగేవి. భక్తి మార్గములో నవవిధ భక్తి చేసినప్పుడు
సాక్షాత్కారాలు అవుతాయి. ఇక్కడైతే వీరు కూర్చుని-కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు,
దీనిని ఇంద్రజాలమని భావించేవారు. ఇదైతే ఫస్ట్ క్లాస్ ఇంద్రజాలము. మీరా అయితే చాలా
తపస్య చేసారు, సాధు-సన్యాసులు మొదలైనవారి సాంగత్యం చేసారు. ఇక్కడ సాధువులు
మొదలైనవారు ఎక్కడున్నారు. వీరైతే తండ్రి కదా. అందరికీ తండ్రి శివబాబా. గురువుగారిని
కలుసుకోవాలని అంటారు. ఇక్కడైతే గురువు లేరు. శివబాబా అయితే నిరాకారుడు, మరి ఎవరిని
కలవాలనుకుంటున్నారు? ఆ గురువుల వద్దకైతే వెళ్ళి కానుకలు సమర్పిస్తారు. ఈ తండ్రి
అయితే అనంతమైన యజమాని. ఇక్కడ కానుకలు మొదలైనవి సమర్పించే విషయము లేదు. ఈ ధనాన్ని ఏమి
చేసుకుంటారు? మేము విశ్వానికి అనంతమైన యజమానిగా అవుతానని ఈ బ్రహ్మా కూడా భావిస్తారు.
పిల్లలు ధనము మొదలైనవి ఏవైతే ఇస్తారో, వారి కోసమే భవనాలు మొదలైనవి నిర్మిస్తారు.
ధనము అయితే శివబాబాకు పనికి రాదు, బ్రహ్మాబాబాకు కూడా పనికి రాదు. ఈ భవనాలు మొదలైనవి
పిల్లల కోసమే తయారుచేసారు, పిల్లలే వచ్చి ఉంటారు. కొంతమంది పేదవారు, కొంతమంది
షావుకారులు ఉంటారు, కొంతమందైతే బాబా, మా ఒక్క ఇటుకను పెట్టండి అని రెండు రూపాయలను
కూడా పంపిస్తారు. కొంతమంది వెయ్యి రూపాయలను పంపిస్తారు. భావన అయితే ఇద్దరికీ ఒక్కటే
కదా. కనుక ఇరువురిది సమానమైపోతుంది. అయినా పిల్లలు వస్తే ఎక్కడ కావాలంటే అక్కడ
ఉండవచ్చు. ఎవరైతే భవనం కట్టించారో, వారు ఒకవేళ వస్తే, వారిని తప్పకుండా సుఖంగా
ఉంచుతారు. బాబా వద్ద కూడా మర్యాదలు జరుగుతాయని కొందరు అంటారు. అరే, అదైతే తప్పకుండా
చేయవలసి ఉంటుంది కదా. కొంతమంది ఒకలా ఉంటారు, కొంతమందైతే ఎక్కడైనా కూర్చుండిపోతారు.
కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు, విదేశాలలో ఉండేవారు, పెద్ద-పెద్ద మహళ్ళలో ఉండేవారు
ఉంటారు, ప్రతి ఒక్క దేశంలో పెద్ద-పెద్ద షావుకార్లు వెలువడుతారు కనుక భవనాలు మొదలైనవి
అటువంటివి తయారుచేస్తారు. ఇక్కడైతే చూడండి, ఎంత మంది పిల్లలు వస్తారు. ఇంకే తండ్రికి
ఇటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటాయా. మహా అయితే, 10-12-20 మంది మనవలు-మనవరాళ్ళు ఉంటారు.
అచ్ఛా, ఎవరికైనా 200-500 మంది కూడా ఉండవచ్చు, అంతకన్నా ఎక్కువ అయితే ఉండరు. ఈ బాబా
కుటుంబము అయితే ఎంత పెద్దది, ఇంకా వృద్ధి చెందనున్నది. ఇక్కడైతే రాజధాని
స్థాపనవుతుంది. తండ్రి యొక్క కుటుంబం ఎంత పెద్దదవుతుంది. ఇక ప్రజాపిత బ్రహ్మా యొక్క
కుటుంబము ఎంతగా అయిపోయింది. కల్ప-కల్పము ఎప్పుడైతే వస్తారో, అప్పుడే ఈ అద్భుతమైన
విషయాలు మీ చెవులలో పడతాయి. ఓ ప్రభూ, మీ గతి-మతి అన్నింటికన్నా అతీతంగా
ప్రారంభమవుతుంది అని తండ్రి కోసమే అంటారు కదా. భక్తి మరియు జ్ఞానంలో తేడా చూడండి
ఎంతగా ఉంది.
స్వర్గములోకి వెళ్ళాలంటే దైవీ గుణాలను కూడా ధారణ చేయాలని తండ్రి మీకు అర్థం
చేయిస్తారు. ఇప్పుడైతే ముళ్ళలాగ ఉన్నారు కదా. నిర్గుణుడినైన నాలో ఏ గుణాలు లేవు అని
పాడుతూ ఉంటారు. ఇకపోతే, 5 వికారాల అవగుణాలున్నాయి, ఇది రావణ రాజ్యము. ఇప్పుడు
మీకెంత మంచి జ్ఞానము లభిస్తుంది. ఈ జ్ఞానము ఎంతటి సంతోషాన్ని అయితే ఇస్తుందో, ఆ
జ్ఞానము అంత ఇవ్వదు. ఆత్మలైన మనము పైన మూలవతనములో ఉండేవారమని మీకు తెలుసు.
సూక్ష్మవతనములో బ్రహ్మా-విష్ణు-శంకరులు ఉంటారు, అది కూడా కేవలం సాక్షాత్కారము
జరుగుతుంది. బ్రహ్మా కూడా ఇక్కడివారే, లక్ష్మీ-నారాయణులు కూడా ఇక్కడి వారే. కేవలం
వారి సాక్షాత్కారం జరుగుతుంది. వ్యక్త బ్రహ్మా నుండి మళ్ళీ సూక్ష్మవతన వాసి ఫరిశ్తా
బ్రహ్మాగా ఎలా అవుతారు అన్న గుర్తులున్నాయి. అంతేకానీ, ఇంకేమీ లేదు. ఇప్పుడు
పిల్లలైన మీరు అన్ని విషయాలను అర్థం చేసుకుంటూ ఉంటారు, ధారణ చేస్తూ ఉంటారు. ఇది
కొత్త విషయమేమీ కాదు. మీరు అనేక సార్లు దేవతలుగా అయ్యారు, దైవీ రాజ్యముండేది కదా. ఈ
చక్రము తిరుగుతూ ఉంటుంది. అది వినాశీ డ్రామా, ఇది అనాది, అవినాశీ డ్రామా. ఇది మీ
బుద్ధిలో తప్ప ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చొని
అర్థం చేయిస్తారు. అంతేకానీ ఇది పరంపరగా కొనసాగుతూ వచ్చిందని కాదు. తండ్రి అంటారు,
ఈ జ్ఞానాన్ని మీకిప్పుడు వినిపిస్తాను. తర్వాత ఇది కనుమరుగైపోతుంది. మీరు రాజ్య
పదవిని ప్రాప్తించుకుంటారు, తర్వాత సత్యయుగంలో ఈ జ్ఞానము ఉండదు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇప్పుడు మేము బ్రాహ్మణులము అన్న స్మృతి సదా ఉండాలి కావున వికారాలకు చాలా-చాలా
దూరంగా ఉండాలి. ఎప్పుడూ అశుద్ధ కర్మలు జరగకూడదు. తండ్రితో చాలా-చాలా నిజాయితీగా,
విశ్వాసపాత్రులుగా ఉండాలి.
2. డబల్ కిరీటధారులైన దేవతలుగా అయ్యేందుకు చాలా మధురంగా తయారవ్వాలి, లైను క్లియర్
గా ఉంచుకోవాలి. రాజయోగ తపస్య చేయాలి.
వరదానము:-
సదా అనంతమైన స్థితిలో స్థితులై ఉండే బంధనముక్త, జీవన్ముక్త
భవ
దేహాభిమానము హద్దు స్థితి మరియు దేహీ అభిమానిగా అవ్వడము -
ఇది అనంతమైన స్థితి. దేహంలోకి రావడముతో అనేక కర్మ బంధనాలలోకి, హద్దులలోకి రావలసి
వస్తుంది కానీ ఎప్పుడైతే దేహీగా అయిపోతారో అప్పుడు ఈ బంధనాలన్నీ సమాప్తమైపోతాయి.
బంధనముక్తులే జీవన్ముక్తులు అని అంటారు, ఆ విధంగా ఎవరైతే అనంతమైన స్థితిలో స్థితులై
ఉంటారో వారు ప్రాపంచికమైన వాయుమండలము, వైబ్రేషన్లు, తమోగుణీ వృత్తులు, మాయ యొక్క
దాడి వీటన్నింటి నుండి ముక్తులైపోతారు, దీనినే జీవన్ముక్త స్థితి అని అంటారు, దీనిని
సంగమయుగంలోనే అనుభవం చేసుకోవాలి.
స్లోగన్:-
నిశ్చయబుద్ధి కలవారి గుర్తు - నిశ్చిత విజయీ మరియు నిశ్చింత స్థితి, వారి వద్దకు
వ్యర్థము రాజాలదు.
అవ్యక్త
ప్రేరణలు-ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి
కర్మల గుహ్య గతిని
తెలుసుకుని అనగా త్రికాలదర్శులుగా అయ్యి ప్రతి కర్మను చెయ్యండి, అప్పుడే
కర్మాతీతులుగా అవ్వగలరు. ఒకవేళ చిన్న-చిన్న పొరపాట్లు సంకల్ప రూపములోనైనా జరిగితే
దాని లెక్కాచారము కూడా చాలా కఠినంగా తయారవుతుంది కనుక చిన్న పొరపాటును కూడా
పెద్దదిగా భావించాలి ఎందుకంటే ఇప్పుడు సంపూర్ణ స్థితికి సమీపంగా వస్తున్నారు.
| | | |