ఓంశాంతి
ఏ విషయము ఆలోచించి పిల్లలైన మీరు ఇక్కడ మధుబన్ కు వస్తారు! ఏ చదువును చదువుకోవడానికి
వస్తారు? ఎవరి వద్దకు వస్తారు? (బాప్ దాదా వద్దకు). ఇది కొత్త విషయము. బాప్ దాదా
వద్దకు చదువుకోవడానికి వెళ్తున్నాము అన్న మాట అనడం ఎక్కడైనా విన్నారా, అది కూడా బాప్
దాదా ఇరువురూ కలిసి ఉన్నారు. అద్భుతము కదా. మీరు అద్భుతమైన తండ్రికి సంతానము.
ఇంతకుముందు పిల్లలైన మీకు కూడా రచయిత గురించి కానీ, రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి
కానీ తెలియదు. ఇప్పుడు ఆ రచయితను మరియు రచనను మీరు నంబరువారు పురుషార్థానుసారముగా
తెలుసుకున్నారు. ఎంతగా తెలుసుకుంటారో మరియు ఎంతగా ఇతరులకు అర్థం చేయిస్తారో, అంతగా
సంతోషము కలుగుతుంది మరియు భవిష్య పదవి లభిస్తుంది. ముఖ్యమైన విషయము ఏమిటంటే -
ఇప్పుడు మనకు రచయిత మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. ఇది కేవలం
బ్రాహ్మణ-బ్రాహ్మణీలైన మనకు మాత్రమే తెలుసు. ఎప్పటివరకైతే జీవించి ఉంటారో,
అప్పటివరకూ - మేము బి.కె. లము అని మరియు శివబాబా నుండి మొత్తం విశ్వము యొక్క
వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని స్వయానికి నిశ్చయము ఉండాలి. పూర్తిగా
చదువుతున్నారా లేక తక్కువగా చదువుతున్నారా అన్నది వేరే విషయము, కానీ మనము వారి
పిల్లలము అన్నదైతే తెలుసు కదా. ఇక తర్వాత - చదువుతున్నారా లేక చదవటం లేదా అన్న
ప్రశ్న తలెత్తుతుంది. దాని అనుసారంగానే పదవి లభిస్తుంది. దత్తత తీసుకోబడ్డారు కావున
- మేము రాజ్యానికి హక్కుదారులుగా అవుతాము అన్న నిశ్చయము ఏర్పడుతుంది. అయితే, చదువులో
కూడా రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. కొందరైతే మంచి రీతిలో చదువుకుంటారు మరియు
చదివిస్తారు, వారికి అసలు ఇంకేదీ తోచదు. కేవలం చదవడము మరియు చదివించడము, ఇది అంతిమము
వరకూ కొనసాగాలి. బయట విద్యార్థి జీవితములో చదువు అనేది అంతిమము వరకు ఏమీ కొనసాగదు,
దానికంటూ సమయము ఉంటుంది. కానీ మీరైతే ఎప్పటివరకైతే జీవించి ఉంటారో, అప్పటివరకూ
చదువుకోవాలి మరియు చదివించాలి. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి - ఎంతమందికి రచయిత అయిన
తండ్రి యొక్క పరిచయాన్ని ఇస్తున్నాను? మనుష్యులైతే మనుష్యులే కదా. చూడటానికి తేడా
ఏమీ కనిపించదు, శరీరము పరంగా తేడా ఉండదు. ఈ చదువు లోలోపల బుద్ధిలో ప్రతిధ్వనిస్తూ
ఉంటుంది. ఎవరు ఎంతగా చదువుకుంటారో, అంతగానే వారికి సంతోషము కూడా ఉంటుంది. నేను
కొత్త విశ్వానికి యజమానిగా అవుతాను అని లోలోపల ఉంటుంది. ఇప్పుడు మనము స్వర్గ
ద్వారములోకి వెళ్తాము. నాలో ఎంత మార్పు వచ్చింది అని మీ హృదయాన్ని సదా
ప్రశ్నించుకుంటూ ఉండండి. తండ్రి మనల్ని తనవారిగా చేసుకున్నారు, మనము ఎలా ఉన్నవారి
నుండి ఎలా అవుతాము. చదువుపైనే ఆధారపడి ఉంది. చదువు ద్వారా మనుష్యులు ఎంత ఉన్నతులుగా
అవుతారు. అవన్నీ అల్పకాలికమైన, క్షణభంగురమైన పదవులు. వాటిలో ఏమీ లేదు, అవి ఎందుకూ
ఉపయోగపడనట్లే. లక్షణాలు ఏవీ ఉండేవి కావు. ఇప్పుడు ఈ చదువు ద్వారా ఎంత ఉన్నతులుగా
అవుతారు. మొత్తం అటెన్షన్ అంతా చదువుపైనే ఉంచాలి. ఎవరి అదృష్టములోనైతే ఉంటుందో, వారి
మనస్సు చదువులో నిమగ్నమై ఉంటుంది. ఇతరులను కూడా చదివించేందుకు భిన్న-భిన్న రీతులలో
పురుషార్థము చేయిస్తూ ఉంటారు. ఇతరులను చదివించి వైకుంఠానికి యజమానులుగా చేయాలి అని
వారికి మనసు కలుగుతుంది. మనుష్యులను నిద్ర నుండి మేల్కొలిపేందుకు ఎంతగా కష్టపడుతూ
ఉంటారు, ఇలా ఇంకా కష్టపడుతూనే ఉంటారు. ఈ ప్రదర్శనీలు మొదలైనవి అసలు అంత ఏమీ కావు,
మున్ముందు అర్థం చేయించడానికి ఇంకా ఎన్నో ఏర్పాట్లు వెలువడుతాయి. ఇప్పుడు తండ్రి
పావనముగా తయారుచేస్తున్నారు కావున తండ్రి యొక్క శిక్షణలపై అటెన్షన్ పెట్టాలి. ప్రతి
విషయములోనూ సహనశీలురుగా కూడా ఉండాల్సి ఉంటుంది. పరస్పరము కలుసుకుని, సంగఠిత రూపములో
భాషణలు మొదలైన కార్యక్రమాలను నిర్వహించాలి. ఒక్క అల్ఫ్ (భగవంతుడు) గురించి కూడా మనము
చాలా బాగా అర్థం చేయించవచ్చు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఎవరు? ఒక్క భగవంతుడి గురించి
మీరు రెండు గంటలు భాషణ చేయవచ్చు. భగవంతుడిని స్మృతి చేయడం వలన సంతోషము కలుగుతుందని
కూడా మీకు తెలుసు. ఒకవేళ పిల్లలకు స్మృతి యాత్ర పట్ల అటెన్షన్ తక్కువగా ఉంటే,
భగవంతుడిని స్మృతి చేయకపోతే తప్పకుండా నష్టము కలుగుతుంది. మొత్తం ఆధారమంతా
స్మృతిపైనే ఉంది. స్మృతి చేయడం ద్వారా పూర్తిగా స్వర్గములోకి వెళ్ళిపోతారు. స్మృతిని
మర్చిపోవడం వలనే కింద పడిపోతారు. ఈ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. వారికి
శివబాబా గురించి తెలియనే తెలియదు. ఎవరు ఎంత ఆర్భాటముగా పూజ చేసినా, తలచుకున్నా, వారు
ఏమీ అర్థం చేసుకోరు.
మీకు తండ్రి నుండి చాలా పెద్ద ఆస్తి లభిస్తుంది. భక్తి మార్గములో కృష్ణుడి యొక్క
సాక్షాత్కారాన్ని పొందేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు, అచ్ఛా, సాక్షాత్కారము
లభించింది అనుకోండి, ఆ తర్వాత ఏమిటి? లాభమైతే ఏమీ జరగలేదు. ప్రపంచము ఎటువంటి
విషయాలపై నడుస్తుందో చూడండి. మీరు ఏమో తియ్యని చెరుకు రసం తాగుతుంటే, మిగిలిన
మనుష్యులంతా పిప్పిని నములుతున్నారు. మీరు ఇప్పుడు తియ్యని చెరుకు రసం తాగి పూర్తిగా
కడుపు నింపుకుని, ఇక అర్ధకల్పము సుఖము పొందుతారు, మిగిలినవారంతా భక్తి మార్గపు రసం
తీసేసిన పిప్పిని నములుతూ కిందకు దిగుతూ వస్తారు. ఇప్పుడు తండ్రి ఎంత ప్రేమగా
పురుషార్థము చేయిస్తారు. కానీ అదృష్టములో లేకపోతే మరి అటెన్షన్ పెట్టరు. స్వయమూ
అటెన్షన్ పెట్టరు, అలాగే ఇతరులను కూడా అటెన్షన్ పెట్టనివ్వరు. స్వయమూ అమృతము తాగరు,
అలాగే ఇతరులను కూడా తాగనివ్వరు. చాలామందిది ఇటువంటి నడవడిక నడుస్తూ ఉంటుంది. ఒకవేళ
పూర్తి రీతిలో చదవుకోకపోతే, దయార్ద్ర హృదయులుగా అవ్వకపోతే, ఎవరి కళ్యాణమూ చేయకపోతే,
ఇక వారు ఏ పదవిని పొందుతారు! అదే చదువుకునేవారు మరియు చదివించేవారు ఎంతటి ఉన్నత
పదవిని పొందుతారు. చదువుకోకపోతే ఏం పదవి లభిస్తుంది అనేది కూడా మున్ముందు రిజల్ట్
తెలిసిపోతుంది. అప్పుడు అనుకుంటారు - నిజమే కదా, బాబా నాకు ఎన్ని వార్నింగ్లు
ఇచ్చారు అని. మీరు ఇక్కడ కూర్చున్నారు, మేము అనంతమైన తండ్రి వద్ద కూర్చున్నాము అని
మీ బుద్ధిలో ఉండాలి. వారు పై నుండి వచ్చి ఈ శరీరము ద్వారా మనల్ని కల్పపూర్వము వలె
చదివిస్తారు. ఇప్పుడు మనము మళ్ళీ తండ్రి ఎదురుగా కూర్చున్నాము. వారితోపాటుగానే
వెళ్ళాలి. వదిలి వెళ్ళిపోకూడదు. తండ్రి మనల్ని తనతోపాటు తీసుకువెళ్తారు. ఈ పాత
ప్రపంచము వినాశనమైపోతుంది. ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు. ఈ పాత ప్రపంచము తప్పకుండా
అంతమవ్వనున్నది అని మున్ముందు తెలుసుకుంటారు. కానీ అప్పుడు తెలుసుకోవడం వలన ఏమీ
లభించదు. ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు. టూ లేట్ అయిపోతుంది. లెక్కాచారాలను
సమాప్తము చేసుకుని అందరూ తిరిగి వెళ్ళాలి. ఇది కూడా వివేకవంతులైన పిల్లలెవరైతే
ఉన్నారో, వారికే తెలుసు. ఎవరైతే సేవలో ఉపస్థితులై ఉంటారో, వారే నిజమైన పిల్లలు. వారు
తల్లి-తండ్రులను ఫాలో చేస్తారు. ఏ విధంగా తండ్రి ఆత్మిక సేవను చేస్తారో, అలా మీరూ
చేయాలి. కొంతమంది పిల్లలకు ఇదే తపన ఉంటుంది. బాబా ఎవరినైతే మహిమ చేస్తారో, వారి వలె
తయారవ్వాలి. టీచరు అయితే అందరికీ లభిస్తారు. ఇక్కడికి కూడా అందరూ వస్తారు. ఇక్కడైతే
పెద్ద టీచరు కూర్చుని ఉన్నారు. తండ్రిని స్మృతే చేయకపోతే మరి ఎలా బాగుపడతారు.
జ్ఞానమైతే చాలా సహజము. 84 జన్మల చక్రము ఎంత సహజమైనది. కానీ ఎంతగా కష్టపడవలసి ఉంటుంది.
తండ్రి ఎంత సహజమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. తండ్రిని మరియు 84 జన్మల
చక్రాన్ని స్మృతి చేసినట్లయితే నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది. ఈ సందేశాన్ని
అందరికీ ఇవ్వాలి. మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి - ఎంతవరకు సందేశకునిగా అయ్యాను?
ఎంతగా అనేకులను మేల్కొల్పుతారో అంతగా బహుమానము లభిస్తుంది, ఒకవేళ నేను మేల్కొల్పటము
లేదంటే తప్పకుండా ఎక్కడో నిద్రపోతున్నాను అని అర్థము, అప్పుడిక నాకు అంతటి ఉన్నత
పదవి లభించదు. బాబా ప్రతిరోజూ చెప్తుంటారు - సాయంత్రము వేళ మీ రోజంతటి
లెక్కాపత్రాన్ని చూసుకోండి. సేవలో కూడా ఉండాలి. ముఖ్యమైన విషయము - తండ్రి పరిచయాన్ని
ఇవ్వడము. తండ్రియే భారత్ ను స్వర్గముగా తయారుచేసారు. ఇప్పుడు నరకముగా ఉంది, మళ్ళీ
స్వర్గముగా తయారవుతుంది. చక్రమైతే తిరగాల్సిందే. తమోప్రధానము నుండి సతోప్రధానముగా
అవ్వాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికారాలు తొలగిపోతాయి. సత్యయుగములో చాలా
కొద్దిమందే ఉంటారు. ఆ తర్వాత రావణ రాజ్యములో ఎంతగా వృద్ధి జరుగుతుంది. సత్యయుగములో
9 లక్షలమంది ఉంటారు, ఆ తర్వాత మెల్లమెల్లగా వృద్ధి చెందుతారు. ఎవరైతే మొదట పావనముగా
ఉండేవారో, వారే తర్వాత పతితముగా అవుతారు. సత్యయుగములో దేవతలది పవిత్ర ప్రవృత్తి
మార్గము. వారే మళ్ళీ అపవిత్ర ప్రవృత్తి మార్గమువారిగా అయిపోయారు. డ్రామానుసారముగా ఈ
చక్రము తిరగవలసిందే. ఇప్పుడు మళ్ళీ మీరు పవిత్ర ప్రవృత్తి మార్గమువారిగా అవుతున్నారు.
తండ్రే వచ్చి పవిత్రముగా తయారుచేస్తారు. వారంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే
వికర్మలు వినాశనమవుతాయి. మీరు అర్ధకల్పము పవిత్రముగా ఉండేవారు, తర్వాత రావణ
రాజ్యములో మీరు పతితముగా అయ్యారు. ఇది కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. మనము
కూడా పూర్తిగా పైసకు కొరగానివారిగా ఉండేవారము, ఇప్పుడు ఎంత జ్ఞానము లభించింది. దీని
ద్వారా మనము ఎలా ఉన్నవారము ఎలా అవుతాము! మిగిలిన ఇన్ని ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ఇవి
అంతమైపోనున్నాయి. అందరూ జంతువులు మరణించినట్లుగా మరణిస్తారు. మంచు కురిసినప్పుడు
ఎన్ని జంతువులు, పక్షులు మొదలైనవి మరణిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి.
ఇదంతా అంతమైపోతుంది. వీరంతా మరణించే ఉన్నారు. ఈ కళ్ళతో మీరు ఏవైతే చూస్తారో, అవి ఇక
ఉండవు. కొత్త ప్రపంచములో బాగా కొద్దిమందే ఉంటారు. ఈ జ్ఞానము మీ బుద్ధిలో ఉంది,
జ్ఞానసాగరుడైన తండ్రియే మీకు జ్ఞానపు వారసత్వాన్ని ఇస్తున్నారు. మొత్తం ప్రపంచములో
మురికియే మురికి ఉందని మీకు తెలుసు. మనము కూడా ఆ మురికిలో అశుద్ధముగా ఉండేవారము.
బాబా ఆ మురికి నుండి బయటకు తీసి ఇప్పుడు ఎంతగా పుష్పాల వలె తయారుచేస్తున్నారు. మనము
ఈ శరీరాన్ని వదిలేస్తాము, ఆత్మ పవిత్రముగా అయిపోతుంది.
తండ్రి అందరికీ ఒకే విధంగా చదువును చదివిస్తారు కానీ కొందరి బుద్ధి పూర్తిగా
జడమైనదిగా ఉంది, వారు ఏమీ అర్థం చేసుకోలేరు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది.
తండ్రి అంటారు, వీరి భాగ్యములో లేకపోతే మరి నేను కూడా ఏం చేయగలను. నేనైతే అందరినీ
ఒకే విధంగా చదివిస్తాను. చదువుకోవడము నంబరువారుగా చదువుకుంటారు. కొందరు మంచి రీతిలో
అర్థం చేసుకుని అర్థం చేయిస్తారు, వారు ఇతరుల జీవితాన్ని కూడా వజ్రతుల్యముగా
తయారుచేస్తారు. కొందరైతే అసలు ఎవరినీ తయారుచేయనే చేయరు. తప్పుడు అహంకారము ఎంతగా ఉంది.
ఏ విధంగా సైన్స్ వారికి బుద్ధి యొక్క అహంకారము ఎంతగా ఉంది, దూరదూరాలలో ఉన్న
ఆకాశాన్ని, సముద్రాన్ని చూడాలనుకుంటారు. తండ్రి అంటారు - దీని వలన లాభమేమీ లేదు.
అనవసరముగా సైన్స్ గర్వితులు తమ బుద్ధిని పాడు చేసుకుంటున్నారు. వారికి చాలా ఎక్కువ
జీతాలు లభిస్తాయి, అంతా వృధా చేస్తూ ఉంటారు. అలాగని బంగారు ద్వారక క్రింది నుండి
బయటకు వస్తుంది అనేమీ కాదు. ఇది డ్రామా చక్రము, ఇది తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ మనము
సమయమనుసారంగా వెళ్ళి కొత్త ప్రపంచములో మన మహళ్ళను తయారుచేసుకుంటాము. మళ్ళీ ఇటువంటి
ఇళ్ళే తయారవుతాయా అని కొందరు ఆశ్చర్యపోతారు. మీరు మళ్ళీ ఇటువంటి బంగారు మహళ్ళను
తయారుచేస్తారు అని తండ్రి తప్పకుండా చూపిస్తారు. అక్కడైతే బంగారము ఎంతగానో ఉంటుంది.
ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల బంగారు పర్వతాలు చాలా ఉన్నాయి, కానీ ఆ బంగారాన్ని బయటకు
తీయలేరు. కొత్త ప్రపంచములోనైతే బంగారపు అపారమైన గనులు ఉండేవి, అవి సమాప్తమైపోయాయి.
ఇప్పుడు వజ్రాల ధర కూడా ఎంతగా ఉందో చూడండి. ఈ రోజు ఇంత ధర ఉంది, రేపు రాళ్లు వలె
అయిపోతాయి. తండ్రి పిల్లలైన మీకు చాలా అద్భుతమైన విషయాలను వినిపిస్తారు మరియు
సాక్షాత్కారాలు కూడా చేయిస్తారు. ఆత్మలమైన మనము మన ఇంటిని వదిలి 5000
సంవత్సరాలయ్యింది అని పిల్లలైన మీకు ఇప్పుడు బుద్ధిలో ఇదే ఉండాలి, దానిని
ముక్తిధామము అని అంటారు. భక్తి మార్గములో ముక్తి కొరకు ఎంతగా కష్టపడతారు, కానీ
ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు - తండ్రి తప్ప ఎవ్వరూ ముక్తిని ఇవ్వలేరు, అలాగే
ఎవ్వరూ తమతో పాటు తీసుకువెళ్ళలేరు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో కొత్త ప్రపంచము
ఉంది, ఈ చక్రము తిరగాల్సిందే అని మీకు తెలుసు, మీరు వేరే ఏ విషయాలలోకి వెళ్ళకూడదు.
కేవలం తండ్రిని స్మృతి చేయాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు
వినాశనమవుతాయని అందరికీ ఇదే చెప్తూ ఉండండి. తండ్రి మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా
తయారుచేసారు కదా. మీరు నా శివ జయంతిని కూడా జరుపుతారు. ఎన్ని సంవత్సరాలయ్యింది? ఇది
5000 సంవత్సరాల నాటి విషయము. మీరు స్వర్గవాసులుగా అయ్యారు, మళ్ళీ 84 జన్మల చక్రములో
తిరిగి వచ్చారు. ఇది కూడా డ్రామాగా తయారై ఉంది. నేను వచ్చి మీకు ఈ సృష్టి చక్రము
గురించి అర్థం చేయిస్తాను. ఇప్పుడు పిల్లలైన మీకు ఇది చాలా బాగా గుర్తుకు వచ్చింది.
మనము అందరికంటే ఉన్నతమైన పాత్రధారులము. మన పాత్ర బాబాతోపాటు ఉంది, మనము బాబా
శ్రీమతము ఆధారంగా, బాబా స్మృతిలో ఉంటూ ఇతరులను కూడా మన సమానముగా తయారుచేస్తాము.
ఎవరైతే కల్పపూర్వము ఉన్నారో వారే తయారవుతారు. సాక్షీగా అయి చూస్తూ ఉంటారు మరియు
పురుషార్థము కూడా చేయిస్తూ ఉంటారు. సదా ఉల్లాసములో ఉండేందుకు రోజూ ఏకాంతములో
కూర్చుని మీతో మీరు మాట్లాడుకోండి. ఇంకా కొద్ది సమయమే ఈ అశాంతి ప్రపంచములో ఉంటాము,
ఇక ఆ తర్వాత అశాంతి అన్న పేరే ఉండదు. మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని ఎవ్వరూ ఇలా
అనడానికి లేదు. శాంతి కోసమని వెళ్తారు కానీ శాంతి సాగరుడైతే ఒక్క తండ్రియే,
ఇతరులెవరి వద్ద ఇది లేనే లేదు. రచయితను మరియు రచనను తెలుసుకోవడమే జ్ఞానము అని
పిల్లలైన మీ బుద్ధిలో ప్రతిధ్వనిస్తూ ఉండాలి. ఒకటి శాంతి కొరకు, ఒకటి సుఖం కొరకు.
ధనము ద్వారా సుఖము లభిస్తుంది. ధనము లేకపోతే మనుష్యులు ఎందుకూ ఉపయోగపడరు. ధనము కొరకు
మనుష్యులు ఎంత పాపం చేస్తారు. తండ్రి అపారమైన ధనాన్ని ఇచ్చారు. స్వర్గము బంగారముతో
తయారుచేయబడినది, నరకము రాళ్ళతో తయారుచేయబడినది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.